శివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం
On
విశ్వంభర, కీసర: కీసర గుట్ట రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు జరిగే శివరాత్రి ఉత్సవాలకు శాసన మండలి ప్రభుత్వ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, సునీత దంపతులకు ఆలయ చైర్మన్ వెంకటేష్ శర్మ, ఈ ఓ సుధాకర్ రెడ్డి ఆహ్వాన పత్రికను ఇచ్చారు. ఉత్సవాలకు సతీ సమేతంగా తప్పకుండా వస్తామని మహేందర్ రెడ్డి తెలిపారని ఈ ఓ సుధాకర్ రెడ్డి చెప్పారు.



