<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/telangana/tag-7685" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>telangna - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/7685/rss</link>
                <description>telangna RSS Feed</description>
                
                            <item>
                <title>నల్గొండలో 'హస్తం' విజయకేతనం</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపితమైంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి, ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/hastam-vijayaketana-in-nalgonda/article-8826"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-13-at-5.59.02-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపితమైంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి, ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తమ పట్టును చాటుకుంటూ, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మున్సిపాలిటీలపై జెండా ఎగురవేసింది. ముఖ్యంగా హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. హాలియాలో మొత్తం 12 వార్డులకు గాను ఏకంగా 11 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. అటు నందికొండలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. అక్కడ కూడా 11 వార్డులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోగా, బీఆర్ఎస్ ఒకే ఒక్క వార్డుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.</p>
<p><strong>మిర్యాలగూడ, దేవరకొండలోనూ అదే జోరు</strong><br />జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీ అయిన మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇక్కడ మొత్తం 48 వార్డుల్లో పోటీ జరగగా, 31 స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ 14 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీకి ఒక చోట, ఇతరులకు రెండు చోట్ల విజయం దక్కింది. ఇక దేవరకొండలోనూ కాంగ్రెస్ 11 వార్డులను గెలుచుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకోగా.. బీఆర్ఎస్ 6, బీజేపీ 1, ఇతరులు 2 వార్డుల్లో విజయం సాధించారు.</p>
<p><strong>చిట్యాల, చండూరులో గులాబీ పార్టీకి నిరాశే</strong><br />చిట్యాల మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను 9 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. బీఆర్ఎస్ కేవలం 2 వార్డులకే పరిమితం కాగా, మరొకటి ఇతరుల పరమైంది. అటు చండూరులోనూ 10 వార్డుల్లో 6 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించగా, బీఆర్ఎస్ 3 చోట్ల, ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక చోట విజయం సాధించారు.</p>
<p><strong>కాంగ్రెస్ క్యాంప్‌లో సంబరాలు</strong><br />ఈ ఫలితాలతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. మిఠాయిలు పంచుకుంటూ, బాణసంచా కాలుస్తూ తమ విజయాన్ని ఘనంగా చాటుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోనూ రెండో స్థానానికే పరిమితం కాగా, బీజేపీ ప్రభావం నామమాత్రంగానే ఉండిపోయింది. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, స్థానిక నేతల కృషే ఈ విజయానికి కారణమని గెలిచిన అభ్యర్థులు పేర్కొంటున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/hastam-vijayaketana-in-nalgonda/article-8826</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/hastam-vijayaketana-in-nalgonda/article-8826</guid>
                <pubDate>Fri, 13 Feb 2026 21:06:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-13-at-5.59.02-pm.jpeg"                         length="128151"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సజ్జనార్ ట్వీట్‌కు హరీశ్ రావు కౌంటర్</title>
                                    <description><![CDATA[<p>ఒకప్పుడు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా, ప్రజల పాలిట 'రియల్ హీరో'గా నీరాజనాలు అందుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ చుట్టూ ఇప్పుడు వివాదాల ముసురు అలుముకుంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/harish-raos-counter-to-sajjanars-tweet/article-8318"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/8dd6d96a-b6df-4f3f-ab2f-090dad98a61d.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> ఒకప్పుడు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా, ప్రజల పాలిట 'రియల్ హీరో'గా నీరాజనాలు అందుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ చుట్టూ ఇప్పుడు వివాదాల ముసురు అలుముకుంది. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా, సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు 'సిట్' చీఫ్‌గా ఉన్న ఆయన.. తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చిచ్చు పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ బృందం విచారించింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ తన వ్యక్తిగత 'ఎక్స్' ఖాతాలో.. "అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ పూర్తయింది" అంటూ పోస్ట్ చేశారు. అయితే, ఈ పోస్టులో కేసీఆర్‌ను కనీసం 'గారు' అని కూడా సంబోధించకపోవడం, ఆయనకున్న 'ప్రతిపక్ష నేత' హోదాను విస్మరించడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.</p>
<p><strong>'మీరెలా డిసైడ్ చేస్తారు?'</strong><br />సజ్జనార్ తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ప్రధానంగా రెండు అంశాలను ఆయన తప్పుబట్టారు. కేసు విచారణ దశలో ఉండగానే అది 'అక్రమం' అని సజ్జనార్ ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కోర్టులు తేల్చకముందే ఒక ఐపీఎస్ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్‌కు విరుద్ధమని ధ్వజమెత్తారు. దర్యాప్తు అధికారిగా ఉంటూ రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని, మాజీ సీఎం పట్ల కనీస మర్యాద పాటించకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు అని విమర్శించారు. న్యాయ పాలనపై విశ్వాసాన్ని దెబ్బతీసేలా, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా పోలీసుల ప్రకటనలు ఉండకూడదని హరీశ్ రావు తెలిపారు.</p>
<p>గతంలో సైబరాబాద్ సీపీగా ఉన్నప్పుడు మహిళా భద్రత విషయంలో సజ్జనార్ తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది. కానీ, ఇటీవలి కాలంలో ఆయన వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రతినిధుల అరెస్ట్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత సున్నితమైన కేసులో సిట్ చీఫ్‌గా ఉంటూ.. రాజకీయ సెటైర్లు లేదా పక్షపాత ధోరణి కనిపించేలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ సీనియర్ అధికారి, రాజకీయ విమర్శల సుడిగుండం నుండి ఎలా బయటపడతారో.. బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/harish-raos-counter-to-sajjanars-tweet/article-8318</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/harish-raos-counter-to-sajjanars-tweet/article-8318</guid>
                <pubDate>Mon, 02 Feb 2026 21:25:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/8dd6d96a-b6df-4f3f-ab2f-090dad98a61d.jpg"                         length="40898"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        