మెడికో ప్రియాంక కుటుంబానికి ఆర్థికసాయం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

మెడికో ప్రియాంక కుటుంబానికి ఆర్థికసాయం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

  • ప్రియాంక ఘటనపై మరోసారి సీఎం సమీక్ష..

Andhra Pradesh CM Chandrababu Naidu: రాజమహేంద్రవరంలో ఈ నెల 3న జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రియాంక కుటుంబానికి ఆర్థికసాయం అందించాలని సీఎం స్పష్టం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని దురదృష్టవశాత్తూ మృతి చెందడం అత్యంత బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రియాంకను యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై ఇప్పటికే అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి.. తాజాగా జిల్లా అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మరోసారి పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహాయ సహకారాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Read More మైనర్ బాలిక మిస్సింగ్ కేసు ఛేదించిన రాప్తాడు పోలీసులు

ఈ ఘటనలో నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేసు దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని ఆధారాలను సేకరించి, నిందితులపై చట్టపరమైన చర్యలు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయం అందించడంతో పాటు, ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. వైద్య విద్యను అభ్యసిస్తూ ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు సాగుతున్న ప్రియాంక మృతి కుటుంబ సభ్యులతో పాటు సమాజానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

మెడికో ప్రియాంక కుటుంబానికి ఆర్థికసాయం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Andhra Pradesh CM Chandrababu Naidu: రాజమహేంద్రవరంలో ఈ నెల 3న జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రియాంక కుటుంబానికి ఆర్థికసాయం అందించాలని సీఎం స్పష్టం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని దురదృష్టవశాత్తూ మృతి చెందడం అత్యంత బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రియాంకను యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై ఇప్పటికే అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి.. తాజాగా జిల్లా అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మరోసారి పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహాయ సహకారాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ ఘటనలో నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేసు దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని ఆధారాలను సేకరించి, నిందితులపై చట్టపరమైన చర్యలు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయం అందించడంతో పాటు, ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. వైద్య విద్యను అభ్యసిస్తూ ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు సాగుతున్న ప్రియాంక మృతి కుటుంబ సభ్యులతో పాటు సమాజానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు.

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababus-key-orders-for-financial-assistance-to-medico-priyankas/article-21462