నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం...చెంచు విద్యార్థి అనుమానాస్పద మృతి

విశ్వంభర, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిగుర్ల రాముడు అనే చెంచు విద్యార్థి అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం నల్లమల్ల లోతట్టు ప్రాంతంలోని రాంపూర్ పెంటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…చిగుర్ల రాముడు అనే విద్యార్థి అచ్చంపేట మండలంలో ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.

ఈ క్రమంలో అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ పంతులమ్మ విద్యా బుద్ధులు చెప్పాల్సింది పోయి అతడితో సన్నిహితంగా ఉంటూ ప్రేమ పాటలు చెప్పింది. ఆ విద్యార్థిని వశపరుచుకుని రాముడితో సన్నిహితంగా మెలిగింది. అయితే, ఆ పంతులమ్మకు భర్త ఉన్నప్పటికీ అభంశుభం తెలియని విద్యార్థితో ఎక్కడికైనా వెళ్లిపోదామని అనుకుంది. ఈ క్రమంలో వారిద్దరూ కల్వకుర్తి పట్టణానికి చేరుకున్నారనే సమాచారం టీచర్ భర్తకు తెలిసింది.

Read More నాంపల్లి లో  నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్

దీంతో పంతులమ్మ రాముడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారించింది. దీంతో రాముడు అడవిలోకి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిగుర్ల రాముడు అనే విద్యార్థి పంతులమ్మ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం భర్తకు తెలియడంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడా..? వారిద్దరి మధ్య ఇంకేమైనా జరిగి ఉంటుందా.. లేక టీచర్‌కు దూరం అవుతున్నాననే మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.