రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ

 మండల వ్యవసాయధికారి ఆశకుమారి

WhatsApp Image 2024-07-24 at 17.22.42_2a9fc1a1

విశ్వంభర చివ్వేంల : - మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో బుధవారం రైతువేదిక నందు రైతు బీమా దరఖాస్తు ల స్వీకరణ  కార్యక్రమంలో  మండల వ్యవసాయ అధికారి  ఆశ కుమారి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 
కొత్తగా పాస్ పుస్తకం వచ్చిన 18-59 సం.ల రైతులు అందరూ రైతు బీమా కి దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకునే వారు రైతభీమ దరఖాస్తు తో పాటు పట్టా పాస్ పుస్తకం,ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ లు జతపరచి రైతు వేదికల్లో సమర్పించమన్నారు.ఈ నెల 30 వ తారీకు  రైతు బీమా దరఖాస్తులకు ఆఖరి తేదీ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  వ్యవసాయ విస్తరణ అధికారి పవన్, రైతులు మొలుగురి.వెంకన్న,పందిరి. వీరా రెడ్డి, సత్తూరి. సోమేష్,ఎల్లమ్మ, తదితరులు ఉన్నారు.

Read More స్మశాన వాటికలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే