రాముతండ సర్పంచి పై అటవీ శాఖ కేసు నమోదు
- ఎఫ్ ఆర్ వో విజయలక్ష్మి
విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని రాము తండా సర్పంచి భూక్య మీటు తో పాటు మరో ఇద్దరి పై అటవీ శాఖ కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఎఫ్ఆర్ఓ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని రాము తండా శివారు రిజర్వ్ ఫారెస్ట్ కంఫర్ట్ నెం. 1144 లో జెసిపి తో అక్రమంగా మట్టి తోలిస్తున్న సర్పంచ్ మీటు, బానోత్ వీరు, గుతుప రవి లను గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. అటవీ శాఖ కు చెందిన భూములలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారనైనా రూపేక్షించేది లేదని కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
రాముతండ సర్పంచి పై అటవీ శాఖ కేసు నమోదు
విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని రాము తండా సర్పంచి భూక్య మీటు తో పాటు మరో ఇద్దరి పై అటవీ శాఖ కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఎఫ్ఆర్ఓ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని రాము తండా శివారు రిజర్వ్ ఫారెస్ట్ కంఫర్ట్ నెం. 1144 లో జెసిపి తో అక్రమంగా మట్టి తోలిస్తున్న సర్పంచ్ మీటు, బానోత్ వీరు, గుతుప రవి లను గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. అటవీ శాఖ కు చెందిన భూములలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారనైనా రూపేక్షించేది లేదని కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.


