అరకు కాఫీ అద్భుతం.. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ

అరకు కాఫీ అద్భుతం.. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ



ఆదివారం నాడు మన్ కీ బాత్ లో ప్రసంగించిన మోడీ.. ప్రత్యేకంగా అరకు కాఫీని ప్రస్తావించారు. ఆయన ఎన్డీయే ప్రభుత్వంలో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మొదటిసారి మన్ కీ బాత్ లో మాట్లాడారు. ప్రత్యేకంగా అరకు కాఫీని ప్రశంసిస్తూ ఆయన మాట్లాడారు. 

అదో అద్భుతం అని.. రుచి చూసిన క్షణం ఇంకా గుర్తుంది అంటూ తెలిపారు. స్థానికంగా ఉన్న కొండదొరలు అరకు కాఫీలోని ప్రత్యేకతను ఎలా కాపాడుకుంటున్నారో కూడా వివరించారు. వాళ్ల సంస్కృతి, ఆచారాలను వదులుకోకుండా అలా జీవించడం చాలా గొప్ప విషయమని అన్నారు. 

వారు తమ అరకు కాఫీ తోటలను కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించగా.. వారు పోరాడిన తీరును ఆయన పొగిడారు. అంతే కాకుండా వారి ఆచార, సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకుంటున్నారని.. అలా జీవించడం గొప్ప విషయం అంటూ ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ.  

Related Posts