ఘనంగా పంతులు మధుబాబు కు సన్మానం 

ఘనంగా పంతులు మధుబాబు కు సన్మానం 

విశ్వంభర, భూదాన్ పోచంపల్లి :-  సెప్టెంబర్ 5 న జరిగిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ను పొందిన ముక్తాపూర్  యూ పీఎస్  ప్రధానోపాధ్యాయులు  పంతులు మధు బాబు పురస్కారం అందుకోవడం పట్ల  ఆ గ్రామ యువకులు, మాజీ వార్డు సభ్యులు  బండారు ప్రకాష్ రెడ్డి ,  ఇటమోని నరేందర్ , సన్న నర్సింహ, సప్పిడి శేఖర్ రెడ్డి లు ఘనంగా సన్మానించారు.  ఇలా అవార్డు రావడం ఎంతో ఆనందకరమని గ్రామానికి కూడా గర్వకారణమైన విషయం అని నరేందర్  హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పెద్దల , ప్రజా ప్రతినిధులు,  విద్యార్థుల తల్లిదండ్రుల , తోటి సిబ్బంది సహకారం వల్లనే గొప్పగా పని అందించగలిగానని మధుబాబు  తెలిపారు. 
 

Tags: