<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/ketireddy-peddareddy/tag-8609" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Ketireddy Peddareddy - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/8609/rss</link>
                <description>Ketireddy Peddareddy RSS Feed</description>
                
                            <item>
                <title>తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(0,0,0);"><strong>జేసీ ప్రభాకర్‌ రెడ్డిని గ్యాంగ్‌స్టర్‌లా తయారు చేశారు: కేతిరెడ్డి</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/why-is-chandrababu-lokesh-silent-on-the-anarchy-in-tadipatri/article-21953"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/ketireddy.jpg" alt=""></a><br /><p class="PDq2pG_selectionAnchorContainer">Ketireddy Peddareddy: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాడిపత్రిలో జరుగుతున్న అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. గోవా లిక్కర్‌ అక్రమ సరఫరా, అక్రమ మద్యం, గంజాయి, పేకాట వంటి వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలతో కమిటీ వేయాలని జేసీ ప్రభాకర్‌ రెడ్డి కోరుతున్నారని, అయితే మంత్రులు పయ్యావుల కేశవ్‌, టీజీ భరత్‌తో కమిటీ వేసి విచారణ చేయించాలని కేతిరెడ్డి సూచించారు.</p>
<p>తాడిపత్రిలో అక్రమ మద్యం, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని కేతిరెడ్డి ఆరోపించారు. కొన్ని పోలీస్‌ స్టేషన్ల వద్దే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తాడిపత్రిలోని పోలీస్‌ స్టేషన్లకు ‘జేసీ స్టేషన్‌’ అని పేరు పెట్టుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా తరహాలో అన్నింటికీ జేసీ ప్రభాకర్‌ రెడ్డి పేరు పెడితే సరిపోతుందని అన్నారు.</p>
<p>టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌ రెడ్డి తన తండ్రి జేసీ ప్రభాకర్‌ రెడ్డిని గ్యాంగ్‌స్టర్‌లా తయారు చేశారని కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 24 మంది వైఎస్సార్‌సీపీ నేతలను అంతం చేస్తామని ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌ రెడ్డి, జేసీ ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సాక్షాత్తూ ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. తాడిపత్రిలో చోటుచేసుకుంటున్న ఆరోపణలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, ప్రజలకు భద్రత కల్పించాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్‌ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/why-is-chandrababu-lokesh-silent-on-the-anarchy-in-tadipatri/article-21953</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/why-is-chandrababu-lokesh-silent-on-the-anarchy-in-tadipatri/article-21953</guid>
                <pubDate>Mon, 24 Aug 2026 10:02:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/ketireddy.jpg"                         length="111035"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        