<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/patta-gangavaram-beach/tag-8031" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Patta Gangavaram Beach - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/8031/rss</link>
                <description>Patta Gangavaram Beach RSS Feed</description>
                
                            <item>
                <title>ఫ్రెండ్స్ డే రోజున విషాదం.. విశాఖ బీచ్‌లో ఇద్దరు యువకుల మృతి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>స్నేహితురాలిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన యువకుడు.. పట్ట గంగవరం బీచ్‌లో విషాదం</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/tragedy-on-friends-day-two-youths-died-on-visakha-beach/article-20798"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/patta-gangavaram-beach.jpg" alt=""></a><br /><p class="PDq2pG_selectionAnchorContainer">Patta Gangavaram Beach: విశాఖపట్నంలో ఫ్రెండ్స్ డే రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. పెదగంట్యాడ మండలం పట్ట గంగవరం బీచ్‌లో సముద్రంలో మునిగి ఓ యువతి, యువకుడు మృతి చెందారు. మృతులను జాలారిపేటకు చెందిన నీతు (18), పెందుర్తికి చెందిన దామోదర్గా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో నలుగురు యువతులు, ముగ్గురు యువకులు కలిసి ఫ్రెండ్స్ డే సందర్భంగా పట్ట గంగవరం బీచ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఫొటోలు దిగుతుండగా నీతు ప్రమాదవశాత్తూ సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఆమెను కాపాడేందుకు దామోదర్ వెంటనే సముద్రంలోకి దూకగా, అలల ఉద్ధృతికి ఇద్దరూ గల్లంతయ్యారు.</p>
<p>సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు, మత్స్యకారులు సహాయక చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇటీవలే దామోదర్‌కు కనకమహాలక్ష్మి అనే యువతితో నిశ్చితార్థం జరిగినట్లు తెలిసి స్థానికులు మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నీతు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కావడం ఈ విషాదాన్ని మరింత కలచివేసింది.</p>
<p>ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సముద్ర తీరాలకు వెళ్లే సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని, హెచ్చరికలు ఉన్న ప్రాంతాల్లో నీటిలోకి వెళ్లవద్దని పోలీసులు సూచిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/tragedy-on-friends-day-two-youths-died-on-visakha-beach/article-20798</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/tragedy-on-friends-day-two-youths-died-on-visakha-beach/article-20798</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 10:31:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/patta-gangavaram-beach.jpg"                         length="144853"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        