<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/brs/tag-69" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>BRS - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/69/rss</link>
                <description>BRS RSS Feed</description>
                
                            <item>
                <title>రైతులకు ఆధునిక సాంకేతికత చేరువ కావాలి: హరీష్ రావు</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మైదానంలో కొనసాగుతున్న రైతుబడి అగ్రిషోను బీఆర్ఎస్ నేత హరీష్ రావు సందర్శించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/farmers-need-access-to-modern-technology/article-9154"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-21-at-7.22.09-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మైదానంలో కొనసాగుతున్న రైతుబడి అగ్రిషోను బీఆర్ఎస్ నేత హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలోని స్టాళ్లను తిలకించి, రైతుల కోసం ఏర్పాటు చేసిన వినూత్న సాంకేతికతను పరిశీలించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. రైతులకు అగ్రిషో ఎన్నో రకాలుగా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రదర్శనలు ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తే సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, రైతులకు మరింత మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న యూరియా కొరతను నివారించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.</p>
<p><strong>అసెంబ్లీలో రైతుల పక్షాన పోరాటం</strong><br />రైతులకు అవసరమైన ఆధునిక వ్యవసాయ పరికరాలను భారీ సబ్సిడీపై అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సాగు పనిముట్లకు రాయితీలు కల్పించే అంశంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రైతుల పక్షాన గట్టిగా చర్చిస్తానని భరోసా ఇచ్చారు. సాంకేతికతను సామాన్య రైతుకు అందుబాటులోకి తెచ్చినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 20న ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక వ్యవసాయ ప్రదర్శన 22వ తేదీ వరకు కొనసాగనుంది. దేశ, విదేశాలకు చెందిన సుమారు 500కు పైగా కంపెనీలు తమ స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి.</p>
<p><strong>అత్యాధునిక సాంకేతికతకు వేదిక</strong><br />ఈ ప్రదర్శనలో ముఖ్యంగా నూతన యంత్రాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు విత్తనాలు, మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల వంటివి రైతులకు ప్రదర్శనకు ఉంచారు. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకలో వ్యవసాయ రంగ నిపుణులతో ప్రత్యేక సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. సందర్శకులు www.rbagrishow.com వెబ్ సైట్ ద్వారా ముందస్తుగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని, నేరుగా వచ్చే వారికి కూడా ప్రవేశం ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/farmers-need-access-to-modern-technology/article-9154</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/farmers-need-access-to-modern-technology/article-9154</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 19:23:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-21-at-7.22.09-pm.jpeg"                         length="117326"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాండ్ పేపర్ల హామీలు ఏమైపోయాయి?: హరీశ్ రావు</title>
                                    <description><![CDATA[<p>కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయినా, ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన వాగ్దానాలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/what-happened-to-the-guarantees-of-bond-papers/article-9083"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-20-at-3.04.18-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయినా, ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన వాగ్దానాలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బాండ్ పేపర్లు రాసిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. నేటికి 800 రోజులు గడిచినా ఒక్క హామీకి కూడా దిక్కులేదని విమర్శించారు. ఇవాళ సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీశ్ రావు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాయ మాటలతో ప్రజలను వంచిస్తోందని మండిపడ్డారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనైనా వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ రూపొందించాలని, అంకెల గారడీ మానేసి ప్రజలకిచ్చిన హామీలకు స్పష్టమైన నిధులు కేటాయించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.</p>
<p><strong>అమలు కాని అభయహస్తం </strong><br />గెలిచిన నెల రోజులకే వృద్ధులు, బీడీ, చేనేత, గీత కార్మికులకు రూ.4000 పెన్షన్ ఇస్తామని చెప్పి 27 నెలలవుతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదని హరీశ్ రావు దుయ్యబట్టారు. ఈ బడ్జెట్‌లోనైనా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క దీనికి నిధులు పెడతారా లేదా అని ప్రశ్నించారు. అదే విధంగా, మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇస్తామని ఆశచూపి మహిళల ఓట్లు దండుకున్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను కూడా ఈ ప్రభుత్వం ఎగ్గొట్టిందని, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలన్నీ కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.</p>
<p><strong>డిక్లరేషన్ల పేరిట మోసం</strong><br />కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, బీసీ, రైతు డిక్లరేషన్లన్నీ పచ్చి అబద్ధాలని హరీశ్ రావు విమర్శించారు. ఎస్సీ సబ్ ప్లాన్, 18 శాతం రిజర్వేషన్ల హామీ దళితులను మోసం చేయడానికేనని, కామారెడ్డిలో సిద్ధరామయ్యను సాక్షిగా పెట్టి ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అమలు ఎక్కడని ఆయన ప్రశ్నించారు. బీసీలకు రూ.20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు మొండిచేయి చూపారని మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ ద్వారా చెప్పించిన రూ.15,000 రైతుబంధు, పంటల బీమా, బోనస్ వంటి హామీలు నీటి మూటలయ్యాయని, అన్నదాతలను ప్రభుత్వం నిలువునా దగా చేసిందని ఆరోపించారు. గత అసెంబ్లీలో బల్లలు చరిచి చెప్పిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు ఎక్కడికి పోయాయని నిలదీస్తూ, కనీసం ఈ బడ్జెట్‌లోనైనా బాధితులందరికీ న్యాయం చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/what-happened-to-the-guarantees-of-bond-papers/article-9083</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/what-happened-to-the-guarantees-of-bond-papers/article-9083</guid>
                <pubDate>Fri, 20 Feb 2026 15:13:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-20-at-3.04.18-pm.jpeg"                         length="110842"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>క్యాతనపల్లిలో హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p>మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ పీఠం కోసం సాగుతున్న పోరు కాస్తా రాజకీయ రణరంగంగా మారింది. బుధవారం ఉదయం నుంచే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/balka-suman-former-mla-of-hydrama-was-arrested-in-kyatanapally/article-8930"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-18-at-5.38.45-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ పీఠం కోసం సాగుతున్న పోరు కాస్తా రాజకీయ రణరంగంగా మారింది. బుధవారం ఉదయం నుంచే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటిని పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ఆయన్ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగి, ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. సుమన్‌ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకోవడంతో క్యాతనపల్లి పురవీధులు నిరసనలతో హోరెత్తాయి.</p>
<p><strong>బందుతో స్తంభించిన పట్టణం.. మహిళా కౌన్సిలర్ల ఆవేదన</strong><br />మంగళవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ సాగుతుండగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ గొడవలకు బీజం వేశాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికను అడ్డుకున్నారని, కాంగ్రెస్ కౌన్సిలర్లు తమపై దౌర్జన్యం చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారని బీఆర్ఎస్, సీపీఐ మహిళా కౌన్సిలర్లు ఆరోపించారు. బుధవారం మీడియా ముందు వారు కన్నీటి పర్యంతమై తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు బుధవారం క్యాతనపల్లి పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి. దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడటంతో పట్టణమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం మంటలు రేగుతున్నాయి.</p>
<p><strong>మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. రాజకీయ యుద్ధం</strong><br />మున్సిపల్ పీఠంపై పట్టు సాధించే క్రమంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పంతం పట్టింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను అధికార పార్టీ దుర్వినియోగం చేస్తోందని బాల్క సుమన్ ఆరోపిస్తుండగా, నిబంధనల ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ కౌన్సిలర్ల ప్రవర్తనపై మహిళా కౌన్సిలర్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, తాజా అరెస్టులు, బంద్ పిలుపుల నేపథ్యంలో క్యాతనపల్లిలో అదనపు బలగాలను మోహరించారు. ఎన్నికల అధికారి తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉంటుందోనని అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/balka-suman-former-mla-of-hydrama-was-arrested-in-kyatanapally/article-8930</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/balka-suman-former-mla-of-hydrama-was-arrested-in-kyatanapally/article-8930</guid>
                <pubDate>Wed, 18 Feb 2026 19:47:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-18-at-5.38.45-pm.jpeg"                         length="32789"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అధికార బలంతో అరాచక పాలన.. బాల్క సుమన్ అరెస్టుపై హరీశ్ రావు విమర్శలు</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ గూండాగిరి రాజ్యమేలుతోందని, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/harish-raos-criticism-of-the-arrest-of-balka-suman-is/article-8926"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-18-at-6.29.33-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ గూండాగిరి రాజ్యమేలుతోందని, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల ఉత్కంఠ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించకుండా కిడ్నాప్‌లు, అక్రమ అరెస్టులతో చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవాలని చూడటం దుర్మార్గమని విమర్శించారు. క్యాతనపల్లిలో ప్రజలు స్పష్టంగా బీఆర్ఎస్‌కు పట్టం కట్టారని, కానీ ఆ తీర్పును తుంగలో తొక్కేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని హరీశ్ రావు మండిపడ్డారు.</p>
<p><strong>పదవుల కబ్జా కాంగ్రెస్ నైజం</strong><br />భూములను కబ్జా చేసినట్లే మున్సిపల్ పదవులను కూడా కబ్జా చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడం, వారిని ప్రలోభపెట్టడం వంటి చర్యల ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని ఆరోపించారు. బాల్క సుమన్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడం ద్వారా ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తున్నారని, ఇలాంటి అణచివేత ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి తొత్తుగా మారడం శోచనీయమని, ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.</p>
<p><strong>ఐక్య పోరాటానికి పిలుపు</strong><br />అరెస్ట్ చేసిన బాల్క సుమన్‌ను తక్షణమే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అడ్డదారుల్లో పదవుల కోసం ప్రయత్నించడం మానుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ అణచివేత వైఖరిపై బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా పోరాడుతాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కానీ కాంగ్రెస్ మాత్రం దౌర్జన్యాలతో అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తోందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ పరిణామాలపై తాము చట్టపరంగా, రాజకీయంగా పోరాటం చేస్తామని హరీశ్ రావు తేల్చి చెప్పారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/harish-raos-criticism-of-the-arrest-of-balka-suman-is/article-8926</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/harish-raos-criticism-of-the-arrest-of-balka-suman-is/article-8926</guid>
                <pubDate>Wed, 18 Feb 2026 19:41:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-18-at-6.29.33-pm.jpeg"                         length="26867"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బందిపోట్లలా దళిత నేత అరెస్టా?: కేటీఆర్</title>
                                    <description><![CDATA[<p>మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/dalit-leader-ktr-arrested-like-bandits/article-8924"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-18-at-6.48.05-pm-(1).jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఒక దళిత నాయకుడైన బాల్క సుమన్‌ను ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, అకస్మాత్తుగా బందిపోట్ల మాదిరిగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆయన ధ్వజమెత్తారు. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ అడ్డదారుల్లో వెళ్తోంది. ఇది ప్రభుత్వ అసమర్థతకు, పిరికిపందతనానికి నిదర్శనం అని కేటీఆర్ మండిపడ్డారు. అరెస్ట్ చేసిన బాల్క సుమన్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.</p><p><strong>మంత్రి వివేక్ డైరెక్షన్‌లో ఎన్నికల ప్రక్రియ</strong><br />క్యాతనపల్లిలో జరుగుతున్న ఎన్నిక కేవలం నామమాత్రంగానే ఉందని, తెరవెనుక మంత్రి వివేక్ వెంకటస్వామి నేరుగా అధికారులపై ఒత్తిడి తెస్తూ ఎన్నికల ప్రక్రియను శాసిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి కళ్లసైగలకు అనుగుణంగా రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు నడుచుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు కాంగ్రెస్ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారాయని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ, దానిని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.</p><p><strong>పోలీసులకు హెచ్చరిక.. ప్రతిఫలం తప్పదు</strong><br />పోలీసు యంత్రాంగం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 'ప్రైవేట్ సైన్యం'లా మారిపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బాల్క సుమన్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలను వేధించడం మానుకోవాలని ఆయన సూచించారు. "ఇప్పుడు అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ, అక్రమాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్క పోలీస్ అధికారి గుర్తుంచుకోవాలి.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భవిష్యత్తులో మీరు చేసిన ప్రతి తప్పుకు తగిన ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అని ఆయన గట్టిగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/dalit-leader-ktr-arrested-like-bandits/article-8924</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/dalit-leader-ktr-arrested-like-bandits/article-8924</guid>
                <pubDate>Wed, 18 Feb 2026 19:39:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-18-at-6.48.05-pm-%281%29.jpeg"                         length="87429"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్‌</title>
                                    <description><![CDATA[<p>మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు చివరకు బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టుకు దారితీశాయి.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/balka-suman-remanded-for-14-days/article-8922"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-18-at-7.35.39-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు చివరకు బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టుకు దారితీశాయి. పోలీసులపై దౌర్జన్యం చేయడం, వారి విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. మంగళవారం నాటి ఘటనలపై లోతుగా విచారణ జరిపిన పోలీసులు, సాక్ష్యాధారాల ప్రాతిపదికన సుమన్‌తో పాటు మరో ముగ్గురు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.</p>
<p>అరెస్టు అనంతరం నిందితులను కట్టుదిట్టమైన భద్రత మధ్య మంచిర్యాల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీనిపై విచారించిన న్యాయస్థానం, బాల్క సుమన్‌ సహా నలుగురికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామంతో పోలీసులు వెంటనే వారిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ అరెస్టులు చేసినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.</p>
<p>క్యాతనపల్లిలో గత కొన్ని రోజులుగా సాగుతున్న పరిణామాలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడంపై నమోదైన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడిగా సుమన్‌ను గుర్తించి కోర్టులో ప్రవేశపెట్టడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/balka-suman-remanded-for-14-days/article-8922</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/balka-suman-remanded-for-14-days/article-8922</guid>
                <pubDate>Wed, 18 Feb 2026 19:38:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-18-at-7.35.39-pm.jpeg"                         length="27259"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగం</title>
                                    <description><![CDATA[<p>మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/errabelli-dayakar-rao-is-emotional/article-8885"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-17-at-6.34.10-pm-(1).jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది. ఈ పరాజయంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన బోరున విలపించారు. రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టుకున్నారు.</p>
<p><strong>లాటరీతో తేలిన ఫలితం</strong><br />తొర్రూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 16 వార్డులకు గాను బీఆర్ఎస్ 9 సీట్లు, కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకున్నాయి. అయితే, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిల ఎక్స్-అఫీషియో సభ్యుల ఓట్లతో కాంగ్రెస్ బలం బీఆర్ఎస్‌తో సమానమైంది. దీంతో అధికారులు లాటరీ ద్వారా చైర్మన్‌ను నిర్ణయించారు. ఈ లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడంతో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది.</p>
<p><strong>పోలీసులు అదుపులోకి ఎర్రబెల్లి</strong><br />ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. ఎంపీ కడియం కావ్య ఎక్స్-అఫీషియో ఓటుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే, ఎంపీలు తమను బెదిరించారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు దిగగా, ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావును అదుపులోకి తీసుకుని నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడానికి పట్టణంలో 144 సెక్షన్ విధించారు.</p>
<p><strong>రాజకీయ భవిష్యత్తుపై ఎర్రబెల్లి ప్రశ్న</strong><br />మీడియాతో మాట్లాడుతూ దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు. "రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన గులాబీ కార్యకర్తలకు తాను ఏం సమాధానం చెప్పాలి?" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నిరంకుశత్వమా అని ప్రశ్నిస్తూ, ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్యల తర్వాత రాజకీయాలలో ఉండాలా వద్దా అని ఎర్రబెల్లి తన ఆవేదనను వెళ్లగక్కారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/errabelli-dayakar-rao-is-emotional/article-8885</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/errabelli-dayakar-rao-is-emotional/article-8885</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 18:42:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-17-at-6.34.10-pm-%281%29.jpeg"                         length="63792"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మున్సిపల్ ఫలితాల ప్రభావం అసెంబ్లీపై ఉండదు</title>
                                    <description><![CDATA[<p>స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఏమాత్రం ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/municipal-results-will-not-affect-the-assembly/article-8848"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-14-at-5.31.28-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఏమాత్రం ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మున్సిపల్ పీఠాల దక్కించుకునే క్రమంలో ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదు ప్రక్రియ అత్యంత కీలకమని, దీనిపై స్పష్టత కోరుతూ ఆయన పార్టీ ముఖ్య నేతలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌లను కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాము 30కి పైగా మున్సిపాలిటీలు గెలుస్తామని అంచనా వేశామని, అయితే ఆ సంఖ్య కొంత మేర తగ్గిందని అంగీకరించారు. అయినప్పటికీ హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో కూడా సమీకరణాలు తమకే అనుకూలంగా మారుతాయని, అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు అవసరమైన వ్యూహాలతో తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.</p>
<p><strong>కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు</strong><br />అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై కేటీఆర్ ఘాటుగా స్పందిస్తూ.. ఆ పార్టీకి కూడా ప్రజలు ఆశించిన మేర మున్సిపాలిటీలను అప్పగించలేదని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ ప్రభావం కేవలం కరీంనగర్, నిజామాబాద్ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఆ పార్టీ ఉనికి ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. పొత్తుల విషయానికొస్తే, స్థానిక పరిస్థితులను బట్టే ఎన్నికల పొత్తులు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.</p>
<p><strong>కొత్తగూడెంలో సీపీఐతో సఖ్యత</strong><br />కొత్తగూడెం మున్సిపాలిటీలో తాము సీపీఐకి మద్దతు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందనే బలమైన సందేశం పంపడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ వివరించారు. ఈ ఫలితాలను విశ్లేషించుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/municipal-results-will-not-affect-the-assembly/article-8848</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/municipal-results-will-not-affect-the-assembly/article-8848</guid>
                <pubDate>Sat, 14 Feb 2026 17:32:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-14-at-5.31.28-pm.jpeg"                         length="114814"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష: కేటీఆర్</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sri-ramaraksha-ktr-is-the-leadership-of-kcr/article-8820"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-13-at-6.10.24-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. అధికార పార్టీ అడ్డదారులు తొక్కినా, క్షేత్రస్థాయిలో గులాబీ జెండా ధైర్యంగా నిలబడిందని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 30 శాతానికి పైగా వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం సామాన్యమైన విషయం కాదని, ఇది తమ పార్టీపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం 15 మున్సిపాలిటీల్లోనే కాకుండా, మరో 37 చోట్ల హంగ్ ఏర్పడేలా ఫలితాలు రావడం వెనుక తమ కార్యకర్తల వీరోచిత పోరాటం ఉందని కేటీఆర్ కొనియాడారు.</p>
<p><strong>అధికార దుర్వినియోగంపై ధ్వజం</strong><br />ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ తీరును కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. గద్వాల, వర్ధన్నపేట వంటి చోట్ల జరిగిన రీ-కౌంటింగ్ గందరగోళాన్ని ప్రస్తావిస్తూ.. అధికారులను అడ్డం పెట్టుకుని, డబ్బు, మద్యం పంపిణీ చేసి అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని, కానీ ఇక్కడ కాంగ్రెస్ 80-90 శాతం స్థానాలు గెలుచుకోలేకపోవడమే ఆ పార్టీ వైఫల్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, దమ్ముంటే ఉప ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ సవాల్ విసిరారు.</p>
<p><strong>ఎర్రజెండాతో దోస్తీ.. కొత్త సమీకరణాలు</strong><br />ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితాల నేపథ్యంలో కేటీఆర్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు రాజకీయాలను తిప్పికొట్టేందుకు సీపీఐతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. సింగరేణి ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవాలంటే వామపక్షాలు, బీఆర్ఎస్ కలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సీపీఐ నేత కూనంనేని సాంబశివరావుతో మాట్లాడి, కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఎర్రజెండాకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కేతన్‌పల్లి మున్సిపాలిటీలో ఇదే తరహాలో కలిసి పనిచేసి విజయం సాధించామని ఆయన గుర్తు చేశారు.</p>
<p>బీఆర్ఎస్ పని అయిపోయిందన్న విమర్శకులకు ఈ ఫలితాలే సమాధానమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా తాము ప్రజల గొంతుకగా మారడంలో సఫలమయ్యామని, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఫలితాల కోసం పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. పార్టీకి కలిసొచ్చే తటస్థులను, ప్రజాస్వామిక శక్తులను కలుపుకొని పోతామని.. రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ జనంలోనే ఉంటామని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు భయపడకుండా పోరాడిన కార్యకర్తలకు అండగా ఉంటామని, త్వరలోనే కొత్త కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sri-ramaraksha-ktr-is-the-leadership-of-kcr/article-8820</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sri-ramaraksha-ktr-is-the-leadership-of-kcr/article-8820</guid>
                <pubDate>Fri, 13 Feb 2026 20:56:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-13-at-6.10.24-pm.jpeg"                         length="81983"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ దేశానికి పట్టిన పెద్ద పీడ: కిషన్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/kishan-reddy-is-the-big-burden-of-the-congress-nation/article-8553"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-06-at-9.02.17-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. సనాతన ధర్మానికి, దేశాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద అవరోధమని, ఆ పార్టీ పాలనలో దేశం భ్రష్టు పట్టిందని ఆయన మండిపడ్డారు. ఈ ఎన్నికలు కేవలం వార్డుల గెలుపు కోసం కాదని, తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల పరిస్థితి ప్రస్తుతం "పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా" తయారైందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పదేళ్ల కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలని ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే, ఇప్పుడు ఆ పార్టీ మంత్రులు దోచుకున్నది పంచుకోవడానికి కొట్టుకుంటున్నారని ఆరోపించారు. అమరవీరుల ఆకాంక్షలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తుంగలో తొక్కాయని, కేవలం బీజేపీతోనే నిజమైన మార్పు సాధ్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.</p>
<p>అభివృద్ధి విషయంలో కేంద్రం వెనకాడటం లేదని చెబుతూ కిషన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో రూ.3.50 లక్షల కోట్ల నిధులతో హైస్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్ కేంద్రంగా మూడు హైస్పీడ్ రైలు మార్గాలను ప్రకటించామని, ఇవి రాష్ట్ర ఆర్థిక రూపురేఖలను మార్చబోతున్నాయని చెప్పారు. కేంద్రం ఇస్తున్న నిధులను వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం 'పెద్దరికం' చేస్తోందే తప్ప, అదనంగా ఏమీ చేయడం లేదని విమర్శించారు.</p>
<p>గత పార్లమెంటు ఎన్నికల్లో 50 శాతం ఎంపీ స్థానాలను బీజేపీకి కట్టబెట్టిన ప్రజలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే తరహాలో నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తారని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య జాతీయ స్థాయిలో రహస్య ఒప్పందం ఉందని, అందుకే విచారణల పేరుతో రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను రక్షించాలంటే కమల దళాన్ని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/kishan-reddy-is-the-big-burden-of-the-congress-nation/article-8553</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/kishan-reddy-is-the-big-burden-of-the-congress-nation/article-8553</guid>
                <pubDate>Fri, 06 Feb 2026 21:25:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-06-at-9.02.17-pm.jpeg"                         length="37151"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.'ప్రజా పాలన – ప్రగతి బాట' కార్యక్రమంలో భాగంగా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/kcrs-adopted-son-kishan-reddy-is-cm-revanth-reddy/article-8538"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-06-at-7.31.52-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.'ప్రజా పాలన – ప్రగతి బాట' కార్యక్రమంలో భాగంగా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీరును విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ముందుకెళ్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. "బీజేపీకి ఓటు వేసినా, బీఆర్ఎస్‌కు ఓటు వేసినా అది మూసీలో వేసినట్లే. ఆ రెండు పార్టీల మధ్య ఉన్నది ఫెవీకాల్ బంధం" అని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ను కాపాడటమే కిషన్ రెడ్డి ప్రధాన అజెండా అని, అందుకే ఆయన ఇప్పుడు 'కల్వకుంట్ల కిషన్ రావు'గా మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డిని కేసీఆర్ దత్తపుత్రుడిగా అభివర్ణిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.</p>
<p><strong>స్మార్ట్ సిటీ ఏది? నిధులు ఏవి? </strong><br />నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను రెండుసార్లు గెలిపించినా జిల్లాకు సాధించిందేమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ మూడుసార్లు ప్రధాని అయినా నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా మార్చలేకపోయారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ మురికికూపంగా మారిందని, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో బీజేపీ విఫలమైందని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వని బీజేపీకి, ఇక్కడి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.</p>
<p><strong>కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం</strong><br />మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మన వార్డుల్లో మన కార్పొరేటర్లు ఉంటేనే నిధుల ప్రవాహం సాధ్యమవుతుందని, అభివృద్ధికి బాటలు పడతాయని ప్రజలకు వివరించారు. "నేను అందరివాడిని.. నాకు కులం, మతం లేదు.. నా లక్ష్యం కేవలం అభివృద్ధి మాత్రమే" అని చెబుతూ, నిజామాబాద్ ఓటర్లు ఈ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇవ్వాలని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/kcrs-adopted-son-kishan-reddy-is-cm-revanth-reddy/article-8538</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/kcrs-adopted-son-kishan-reddy-is-cm-revanth-reddy/article-8538</guid>
                <pubDate>Fri, 06 Feb 2026 19:34:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-06-at-7.31.52-pm.jpeg"                         length="154596"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ జలహక్కులపై కాంగ్రెస్ 'మరణశాసనం'!</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యం కాదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు వల్ల రాష్ట్రానికి తీరని "జలద్రోహం" జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/congress-death-knell-on-telangana-water-rights/article-8106"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/2e0ca244-2eed-41e3-b8ff-e98384622870.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యం కాదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు వల్ల రాష్ట్రానికి తీరని "జలద్రోహం" జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "ఈ ప్రాంతం వాడే తెలంగాణకు ద్రోహం చేస్తాడని కాళోజీ గారు ఆనాడే చెప్పారు. నేడు రేవంత్ రెడ్డి రూపంలో అది నిజమవుతోంది" అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఏపీ ప్రయోజనాల కోసం, చంద్రబాబు నాయుడుపై ఉన్న మమకారంతో రేవంత్ రెడ్డి తెలంగాణ నీటిని ధారపోస్తున్నారని, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సహకరించడమే దీనికి నిదర్శనమని విమర్శించారు. సుప్రీంకోర్టులో బలహీనమైన రిట్ పిటిషన్ వేసి వెనక్కి తీసుకోవడం ద్వారా తెలంగాణ నీటి చరిత్రలో నేడు ఒక 'చీకటి రోజు' గా మిగిలిపోతుందని తెలిపారు.</p>
<p><strong>నల్లమల సాగర్ కుట్ర</strong><br />నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు రావాల్సిన 200 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. డీపీఆర్ ఆపాలని, కేంద్రం అనుమతులు రద్దు చేయాలని గతంలో లేఖ రాసిన ప్రభుత్వం.. ఆ షరతులకు కేంద్రం/ఏపీ అంగీకరించకుండానే ఢిల్లీ మీటింగ్‌కు ఎందుకు వెళ్లింది? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన ఇంజనీర్ ఆదిత్యనాథ్‌ను ఈ కీలక చర్చలకు ఎందుకు పంపారు? అని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ సమావేశాన్ని ప్రభుత్వం ఎందుకు బహిష్కరించలేదని హరీశ్ రావు అడిగారు.</p>
<p><strong>కేంద్ర మంత్రులపై విమర్శలు</strong><br />రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదని హరీష్ రావు నిలదీశారు. రేవంత్ రెడ్డికి కేవలం ఢిల్లీ, దావోస్ పర్యటనలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర పాలనపై లేదని ఎద్దేవా చేశారు. జల ద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుది అయితే.. పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి. ఈ దుర్మార్గాన్ని ప్రజల్లో ఎండగడతాం. నీటి హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధమవుతామని హరీశ్ రావు తెలిపారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/congress-death-knell-on-telangana-water-rights/article-8106</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/congress-death-knell-on-telangana-water-rights/article-8106</guid>
                <pubDate>Fri, 30 Jan 2026 14:31:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/2e0ca244-2eed-41e3-b8ff-e98384622870.jpeg"                         length="59267"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        