ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 2700 పాయింట్ల నష్టంతో 73,739 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 838 పాయింట్లు నష్టపోయి 22,425 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద ప్రారంభమైంది.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూడాల్సివచ్చింది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 2700 పాయింట్ల నష్టంతో 73,739 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 838 పాయింట్లు నష్టపోయి 22,425 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద ప్రారంభమైంది.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య టగ్ ఆఫ్ వార్ కొనసాగుతోంది. ఎవరికీ కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోగా రెండు కూటములు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. ఇక ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడినట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఫేవర్‌గా వెలువడటంతో సోమవారం సరికొత్త రికార్డు స్థాయిలో భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఒక్కసారిగా కుదేలయ్యాయి. 

Read More కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి 

ఇదిలా ఉండగా బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 272ను దాటడంతో బీజేపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, రియలన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, రిలయన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కాగా, అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి.

Related Posts

Advertisement

LatestNews

నోష్ లాబ్ లో  ప్రమాదంపై కంపెనీ ముందు సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా
సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ .
జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు..
సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు