తీహార్ జైలుకు మాజీ మంత్రులు.. కవితతో ములాఖత్
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో కవిత
- మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ములాఖత్
- యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఇవాళ(మంగళవారం) కలిశారు. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ సైతం కవితను కలిసిన విషయం తెలిసిందే. అలాగే రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా కవితతో ములాఖత్ అయ్యారు.
తాజాగా ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్.. కవితతో ములాఖత్ అయ్యారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు తీహార్ జైలుకు వెళ్లి ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పి వస్తున్నారు.
తీహార్ జైలుకు చేరుకున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్.
— Telugu Scribe (@TeluguScribe) June 18, 2024
ఎమ్మెల్సీ కవితను ములాఖత్లో భాగంగా కలిసిన సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ pic.twitter.com/FkSd0ZRZgA