బుల్లితెరమీదకు రీ ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. ఏ ఛానెల్ లో అంటే..?

బుల్లితెరమీదకు రీ ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. ఏ ఛానెల్ లో అంటే..?

 

బుల్లితెరపై అనసూయకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె యాంకర్ గా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసింది. మరీ ముఖ్యంగా జబర్దస్త్ ప్రోగ్రామ్ ఆమెకు తిరుగులేని స్టార్ డమ్ ను తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోలేదు. కానీ ఎందుకో ఆ ప్రోగ్రామ్ మానేసింది. తర్వాత స్టార్ మాలో ఓ ప్రోగ్రామ్ చేసింది. 

కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. అప్పటి నుంచి వరుసగా పెద్ద సినిమాల్లోనే నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. చాలా కాలంగా ఆమె బుల్లితెరకు దూరంగానే ఉంది. కానీ ఇప్పుడు తాజాగా ఆమె బుల్లితెరమీదకు ఎంట్రీ ఇచ్చింది. త్వరలో ప్రారంభం కాబోతున్న ఓ గేమ్ షో ప్రోమోలో అనసూయ కనిపించింది. 

కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ పేరుతో స్టార్ మా ఓ ప్రోమో విడుదల చేసింది. ఇందులో అనసూయ, శేఖర్ మాస్టర్, అమర్ దీప్, ప్ఇరయాంక, శోభాశెట్టి, తేజ, విష్ణుప్రియ, రీతూ చౌదరి కనిపించారు. అంటే వీరితో ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నారన్నమాట. దీనికి అనసూయనే యాంకరింగ్ చేస్తోందని తెలుస్తోంది.

Related Posts