<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/farmers/tag-681" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>farmers - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/681/rss</link>
                <description>farmers RSS Feed</description>
                
                            <item>
                <title>రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క.. రుణమాఫీపై క్లారిటీ</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>విశ్వంభర, భద్రాద్రి కొత్తగూడెంః తెలంగాణలో రైతులు రుణమాఫీ కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు దానిపై క్లారిటీ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. కాగా ఇప్పుడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. ఆరు నూరైనా సరే రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. </p>
<p>ఆగస్టు 15 కన్నా ముందే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీని ఎవరు ఆపలేరన్నారు. ప్రజాభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందిస్తామని.. అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక రైతు భరోసాను కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వబోమని.. రైతులతో మాట్లాడిన తర్వాత విధి, విధానాలను రూపొందిస్తామన్నారు. </p>
<p>రైతుల అభిప్రాయాలను తీసుకుని కేబినెట్ లో, అసెంబ్లీలో చర్చలు జరిపిన తర్వాత దానిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. గురువారం రోజున భద్రాద్రి కొత్తగూడెం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bhatti-vikramarka-who-gave-good-news-to-farmers-is-clear-formers-loan/article-2436"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/bhatti-vikramarja.webp" alt=""></a><br /><p> </p>
<p>విశ్వంభర, భద్రాద్రి కొత్తగూడెంః తెలంగాణలో రైతులు రుణమాఫీ కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు దానిపై క్లారిటీ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. కాగా ఇప్పుడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. ఆరు నూరైనా సరే రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. </p>
<p>ఆగస్టు 15 కన్నా ముందే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీని ఎవరు ఆపలేరన్నారు. ప్రజాభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందిస్తామని.. అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక రైతు భరోసాను కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వబోమని.. రైతులతో మాట్లాడిన తర్వాత విధి, విధానాలను రూపొందిస్తామన్నారు. </p>
<p>రైతుల అభిప్రాయాలను తీసుకుని కేబినెట్ లో, అసెంబ్లీలో చర్చలు జరిపిన తర్వాత దానిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. గురువారం రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bhatti-vikramarka-who-gave-good-news-to-farmers-is-clear-formers-loan/article-2436</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bhatti-vikramarka-who-gave-good-news-to-farmers-is-clear-formers-loan/article-2436</guid>
                <pubDate>Thu, 27 Jun 2024 20:54:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/bhatti-vikramarja.webp"                         length="153102"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇంద్రకీలాద్రికి అమరావతి రైతుల పాదయాత్ర</title>
                                    <description><![CDATA[<p>ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/amaravati-farmers-march-to-indrakiladri/article-2312"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/124116972_230624amr-brk1a.jpg" alt=""></a><br /><p>ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు రాజధాని ఉద్యమం విజయం సాధించడంతో కనకదుర్గమ్మ ఆలయానికి అమరావతి ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర  ప్రారంభించారు. </p>
<p>ఆదివారం తెల్లవారుజామున తుళ్లూరు శిబిరం నుంచిరైతులు, మహిళలు పొంగళ్లు తయారు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఇంద్రకీలాద్రికి కాలి నడకన బయల్దేరారు. ఉదయం 11 గంటలలోపు అక్కడికి చేరుకుని మొక్కులు చెల్లించుకునేలా ప్రణాళిక రూపొందించారు. తుళ్లూరు నుంచి రాయపూడి, రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి, కరకట్ట, ప్రకాశం బ్యారేజీ మీదుగా పాదయాత్ర సాగనుంది. పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/amaravati-farmers-march-to-indrakiladri/article-2312</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/amaravati-farmers-march-to-indrakiladri/article-2312</guid>
                <pubDate>Sun, 23 Jun 2024 08:05:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/124116972_230624amr-brk1a.jpg"                         length="62111"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి రేవంత్ కేబినెట్ ఆమోదం</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రుణమాఫీ కోసం 2023 డిసెంబర్ 9కి ముందు రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తింప చేస్తారు. దీనిపై శుక్రవారం రోజున రేవంత్ కేబినెట్ సమావేశం నిర్వహించింది.</p>
<p>రేవంత్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రుణమాఫీ కూడా ఉంది. అయితే డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని రేవంత్ ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల చేయలేకపోయారు. అందుకే ఎంపీ ఎన్నికల సమయంలో ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.</p>
<p>ఇక రుణమాఫీకి రూ.39వేల కోట్లు అవసరం అవుతాయని కేబినెట్ అంచనా వేసింది. దీనికి పీఎం కిసాన్ యోజనకు వర్తింపజేస్తున్న నిబంధనలను వర్తింపజేయాలని చూస్తున్నారు. అదే జరిగితే సీఎం మొదలు ఎమ్మెల్యే వరకు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/good-news-for-farmers-revanth-cabinet-approves-loan-waiver/article-2246"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/af1a2962-02ff-4dc7-99e0-6e933ed9a9df2.jpeg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రుణమాఫీ కోసం 2023 డిసెంబర్ 9కి ముందు రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తింప చేస్తారు. దీనిపై శుక్రవారం రోజున రేవంత్ కేబినెట్ సమావేశం నిర్వహించింది.</p>
<p>రేవంత్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రుణమాఫీ కూడా ఉంది. అయితే డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని రేవంత్ ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల చేయలేకపోయారు. అందుకే ఎంపీ ఎన్నికల సమయంలో ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.</p>
<p>ఇక రుణమాఫీకి రూ.39వేల కోట్లు అవసరం అవుతాయని కేబినెట్ అంచనా వేసింది. దీనికి పీఎం కిసాన్ యోజనకు వర్తింపజేస్తున్న నిబంధనలను వర్తింపజేయాలని చూస్తున్నారు. అదే జరిగితే సీఎం మొదలు ఎమ్మెల్యే వరకు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను కడుతున్నవారికి రైతు భరోసా మినహాయించబోతున్నట్టు తెలుస్తోంది. దాని వల్ల ఎంత ఆదాయం మిగులుతుందనేది కూడా అధికారులు అంచనా వేయాలంటూ ఆదేశించారు సీఎం. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/good-news-for-farmers-revanth-cabinet-approves-loan-waiver/article-2246</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/good-news-for-farmers-revanth-cabinet-approves-loan-waiver/article-2246</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 18:34:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/af1a2962-02ff-4dc7-99e0-6e933ed9a9df2.jpeg"                         length="76124"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతులకు నష్ట పరిహారం అందిస్తాంఃభూపాలపల్లి కలెక్టర్</title>
                                    <description><![CDATA[<p> </p>
<p>చట్టం ప్రకారం అందరికీ పరిహారం<br />గ్రీ్ ఫీల్డ్ నేషనల్ హైవేతో జిల్లా అభివృద్ధి</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/will-provide-compensation-to-the-farmers-said-by-bhupalapalli-collector/article-1915"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/754f1a1f-9312-4661-9801-ecd6b1b89ae3.jpeg" alt=""></a><br /><p> </p>
<p>విశ్వంభర, భూపాలపల్లిః గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం కలెక్టరేట్ లో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణ పై టేకుమట్ల,చిట్యాల, మొగుళ్ళపల్లి మండలాలకు చెందిన రైతులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మీ మండలాలు, గ్రామాల అభివృద్ధి కోసమే గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 3 మండలాల పరిధిలోని 13 గ్రామాల రైతుల నుంచి భూ సేకరణ చేస్తామని వివరించారు. </p>
<p>రైతుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు. 350 ఎకరాలు 35 కిలో మీటర్ల దూరంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే వస్తుందని రోడ్డు నిర్మాణం కోసం 45 మీటర్ల వెడల్పు సేకరణ చేయాల్సి ఉన్నదన్నారు. భూ సేకరణ విషయంలో భూముల ధరలు, భూముల పట్టాలలో తప్పులు, కొంతమందికి పట్టాలు లేకపోవడం లాంటి విషయంలో ప్రభుత్వం తరుపున సహకారం అందిస్తామని తెలిపారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్ట పరిహారం అందిస్తామని, అందరికీ న్యాయం జరిగేలా చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మంగీలాల్, నేషనల్ హైవే అధికారులు, మూడు మండలాల రైతులు తదితరులు పాల్గొన్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/will-provide-compensation-to-the-farmers-said-by-bhupalapalli-collector/article-1915</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/will-provide-compensation-to-the-farmers-said-by-bhupalapalli-collector/article-1915</guid>
                <pubDate>Sat, 15 Jun 2024 18:16:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/754f1a1f-9312-4661-9801-ecd6b1b89ae3.jpeg"                         length="392752"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జులై 15 నుంచి దశలవారీగా రుణమాఫీ... ప్రభుత్వం కసరత్తు </title>
                                    <description><![CDATA[<p>రైతు రుణమాఫీపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. రుణమాఫీ చెల్లింపును జులై 15 నుంచి ఆగస్టు 15 వరకూ దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/from-july-15-the-government-is-working-on-a-phased/article-1868"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/gh140624main-1a.jpg" alt=""></a><br /><p>రైతు రుణమాఫీపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. రుణమాఫీ చెల్లింపును జులై 15 నుంచి ఆగస్టు 15 వరకూ దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా రూ. 2లక్షల రైతు రుణమాఫీకి ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తోంది. </p>
<p>జులై 15 నుంచి రూ. 50వేల లోపు, ఆ తర్వాత రూ. 75వేలు,  రూ. లక్ష.. ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తోంది. రైతుల్లో 70 శాతం మందికి రూ. లక్ష లోపు రుణం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. తొలి దశలో వీరికి మాఫీ చేసి మిగిలినవారికి ఆగస్టు 15లోగా జమ చేయాలనే అంశంపైనా చర్చ సాగుతోంది. అయితే, నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవనున్నట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/from-july-15-the-government-is-working-on-a-phased/article-1868</link>
                <guid>https://www.vishvambhara.com/from-july-15-the-government-is-working-on-a-phased/article-1868</guid>
                <pubDate>Sat, 15 Jun 2024 08:25:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/gh140624main-1a.jpg"                         length="84506"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేవంత్ రెడ్డికి రైతుల కంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయి: కిషన్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>సీఎం రేవంత్‌రెడ్డికి రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఇవాళ (గురువారం) ఆయన బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను సందర్శించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/for-revanth-reddy-elections-have-become-more-important-than-farmers/article-664"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/cr-20240523tn664f187db3b42.webp" alt=""></a><br /><p>సీఎం రేవంత్‌రెడ్డికి రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఇవాళ (గురువారం) ఆయన బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఇందిరమ్మ రాజ్యంలో రుణమాఫీ లేదు.. వడ్లకు బోనస్ లేదు అని చురకలు అంటించారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p>ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రైతులను బీఆర్ఎస్ మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరి అని రైతులను ఇబ్బందులకు గురిచేశారని... ఇప్పుడు, దొడ్డు వడ్లు సాగు చేస్తే బోనస్ ఇవ్వబోమని రేవంత్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు.</p>
<p>ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని కిషన్ రెడ్డి నిలదీశారు. రైతులకు రుణమాఫీ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతి గింజను కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. రైతుల్లో వ్యతిరేకత మూటగట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పదేళ్లు పడితే... కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 నెలలే పట్టిందన్నారు. దొడ్డు రకం వడ్లు వేసిన రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని కిషన్ రెడ్డి హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/for-revanth-reddy-elections-have-become-more-important-than-farmers/article-664</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/for-revanth-reddy-elections-have-become-more-important-than-farmers/article-664</guid>
                <pubDate>Thu, 23 May 2024 17:08:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/cr-20240523tn664f187db3b42.webp"                         length="43536"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని రైతుల ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం..! </title>
                                    <description><![CDATA[<p>సన్నవడ్లతో పాటు దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు మంగళవారం ధర్నాకు దిగారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/farmers-concern-to-give-bonus-to-doddu-vadu-burnt-effigy/article-553"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/screenshot-2024-05-21-135318.jpg" alt=""></a><br /><p>సన్నవడ్లతో పాటు దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు మంగళవారం ధర్నాకు దిగారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చిన రైతులు వాహనాల రాకపోకను అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. </p>
<p>ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను నట్టేట ముంచుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో అన్ని రకాల ధాన్యానికి, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ సన్న ధాన్యానికే ఇస్తామంటూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సన్న రకం ధాన్యం మార్కెట్‌కు రాదని, అది ఎక్కువగా మిల్లులలోనే అమ్ముడుపోతుందని తెలిపారు. ఎక్కువ శాతం రైతులు దొడ్డు వడ్లను పండిస్తుంటారని తెలిపారు.</p>
<p>కేసీఆర్ రైతులను నెత్తిన పెట్టుకొని చూసుకున్నాడంటూ గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం నీళ్లు ఇవ్వడంలేదని వాపోయారు. కరెంట్ సైతం సరిగా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రైతుబంధు పంట చివరలో ఇచ్చి చేతులు దులుపేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో తమ పంటలు ఎండిపోవడంతో ఉన్న కొద్ది పంటలను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలని లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/farmers-concern-to-give-bonus-to-doddu-vadu-burnt-effigy/article-553</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/farmers-concern-to-give-bonus-to-doddu-vadu-burnt-effigy/article-553</guid>
                <pubDate>Tue, 21 May 2024 13:56:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/screenshot-2024-05-21-135318.jpg"                         length="190690"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        