శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టులోకి దూసుకెళ్లిన కారు
- మెట్టుగడ్డ తండా నుంచి శంషాబాద్కు వెళ్తుండగా ప్రమాదం
Shamshabad Accident: మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం మెట్టుగడ్డ తండా నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు (నంబర్ TS 07 GZ 9333) అదుపు తప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కేతావత్ లింబ్యా (54), ఆయన భార్య కేతావత్ జమున (45), కత్రావత్ మాన్సింగ్ (48), కేతావత్ వస్రామ్ (45) అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో జమున గృహిణి కాగా, మిగిలిన ముగ్గురు వ్యాపారులు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం అతివేగం వల్ల జరిగిందా లేక ఏదైనా సాంకేతిక లోపం వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
రోడ్డు ప్రమాదాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మితిమీరిన వేగం, నిబంధనలు పాటించకపోవడం, ఇతర కారణాల వల్ల రహదారులపై నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలోనూ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాల అవగాహన చర్యలు చేపడుతున్నా ప్రమాదాల తీవ్రత తగ్గడం లేదు. తాజాగా శంషాబాద్ పరిధిలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకున్న ఘటన అందరిని షాక్ కు గురిచేసింది.



