ఈక్వెడార్లో భారీ వరదలు.. 30 మంది గల్లంతు
- కొండచరియలు విరిగిపడి ఆరుగురి మృతి
- భారీ వర్షాలతో అతలాకుతలం
మధ్య, దక్షిణ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఈక్వెడార్లోని బానోస్ డి అగువా శాంటాలో కొండచరియలు విరిగిపడి ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 30మంది గల్లంతయ్యారు. దేశంలోని సెంట్రల్ రీజియన్లోని బానోస్ డి అగువా శాంటా నగరం అతలాకుతలమైంది.
ఈక్వెడార్లోని రిస్క్ మేనేజ్ మెంట్ సెక్రటేరియట్ తన నివేదికలో కొండచరియలు విరిగిపడడాన్ని చాలా తీవ్రతతో పరిగణించింది. భారీ వర్షాల దృష్ట్యా, ఎల్ సాల్వడార్ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ చిన్న దేశం అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించింది. గ్వాటెమాలాలో అనేక విమానయాన సంస్థలు ముందుజాగ్రత్తగా విమానాలను మళ్లించాల్సి వచ్చిందని కమ్యూనికేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈక్వెడార్ పబ్లిక్ వర్క్స్ మంత్రి రాబర్టో లూక్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.