<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/nandyal/tag-8019" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Nandyal - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/8019/rss</link>
                <description>Nandyal RSS Feed</description>
                
                            <item>
                <title>పెరుగుతున్న శ్రీశైలం నీటిమట్టం.. మరోసారి జలసమాధి కానున్న సంగమేశ్వరం దేవాలయం</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>8 నెలల పాటు నీటిలోనే సంగమేశ్వరం ఆలయం.. భక్తులకు చివరి దర్శన అవకాశం.</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/srisailam-water-level-is-rising-sangameswaram-temple-will-once-again/article-20788"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/sangameshwara-alayam.jpg" alt=""></a><br /><p class="PDq2pG_selectionAnchorContainer">Sangameswaram Temple: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని పవిత్ర సంగమేశ్వరం దేవాలయం మరోసారి జలాధివాసానికి చేరువవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్స్‌లో ఉన్న ఈ చారిత్రక శైవక్షేత్రం ప్రతి ఏడాది వర్షాకాలంలో నీటమునిగిపోవడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 849.6 అడుగులకు చేరుకోవడంతో ఆలయం చుట్టూ బ్యాక్‌వాటర్స్ విస్తరిస్తున్నాయి. నీటిమట్టం మరింత పెరిగితే ఆలయం పూర్తిగా జలసమాధి కానుంది.</p>
<p>ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీశైలం జలాశయం నీటిమట్టం 841 అడుగులకు చేరుకున్నప్పుడు గర్భగుడిలోకి నీరు ప్రవేశించడం ప్రారంభమవుతుంది. అనంతరం నీటిమట్టం 867 అడుగులకు చేరుకోగానే సంగమేశ్వరం దేవాలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. ఆ తర్వాత సుమారు ఎనిమిది నెలల పాటు ఆలయం జలాధివాసంలోనే ఉండటంతో భక్తులకు దర్శనం ఉండదు. వేసవి కాలంలో శ్రీశైలం నీటిమట్టం తగ్గిన తర్వాత మాత్రమే ఆలయం మళ్లీ దర్శనానికి తెరుచుకుంటుంది.</p>
<p>కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ పురాతన శైవక్షేత్రాన్ని దర్శించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఆలయం జలాధివాసానికి చేరువవుతున్న నేపథ్యంలో భక్తులు చివరి దర్శనం కోసం భారీగా వస్తున్నారు. నీటిమట్టం పెరుగుతున్న పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/srisailam-water-level-is-rising-sangameswaram-temple-will-once-again/article-20788</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/srisailam-water-level-is-rising-sangameswaram-temple-will-once-again/article-20788</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 09:47:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/sangameshwara-alayam.jpg"                         length="105402"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        