వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటిన కార్పొరేటర్

08

విశ్వంభర కూకట్ పల్లి జూలై 11 : పర్యావరణ పరిరక్షణంలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములు కావాలని వెంకటేష్ గౌడ్ ఉన్నారు.. జి.ఎచ్.ఎం.సి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వనమహోత్సవం కార్యక్రమంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. భావితరాలకు మనమిచ్చే ఆస్తి స్వచ్ఛమైన పర్యావరణమే అని అన్నారు. నాటిన మొక్కలను పరిరక్షించాల్సిన బాధ్యతను అధికారులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మారెడ్డి, అనిల్ రెడ్డి, శివరాజ్ గౌడ్, పాండుగౌడ్, భాస్కర్ రెడ్డి, జి.ఎచ్.ఎం.సి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More బ్రిటన్ లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు