దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని రైతుల ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం..! 

దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని రైతుల ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం..! 

సన్నవడ్లతో పాటు దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు మంగళవారం ధర్నాకు దిగారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

సన్నవడ్లతో పాటు దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు మంగళవారం ధర్నాకు దిగారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చిన రైతులు వాహనాల రాకపోకను అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను నట్టేట ముంచుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో అన్ని రకాల ధాన్యానికి, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ సన్న ధాన్యానికే ఇస్తామంటూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సన్న రకం ధాన్యం మార్కెట్‌కు రాదని, అది ఎక్కువగా మిల్లులలోనే అమ్ముడుపోతుందని తెలిపారు. ఎక్కువ శాతం రైతులు దొడ్డు వడ్లను పండిస్తుంటారని తెలిపారు.

Read More ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ నిరసన 

కేసీఆర్ రైతులను నెత్తిన పెట్టుకొని చూసుకున్నాడంటూ గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం నీళ్లు ఇవ్వడంలేదని వాపోయారు. కరెంట్ సైతం సరిగా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రైతుబంధు పంట చివరలో ఇచ్చి చేతులు దులుపేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో తమ పంటలు ఎండిపోవడంతో ఉన్న కొద్ది పంటలను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలని లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరించారు.

🕒 21 May 2024 ✍️ Desk

దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని రైతుల ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం..! 

సన్నవడ్లతో పాటు దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు మంగళవారం ధర్నాకు దిగారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చిన రైతులు వాహనాల రాకపోకను అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను నట్టేట ముంచుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో అన్ని రకాల ధాన్యానికి, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ సన్న ధాన్యానికే ఇస్తామంటూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సన్న రకం ధాన్యం మార్కెట్‌కు రాదని, అది ఎక్కువగా మిల్లులలోనే అమ్ముడుపోతుందని తెలిపారు. ఎక్కువ శాతం రైతులు దొడ్డు వడ్లను పండిస్తుంటారని తెలిపారు.

కేసీఆర్ రైతులను నెత్తిన పెట్టుకొని చూసుకున్నాడంటూ గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం నీళ్లు ఇవ్వడంలేదని వాపోయారు. కరెంట్ సైతం సరిగా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రైతుబంధు పంట చివరలో ఇచ్చి చేతులు దులుపేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో తమ పంటలు ఎండిపోవడంతో ఉన్న కొద్ది పంటలను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలని లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరించారు.

🔗 https://www.vishvambhara.com/telangana/farmers-concern-to-give-bonus-to-doddu-vadu-burnt-effigy/article-553

Advertisement

LatestNews

అనంతపురం జేఎన్‌టీయూఏకు అరుదైన గౌరవం.. 80వ వార్షికోత్సవంలో 'మై స్టాంప్' ఆవిష్కరణ
బోయలపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి. - 
డబ్బు ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
27 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్‌కు సోనం వాంగ్‌చుక్ రాక
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం.. ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో చికిత్స?