<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/case/tag-860" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Case - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/860/rss</link>
                <description>Case RSS Feed</description>
                
                            <item>
                <title>నటి ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థరెడ్డికి చుక్కెదురు</title>
                                    <description><![CDATA[<p>రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెల్లడించింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/siddhartha-reddy-is-accused-in-the-case-of-actress-pratyushas/article-8874"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-17-at-5.40.11-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో: </strong>రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్‌ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం ధర్మాసనం.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.</p>
<p><strong>పోస్టుమార్టం ప్రక్రియపై సుప్రీం తీవ్ర అసంతృప్తి</strong><br />ఈ కేసు విచారణ సందర్భంగా పోస్టుమార్టం జరిగిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పోస్టుమార్టం నిర్వహించిన పద్ధతి సరిగా లేదని అభిప్రాయపడింది. నిందితుడు, బాధితురాలి తరఫున దాఖలైన వేర్వేరు అప్పీళ్లను పరిశీలించిన అనంతరం ఈ మేరకు తీర్పును వెలువరించింది.</p>
<p><strong>ప్రేమ.. విషాదం.. సుదీర్ఘ న్యాయపోరాటం</strong><br />ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా, సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న ఇద్దరూ విషం తాగిన స్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష ఫిబ్రవరి 24న మృతి చెందగా, చికిత్స అనంతరం సిద్ధార్థరెడ్డి మార్చి 9న డిశ్చార్జి అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో తేలింది. ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ప్రకారం.. ఆర్గానోఫాస్ఫేట్‌ కారణంగా ప్రత్యూష మరణించారని, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని తేలింది.</p>
<p><strong>ఐదేళ్ల నుంచి రెండేళ్లకు శిక్ష తగ్గింపు</strong><br />దర్యాప్తు జరిపిన సీబీఐ.. నిందితుడిపై ఆత్మహత్యకు పురికొల్పడం (సెక్షన్ 306), ఆత్మహత్యకు యత్నించడం (సెక్షన్ 309) కింద ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. 2004 ఫిబ్రవరి 23న హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి సిద్ధార్థరెడ్డికి ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు. దీనిని సవాల్‌ చేస్తూ సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి, ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేయగా, తాజాగా సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/siddhartha-reddy-is-accused-in-the-case-of-actress-pratyushas/article-8874</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/siddhartha-reddy-is-accused-in-the-case-of-actress-pratyushas/article-8874</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 17:48:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-17-at-5.40.11-pm.jpeg"                         length="179980"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదు</title>
                                    <description><![CDATA[<p>కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎఫ్‌టీఎస్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/case-registered-against-former-mla-jaggareddy/article-8752"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-12-at-7.09.40-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎఫ్‌టీఎస్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జగ్గారెడ్డిపై 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>
<p>కేసు నమోదుపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. సంగారెడ్డిలో దొంగ ఓట్లను అడ్డుకున్న కాంగ్రెస్ నేతపై సీఐ చేయిచేసుకున్నారని ఆయన ఆరోపించారు. తమ నేతను కొట్టినందుకే సీఐని తిట్టాల్సి వచ్చిందని జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. సీఐ శివకుమార్ బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చర్యలు ఉండాలని ఆయన అన్నారు. నిన్న జరిగిన ఘటనలో తప్పు ఎవరిదనేది న్యాయస్థానంలో తేలుతుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/case-registered-against-former-mla-jaggareddy/article-8752</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/case-registered-against-former-mla-jaggareddy/article-8752</guid>
                <pubDate>Thu, 12 Feb 2026 19:11:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-12-at-7.09.40-pm.jpeg"                         length="96643"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సోషల్ మీడియా ట్రోలర్లపై అనసూయ ఫైర్..</title>
                                    <description><![CDATA[<p>ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న అనుచిత దాడులపై చట్టపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా ఆన్‌లైన్ వేదికగా తనను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/anasuya-fires-at-social-media-trolls/article-7608"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/fbb19fde-1252-49f9-9c35-4864531ec45c.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, సినిమా బ్యూరో:</strong> ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న అనుచిత దాడులపై చట్టపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా ఆన్‌లైన్ వేదికగా తనను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక వివరాలను పరిశీలించిన పోలీసులు, ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న సుమారు 42 మందిపై కేసులు నమోదు చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.</p>
<p><strong>ఒక ఇంటర్వ్యూతో మొదలైన విద్వేష ప్రచారం </strong></p>
<p>గతేడాది డిసెంబర్ 23న ఒక మీడియా ఇంటర్వ్యూలో అనసూయ తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే, ఆ వ్యాఖ్యలను సాకుగా తీసుకుని సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు ఆమెపై ఒక వ్యవస్థీకృత క్యాంపెయిన్‌ తరహాలో దాడికి దిగారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, లైంగిక దూషణలు, బెదిరింపులు, అసభ్యకరమైన పోస్టులతో ఆమెను మానసిక వేదనకు గురిచేశారు. ఇది క్రమంగా ముదిరి క్రిమినల్ డిఫమేషన్, ఏఐ ఫోర్జరీ వంటి తీవ్రమైన నేరాలకు దారితీసిందని అనసూయ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు.</p>
<p><strong>రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు</strong><br />అనసూయ సమర్పించిన పక్కా ఆధారాలు, సోషల్ మీడియా లింకులను పరిశీలించిన పోలీసులు ఈ కేసును అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. నిందితుల జాబితాలో సినీ రంగానికి చెందిన కరాటే కల్యాణి, శేఖర్ బాషా, విజయలక్ష్మి వంటి ప్రముఖులతో పాటు టీవీ యాంకర్లు రోహిత్, మనోజ్,  పలువురు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు ఉన్నారు. బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని వంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లను కూడా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. కేవలం వ్యక్తులే కాకుండా, తప్పుడు ప్రచారం చేసిన కొన్ని ఆన్‌లైన్ మీడియా పేజీలపై కూడా చర్యలకు ఉపక్రమించారు.</p>
<p><strong>సాంకేతిక ఆధారాలతో విచారణ వేగవంతం </strong><br />ఈ కేసులో ప్రధానంగా 'ఏఐ ఫోర్జరీ' (మార్ఫింగ్), లైంగిక వేధింపుల అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. నిందితులు వాడిన ఐపీ అడ్రస్‌లు, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను సేకరిస్తున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను కించపరుస్తూ వ్యూస్ కోసం కంటెంట్ క్రియేట్ చేసే వారికి ఈ కేసు ఒక హెచ్చరికగా మారుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. త్వరలోనే నిందితులకు నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Movies</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/anasuya-fires-at-social-media-trolls/article-7608</link>
                <guid>https://www.vishvambhara.com/crime/anasuya-fires-at-social-media-trolls/article-7608</guid>
                <pubDate>Fri, 16 Jan 2026 18:50:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/fbb19fde-1252-49f9-9c35-4864531ec45c.jpg"                         length="73935"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భూ భారతి స్కామ్‌లో 15 మంది అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్ర రెవెన్యూ శాఖలో సంచలనం సృష్టించిన 'భూ భారతి' కుంభకోణం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల సరిహద్దుల్లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/15-people-arrested-in-bhu-bharati-scam/article-7602"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/a5063045-0f2e-4652-a392-b82c004eed93.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> రాష్ట్ర రెవెన్యూ శాఖలో సంచలనం సృష్టించిన 'భూ భారతి' కుంభకోణం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల సరిహద్దుల్లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. భూ భారతి వెబ్‌సైట్‌లో ఉన్న కొన్ని సాంకేతిక లోపాలను నిందితులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని చెప్పారు. తప్పుడు పద్ధతుల్లో లాగిన్ అయ్యి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలాన్లను పక్కదారి పట్టించి అక్రమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారని చెప్పారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.3.90 కోట్ల గండి పడిందని సీపీ సన్ ప్రీత్ సింగ్ వివరించారు.</p><p><strong>నిందితుల నుంచి భారీగా రికవరీ</strong><br />పోలీసులు నిందితుల ఇళ్లపై దాడులు చేసి భారీ మొత్తంలో నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 63.19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.కోటి విలువైన ఆస్తి పత్రాలు, నిందితుల బ్యాంకు ఖాతాల సీజ్ చేశామన్నారు. ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. </p><p>ఈ కేసులో బసవరాజు, జెల్లా అనే వ్యక్తులను ప్రధాన నిందితులుగా గుర్తించారు. ప్రస్తుతం మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఇలాంటి సాంకేతిక నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరైనా ప్రభుత్వ అధికారులు లేదా కీలక వ్యక్తుల హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/15-people-arrested-in-bhu-bharati-scam/article-7602</link>
                <guid>https://www.vishvambhara.com/crime/15-people-arrested-in-bhu-bharati-scam/article-7602</guid>
                <pubDate>Fri, 16 Jan 2026 18:36:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/a5063045-0f2e-4652-a392-b82c004eed93.jpg"                         length="39929"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెళ్లి పేరుతో మోసం.. ఎమ్మెల్యే రాహుల్ కు 3 రోజుల పోలీస్ కస్టడీ</title>
                                    <description><![CDATA[<p>లైంగిక దాడి ఆరోపణల కేసులో చిక్కుకున్న కేరళ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూట‌తిల్‌ను విచారణ నిమిత్తం తిరువల్ల జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/3-days-police-custody-to-mla-rahul-for-fraud-in/article-7490"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/570a47c6-02f0-4c9f-bdc1-5b29ce76c765.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో:</strong> లైంగిక దాడి ఆరోపణల కేసులో చిక్కుకున్న కేరళ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూట‌తిల్‌ను విచారణ నిమిత్తం తిరువల్ల జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారన్న బాధితురాలి ఫిర్యాదుతో నమోదైన ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సిద్ధమైంది. పోలీసులు మొదట ఏడు రోజుల కస్టడీ కోరినప్పటికీ, వాదనలు విన్న అనంతరం కోర్టు కేవలం మూడు రోజులకు మాత్రమే అనుమతినిచ్చింది. ఈ కేసులో మరింత లోతుగా సాక్ష్యాలను సేకరించాలని, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు నివేదించారు.</p>
<p><strong>రాజకీయ వేటు..</strong><br />2024 ఏప్రిల్ లో ఒక హోటల్‌లో తనపై ఎమ్మెల్యే రాహుల్ అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.</p>
<p><strong>ఆందోళనల మధ్య కోర్టుకు..</strong><br />తిరువల్ల తాలుకా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఎమ్మెల్యేను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో DYFI, SFI, యువ మోర్చా కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కస్టడీలో ఉన్న మూడు రోజుల పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ బాధితురాలు పేర్కొన్న ప్రదేశాలకు ఎమ్మెల్యేను తీసుకెళ్లి విచారించనుంది. నిందితుడి ఫోన్ డేటా, ఇతర ఫోరెన్సిక్ ఆధారాలను కూడా పోలీసులు పరిశీలించనున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/3-days-police-custody-to-mla-rahul-for-fraud-in/article-7490</link>
                <guid>https://www.vishvambhara.com/national/3-days-police-custody-to-mla-rahul-for-fraud-in/article-7490</guid>
                <pubDate>Tue, 13 Jan 2026 20:14:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/570a47c6-02f0-4c9f-bdc1-5b29ce76c765.jpg"                         length="98105"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కుటుంబ సభ్యులపై కేసు !</title>
                                    <description><![CDATA[<p>బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్లలో కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశారంటూ ఓ వ్యక్తి చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/a-case-has-been-registered-against-former-brs-mla-jeevan/article-729"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/jeevan_reddy_6a254808b2_v_jpg--799x414-4g.webp" alt=""></a><br /><p>బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్లలో కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశారంటూ ఓ వ్యక్తి చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనపై మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.</p>
<p>వివరాల ప్రకారం.. ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. సర్వే నెంబర్ 32, 35, 36, 38 లో ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నాడు. అయితే, దామోదర్ రెడ్డి భూమికి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉంది. 2023లో ఫంక్షన్ హాల్‌ను కూల్చేసి దామోదర్ రెడ్డి భూమిని జీవన్ రెడ్డి కబ్జా చేసినట్లు సమాచారం. </p>
<p>అయితే, కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్‌ను జీవన్ రెడ్డి కాపలా పెట్టాడు. తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలదీసేందుకు వెళ్లిన దామోదర్ రెడ్డిపై దాడికి దిగారు పంజాబీ గ్యాంగ్.. మారణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని.. జీవన్‌రెడ్డి అనుచరులు బయభ్రాంతులకు గురిచేశారని బాధిడుతు తెలిపాడు. దీంతో జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీసులు ఆరు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/a-case-has-been-registered-against-former-brs-mla-jeevan/article-729</link>
                <guid>https://www.vishvambhara.com/crime/a-case-has-been-registered-against-former-brs-mla-jeevan/article-729</guid>
                <pubDate>Fri, 24 May 2024 16:14:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/jeevan_reddy_6a254808b2_v_jpg--799x414-4g.webp"                         length="21350"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        