<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/jai-bhim-rao-bharat-party/tag-8221" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Jai Bhim Rao Bharat Party - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/8221/rss</link>
                <description>Jai Bhim Rao Bharat Party RSS Feed</description>
                
                            <item>
                <title>డీఎస్సీ నిరసనలకు జై భీమ్ రావు భారత్ పార్టీ మద్దతు.. అనంతపురంలో రిలే దీక్ష</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఏపీ జెన్ జెడ్ వార్‌లో జై భీమ్ రావు భారత్ పార్టీ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/6a7584d6cce16/article-21074"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/anantapuram-news.jpg" alt=""></a><br /><p>Jai Bhim Rao Bharat Party: అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ వద్ద మున్సిపల్ కార్యాలయం ఎదురుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 'ఏపీ జెన్ జెడ్ వార్' రిలే నిరాహార దీక్షకు జై భీమ్ రావు భారత్ పార్టీ మద్దతు ప్రకటించింది. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ నిరసనలో జై భీమ్ రావు భారత్ పార్టీ అనంతపురం అర్బన్ ఇంచార్జ్ నరేష్ కొడవండ్ల పాల్గొన్నారు.</p>
<p>ఈ సందర్భంగా నరేష్ కొడవండ్ల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు, దళితులు, బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆరోపించారు. డీఎస్సీ నియామకాల విషయంలో అభ్యర్థులకు న్యాయం చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.  దళితుల సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పిన ప్రభుత్వం, దళిత ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలపై స్పందించడం లేదని నరేష్ కొడవండ్ల విమర్శించారు.</p>
<p>దళితుల హక్కులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, లేకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ జిల్లా మాజీ ఎంపీ, జిల్లా ఇన్‌చార్జ్ అనంత వెంకట్రామిరెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు ఆయన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జై భీమ్ రావు భారత్ పార్టీ అనంతపురం అర్బన్ ఇంచార్జ్ నరేష్ కొడవండ్లతో పాటు ఎంహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్టీసీ డ్రైవర్ హరిజన నాగన్న తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/6a7584d6cce16/article-21074</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/6a7584d6cce16/article-21074</guid>
                <pubDate>Fri, 07 Aug 2026 12:53:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/anantapuram-news.jpg"                         length="172347"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        