<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/bhatti-vikramarka/tag-673" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>bhatti vikramarka - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/673/rss</link>
                <description>bhatti vikramarka RSS Feed</description>
                
                            <item>
                <title>కేసీఆర్ పాలనను మర్చిపోయావా.. హరీశ్ రావుకు భట్టి విక్రమార్క కౌంటర్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>కేసీఆర్ పాలనను మర్చిపోయావా అంటూ మాజీ మంత్రి హరీశ్ రావుకు సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ వేశారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో గత పదేండ్లుగా ఎన్నో దారుణాలు వెలుగు చూశాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని.. అందుకోసం ఏదైనా చేస్తామంటూ తెలిపారు. </p>
<p>బ్యాంకర్ల వార్షిక రుణప్రణాళికను ఆయన ఆవిష్కరించారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలన్నారు. పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్ అన్నారు. రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలటూ తెలిపారు భట్టి విక్రమార్క. త్వరలోనే తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డు రాబోతోందని.. దాంతో తెలంగాణ రూపు రేఖలే మారిపోతాయంటూ తెలిపారు భట్టి విక్రమార్క. </p>
<p>ఇంత చేస్తున్నా సరే తమను బీఆర్ ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని.. కానీ కేసీఆర్ కాళేశ్వరం కడితే కూలిపోయిందంటూ ఆరోపించారు భట్టి. కేసీఆర్ పానలో జరిగినన్ని అక్రమాలు ఎప్పుడూ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bhatti-vikramarka-counters-harish-rao/article-2115"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/bhatti-vikramarka-vs-harish-rao_v_jpg--1280x720-3g.webp" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>కేసీఆర్ పాలనను మర్చిపోయావా అంటూ మాజీ మంత్రి హరీశ్ రావుకు సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ వేశారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో గత పదేండ్లుగా ఎన్నో దారుణాలు వెలుగు చూశాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని.. అందుకోసం ఏదైనా చేస్తామంటూ తెలిపారు. </p>
<p>బ్యాంకర్ల వార్షిక రుణప్రణాళికను ఆయన ఆవిష్కరించారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలన్నారు. పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్ అన్నారు. రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలటూ తెలిపారు భట్టి విక్రమార్క. త్వరలోనే తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డు రాబోతోందని.. దాంతో తెలంగాణ రూపు రేఖలే మారిపోతాయంటూ తెలిపారు భట్టి విక్రమార్క. </p>
<p>ఇంత చేస్తున్నా సరే తమను బీఆర్ ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని.. కానీ కేసీఆర్ కాళేశ్వరం కడితే కూలిపోయిందంటూ ఆరోపించారు భట్టి. కేసీఆర్ పానలో జరిగినన్ని అక్రమాలు ఎప్పుడూ జరగలేదని.. కాబట్టి కేసీఆర్ చేసిన పాపాలకు ఇప్పుడు మేం పరిష్కారాలు చూపిస్తున్నామంటూ తెలిపారు భట్టి విక్రమార్క. కక్ష సాధింపు కోసం కమిషన్ వేయలేదని.. గతంలో విద్యుత్ మంత్రిగా పనిచేసిన జగదీశ్ రెడ్డి వేయమంటేనే వేశామని తెలిపారు భట్టి విక్రమార్క. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bhatti-vikramarka-counters-harish-rao/article-2115</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bhatti-vikramarka-counters-harish-rao/article-2115</guid>
                <pubDate>Wed, 19 Jun 2024 15:37:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/bhatti-vikramarka-vs-harish-rao_v_jpg--1280x720-3g.webp"                         length="48130"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి: భట్టి విక్రమార్క </title>
                                    <description><![CDATA[<p>ఎన్నికల కోడ్ ముగిసిందని గుర్తుచేస్తూ అధికారులు అభివృద్ధిపై దృష్టిసారించి జవాబుదారీతనంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/officials-should-work-with-accountability-bhatti-vikramarka%C2%A0/article-1535"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/123228509_09bhatti-1a.jpg" alt=""></a><br /><p>ఎన్నికల కోడ్ ముగిసిందని గుర్తుచేస్తూ అధికారులు అభివృద్ధిపై దృష్టిసారించి జవాబుదారీతనంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధిర అభివృద్ధిపై అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇచ్చిన మాట ప్రకారం మధిరను దేశంలో నెంబర్ వన్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. మధిరలో అండర్ డ్రైనేజీల నిర్మాణానికి రూ.128 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. </p>
<p>అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద, యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్, వెన్నునొప్పి వంటి ఖరీదైన వ్యాధుల చికిత్సలు, ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తుతం ఉన్న పథకాలకు సంబంధించి నూతన చికిత్సా విధానాలు, ఆర్థిక సవరణల కోసం రాష్ట్ర సచివాలయంలో భట్టి విక్రమార్కతో సమావేశం జరిగింది.2007లో కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం కింద 2.84 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ఈ పథకం ద్వారా వారికి 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. రాష్ట్రంలోని 1402 ఆసుపత్రుల ద్వారా ఈ సదుపాయం కల్పించబడింది.</p>
<p>ప్రస్తుతం ఈ పథకంలో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వైద్య నిపుణుల సూచనల మేరకు 1375 ప్రొసీజర్లకు ప్యాకేజీ ధరలను పెంచుతూ డిప్యూటీ సీఎం నిర్ణయించారు. యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్ సన్, వెన్నుపూసలకు సంబంధించి ఆరోగ్యశ్రీలో అమలు చేయని 65 అధునాతన చికిత్స విధానాలను ఇక నుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్‌లో ఉన్న 98 చికిత్సా విధానాలను రాజు ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల ప్రభుత్వానికి దాదాపు 189.83 కోట్లు ఖర్చు, 65 కొత్త చికిత్సలను అంగీకరించడం వల్ల ప్రభుత్వం 158.20 కోట్లు ఖర్చు,  చేస్తుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/officials-should-work-with-accountability-bhatti-vikramarka%C2%A0/article-1535</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/officials-should-work-with-accountability-bhatti-vikramarka%C2%A0/article-1535</guid>
                <pubDate>Sun, 09 Jun 2024 13:24:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/123228509_09bhatti-1a.jpg"                         length="37792"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గవర్నర్‌‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణ అవతరణ వేడుకలకు ఆహ్వానం</title>
                                    <description><![CDATA[<p>రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-met-with-the-governor-and-invited-to/article-1093"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/0-5.jpg" alt=""></a><br /><p>రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు.కాగా జూన్ 2న తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను రేవంత్ సర్కార్ ఘనంగా నిర్వహిస్తోంది. డిసెంబర్ 6, 2023వ తేదీన తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. </p>
<p>జూన్ 02, 2024న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కలిసి రాజ్ భవన్‌లో గవర్నర్ రాధా కృష్ణన్‌ను  కలిశారు. </p>
<p>ఆదివారం ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జూన్ 2న ఉదయం 9.30గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు, 10గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో పోలీసుల కవాతులు నిర్వహించనున్నారు. అదేవిధంగా సాయంత్రం ట్యాంక్ బండ్‌పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రారంభించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్‌ను ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేశారు. సాయంత్రం 6.30గంటలకు సీఎం అక్కడికి చేరుకుటారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-met-with-the-governor-and-invited-to/article-1093</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-met-with-the-governor-and-invited-to/article-1093</guid>
                <pubDate>Sat, 01 Jun 2024 11:06:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/0-5.jpg"                         length="494030"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం...! </title>
                                    <description><![CDATA[<p>అకాల వర్షాలతో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్ చెప్పారు. ఇవాళ (మంగళవారం) హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/deputy-cm-gave-good-news-to-the-farmers/article-549"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/bhatti-vikramarka.jpg" alt=""></a><br /><p>అకాల వర్షాలతో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్ చెప్పారు. ఇవాళ (మంగళవారం) హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు. </p>
<p>తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని.. వాతావరణ శాఖ సూచనలను రైతులకు అందించాలని సూచించారు. వర్ష సూచనపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. </p>
<p>అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ నేతలకు అలవాటు అని ఎద్దేవా చేశారు. 15 రోజుల ముందుగానే ధాన్యం కొంటున్నామని తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా తాము ధాన్యం కొనుగోలు చేశామన్నారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని గత ప్రభుత్వం కొనలేదన్నారు. మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని, రైతులెవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.</p>
<p><strong>సన్నబియ్యానికే బోనస్ అనలేదు: భట్టి </strong></p>
<p>సన్న బియ్యానికే రూ.500 బోనస్ ఇస్తామని తాము అనలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రూ.500 బోనస్ ఇచ్చే పథకాన్ని సన్న బియ్యంతో మొదలుపెడుతామని చెప్పామని తెలిపారు.  రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది రైతు ప్రభుత్వమని వెల్లడించారు. తడిచినా, మొలకెత్తినా చివరి గింజ వరకు కొంటామని స్పష్టం చేశారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/deputy-cm-gave-good-news-to-the-farmers/article-549</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/deputy-cm-gave-good-news-to-the-farmers/article-549</guid>
                <pubDate>Tue, 21 May 2024 13:26:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/bhatti-vikramarka.jpg"                         length="278702"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        