గంటన్నర వరకు టెన్షన్ వద్దు.. వైసీపీ నేతలకు ఆరా మస్తాన్ భరోసా!

గంటన్నర వరకు టెన్షన్ వద్దు.. వైసీపీ నేతలకు ఆరా మస్తాన్ భరోసా!

ఏడో విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలై పార్టీల వారిగా సీట్లను ప్రకటించాయి. పలాన పార్టీ అధికారంలోకి రాబోతుందని, ఇంకో పార్టీ వెనకంజలో ఉంటుందని జోస్యం చెప్పాయి.

విశ్వంభర, విజయవాడ:  ఏడో విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలై పార్టీల వారిగా సీట్లను ప్రకటించాయి. పలాన పార్టీ అధికారంలోకి రాబోతుందని, ఇంకో పార్టీ వెనకంజలో ఉంటుందని జోస్యం చెప్పాయి. ఇదే మాదిరిగా హైదరాబాద్‌కు చెందిన ఆరా మస్తాన్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను రిలీజ్ చేస్తూ ఏపీలో రెండోసారి వైసీపీనే అధికారం చేపట్టబోతుందని, జగన్ ప్రమాణస్వీకారం చేయడం ఖాయం అంటూ ప్రకటించింది. వైసీపీకి 94 నుంచి 104 సీట్లు పక్కాగా వస్తాయని తెలిపింది. టీడీపీ కూటమికి 71 నుంచి 81 స్థానాలు వస్తాయని పేర్కొంది. అయితే నేడు వెలుబడుతున్న ఫలితాలు అందుకు భిన్నంగా వస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయానికే టీడీపీ కూటమి అధికారం చేపట్టే మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసింది. టీడీపీ 132, జనసేప 19, బీజేపీ 7, వైసీపీ 17 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థులు ఓటమిని అంగీకరిస్తూ కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇంటి బాటపడుతున్నారు. ఇదే సమయంలో ఆరా మస్తాను నుంచి ఓ ప్రకటన వెలుబడింది. ఫలితాలు అప్పుడే ముగిసిపోలేదని.. మరో గంటన్నర ఓపిక పట్టండి అంటూ తెలిపింది. ఆరా మస్తాన్ ప్రకటనపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ మొదలయ్యాయి. 

Related Posts