యూపీ నుంచి హైదరాబాద్‌కు అక్రమ ఇంజెక్షన్లు.. జిమ్ ప్రియులే టార్గెట్?

యూపీ నుంచి హైదరాబాద్‌కు అక్రమ ఇంజెక్షన్లు.. జిమ్ ప్రియులే టార్గెట్?

  • సైఫాబాద్‌లో ఖాకీల బిగ్ ఆపరేషన్
  • రూ.4 లక్షల విలువైన నిషేధిత ఇంజెక్షన్లు స్వాధీనం

Hyderabad Police: హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రిస్క్రిప్షన్ లేకుండా మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్, సైఫాబాద్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని షేక్ ఫహీమ్, మహ్మద్ నయీమ్, ఇబ్రహీం హుస్సేన్‌లుగా పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 100 మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు, ఒక యమహా ఏరోక్స్ స్కూటీ, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

ప్రాథమిక విచారణలో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి ఈ ఇంజెక్షన్లను అక్రమంగా హైదరాబాద్‌కు తెప్పించి, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాల్సిన ఔషధమని, వీటిని దుర్వినియోగం చేయడం లేదా అనుమతి లేకుండా వినియోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటులో అసాధారణ మార్పులు, ఇతర ప్రాణాంతక దుష్ప్రభావాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Read More టిమ్స్‌ ప్రారంభానికి సన్నాహాలు

ఈ కేసులో నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమంగా మందులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు వైద్యుల సూచన లేకుండా ఎలాంటి ఇంజెక్షన్లు లేదా మందులు కొనుగోలు చేయరాదని సూచించారు. అనుమానాస్పదంగా మందుల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు లేదా డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

యూపీ నుంచి హైదరాబాద్‌కు అక్రమ ఇంజెక్షన్లు.. జిమ్ ప్రియులే టార్గెట్?

Hyderabad Police: హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రిస్క్రిప్షన్ లేకుండా మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్, సైఫాబాద్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని షేక్ ఫహీమ్, మహ్మద్ నయీమ్, ఇబ్రహీం హుస్సేన్‌లుగా పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 100 మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు, ఒక యమహా ఏరోక్స్ స్కూటీ, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

ప్రాథమిక విచారణలో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి ఈ ఇంజెక్షన్లను అక్రమంగా హైదరాబాద్‌కు తెప్పించి, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాల్సిన ఔషధమని, వీటిని దుర్వినియోగం చేయడం లేదా అనుమతి లేకుండా వినియోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటులో అసాధారణ మార్పులు, ఇతర ప్రాణాంతక దుష్ప్రభావాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ కేసులో నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమంగా మందులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు వైద్యుల సూచన లేకుండా ఎలాంటి ఇంజెక్షన్లు లేదా మందులు కొనుగోలు చేయరాదని సూచించారు. అనుమానాస్పదంగా మందుల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు లేదా డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

🔗 https://www.vishvambhara.com/telangana/illegal-injections-from-up-to-hyderabad/article-20504

Advertisement

LatestNews

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ‘ఇంద్రపుత్ర’గా పాన్ ఇండియా మూవీ
భూగర్భ డ్రైనేజీ  పనులు వెంటనే ప్రారంభించాలి. - చిలకమర్రి నరసింహ, మాజీ సభ్యులు- రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ 
భూగర్భ డ్రైనేజీ  పనులు వెంటనే ప్రారంభించాలి. - చిలకమర్రి నరసింహ, మాజీ సభ్యులు- రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ 
బరువు తగ్గాలా..? డైట్‌లో ఈ ఆహారాలను చేర్చుకోండి
ఫ్లిప్‌కార్ట్‌లో మైక్రోసైట్ లీక్... ఆగస్టు 14న లాంచ్ కానున్న మోటోరోలా మైండ్ బ్లోయింగ్ ఫోన్
మెడికో ప్రియాంక కుటుంబానికి ఆర్థికసాయం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
హైదరాబాద్‌లో మహిళలు, చిన్నారులపై దారుణాలు.. రెండేళ్లలో 5,370 కేసులు