నాగార్జునసాగర్లో వరుణ యాగం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు
వర్షాలు సమృద్ధిగా కురవాలి.. నాగార్జునసాగర్లో వరుణ యాగం నిర్వహించిన ఉత్తమ్ దంపతులు
Uttam Kumar Reddy: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, జలాశయాలు, చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్ వేదికగా పవిత్ర వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి సాగునీటి వనరులు నిండాలని, రైతులకు సాగునీటి కొరత లేకుండా పాడిపంటలు సమృద్ధిగా పండాలని మంత్రి దంపతులు ప్రార్థించారు. వర్షాలు సకాలంలో కురిసి రైతుల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
నాగార్జునసాగర్ జలాశయం పరిసరాల్లో నిర్వహిస్తున్న ఈ వరుణ యాగంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, యాగ క్రతువులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడం, రైతుల సంక్షేమం సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పంటలకు అనుకూలమైన వర్షాలు కురిసి రైతులకు మంచి దిగుబడులు రావాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని యాగంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. రైతు సంక్షేమం – రాష్ట్ర సుభిక్షమే లక్ష్యం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పేర్కొన్నారు.
నాగార్జునసాగర్లో వరుణ యాగం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు
Uttam Kumar Reddy: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, జలాశయాలు, చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్ వేదికగా పవిత్ర వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి సాగునీటి వనరులు నిండాలని, రైతులకు సాగునీటి కొరత లేకుండా పాడిపంటలు సమృద్ధిగా పండాలని మంత్రి దంపతులు ప్రార్థించారు. వర్షాలు సకాలంలో కురిసి రైతుల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
నాగార్జునసాగర్ జలాశయం పరిసరాల్లో నిర్వహిస్తున్న ఈ వరుణ యాగంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, యాగ క్రతువులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడం, రైతుల సంక్షేమం సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పంటలకు అనుకూలమైన వర్షాలు కురిసి రైతులకు మంచి దిగుబడులు రావాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని యాగంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. రైతు సంక్షేమం – రాష్ట్ర సుభిక్షమే లక్ష్యం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పేర్కొన్నారు.


