ఒకేసారి 12 మంది ఇన్ స్పెక్టర్లపై బదిలీ వేటు...

ఒకేసారి 12 మంది ఇన్ స్పెక్టర్లపై బదిలీ వేటు...

విశ్వంభర, హైదరాబాద్ : హైదరాబాద్ సీసీఎస్ లో ఉన్నతాధికారులు ప్రక్షాళన చేపట్టారు. ఏకంగా ఒకేసారి 12 మంది ఇన్ స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు. అయితే ఇటీవల సీసీఎస్ లో ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కిన విషయం విదితమే. తరుచూ సీసీఎస్ పై అరోపణలతో 12 మందిని బదిలీ చేశారు. 12 మంది ఇన్ స్పెక్టర్లను మల్టీ జోన్ 2కు బదిలీ చేశారు. అయితే ఒకేసారి 12 మంది ఇన్ స్పెక్టర్లపై బదిలీ వేటు వేయడం ప్రస్తుతం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.