<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/maheshkumargoud/tag-7409" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>maheshkumargoud - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/7409/rss</link>
                <description>maheshkumargoud RSS Feed</description>
                
                            <item>
                <title>మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ</title>
                                    <description><![CDATA[<p>మార్చి 15లోపు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/filling-up-of-nominated-posts-by-march-15/article-9055"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-19-at-7.16.35-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మార్చి 15లోపు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మంత్రులందరితో కాంగ్రెస్ అగ్రనాయకులు సమావేశమై, పార్టీ నిర్మాణం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సుదీర్ఘంగా చర్చించారని తెలిపారు. ఈ భేటీలో పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ప్రజలు సంక్షేమ పథకాలను ఆస్వాదిస్తున్నందునే పార్టీని ఆశీర్వదించారని, రాష్ట్రంలో 80 శాతం ప్రజలు తమకు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. </p>
<p>ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధివిధానాల గురించి అడిగి తెలుసుకున్నారని, విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులపై ఆసక్తి చూపారని తెలిపారు. ఇక, పార్టీలో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన రాజగోపాల్ రెడ్డి అంశంపై కూడా అగ్రనేతలతో చర్చించినట్లు పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. త్వరలోనే రాజగోపాల్ రెడ్డిని పిలిచి పార్టీ పెద్దలు మాట్లాడతారని ఆయన స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా, పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తూ చేపడతామని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/filling-up-of-nominated-posts-by-march-15/article-9055</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/filling-up-of-nominated-posts-by-march-15/article-9055</guid>
                <pubDate>Thu, 19 Feb 2026 19:29:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-19-at-7.16.35-pm.jpeg"                         length="62373"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజా పాలనకే పట్టాభిషేకం.. మున్సిపల్ ఫలితాలపై మహేష్ కుమార్ గౌడ్ హర్షం</title>
                                    <description><![CDATA[<p>మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో ‘ప్రజా పాలన’ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని నిరూపించాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mahesh-kumar-goud-is-happy-about-the-municipal-results-which/article-8816"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-13-at-6.43.05-pm-(1).jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో ‘ప్రజా పాలన’ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని నిరూపించాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనవిజయంపై ఆయన స్పందించారు. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు ఉంచిన అచంచలమైన విశ్వాసమని పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల్లో హస్తం పార్టీ అప్రతిహత విజయం సాధించడం గర్వకారణమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.</p>
<p><strong>తిరుగులేని ఆధిక్యం.. పారదర్శక పాలనకు గుర్తింపు</strong><br />మున్సిపల్ ఎన్నికల గణాంకాలను వివరిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 90కి పైగా మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగిరిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. 1500కు పైగా వార్డులు, 170కు పైగా డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించి తమ మద్దతును స్పష్టంగా ప్రకటించారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి వంటి అంశాల్లో తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలే ఈ విజయానికి సోపానాలని ఆయన విశ్లేషించారు.</p>
<p><strong>విపక్షాల అసత్య ప్రచారానికి చెక్</strong><br />ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూసినా ఓటర్లు మాత్రం అభివృద్ధి వైపే నిలిచారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ అనే లక్ష్యంతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించారని ఆయన పేర్కొన్నారు. ఈ వరుస విజయాలు కాంగ్రెస్ పార్టీపై బాధ్యతను మరింత పెంచాయని, ప్రజల నమ్మకాన్ని వంద శాతం నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.</p>
<p><strong>కార్యకర్తలకు కృతజ్ఞతలు.. అభివృద్ధికి బాటలు</strong><br />పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. ఈ అద్భుత విజయం కోసం అహర్నిశలు శ్రమించిన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలకు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, మరింత పారదర్శకమైన మరియు ప్రజాకేంద్రిత పాలనను అందిస్తూ తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mahesh-kumar-goud-is-happy-about-the-municipal-results-which/article-8816</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mahesh-kumar-goud-is-happy-about-the-municipal-results-which/article-8816</guid>
                <pubDate>Fri, 13 Feb 2026 20:53:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-13-at-6.43.05-pm-%281%29.jpeg"                         length="84286"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంత్రుల వ్యక్తిగత జీవితాల దుష్ప్రచారంపై టీపీసీసీ చీఫ్ అసహనం</title>
                                    <description><![CDATA[<p><strong>విశ్వంభర, బ్యూరో: </strong>తెలంగాణ రాష్ట్ర మంత్రుల ప్రైవేట్ జీవితాల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి నిరాధారమైన వార్తలను ప్రచురించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ విమర్శలు విధానాల పరంగా ఉండాలి తప్ప, వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఈ మేరకు శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు రేటింగ్‌ల కోసం, వ్యూస్ కోసం మంత్రుల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలను అల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకు స్వేచ్ఛ ఉంది.. కానీ అది ఇతరుల ప్రైవేట్ జీవితాల్లోకి తొంగిచూసేలా ఉండకూడదని హితవు పలికారు. ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అని ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం ఉండాలని, వ్యక్తిత్వ హననానికి పాల్పడే సంస్కృతిని ప్రోత్సహించవద్దని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-tpcc-chief-is-impatient-with-the-misrepresentation-of-ministers/article-7346"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/whatsapp-image-2026-01-10-at-9.23.59-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, బ్యూరో: </strong>తెలంగాణ రాష్ట్ర మంత్రుల ప్రైవేట్ జీవితాల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి నిరాధారమైన వార్తలను ప్రచురించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ విమర్శలు విధానాల పరంగా ఉండాలి తప్ప, వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఈ మేరకు శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు రేటింగ్‌ల కోసం, వ్యూస్ కోసం మంత్రుల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలను అల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకు స్వేచ్ఛ ఉంది.. కానీ అది ఇతరుల ప్రైవేట్ జీవితాల్లోకి తొంగిచూసేలా ఉండకూడదని హితవు పలికారు. ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అని ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం ఉండాలని, వ్యక్తిత్వ హననానికి పాల్పడే సంస్కృతిని ప్రోత్సహించవద్దని ఆయన కోరారు. ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అనవసరమైన గాసిప్స్‌కు ప్రాధాన్యత ఇవ్వొద్దని ఆయన సూచించారు. బాధ్యతాయుతమైన జర్నలిజం వైపు మీడియా అడుగులు వేయాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-tpcc-chief-is-impatient-with-the-misrepresentation-of-ministers/article-7346</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-tpcc-chief-is-impatient-with-the-misrepresentation-of-ministers/article-7346</guid>
                <pubDate>Sat, 10 Jan 2026 22:10:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/whatsapp-image-2026-01-10-at-9.23.59-pm.jpeg"                         length="14700"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        