‘ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది..’ సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ 

‘ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది..’ సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ 

  • పాఠశాలకు రూపాయి ఖర్చులేకుండా ప్రయాణం 
  • ఆధార్‌కార్డులు చూపిస్తూ విద్యార్థినుల హర్షం 
  • సోషల్ మీడియాలో పంచుకున్న సీఎం

తెలంగాణలో విద్యార్థులు వేసవి సెలవులు ముగిసి 2024-25 విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఈనెల 12వ తేదీ (బుధవారం) నుంచి విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం సరికొత్త విధానాలతో ముందుకొచ్చింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. 

ఇందులో భాగంగా కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టిన రోజే అమలు చేసిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థినులు ఇప్పుడు బస్ పాస్‌లకు బదులుగా ఆధార్‌కార్డులను వెంట తీసుకెళ్లి జీరో టికెట్ తీసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి బస్సుల్లో పాఠశాలకు వెళ్లే విద్యార్థినులకు ఎంతో మేలు చేస్తోంది. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 

Read More తెలంగాణ టీడీపీ రాష్ట్ర నాయకులు గూడపాటి శరత్ ను కలిసిన ఏలే మహేష్ నేత 

రేవంత్ ట్వీట్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు. ‘‘సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది. ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు. ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వల్ల  బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నామని తమ చేతిలో ఆధార్ కార్డులు చూపిస్తూ వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు’’ అంటూ సీఎం పేర్కొన్నారు.

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు