కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించండి

కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించండి

  •  ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

విశ్వంభర, పరిగి: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 15వవార్డు బోయవాడ, మున్నూరు వాడలో  ఎమ్మెల్యే  టి.రామ్మోహన్ రెడ్డి  విస్తృతంగా  పర్యటించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని,  కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు.  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధాంతి పార్థసారథి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గానేమోని శ్రీనివాస్, పాలాది శ్రీనివాస్ గుప్తా, ఆంజనేయులు, మల్లేష్, వెంకటేష్, జగన్, బాలు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags: