ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత..
పరామర్శించిన కేటీఆర్
On
హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చికిత్స
హైదరాబాద్,విశ్వంభర:- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అస్వస్థత గురయ్యారు. హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న మాజీ మంత్రి , బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఏఐజి ఆసుపత్రి కి వెళ్లి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ని పరామర్శించడం జరిగింది. ఏఐజి వైద్యుల తో మాట్లాడి సుధీర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు కెటిఆర్. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.