<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/kcr/tag-89" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>KCR - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/89/rss</link>
                <description>KCR RSS Feed</description>
                
                            <item>
                <title>కేసీఆర్ కుటుంబ ఆస్తులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపణలు</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తుల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mla-kadiam-sriharis-allegations-on-kcr-family-properties/article-9049"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-19-at-7.00.29-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తుల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ అంశంపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014కు ముందు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పదేళ్ల అధికారంలో రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని వేల కోట్లు సంపాదించారని కడియం ఆరోపించారు. ఈ ఆస్తుల వివరాలన్నీ ప్రజల ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.</p>
<p><strong>తెలంగాణ 'జాతిపిత' ఎవరు?</strong><br />కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించడాన్ని కడియం శ్రీహరి తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ కోసం ఆయన ఏం చేశారని జాతిపిత అంటున్నారని ప్రశ్నించారు. అధికారాన్ని ఒక కుటుంబ హక్కుగా భావిస్తున్నారని, తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబానికి మాత్రమే సొంతం అనేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ స్కాములు చేశారని, వారిపై కేసులు ఉన్నాయని కడియం సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులపై కేసులు ఉంటే తెలంగాణను అవమానించినట్లు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏమైనా మీ అయ్య సొత్తా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇంకా ఎన్ని రోజులు సెంటిమెంట్‌ను వాడుకుంటారని ప్రశ్నించిన ఆయన, ప్రజలు తిరస్కరించినా అహంకారం తగ్గడం లేదని, మాట తీరులో మార్పు రాలేదని విమర్శించారు. అధికారాన్ని తమ హక్కుగా భావించే ధోరణి ఇకనైనా మానుకోవాలని ఆయన హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mla-kadiam-sriharis-allegations-on-kcr-family-properties/article-9049</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mla-kadiam-sriharis-allegations-on-kcr-family-properties/article-9049</guid>
                <pubDate>Thu, 19 Feb 2026 19:04:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-19-at-7.00.29-pm.jpeg"                         length="67674"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ జాతి హీరో కేసీఆర్: కేటీఆర్</title>
                                    <description><![CDATA[<p>భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు మంగళవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ.. తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ జాతికి హీరో అని స్పష్టం చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/telangana-national-hero-kcr-ktr/article-8887"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-17-at-6.46.12-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు మంగళవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ.. తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ జాతికి హీరో అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎప్పుడూ తాను "జాతిపిత"నని చెప్పుకోలేదని, తమ జాతికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన నేతను ప్రజలే అలా పిలుచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితర ముఖ్య నేతలు పాల్గొని 72 కిలోల కేక్ కట్ చేశారు. అలాగే కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల పాలనను ప్రతిబింబించే డాక్యుమెంటరీని నేతలు విడుదల చేశారు.</p>
<p><strong>ద్రోహుల జాతి వర్సెస్ ఫైటర్ల జాతి</strong><br />ఈ సందర్భంగా కేటీఆర్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమకారుల మీదకు తుపాకులు తీసుకొని దాడికి వెళ్లిన వారికి "జాతి" నిర్వచనం తెలియదని ఎద్దేవా చేశారు. తెలంగాణ జై నినాదానికి భయపడే వారికి, తెలంగాణ సోయి లేని వారికి జాతి విలువ తెలియదన్నారు. తెలంగాణలో కేవలం "తెలంగాణవాదుల జాతి", "తెలంగాణ ద్రోహుల జాతి" మాత్రమే ఉన్నాయని, తమది ఫైటర్ల జాతి అయితే, వారిది ద్రోహుల జాతి అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.</p>
<p><strong>కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం అసాధ్యం</strong><br />కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని కొందరు అంటున్నారని, తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్లు అయినప్పుడు వాటిని ఎలా చెరిపేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరులు, విద్యార్థి అమరవీరుల జాతి తమదని ఆయన కొనియాడారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే కార్యకర్తలు జన్మదిన సందర్భంగా ఇచ్చే చిరుకానుక అని కేటీఆర్ పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/telangana-national-hero-kcr-ktr/article-8887</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/telangana-national-hero-kcr-ktr/article-8887</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 18:48:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-17-at-6.46.12-pm.jpeg"                         length="80466"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేరాలు చేస్తే విచారణ తప్పదు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు</title>
                                    <description><![CDATA[<p>ఫోన్ ట్యాపింగ్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ అక్రమ వ్యవహారానికి అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని, చట్టం ముందు ఎవరూ అతితీతులు కాదని ఆయన స్పష్టం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-criticizes-kcr-if-crimes-are-committed/article-8296"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/9a8a66eb-3635-4c82-87bc-8b0bc797785b.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>ఫోన్ ట్యాపింగ్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ అక్రమ వ్యవహారానికి అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని, చట్టం ముందు ఎవరూ అతితీతులు కాదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం బంజారాహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్‌కు సిట్ నోటీసుల వ్యవహారంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. నేరాలు చేసినప్పుడు విచారణ ఎదుర్కోవాల్సిందేనని, తాము ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి అధికారులు విచారించాలని కోరడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు.</p>
<p><strong>జాతిపిత హోదాపై తీవ్ర అభ్యంతరం</strong><br />కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆయనను 'తెలంగాణ జాతిపిత'గా అభివర్ణించడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను విస్మరించి, కేవలం కుటుంబ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇచ్చిన వారు జాతిపితలు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. అసలైన తెలంగాణ ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసి, ప్రొఫెసర్ కోదండరామ్ వంటి మేధావులను అవమానించిన చరిత్ర కేసీఆర్ సర్కార్‌దని దుయ్యబట్టారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత పదవులన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులే పంచుకున్నారని, ఆనాడు ఉద్యమకారుల తలుపులు బద్దలు కొట్టి బెడ్ రూమ్‌ల నుంచి ఈడ్చుకెళ్లినప్పుడు ఈ 'జాతిపిత' హోదా ఎటు పోయిందని నిలదీశారు.</p>
<p><strong>విచారణకు సహకరించాల్సిందే..</strong><br />ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలకు పాల్పడి ఇప్పుడు విచారణ అంటే తప్పించుకోవడం సరికాదని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పడని ఉద్యమకారుడు లేడని, అనేకమందిని అరెస్టులు చేసి వేధించారని ఆయన గుర్తు చేశారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా విచారణను ఎదుర్కోవాల్సిందేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన సాగుతోందని, గతంలో జరిగిన అరాచకాలను తాము ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-criticizes-kcr-if-crimes-are-committed/article-8296</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-criticizes-kcr-if-crimes-are-committed/article-8296</guid>
                <pubDate>Mon, 02 Feb 2026 20:26:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/9a8a66eb-3635-4c82-87bc-8b0bc797785b.jpg"                         length="148459"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేసీఆర్‌కు ఇచ్చిన సిట్ నోటీసులు చెల్లవు</title>
                                    <description><![CDATA[<p>రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ న్యాయ బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-sit-notices-given-to-kcr-are-invalid/article-8110"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/946cdc7c-5ea8-4abc-993d-3aee026692d6.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ న్యాయ బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నోటీసులు చట్టబద్ధంగా చెల్లవని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు స్పష్టం చేశారు. మోహిత్ రావు తన అధికారిక ప్రకటనలో చట్టంలోని కీలక అంశాలను ప్రస్తావించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 (CRPC-160) ప్రకారం.. వయస్సు, ఇతర ఆరోగ్య కారణాల దృష్ట్యా కొన్ని వర్గాల వ్యక్తులకు నోటీసులు ఇవ్వడంపై స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. కేసీఆర్ విషయంలో ఈ నిబంధనలను సిట్ తుంగలో తొక్కిందని, చట్టాన్ని అతిక్రమించి నోటీసులు ఇవ్వడం చెల్లదని ఆయన పేర్కొన్నారు. ఏళ్ల తరబడి విచారణ పేరుతో వేధిస్తామంటే కుదరదని.. ఇలాంటి రాజకీయ కక్షసాధింపు కేసులను గతంలో సుప్రీంకోర్టు వందల సంఖ్యలో కొట్టేసిందన్నారు. ఈ నోటీసులపై తాము వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.</p>
<p>రాజకీయ వేడి.. న్యాయ పోరాటం<br />ఈ కేసులో తాజాగా నేరుగా గులాబీ బాస్ కేసీఆర్‌కు నోటీసులు అందడంతో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. న్యాయపరంగా ఈ నోటీసులను ఎదుర్కోవడమే కాకుండా, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న 'కక్షసాధింపు' రాజకీయాలను ఎండగడతామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పలువురు అధికారుల అరెస్టులతో సాగిన ఈ కేసు, ఇప్పుడు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతోంది. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-sit-notices-given-to-kcr-are-invalid/article-8110</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-sit-notices-given-to-kcr-are-invalid/article-8110</guid>
                <pubDate>Fri, 30 Jan 2026 14:50:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/946cdc7c-5ea8-4abc-993d-3aee026692d6.jpeg"                         length="47012"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అనారోగ్యం కారణంగా విచారణకు రాలేను </title>
                                    <description><![CDATA[<div>తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ముంగిటకు చేరింది. ఈ కేసులో లోతైన విచారణ జరుపుతున్న ప్రత్యేక విచారణ బృందం (SIT), తాజాగా కేసీఆర్‌కు అధికారికంగా నోటీసులు జారీ చేసింది.</div>
<div> </div>
<div> </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/unable-to-attend-due-to-illness/article-8102"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/f021826a-12bf-4028-b6f1-de5f673a876a.jpg" alt=""></a><br /><div><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ముంగిటకు చేరింది. ఈ కేసులో లోతైన విచారణ జరుపుతున్న ప్రత్యేక విచారణ బృందం (SIT), తాజాగా కేసీఆర్‌కు అధికారికంగా నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, సొంత పార్టీ నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై సిట్ ఇప్పటికే పలువురు ఉన్నత స్థాయి పోలీసు అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ అధికారుల విచారణలో వెల్లడైన కీలక సమాచారం ఆధారంగానే ఇప్పుడు కేసీఆర్‌కు నోటీసులు పంపినట్లు సమాచారం.</div>
<div> </div>
<div>అయితే, సిట్ నోటీసులపై స్పందించిన కేసీఆర్.. తాను ప్రస్తుతం విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. గత ఏడాది చివరలో జరిగిన మోకాలి శస్త్రచికిత్స తర్వాత తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఫిజియోథెరపీ, విశ్రాంతి అవసరమని ఆయన అధికారులకు విన్నవించారు. సుదీర్ఘ ప్రయాణాలు చేయడం, ఎక్కువ సమయం కూర్చోవడం ఆరోగ్యపరంగా ఇబ్బందికరమని, అందుకే తనకు కొంత సమయం కావాలని ఆయన కోరారు. చట్టం పట్ల తనకు గౌరవం ఉందని, అయితే ప్రస్తుత శారీరక స్థితి సహకరించడం లేదని ఆయన కార్యాలయం ద్వారా సిట్‌కు సమాచారం అందినట్లు తెలుస్తోంది.</div>
<div> </div>
<div>మరోవైపు, కేసీఆర్ సమాధానంపై సిట్ అధికారులు తీవ్రంగా చర్చిస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా విచారణను ఆలస్యం చేయడం సరికాదని భావిస్తున్న అధికారులు, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ స్వయంగా కార్యాలయానికి రాలేని పక్షంలో, అధికారుల బృందమే నేరుగా ఆయన నివాసానికి వెళ్లి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిట్ సిద్ధం చేసినట్లు సమాచారం. నిందితుల వాంగ్మూలాల్లో కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చిందా? ట్యాపింగ్ ఆదేశాలు ఎక్కడి నుంచి వెళ్లాయి? అనే కోణంలో విచారణ సాగనుంది.</div>
<div> </div>
<div>ఈ పరిణామంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తుండగా, తప్పు చేసిన వారు ఎవరైనా చట్టానికి సమాధానం చెప్పాల్సిందేనని అధికార కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. కేసీఆర్ విన్నపాన్ని మన్నించి సిట్ మరింత సమయం ఇస్తుందా? లేక విచారణ కోసం ఆయన నివాసానికే వెళ్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/unable-to-attend-due-to-illness/article-8102</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/unable-to-attend-due-to-illness/article-8102</guid>
                <pubDate>Thu, 29 Jan 2026 21:06:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/f021826a-12bf-4028-b6f1-de5f673a876a.jpg"                         length="11690"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డైలీ సీరియల్‌లా సిట్ విచారణ</title>
                                    <description><![CDATA[<div>ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/daily-serial-sit-investigation/article-8086"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/7d29b5aa-3ff6-4670-9721-9827a0066600.jpg" alt=""></a><br /><div><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ నోటీసుల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుందని ఆమె విమర్శించారు.</div>
<div> </div>
<div>ఈ కేసు విచారణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత, సిట్ విచారణ అసలు సీరియస్‌గా జరగడం లేదని మండిపడ్డారు. ఒక ముఖ్యమైన కేసును త్వరగా ముగించకుండా, ప్రభుత్వం దీనిని ఒక ‘డైలీ సీరియల్’ లాగా కావాలనే సాగదీస్తోందని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటం అనేది ముమ్మాటికీ తప్పేనని, దానిని ఎవరూ సమర్థించబోరని స్పష్టం చేసిన ఆమె, అయితే ఈ కేసులో అసలైన నేరస్థులకు శిక్ష పడేలా ప్రభుత్వం వ్యవహరించడం లేదని ఆక్షేపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని ఇంకెన్నాళ్లు నాన్చుతారో చూస్తామని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/daily-serial-sit-investigation/article-8086</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/daily-serial-sit-investigation/article-8086</guid>
                <pubDate>Thu, 29 Jan 2026 20:22:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/7d29b5aa-3ff6-4670-9721-9827a0066600.jpg"                         length="11384"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గులాబీ బాస్‌తో హరీశ్ రావు భేటీ</title>
                                    <description><![CDATA[<p>మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం దాదాపు 7 గంటల పాటు సిట్ (SIT) విచారణను ఎదుర్కొన్న మరుసటి రోజే, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/harish-rao-met-rose-boss/article-7789"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/b6195ba7-6479-44c6-9da6-c5a843b774e7.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం దాదాపు 7 గంటల పాటు సిట్ (SIT) విచారణను ఎదుర్కొన్న మరుసటి రోజే, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో విచారణాధికారులు సంధించిన ప్రశ్నలు, తాను ఇచ్చిన సమాధానాలపై హరీశ్ రావు 'గులాబీ బాస్'కు వివరించినట్లు సమాచారం.</p>
<p><strong>విచారణలో అసలేం జరిగింది?</strong><br />మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విచారణలో సిట్ అధికారులు హరీశ్ రావును ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ అధికారులతో ఉన్న సంబంధాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయనకు తెలిసిన అంశాలపై ఆరా తీశారు. అయితే, ఇప్పటికే అరెస్టయిన అధికారులు 'పెద్దాయన' ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుండటంతో, ఆ పెద్దాయన ఎవరనే కోణంలోనే విచారణ సాగినట్లు తెలుస్తోంది.</p>
<p><strong>కాళేశ్వరం సీన్ మళ్ళీ?</strong><br />ప్రస్తుత పరిణామాలు గతంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను గుర్తుచేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు కాళేశ్వరం కేసులో హరీశ్ రావును విచారించిన వెంటనే ఆయన కేసీఆర్‌ను కలిశారు. ఆ భేటీ ముగిసిన కొద్ది రోజులకే కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ విచారణ ముగియడం, తక్షణమే ఎర్రవల్లిలో భేటీ జరగడం చూస్తుంటే.. తదుపరి నోటీసులు నేరుగా కేసీఆర్‌కే అందుతాయా? అనే చర్చ జోరందుకుంది.</p>
<p><strong>సిట్' నెక్స్ట్ టార్గెట్ ఎవరు?</strong><br />దర్యాప్తు సంస్థలు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాల ప్రకారం విచారణ ప్రక్రియ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు వంటి వారు నిందితులుగా ఉండగా, రాజకీయంగా ఈ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. కాగా, ప్రభుత్వ చర్యలను 'రాజకీయ కక్ష సాధింపు'గా అభివర్ణిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు, దీన్ని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి.</p>
<p>వరుస విచారణలు, నోటీసుల నేపథ్యంలో పార్టీ కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు, అలాగే చట్టపరమైన చిక్కుల నుంచి ఎలా బయటపడాలనే అంశంపై హరీశ్ రావుకు కేసీఆర్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/harish-rao-met-rose-boss/article-7789</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/harish-rao-met-rose-boss/article-7789</guid>
                <pubDate>Wed, 21 Jan 2026 19:22:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/b6195ba7-6479-44c6-9da6-c5a843b774e7.jpg"                         length="68324"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అసెంబ్లీలో కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం ...వీడియో ఇదిగో</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించిన ముఖ్యమంత్రి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఆరోగ్యం గురించి వాకబు చేసిన రేవంత్</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆసక్తికర సంఘటన</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-shakes-hands-with-kcr-in-assembly/article-7161"><img src="https://www.vishvambhara.com/media/400/2025-12/kcrrevanth_v_jpg--442x260-4g.webp" alt=""></a><br /><div>విశ్వంభర హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం చేశారు. సభలో కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి వాకబు చేశారు. మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌, సీతక్క, ఎమ్మెల్యే నవీన్‌యాదవ్‌ ఆయనను పలకరించి అభివాదం చేశారు.</div>
<div><video style="width:100%;height:auto;" src="https://www.vishvambhara.com/media/2025-12/whatsapp-video-2025-12-29-at-12.50.07-pm.mp4" controls=""></video></div>
<div><strong>రెండు నిమిషాల తర్వాత వెళ్లిపోయిన కేసీఆర్</strong></div>
<div>అసెంబ్లీ సమావేశాల తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు సంతాపం తెలిపారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్‌ సభ నుంచి వెళ్లిపోయారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు సభలో ఉన్నది కేవలం రెండు నిమిషాలు మాత్రమే.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-shakes-hands-with-kcr-in-assembly/article-7161</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-shakes-hands-with-kcr-in-assembly/article-7161</guid>
                <pubDate>Mon, 29 Dec 2025 13:18:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-12/kcrrevanth_v_jpg--442x260-4g.webp"                         length="25952"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దీక్ష దివాస్ పేరిట బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరతీసింది : టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>అమరుల శవాలపై కేసీఆర్ అధికారం అనుభవించారు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ దీక్ష దివాస్’ పేరిట మరో కొత్త డ్రామాకు తెరతీసింది.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong> 2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకం.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>బిఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించండి.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/brs-has-opened-another-new-drama-in-the-name-of/article-6940"><img src="https://www.vishvambhara.com/media/400/2025-11/whatsapp-image-2025-11-29-at-10.25.06-am-(1).jpeg" alt=""></a><br /><p><em><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైదరాబాద్</strong></span></em>: ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరదీసింది.. ‘దీక్ష దివాస్’ పేరిట ప్రజలను మోసం చేయడానికి సిద్ధమైందని టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ బయటికి వస్తే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ ముగిసిన శకం అని కేసీఆర్ స్వయంగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ప్రజా సెంటిమెంట్‌ను రాజకీయ లాభం కోసం వాడుకుని కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందింది అని ఆయన ఆరోపించారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ బూటకపు మాటలను నమ్మవద్దని  తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమరుల శవాలపై కేసీఆర్ అధికారం అనుభవించారని.. 2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకం అని ఆరోపించారు. </p>
<p>తెలంగాణ వచ్చింది కేసీఆర్ దీక్ష వల్ల కాదని సోనియా గాంధీ వల్ల వచ్చిందన్నారు. ‘రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్నా’ అని చెప్పి నిమ్స్‌లో ఫ్లూయిడ్స్ తీసుకున్నారని మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, కేటీఆర్ ఒక్కసారి చదవాలని సూచించారు.బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించాలని హితవు పలికారు. 2009లో ముగిసిన దీక్షతో బీఆర్ఎస్ నాటకాలకు తెరతీస్తోందనిమండిపడ్డారు. నిజమైన దీక్షకు మయన్మార్ ఐరన్ లేడీఇరోమ్ షర్మిలా 16 ఏళ్ల నిరాహార దీక్షే ఉదాహరణ అని.. షర్మిల దీక్షకు కేసీఆర్ దీక్షకు “నక్క – నాగలోకం” తేడా ఉందని వ్యాఖ్యానించారు.</p>
<p>పార్లమెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గల్లంతు కావడం ఖాయం అని మహేశ్ గౌడ్ జోష్యం చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనేక వర్సిటీల విద్యార్థులు ఉద్యమానికి ఊపిరులుగా నిలిచారన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలకు స్పందించి సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని చెప్పుకొచ్చారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రజా ప్రతినిధులను నిలదీయాలని ప్రజలకు మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/brs-has-opened-another-new-drama-in-the-name-of/article-6940</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/brs-has-opened-another-new-drama-in-the-name-of/article-6940</guid>
                <pubDate>Sat, 29 Nov 2025 10:48:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-11/whatsapp-image-2025-11-29-at-10.25.06-am-%281%29.jpeg"                         length="120511"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ పై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనోడు..</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>కేటీఆర్ కి రాజకీయంగా మెచ్యురిటీ రాలేదు.. </strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ నీకు ఇప్పుడు చిల్లర పార్టీ అయ్యిందా..? </strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయాలు నేర్చుకున్న మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాసేనా..?</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ..అమెరికా లో నువ్వుజీతం మీదనే బతికే వాడివి ..</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>కిషన్ రెడ్డి మంచోడే..కేంద్రమంత్రి ఐనా స్క్రిప్ట్ రీడరే..!</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>బీజేపీ, బిఆర్ఎస్ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు జగ్గారెడీ విజ్ఞప్తి</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/ktr-character-lenodu-speaking-on-congress/article-6162"><img src="https://www.vishvambhara.com/media/400/2025-08/whatsapp-image-2025-08-22-at-7.12.27-pm.jpeg" alt=""></a><br /><p><em><strong>విశ్వంభర,హైదరాబాద్  : </strong></em>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించిన కేటీఆర్‌కు క్యారెక్టర్ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీపై ఇలా మాట్లాడటం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని మండిపడ్డారు.శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. "వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మీకు థర్డ్ క్లాస్ పార్టీగా, చిల్లర పార్టీగా కనిపిస్తోందా? ఆ పార్టీ నుంచే రాజకీయాలు నేర్చుకున్న మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాసే కదా?" అని నిలదీశారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాధ్యమైందని స్వయంగా కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన మాటలను కేటీఆర్ మరిచిపోయారా అని ధ్వజమెత్తారు.తెలంగాణ రాకపోయి ఉంటే కేటీఆర్ కుటుంబం పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని జగ్గారెడ్డి హితవు పలికారు. "సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు అమెరికాలో జీతం మీద బతికేవారు. మీ కుటుంబం వేల కోట్లు సంపాదించే అవకాశం ఉండేది కాదు" అని ఘాటుగా విమర్శించారు. </p>
<p>తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు లేనిది, ఇప్పుడు కాంగ్రెస్ చిల్లర పార్టీగా ఎందుకు కనిపిస్తోందని ఆయన ప్రశ్నించారు.పదేళ్లు మంత్రిగా పనిచేసినా కేటీఆర్‌కు రాజకీయ పరిణతి రాలేదని, బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. ఆయన తాత, నానమ్మ బతికి ఉంటే ఇలాంటి మాటలకు చెంప మీద కొట్టేవారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన దీక్ష కూడా నాటకంలో భాగమేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలంటూ కేటీఆర్‌కు ఈ సందర్భంగా సూచించారు. తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తారా? అవకాశవాద రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్‌ వైఖరులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎండగట్టారు.తాను సచివాలయంలో సమీక్షలు నిర్వహిస్తే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తాను సమీక్షలు చేస్తానని, వాటిని ఆపేది లేదని స్పష్టం చేశారు. యూరియా ఇవ్వాల్సింది కేంద్రమేనని  మీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నామ్  చేస్తున్నారని అన్నారు . కిషన్ రెడ్డి కేంద్రమంత్రి ఐనా స్క్రిప్ట్ రీడరే అని అన్నారు. వేల కోట్లు రైతులకు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, యూరియా కేంద్రం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వకుండా ఉంటుందా..? అని పేర్కొన్నారు . బిఆర్ఎస్ బీజేపీ నేతల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి జగ్గారెడ్డి పేర్కొన్నారు .సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రైతులకు యూరియా అందించే పనిలోనే ఉన్నారని కేంద్రం దగ్గర తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని రైతులు గమనించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేసారు . </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/ktr-character-lenodu-speaking-on-congress/article-6162</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/ktr-character-lenodu-speaking-on-congress/article-6162</guid>
                <pubDate>Fri, 22 Aug 2025 19:16:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-08/whatsapp-image-2025-08-22-at-7.12.27-pm.jpeg"                         length="151599"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేటీఆర్ మీ ఫ్యామిలీనే ఒక 420.. మమ్మల్ని 420 అంటారా..? : జగ్గారెడ్డి </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సీఎం రేవంత్ నిధుల కోసం ఢిల్లీ వెళ్తే.. కేసీఆర్ కుటుంబం లిక్కర్ దందా కోసం ఢిల్లీ వెళ్లింది</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>అందరికీ వడదెబ్బ తగిలితే.. కేటీఆర్ కి సిస్టర్.. బ్రదరిన్ల స్ట్రోక్ తగిలింది.. </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>మా రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ జీరో..కేటీఆర్ సర్పంచ్‌గానైనా గెలిచారా?</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ముఖ్యమంత్రి రేవంత్ తో చర్చించే స్థాయి కేటీఆర్‌కు లేదు..</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>కేటీఆర్, హరీష్ సవాలు విసిరితే చర్చకు రావడానికి నేను సిద్ధం: జగ్గారెడ్డి</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/ktr-me-family-is-a-420s-420-antara-jaggara-reddy/article-5788"><img src="https://www.vishvambhara.com/media/400/2025-07/whatsapp-image-2025-07-08-at-9.54.44-pm.jpeg" alt=""></a><br /><p><em><strong>విశ్వంభర, హైదరాబాద్</strong></em> : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తమ సుదీర్ఘ రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ ఒక జీరో అని, ఆయన ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చర్చకు పిలిచే స్థాయి కేటీఆర్‌కు లేదని అన్నారు.మంగళవారం గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశ్నించారు. మేమంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి క్షేత్రస్థాయి నుంచి నాయకులుగా ఎదిగాం. కేటీఆర్ తన తండ్రి సీటిస్తే నేరుగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయనెప్పుడైనా సర్పంచ్‌గా గెలిచారా? జడ్పీటీసీగా గెలిచారా? రాజకీయాల్లోని కష్టనష్టాలు, ఒడిదుడుకులు ఆయనకు ఎలా తెలుస్తాయి?" అని జగ్గారెడ్డి నిలదీశారు.అమెరికా లో చదువుకొని వచ్చిన నీకు ఎమ్మెల్యే లు అసెంబ్లీ లో చర్చ చేస్తారా,రోడ్ల మీద చేస్తారా అన్న జ్ఞానం కూడా లేదా అని ప్రశ్నించారు.</p>
<p>మీ నాయన కేసీఆర్ చర్చ కు సవాలు చేస్తే, సీఎం రేవంత్ రెడ్డి వస్తారు, అవసరం అయితే నేను సీఎం ను ఒప్పించేందుకు ట్రై చేస్తానన్నారు. లేదంటే కేటీఆర్, హరీష్ లు సవాలు చేస్తే నేను రావడానికి ఎక్కడికైనా మీతో చర్చించేందుకు సిద్ధం అన్నారు. కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని, కాంగ్రెస్ నేతలను "గాడిదలు" అంటూ విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. "మీరు మమ్మల్ని ఒక మాట అంటే మేము పది మాటలు అంటాం. మీరు ముఖ్యమంత్రిని దూషించడం ఆపేస్తే, మేము కూడా ప్రతి విమర్శలు ఆపేస్తాం" అని స్పష్టం చేశారు.</p>
<p>18 నెలలు అధికారం లేకపోయేసరికి కేటీఆర్ గట్టున పడ్డ చేపలా కొట్టుకుంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. సోదరి కవిత అరెస్టు వ్యవహారంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, అందుకే తరచూ విదేశీ పర్యటనలకు వెళుతున్నారని ఆరోపించారు. అందరికీ వడదెబ్బ తగిలితే కేటీఆర్ కి సిస్టర్, బ్రదరిన్ల స్ట్రోక్ తగిలిందని అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు.కాంగ్రెస్‌ను విమర్శించే ముందు కేటీఆర్ బాగా అధ్యయనం చేయాలని జగ్గారెడ్డి సూచించారు.సీఎం రేవంత్ రెడ్డి ని గోకుడు ఎందుకు మళ్ళీ ఆయనతో తన్నించుకోవడం ఎందుకని అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/ktr-me-family-is-a-420s-420-antara-jaggara-reddy/article-5788</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/ktr-me-family-is-a-420s-420-antara-jaggara-reddy/article-5788</guid>
                <pubDate>Thu, 10 Jul 2025 11:29:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-07/whatsapp-image-2025-07-08-at-9.54.44-pm.jpeg"                         length="92610"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తొమ్మిదేళ్ల తర్వాత నేను సీఎం అయ్యేందుకు కృషి చేస్తా : జగ్గారెడ్డి </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(224,62,45);">రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన అద్భుతంగా సాగుతుంది.</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">మరో ఐదేళ్లు కూడా సీఎం అయ్యేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">లిక్కర్ స్కాంలో వందల కోట్లు కవితకు ఎక్కడివి?</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/i-will-work-to-become-cm-after-nine-years/article-5733"><img src="https://www.vishvambhara.com/media/400/2025-06/whatsapp-image-2025-06-26-at-7.54.36-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. ముఖ్యమంత్రి పదవిపై తన ఆకాంక్షను పరోక్షంగా వెల్లడిస్తూనే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.</p>
<p>ముఖ్యమంత్రి పదవి గురించి జగ్గారెడ్డి మాట్లాడుతూ, వచ్చే మూడేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆ తర్వాత ఐదేళ్ల కాలానికి కూడా ముఖ్యమంత్రి కావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అయితే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత తానూ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆ సమయంలో తన అభ్యర్థిత్వాన్ని ప్రజల ముందు ఉంచుతానని ఆయన వ్యాఖ్యానించారు.</p>
<p>రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన అద్భుతంగా సాగుతుందని ఆయన అన్నారు. గతంలో రైతు బంధు వేసేందుకు బీఆర్ఎస్‌ ఐదు నెలల టైం తీసుకునేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేసిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయంలో డబ్బులు అందుబాటులో ఉండి కూడా వేయలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు కడుతూ కూడా రైతు భరోసా వేసిందన్నారు.</p>
<p>మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఫోన్ ట్యాపింగ్‌తోనే నడిచిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు అంతా ఏం చేస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిఘా పెట్టిందని. తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు తనకు చెప్పినట్టు తెలిపారు. కాంగ్రెస్‌ నాయకుల ఫోన్‌లు ట్యాప్‌ చేయడంపైన దృష్టి పెట్టిన బీఆర్ఎస్‌ గత పదేళ్ల రాష్ట్ర పాలనను గాలికొదిలేసిందని విమర్శించారు.</p>
<p>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం</p>
<p>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కవిత ప్రతి విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆమె బీఆర్ఎస్‌లో ఉన్నా బయటకు వచ్చినా పెద్ద తేడా ఏమీ ఉండదని అన్నారు. కవిత మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని విమర్శించారు. సాధారణంగా తండ్రి రాజకీయ వారసత్వం కుమారుడికి వస్తుందని, ఒకవేళ కుమారుడు లేకపోతే కుమార్తెకు అవకాశం దక్కవచ్చని వ్యాఖ్యానించారు.</p>
<p>తాము స్పందించే స్థాయి నాయకురాలు కవిత కాదన్నది తమ అభిప్రాయమని జగ్గారెడ్డి అన్నారు. కవిత ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాన ప్రాధాన్యత కలిగిన నేతలని, వారు రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకుంటే అర్థం ఉంటుందని తెలిపారు.తమ గురించి కవిత అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో కవిత ప్రమేయంపై జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ స్కాంలో పెట్టుబడులు పెట్టడానికి కవితకు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని జగ్గారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/i-will-work-to-become-cm-after-nine-years/article-5733</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/i-will-work-to-become-cm-after-nine-years/article-5733</guid>
                <pubDate>Fri, 27 Jun 2025 17:55:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-06/whatsapp-image-2025-06-26-at-7.54.36-pm.jpeg"                         length="120178"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        