<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/sc-colony/tag-8073" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>SC Colony - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/8073/rss</link>
                <description>SC Colony RSS Feed</description>
                
                            <item>
                <title>ఎస్సీ నియోజకవర్గంలోనే ఎస్సీలకు తాగునీటి కష్టాలు.. నడిమిదొడ్డి వాసుల ఆవేదన</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(224,62,45);">పొలాల నీరే తాగుతున్నాం.. అధికారులను వేడుకుంటున్న నడిమిదొడ్డి ఎస్సీ కాలనీ ప్రజలు</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/even-if-the-government-has-changed-our-lives-have-not/article-20936"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/nadimidoddi.png" alt=""></a><br /><p>Nadimidoddi News: అనంతపురం జిల్లా నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామంలోని ఎస్సీ కాలనీలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. తాగడానికి స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేకపోవడంతో పొలాల్లోని నీటినే తెచ్చుకుని తాగాల్సిన దుస్థితి నెలకొందని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గానికి ఎస్సీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, తమకు కనీస తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని గ్రామస్తులు వాపోయారు.</p>
<p>గ్రామంలో నెలలుగా తాగునీటి సమస్య కొనసాగుతున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే పరిస్థితి ఉండేదని, ప్రభుత్వం మారితే తమ సమస్యలు తీరుతాయని ఆశించామని, కానీ ఇప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.</p>
<p>తాగడానికి సరైన నీరు లేకపోవడంతో వ్యవసాయ పొలాల్లో ఉన్న నీటినే వినియోగించాల్సి వస్తోందని గ్రామస్తులు మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కలుషిత నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, అయినప్పటికీ ప్రత్యామ్నాయం లేక అదే నీటిని ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి నడిమిదొడ్డి ఎస్సీ కాలనీలో శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/even-if-the-government-has-changed-our-lives-have-not/article-20936</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/even-if-the-government-has-changed-our-lives-have-not/article-20936</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 09:19:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/nadimidoddi.png"                         length="2109691"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        