జర్నలిస్టుల పై దాడి హేయమైన చర్య
On
విశ్వంభర,కల్వకుర్తి/ఆమనగల్లు,జులై 11: ఓయూలో నిరుద్యోగుల ఆందోళన కార్యక్రమంలో కవరేజీకి వెళ్లిన జీ తెలుగు జర్నలిస్ట్ పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేసిన జర్నలిస్టులు.
అనంతరం ఆర్డీవో కి మెమోరాండం అందచేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో దాడి చేసిన పోలీస్ లపై సీఐ కి పిర్యాదు చేయడం జరిగింది
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని... లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తప్పవని హెచ్చరించిన కల్వకుర్తి జర్నలిస్టులు.