మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
On
విశ్వంభర, నాగారం: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండల కేంద్రానికి చెందిన వంగూరి మల్లయ్య , మంగదుడ్ల అవిలయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసాలకు వెళ్లి వారి కుటుంబసభ్యులను సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన బొబ్బలి వెంకటమ్మ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్క సైదులు, బిఆర్ఎస్ మండల నాయకులు కూరం వెంకన్న, చిప్పలపల్లి సోమయ్య, గంట నర్సయ్య, నాయకులు కన్నెబోయిన అంజయ్య , కన్నెబోయిన బాలమ్మ, ఎల్క కృష్ణ, ఆకారపు మధు, బొబ్బలి లింగామల్లు, మంగదుడ్ల సాయి, బుర్రి సురేష్ రెడ్డి, శ్రీకాంత్, పండు తదితరులు వున్నారు.



