<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/india/tag-8" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>India - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/8/rss</link>
                <description>India RSS Feed</description>
                
                            <item>
                <title>బంగారం దిగుమతులపై ఆందోళన వద్దు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్</title>
                                    <description><![CDATA[<p> భారత ఆర్థిక వ్యవస్థపై బంగారం ధరల ప్రభావం, దిగుమతుల తీరుపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/union-minister-nirmala-sitharaman-says-no-need-to-worry-about/article-9393"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-9.25.11-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో: </strong>భారత ఆర్థిక వ్యవస్థపై బంగారం ధరల ప్రభావం, దిగుమతుల తీరుపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. బడ్జెట్ అనంతర సంప్రదాయం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు డైరెక్టర్లతో భేటీ అయిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలోకి జరుగుతున్న బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని ఆమె స్పష్టం చేశారు. కరెంట్ ఖాతా లోటుపై వీటి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.</p>
<p><strong>అంతర్జాతీయ కొనుగోళ్లతోనే ధరల సెగ</strong><br />ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వలను పెంచుకోవడానికి పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని, ఇదే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశ్లేషించారు. మన దేశంలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాకుండా ఒక పెట్టుబడి సాధనంగా ఉందని ఆమె గుర్తు చేశారు. పండుగ సమయాల్లో ధరలలో మార్పులు రావడం సహజమేనని, అయితే అవి నిర్దిష్ట పరిమితులను దాటలేదని పేర్కొన్నారు. ఆర్‌బీఐ కూడా ధరల గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.</p>
<p><strong>అమెరికా టారిఫ్ యుద్ధంపై సమీక్ష</strong><br />ఇదే సమయంలో అమెరికా విధిస్తున్న కొత్త దిగుమతి సుంకాల (టారిఫ్) అంశంపై కూడా ఆర్థిక మంత్రి స్పందించారు. ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో సహా ఇతర దేశాలపై సుంకాలను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచడంపై వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిశితంగా సమీక్షిస్తోందని తెలిపారు. ఈ అంశంపై ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం లేదా వ్యాఖ్యలు చేయడం తొందరపాటే అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. భారత ప్రతినిధుల బృందం తదుపరి చర్చలకు వెళ్లిన తర్వాతే వాణిజ్య పరమైన స్పష్టత వస్తుందని వివరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/union-minister-nirmala-sitharaman-says-no-need-to-worry-about/article-9393</link>
                <guid>https://www.vishvambhara.com/national/union-minister-nirmala-sitharaman-says-no-need-to-worry-about/article-9393</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 21:26:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-23-at-9.25.11-pm.jpeg"                         length="289380"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీలో జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ</title>
                                    <description><![CDATA[<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఆయుష్ వైద్యానికి హబ్ గా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రాచీన వైద్య విధానాలను ఆధునిక చికిత్సలతో అనుసంధానించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా భారీ ప్రాజెక్టులను రూపొందించింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/national-institute-of-ayurvedic-medicine-in-ap/article-8777"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-12-at-8.51.38-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, ఏపీ బ్యూరో:</strong> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఆయుష్ వైద్యానికి హబ్ గా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రాచీన వైద్య విధానాలను ఆధునిక చికిత్సలతో అనుసంధానించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా భారీ ప్రాజెక్టులను రూపొందించింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని 'మెడికల్ హబ్'గా మార్చే ప్రణాళికలో భాగంగా, అక్కడ ఒక ప్రతిష్టాత్మక జాతీయ ఆయుర్వేద సంస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.</p>
<p>ఇప్పటికే తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆయుర్వేద కళాశాలను జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయడం, లేదా కేంద్ర నిధులతో కొత్త సంస్థను నిర్మించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాజధాని అమరావతిలో, 2026 కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా రెండు జాతీయ స్థాయి వైద్య పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. అమరావతిలో నిర్మించబోయే 'హెల్త్ సిటీ'లో ఈ సంస్థలు అత్యాధునిక వైద్య పరిశోధనలను చేపట్టడంతో పాటు, ఉన్నత వైద్య విద్యను కూడా అందించనున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/national-institute-of-ayurvedic-medicine-in-ap/article-8777</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/national-institute-of-ayurvedic-medicine-in-ap/article-8777</guid>
                <pubDate>Thu, 12 Feb 2026 20:53:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-12-at-8.51.38-pm.jpeg"                         length="69611"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మోదీ-ట్రంప్‌ ‘చారిత్రాత్మక’ ఒప్పందం</title>
                                    <description><![CDATA[<p> ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ తర్వాత ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/modi-trump-historic-agreement/article-8321"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/image-(39).jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో: </strong>ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ తర్వాత ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత ఉత్పత్తులపై విధిస్తున్న భారీ ప్రతీకార సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ పరిణామం అటు అమెరికా మార్కెట్‌లో భారతీయ వస్తువులకు ఊపిరి పోయడంతో పాటు, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.</p>
<p><strong>ట్రంప్ 'ట్రూత్' సోషల్ వేదికగా సంచలన ప్రకటన</strong><br />ప్రధాని మోదీతో సంభాషణ అనంతరం ట్రంప్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్నారు. "నా స్నేహితుడు మోదీ ఒక శక్తిమంతమైన నాయకుడు. ఆయన విజ్ఞప్తిని గౌరవిస్తూ భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నాను. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేసి, అమెరికా, వెనిజులా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించింది. దీనివల్ల ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉంది" అని ట్రంప్ పేర్కొన్నారు.</p>
<p><strong>సుంకాల లెక్కలివే</strong><br />ఇప్పటివరకు భారతీయ ఉత్పత్తులపై అమెరికా దాదాపు 50 శాతం సుంకాలు విధిస్తోంది. ఇందులో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు శిక్షాత్మకంగా విధించిన 25 శాతం అదనపు సుంకం కూడా ఉంది. తాజా ఒప్పందంతో మొత్తం సుంకం 18 శాతానికి తగ్గించింది. అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలు సున్నా స్థాయికి చేర్చింది. దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన టెక్నాలజీ, వ్యవసాయం, ఇంధన ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోనుంది.</p>
<p><strong>ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ</strong><br />అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై మోదీ స్పందిస్తూ, 140 కోట్ల మంది భారతీయుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. "రెండు దేశాలు కలిసి పనిచేస్తే ప్రపంచ శాంతికి, సుస్థిరతకు మార్గం సుగమమవుతుంది. అమెరికా సుంకాల తగ్గింపు ఎంతో సంతోషకరం. ట్రంప్ నాయకత్వంలో మా భాగస్వామ్యం అత్యున్నత స్థాయికి చేరుతుందని నమ్ముతున్నాను" అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.</p>
<p>జైశంకర్ పర్యటన వేళ కీలక మలుపు<br />భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా పర్యటన ప్రారంభమైన రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులు, ముఖ్యంగా టెక్నాలజీ, తయారీ రంగాలకు భారీ ఊరట కలగనుంది. 'మోదీ-ట్రంప్' ద్వయం ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమీకరణాలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/modi-trump-historic-agreement/article-8321</link>
                <guid>https://www.vishvambhara.com/national/modi-trump-historic-agreement/article-8321</guid>
                <pubDate>Tue, 03 Feb 2026 10:00:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/image-%2839%29.jpg"                         length="59542"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారత్‌లో విమానాల తయారీ</title>
                                    <description><![CDATA[<p>భారత్‌ను గ్లోబల్‌ ఏవియేషన్‌ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. దేశీయ దిగ్గజ సంస్థ అదానీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రయర్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/aircraft-manufacturing-in-india/article-8002"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/image-(5).jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో: </strong>భారత్‌ను గ్లోబల్‌ ఏవియేషన్‌ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. దేశీయ దిగ్గజ సంస్థ అదానీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రయర్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మంగళవారం అధికారికంగా వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌లోనే ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో చిన్న మరియు డొమెస్టిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉందని, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా తయారీ చేపట్టనున్నామని మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు. </p>
<p>ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారత్ అగ్రస్థానంలో ఉంది. టైర్‌-2, టైర్‌-3 నగరాల మధ్య విమాన రాకపోకలను మరింత సులభతరం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషించనుంది.  'ఉడాన్' వంటి పథకాల ద్వారా చిన్న నగరాలకు విమాన ప్రయాణాన్ని చేరువ చేస్తున్న క్రమంలో, ఎంబ్రయర్‌ వంటి సంస్థలతో భాగస్వామ్యం భారత రవాణా ముఖచిత్రాన్ని మార్చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ భాగస్వామ్యం వల్ల దేశంలో వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా, విమాన ప్రయాణ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/aircraft-manufacturing-in-india/article-8002</link>
                <guid>https://www.vishvambhara.com/national/aircraft-manufacturing-in-india/article-8002</guid>
                <pubDate>Tue, 27 Jan 2026 14:50:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/image-%285%29.jpg"                         length="25050"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>982 మంది పోలీసులకు పురస్కారాలు</title>
                                    <description><![CDATA[<p> 2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో అసాధారణ ప్రతిభ కనబరిచిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు మరియు కరెక్షనల్ సర్వీస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/awards-to-982-policemen/article-7912"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/image-(74).jpg" alt=""></a><br /><p><br /><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో: </strong>2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో అసాధారణ ప్రతిభ కనబరిచిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు మరియు కరెక్షనల్ సర్వీస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 982 మంది సిబ్బంది ఈ గౌరవానికి ఎంపికయ్యారు. ప్రాణాలకు తెగించి పోరాడిన వారు కొందరైతే, దశాబ్దాల కాలంగా నిరుపమాన సేవలు అందించిన వారు మరికొందరు ఈ జాబితాలో నిలిచారు.</p>
<p>శత్రువులను ఎదుర్కోవడంలో, నేరస్తులను వేటాడడంలో ప్రాణాలను పణంగా పెట్టిన 125 మంది వీరులకు గ్యాలంట్రీ మెడల్స్ దక్కాయి. పోలీస్ విభాగం నుంచి 121 మంది, ఫైర్ సర్వీస్ నుంచి నలుగురు పతకాలు సాధించారు. జమ్మూ కశ్మీర్‌లో సాహసాలు చేసిన 45 మంది, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి 35 మంది ఈ జాబితాలో ఉండటం విశేషం. రాష్ట్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్ రెడ్డి తన అసాధారణ ధైర్యసాహసాలకు గానూ గ్యాలంట్రీ అవార్డుకు ఎంపికయ్యారు.</p>
<p><strong>విశిష్ట సేవలో 'తెలుగు' వెలుగు</strong><br />దీర్ఘకాలికంగా విశిష్ట సేవలందించిన అధికారులకు ఇచ్చే 'ప్రెసిడెంట్ మెడల్స్' (101) లో తెలుగు అధికారులు మెరిశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏఎస్పీ ఆర్.ఎం.కె. తిరుమలాచారి, తెలంగాణ నుంచి అడిషనల్ ఎస్పీ జీఎస్ ప్రకాశ్ రావు, ఎస్ఐ దామోదర్ రెడ్డి రాష్ట్రపతి పతకాలను అందుకోనున్నారు. మొత్తం 101 పతకాల్లో పోలీస్ సర్వీస్‌కు 89, అగ్నిమాపక దళానికి 5, హోంగార్డులకు 3, కరెక్షనల్ సర్వీస్‌కు 4 లభించాయి.</p>
<p><strong>సేవే పరమావధిగా..</strong><br />నిబద్ధతతో కూడిన సేవలకు ఇచ్చే మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ఈసారి 756 మందిని వరించాయి. ఇందులో పోలీస్ శాఖకు 664, ఫైర్  సర్వీస్ కు 34, సివిల్ డిఫెన్స్ &amp; హోంగార్డుకు 33, కరెక్షనల్ సర్వీస్‌కు 25 పతకాలు ప్రదానం చేశారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, మంచు పర్వతాల్లో, అటవీ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది త్యాగాలను కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా కొనియాడింది. "ప్రజల రక్షణే లక్ష్యంగా పనిచేసే మన భద్రతా బలగాల పరాక్రమం దేశానికి గర్వకారణం" అని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/awards-to-982-policemen/article-7912</link>
                <guid>https://www.vishvambhara.com/national/awards-to-982-policemen/article-7912</guid>
                <pubDate>Sun, 25 Jan 2026 14:05:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/image-%2874%29.jpg"                         length="17777"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title> మావోయిస్టులకు షాక్.. 9 మంది మావోల లొంగుబాటు</title>
                                    <description><![CDATA[<p>దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. గత కొంతకాలంగా వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో బలహీనపడుతున్న మావోయిస్టు కేడర్ నుంచి మరో తొమ్మిది మంది కీలక నేతలు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/surrender-of-9-maoists-came-as-a-shock-to-the/article-7882"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/eda59d8f-4bf2-4905-91a0-f9d1a87a1a21.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో:</strong> దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. గత కొంతకాలంగా వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో బలహీనపడుతున్న మావోయిస్టు కేడర్ నుంచి మరో తొమ్మిది మంది కీలక నేతలు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని ధంతారి జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ సమక్షంలో వారు తమ ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన ఈ తొమ్మిది మంది మావోయిస్టులపై ప్రభుత్వం గతంలోనే భారీ రివార్డులను ప్రకటించింది. వీరిందరిపై కలిపి మొత్తం రూ.47 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరు గతంలో పలు హింసాత్మక ఘటనలు, ఐఈడీ పేలుళ్లు, భద్రతా దళాలపై దాడుల్లో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం.</p>
<p>ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలపై నమ్మకంతోనే ఈ మావోయిస్టులు బయటకు వచ్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున అందాల్సిన తక్షణ సాయం, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని జిల్లా యంత్రాంగం హామీ ఇచ్చింది. "నక్సలిజం వల్ల ఒరిగేదేమీ లేదని, అడవుల్లో ప్రాణాలు పణంగా పెట్టే కంటే సామాన్య పౌరులుగా జీవించడం మిన్న అని గుర్తించాలి. ఇంకా అడవుల్లోనే ఉండిపోయిన మావోయిస్టులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని లొంగిపోవాలి" అని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. వరుస లొంగుబాట్లతో ధంతారి, బస్తర్ ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమ ప్రాబల్యం గణనీయంగా తగ్గుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/surrender-of-9-maoists-came-as-a-shock-to-the/article-7882</link>
                <guid>https://www.vishvambhara.com/national/surrender-of-9-maoists-came-as-a-shock-to-the/article-7882</guid>
                <pubDate>Fri, 23 Jan 2026 21:26:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/eda59d8f-4bf2-4905-91a0-f9d1a87a1a21.jpg"                         length="87615"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహరాజా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం</title>
                                    <description><![CDATA[<p>దేశంలోనే అత్యంత విలాసవంతమైన రైలుగా పేరుగాంచిన 'మహరాజా ఎక్స్‌ప్రెస్‌' పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/a-near-miss-for-the-maharaja-express/article-7804"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/6dde9ab2-1bff-485d-bebe-15960c3f98b1.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో: </strong>దేశంలోనే అత్యంత విలాసవంతమైన రైలుగా పేరుగాంచిన 'మహరాజా ఎక్స్‌ప్రెస్‌' పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. జైపుర్ నుంచి సవాయి మాధోపుర్‌కు వెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి పట్టాలపై దుండగులు ఏర్పాటు చేసిన అవరోధాలను పైలట్ సకాలంలో గుర్తించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ రైలులో అత్యధికంగా విదేశీ పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది.</p>
<p><strong>అసలేం జరిగిందంటే?</strong><br />మంగళవారం అర్ధరాత్రి మహరాజా ఎక్స్‌ప్రెస్‌ తన ప్రయాణంలో ఉండగా, పట్టాలపై ఏదో అసాధారణ వస్తువులు ఉన్నట్లు లోకో పైలట్ గమనించారు. వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రైలు సురక్షితంగా ఆగిపోయింది. కిందకు దిగి పరిశీలించగా, పట్టాలపై దాదాపు  5 అడుగుల పొడవున్న భారీ ఇనుప రాడ్లను అడ్డంగా పెట్టినట్లు గుర్తించి అధికారులు నివ్వెరపోయారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.</p>
<p>రైలును పట్టాలు తప్పించేందుకే దుండగులు ఉద్దేశపూర్వకంగా ఈ రాడ్లను అక్కడ అమర్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం స్నిఫర్ డాగ్స్ సాయంతో రైల్వే పోలీసులు పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు, పట్టాల క్లియరెన్స్ కారణంగా రైలు దాదాపు అరగంట పాటు అక్కడే నిలిచిపోయింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/a-near-miss-for-the-maharaja-express/article-7804</link>
                <guid>https://www.vishvambhara.com/national/a-near-miss-for-the-maharaja-express/article-7804</guid>
                <pubDate>Wed, 21 Jan 2026 20:41:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/6dde9ab2-1bff-485d-bebe-15960c3f98b1.jpg"                         length="83757"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వారసత్వ కట్టడాల వద్ద యూపీఐ సేవలు </title>
                                    <description><![CDATA[<p>దేశంలోని చారిత్రక, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/upi-services-at-heritage-buildings/article-7802"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/3548b688-d84f-4c32-9faa-76b08741bf72.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో: </strong>దేశంలోని చారిత్రక, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇకపై ఎర్రకోట, తాజ్ మహల్, చార్మినార్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో టికెట్ల కోసం చిల్లర కష్టాలు పడాల్సిన అవసరం లేదు. అన్ని హెరిటేజ్ సైట్లలో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారత పురావస్తు సర్వే సంస్థ (ASI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుబంధ సంస్థ ఎన్‌బీఎస్‌ఎల్‌ (NBSL) కసరత్తు చేస్తున్నాయి.</p>
<p><strong>డిజిటల్ వైపు అడుగులు</strong><br />ప్రస్తుతం ఏఎస్‌ఐ ఆధ్వర్యంలోని కట్టడాలకు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉన్నప్పటికీ, నేరుగా కౌంటర్ల వద్ద మాత్రం కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. దీనివల్ల పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టికెట్ కౌంటర్ల వద్ద భీమ్ యూపీఐ సేవలను ప్రారంభించనున్నారు. ప్రతి టికెట్ కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేస్తారు. సందర్శకులు తమ మొబైల్ ద్వారా స్కాన్ చేసి క్షణాల్లో టికెట్ పొందవచ్చు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు పర్యాటకులకు కొంత మేర క్యాష్‌బ్యాక్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఎన్‌బీఎస్‌ఎల్‌ ఎండీ, సీఈఓ నటరాజన్ వెల్లడించారు. విదేశీ పర్యాటకులతో పాటు స్వదేశీయులకు కూడా ఈ విధానం ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది. అన్ని పురావస్తు ప్రదేశాల్లో నగదు రహిత లావాదేవీలను పెంచడమే తమ లక్ష్యమని ఎన్‌బీఎస్ఎల్ ఎండీ నటరాజన్ తెలిపారు. ఎన్‌బీఎస్‌ఎల్‌, ఏఎస్‌ఐ సమన్వయంతో త్వరలోనే ఈ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/upi-services-at-heritage-buildings/article-7802</link>
                <guid>https://www.vishvambhara.com/national/upi-services-at-heritage-buildings/article-7802</guid>
                <pubDate>Wed, 21 Jan 2026 20:40:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/3548b688-d84f-4c32-9faa-76b08741bf72.jpg"                         length="36417"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రిపబ్లిక్ డే టార్గెట్‌గా ఉగ్ర కుట్ర</title>
                                    <description><![CDATA[<p>భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారీ కుట్రకు తెరలేపింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/terror-conspiracy-as-republic-day-target/article-7775"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/a5b39ca3-ecce-44be-8cdf-89fc246d26eb.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో: </strong>భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారీ కుట్రకు తెరలేపింది. జనవరి 26న దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో భీకర దాడులు చేసేందుకు ‘26-26’ అనే కోడ్ నేమ్‌తో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ దాడుల వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు పక్కా సమాచారం అందింది. గణతంత్ర దినోత్సవం రోజున (జనవరి 26) విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా '26-26' పేరును నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  జమ్మూ కశ్మీర్, దిల్లీ, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని రద్దీ ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు. నిందితులు సోషల్ మీడియా వేదికగా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ, యువకులను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.</p>
<p><strong>అప్రమత్తమైన భద్రతా బలగాలు</strong><br />ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ నిఘాను ముమ్మరం చేసింది. పలువురు అనుమానిత ఉగ్రవాదుల ఫొటోలతో దిల్లీ పోలీసులు వాంటెడ్ నోటీసులు జారీ చేశారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్ల వద్ద బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానిత వస్తువులు కనిపిస్తే తక్షణమే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/terror-conspiracy-as-republic-day-target/article-7775</link>
                <guid>https://www.vishvambhara.com/national/terror-conspiracy-as-republic-day-target/article-7775</guid>
                <pubDate>Wed, 21 Jan 2026 18:22:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/a5b39ca3-ecce-44be-8cdf-89fc246d26eb.jpg"                         length="71672"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మైనారిటీలపై దాడులు మత ప్రమేయం లేనివే</title>
                                    <description><![CDATA[<p>బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన వేళ, అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/international/attacks-on-minorities-are-not-religious/article-7750"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/e45357b1-5dc3-49fb-84ae-244a6c059df8.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర బ్యూరో:</strong> బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన వేళ, అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గడిచిన ఏడాది కాలంలో జరిగిన ఘటనల్లో అత్యధికం వ్యక్తిగత కక్షలు లేదా నేరపూరిత స్వభావం కలిగినవే తప్ప, వాటికి మతపరమైన ఉద్దేశాలు లేవని మహమ్మద్ యూనస్ కార్యాలయం స్పష్టం చేసింది.</p>
<p>యూనస్ కార్యాలయం విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం.. గతేడాది మైనారిటీలకు సంబంధించి 645 ఘటనలు నమోదయ్యాయి. వీటిలో కేవలం 71 ఘటనలు (అంటే కేవలం 11%) మాత్రమే మతపరమైన కారణాలతో జరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. దేవాలయాల ధ్వంసానికి సంబంధించి 38 కేసులు నమోదయ్యాయి. మతపరమైన 71 ఘటనల్లో 50 కేసులను పోలీసులు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన 21 ఘటనలపై విచారణ సాగుతోందని వెల్లడించింది.</p>
<p><strong>గణాంకాలను తోసిపుచ్చిన హిందూ సంఘాలు</strong><br />ప్రభుత్వ గణాంకాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ (BHBCUC) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ప్రకటనలు నేరస్తులకు వత్తాసు పలికేలా ఉన్నాయని, వారికి శిక్ష పడదనే భరోసా కల్పిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.</p>
<p><strong>ఆందోళనలో హిందూ సమాజం</strong><br />బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణపై భారత్ నిరంతరం ఒత్తిడి తెస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ ఏడాది కేవలం మూడు వారాల వ్యవధిలోనే 10 మందికి పైగా హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. నిత్యం ఆలయాల ధ్వంసం, ఆస్తుల లూటీ వంటి వార్తలు మైనారిటీల్లో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. అన్ని నేరాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పెరుగుతున్న దాడులు మరియు మైనారిటీ సంఘాల ఆందోళనలు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>International</category>
                                    

                <link>https://www.vishvambhara.com/international/attacks-on-minorities-are-not-religious/article-7750</link>
                <guid>https://www.vishvambhara.com/international/attacks-on-minorities-are-not-religious/article-7750</guid>
                <pubDate>Mon, 19 Jan 2026 20:16:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/e45357b1-5dc3-49fb-84ae-244a6c059df8.jpg"                         length="51194"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నౌకాయానంలో భారత్ ఘనత</title>
                                    <description><![CDATA[<p>ఆధునిక సాంకేతికతకు, పురాతన విజ్ఞానాన్ని జోడించి రూపొందించిన ‘ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య’ తన తొలి సుదీర్ఘ అంతర్జాతీయ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/indias-glory-in-sailing/article-7530"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/image-(47).jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో: </strong>భారత నౌకాదళం చరిత్ర సృష్టించింది. ఆధునిక సాంకేతికతకు, పురాతన విజ్ఞానాన్ని జోడించి రూపొందించిన ‘ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య’ తన తొలి సుదీర్ఘ అంతర్జాతీయ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది. గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి బయల్దేరిన ఈ నౌక.. ఎలాంటి ఇంజిన్ సాయం లేకుండా, కేవలం తెరచాపల సాయంతో పయనించి బుధవారం ఒమన్‌ రాజధాని మస్కట్ తీరానికి చేరుకుంది. మస్కట్‌కు చేరుకున్న అనంతరం ఓడలోని సిబ్బంది సంబరాలు చేసుకున్నారు.</p>
<p>గత నెల 29న గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి బయల్దేరిన ఈ నౌక.. 18 మంది సిబ్బందితో 18 రోజుల పాటు ప్రయాణించింది. సుమారు సుమారు 750 నాటికల్ మైళ్లు (1,400 కిలోమీటర్లు) ప్రయాణించింది. ఎలాంటి ఇంజిన్ లేకుండా కేవలం తెరల సహాయంతో కొనసాగిన ఈ ప్రయాణం భారతదేశ ప్రాచీన సముద్రయాణ వైభవానికి, అద్వితీయమైన నౌకా నిర్మాణ కౌశల్యానికి ప్రతీకగా నిలిచింది.</p>
<p><strong>అజంతా స్ఫూర్తితో.. ఆధునిక సృష్టి</strong><br />ఈ నౌక నిర్మాణం వెనుక 1,500 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందిన అజంతా గుహల్లోని ఒక ఓడ చిత్రం ఆధారంగా కేరళకు చెందిన నిపుణులైన కార్మికులు దీనిని రూపొందించారు. నౌక పొడవు 65 అడుగులు, వెడల్పు 22 అడుగులు, ఎత్తు 13 అడుగులతో రూపొందించారు. ఈ నౌక తయారీలో ఎక్కడా ఒక్క లోహపు మేకును కూడా వాడకపోవడం విశేషం. చెక్క పలకలను ఒకదానికొకటి కొబ్బరి తాడు, పీచుసహాయంతో కుట్టినట్టుగా జత చేశారు. సముద్రపు ఉప్పు నీటి నుంచి కలపను రక్షించేందుకు సహజ సిద్ధమైన రెసిన్ (జిగురు) పూతను వాడారు.</p>
<p><strong>నౌకపై కొలువుదీరిన ప్రాచీన చిహ్నాలు</strong><br />ఈ ఓడకు పూర్వ కాలంలో మన దేశం నుంచి ఆగ్నేయాసియా దేశాలకు ఓడలను నడిపిన దిగ్గజ నావికుడు కౌండిన్య పేరును ఈ ఓడకు పెట్టారు. నౌక తరచాలపై గండభేరుండ పక్షి, సూర్యుడి రూపాలను చిత్రించారు. ముందు భాగంలో సింహాయాళి ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. హరప్పా శైలికి ప్రతి రూపంలో ఉండే లంగరు బొమ్మను డెక్ పై ఉంచారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/indias-glory-in-sailing/article-7530</link>
                <guid>https://www.vishvambhara.com/national/indias-glory-in-sailing/article-7530</guid>
                <pubDate>Wed, 14 Jan 2026 17:26:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/image-%2847%29.jpg"                         length="33125"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇరాన్‌ను వీడాలని భారతీయులకు సూచన</title>
                                    <description><![CDATA[<p>పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో  భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. భారత విదేశాంగ శాఖ (MEA) ఇరాన్‌లోని భారతీయ పౌరులకు అత్యవసర సూచనలు జారీ చేసింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/international/indians-advised-to-leave-iran/article-7516"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/5bf4d2bb-7b76-4d79-bb28-820195de59de.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, బ్యూరో:</strong> పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో  భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. భారత విదేశాంగ శాఖ (MEA) ఇరాన్‌లోని భారతీయ పౌరులకు అత్యవసర సూచనలు జారీ చేసింది. ఇరాన్ -ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడైనా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో తక్షణమే భారతీయులు ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు అందుబాటులో ఉన్న విమాన లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి రావాలని ప్రభుత్వం కోరింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు  భారతీయులెవరూ ప్రస్తుతం ఇరాన్‌కు వెళ్లవద్దని, అన్ని రకాల ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని స్పష్టం చేసింది.ఇరాన్‌లో ఉన్నవారు వెంటనే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం లేదా జహేదాన్‌లోని కాన్సులేట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది.</p>
<p>ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గగనతల మూసివేత లేదా రవాణా నిలిపివేత వంటి పరిస్థితులు తలెత్తక ముందే సురక్షితంగా బయటపడాలని కేంద్రం భావిస్తోంది. "ఇరాన్‌లో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అక్కడ ఉన్న మన పౌరులు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు." అంటూ విదేశాంగ శాఖ ప్రకటన చేసింది.</p>
<p>ప్రస్తుతం ఇరాన్‌లో సుమారు 5,000 నుండి 10,000 మంది వరకు భారతీయులు (ముఖ్యంగా విద్యార్థులు మరియు ఉద్యోగులు) ఉన్నట్లు అంచనా. ఒకవేళ యుద్ధం మొదలైతే వారిని తరలించడం కష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో 'ఆపరేషన్ అజయ్' లేదా 'ఆపరేషన్ కావేరి' తరహాలో పెద్ద ఎత్తున తరలింపు అవసరం కాకుండా, ముందుగానే అప్రమత్తం చేస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>International</category>
                                    

                <link>https://www.vishvambhara.com/international/indians-advised-to-leave-iran/article-7516</link>
                <guid>https://www.vishvambhara.com/international/indians-advised-to-leave-iran/article-7516</guid>
                <pubDate>Wed, 14 Jan 2026 16:26:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/5bf4d2bb-7b76-4d79-bb28-820195de59de.jpg"                         length="170772"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        