విషాదం.. విద్యుదాఘాతంతో తల్లీకొడుకు మృతి..!

విషాదం.. విద్యుదాఘాతంతో తల్లీకొడుకు మృతి..!

విద్యుదాఘాతానికి గురై తల్లీకొడుకు మృతిచెందారు. ప్రమాదానికి గురైన తల్లిని కాపాడే ప్రయత్నంలో కొడుకు, కూతురు కరెంట్ షాక్ తగిలగా వారిలో తల్లి, కొడుకు మృతిచెందారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై తల్లీకొడుకు మృతిచెందారు. ప్రమాదానికి గురైన తల్లిని కాపాడే ప్రయత్నంలో కొడుకు, కూతురు కరెంట్ షాక్ తగిలగా వారిలో తల్లి, కొడుకు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లికి చెందిన మణెమ్మ(45) ఇంటి వద్ద దుస్తులు ఆరేస్తుండగా కరెంట్ షాక్‌కు గురైంది. 

దీంతో గమనించిన ఆమె కుమారుడు ప్రసాద్, కూతురు శ్రీలత ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే వారికీ కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో తల్లి మణెమ్మ, కుమారుడు ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందారు. కూతురు శ్రీలతకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Related Posts