రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
On
మండల వ్యవసాయధికారి ఆశకుమారి
విశ్వంభర చివ్వేంల : - మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో బుధవారం రైతువేదిక నందు రైతు బీమా దరఖాస్తు ల స్వీకరణ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆశ కుమారి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
కొత్తగా పాస్ పుస్తకం వచ్చిన 18-59 సం.ల రైతులు అందరూ రైతు బీమా కి దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకునే వారు రైతభీమ దరఖాస్తు తో పాటు పట్టా పాస్ పుస్తకం,ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ లు జతపరచి రైతు వేదికల్లో సమర్పించమన్నారు.ఈ నెల 30 వ తారీకు రైతు బీమా దరఖాస్తులకు ఆఖరి తేదీ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి పవన్, రైతులు మొలుగురి.వెంకన్న,పందిరి. వీరా రెడ్డి, సత్తూరి. సోమేష్,ఎల్లమ్మ, తదితరులు ఉన్నారు.
Tags: vishvambhara vishwambhara FarmersSupport RuralDevelopment Acceptance of applications for Rythu Bima at Rythu Vedika RythuBima RythuVedika FarmersInsurance CropInsurance AgricultureScheme InsuranceCoverage Go rnmentScheme riculturalPolicy FinancialSecurity SocialSecurity armersEmpowerment RuralIndia FarmersWelfare