కిడ్నాప్ కు గురైన 11 నెలల బాబు… కేసు నమోదు

కిడ్నాప్ కు గురైన 11 నెలల బాబు… కేసు నమోదు

విశ్వంభర, వెబ్ డెస్క్ : 11 నెలల బాబు కిడ్నాప్ అయిన ఘటన సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చోటు చేసుకుంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కు చెందిన వానరాశి జంపన్న, దుర్గా దంపతులు గత వారం క్రితం వలస వచ్చి సత్తుపల్లి గుడిపాగు రోడ్డులో గుడారం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. గ్యాస్ స్టవ్లు, మిక్సీలు రిపేర్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి తల్లిదండ్రులు బాబుతో పాటు గుడారంలో నిద్రిస్తుండగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తల్లి లేచి చూడగా బాబు సాయి దేవాన్ష్ కనపడకపోవడం తో అర్ధరాత్రి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చి పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ సాయి దేవాన్స్​ ఆచూకీ లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తలు తమ బాబుని కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రులు మంగళవారం ఉదయం సత్తుపల్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు