<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/harishrao/tag-650" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>harishrao - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/650/rss</link>
                <description>harishrao RSS Feed</description>
                
                            <item>
                <title>ఖమ్మంలో కాంగ్రెస్ ‘రాక్షస కాండ’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు</title>
                                    <description><![CDATA[<p> ఖమ్మం నగరం వెలుగుమట్ల వినోబా నగర్‌లో పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/congresss-monstrous-stalk-in-khammam/article-9537"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-24-at-3.09.57-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>ఖమ్మం నగరం వెలుగుమట్ల వినోబా నగర్‌లో పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. వేల మంది పోలీసుల పహారాలో, నాలుగు జిల్లాల బలగాలను మోహరించి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఇళ్లను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. అప్పులు చేసి పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం అత్యంత హేయమైన చర్య అని, పేద ప్రజలు ప్రభుత్వానికి తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని  నిలదీశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారంటేనే ప్రభుత్వం చేస్తున్న అరాచకం బయటకు తెలియకూడదనే భయం కనిపిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. "చీకటి పనులు చేసేవారే మీడియాను చూసి భయపడతారు" అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని నమ్మబలికిన రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. నేడు ఉన్న ఇళ్లను కూలగొట్టి పేదలను నడిరోడ్డుపై నిలబెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.</p>
<p><strong>గుండె తరుక్కుపోతున్న బాధితుల రోదన</strong><br />ఓటు వేసినందుకు మాకు తగిన శాస్తి జరిగింది అని బాధితులు రోదిస్తుంటే చూసి గుండె తరుక్కుపోతోందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చడం అమానుషమని పేర్కొన్నారు. బాధితుల కన్నీళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.</p>
<p><strong>బీఆర్ఎస్ అండగా ఉంటుంది</strong><br />వెంటనే అక్రమ కూల్చివేతలను ఆపి పోలీసులు వెనక్కి వెళ్లాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పేదలపై కర్రలు ఎత్తడం మానేసి, ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు. నిర్వాసితులకు న్యాయం చేయకుండా ఇంచు భూమి కూడా కదిలించడానికి వీల్లేదు అని స్పష్టం చేస్తూ, పేదల గూడు చెదిరితే ప్రభుత్వ గద్దెలు కూడా అంతే వేగంగా కూలుతాయని హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/congresss-monstrous-stalk-in-khammam/article-9537</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/congresss-monstrous-stalk-in-khammam/article-9537</guid>
                <pubDate>Tue, 24 Feb 2026 15:16:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-24-at-3.09.57-pm.jpeg"                         length="72044"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతులకు ఆధునిక సాంకేతికత చేరువ కావాలి: హరీష్ రావు</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మైదానంలో కొనసాగుతున్న రైతుబడి అగ్రిషోను బీఆర్ఎస్ నేత హరీష్ రావు సందర్శించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/farmers-need-access-to-modern-technology/article-9154"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-21-at-7.22.09-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మైదానంలో కొనసాగుతున్న రైతుబడి అగ్రిషోను బీఆర్ఎస్ నేత హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలోని స్టాళ్లను తిలకించి, రైతుల కోసం ఏర్పాటు చేసిన వినూత్న సాంకేతికతను పరిశీలించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. రైతులకు అగ్రిషో ఎన్నో రకాలుగా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రదర్శనలు ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తే సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, రైతులకు మరింత మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న యూరియా కొరతను నివారించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.</p>
<p><strong>అసెంబ్లీలో రైతుల పక్షాన పోరాటం</strong><br />రైతులకు అవసరమైన ఆధునిక వ్యవసాయ పరికరాలను భారీ సబ్సిడీపై అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సాగు పనిముట్లకు రాయితీలు కల్పించే అంశంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రైతుల పక్షాన గట్టిగా చర్చిస్తానని భరోసా ఇచ్చారు. సాంకేతికతను సామాన్య రైతుకు అందుబాటులోకి తెచ్చినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 20న ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక వ్యవసాయ ప్రదర్శన 22వ తేదీ వరకు కొనసాగనుంది. దేశ, విదేశాలకు చెందిన సుమారు 500కు పైగా కంపెనీలు తమ స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి.</p>
<p><strong>అత్యాధునిక సాంకేతికతకు వేదిక</strong><br />ఈ ప్రదర్శనలో ముఖ్యంగా నూతన యంత్రాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు విత్తనాలు, మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల వంటివి రైతులకు ప్రదర్శనకు ఉంచారు. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకలో వ్యవసాయ రంగ నిపుణులతో ప్రత్యేక సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. సందర్శకులు www.rbagrishow.com వెబ్ సైట్ ద్వారా ముందస్తుగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని, నేరుగా వచ్చే వారికి కూడా ప్రవేశం ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/farmers-need-access-to-modern-technology/article-9154</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/farmers-need-access-to-modern-technology/article-9154</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 19:23:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-21-at-7.22.09-pm.jpeg"                         length="117326"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాండ్ పేపర్ల హామీలు ఏమైపోయాయి?: హరీశ్ రావు</title>
                                    <description><![CDATA[<p>కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయినా, ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన వాగ్దానాలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/what-happened-to-the-guarantees-of-bond-papers/article-9083"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-20-at-3.04.18-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయినా, ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన వాగ్దానాలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బాండ్ పేపర్లు రాసిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. నేటికి 800 రోజులు గడిచినా ఒక్క హామీకి కూడా దిక్కులేదని విమర్శించారు. ఇవాళ సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీశ్ రావు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాయ మాటలతో ప్రజలను వంచిస్తోందని మండిపడ్డారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనైనా వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ రూపొందించాలని, అంకెల గారడీ మానేసి ప్రజలకిచ్చిన హామీలకు స్పష్టమైన నిధులు కేటాయించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.</p>
<p><strong>అమలు కాని అభయహస్తం </strong><br />గెలిచిన నెల రోజులకే వృద్ధులు, బీడీ, చేనేత, గీత కార్మికులకు రూ.4000 పెన్షన్ ఇస్తామని చెప్పి 27 నెలలవుతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదని హరీశ్ రావు దుయ్యబట్టారు. ఈ బడ్జెట్‌లోనైనా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క దీనికి నిధులు పెడతారా లేదా అని ప్రశ్నించారు. అదే విధంగా, మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇస్తామని ఆశచూపి మహిళల ఓట్లు దండుకున్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను కూడా ఈ ప్రభుత్వం ఎగ్గొట్టిందని, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలన్నీ కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.</p>
<p><strong>డిక్లరేషన్ల పేరిట మోసం</strong><br />కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, బీసీ, రైతు డిక్లరేషన్లన్నీ పచ్చి అబద్ధాలని హరీశ్ రావు విమర్శించారు. ఎస్సీ సబ్ ప్లాన్, 18 శాతం రిజర్వేషన్ల హామీ దళితులను మోసం చేయడానికేనని, కామారెడ్డిలో సిద్ధరామయ్యను సాక్షిగా పెట్టి ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అమలు ఎక్కడని ఆయన ప్రశ్నించారు. బీసీలకు రూ.20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు మొండిచేయి చూపారని మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ ద్వారా చెప్పించిన రూ.15,000 రైతుబంధు, పంటల బీమా, బోనస్ వంటి హామీలు నీటి మూటలయ్యాయని, అన్నదాతలను ప్రభుత్వం నిలువునా దగా చేసిందని ఆరోపించారు. గత అసెంబ్లీలో బల్లలు చరిచి చెప్పిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు ఎక్కడికి పోయాయని నిలదీస్తూ, కనీసం ఈ బడ్జెట్‌లోనైనా బాధితులందరికీ న్యాయం చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/what-happened-to-the-guarantees-of-bond-papers/article-9083</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/what-happened-to-the-guarantees-of-bond-papers/article-9083</guid>
                <pubDate>Fri, 20 Feb 2026 15:13:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-20-at-3.04.18-pm.jpeg"                         length="110842"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అధికార బలంతో అరాచక పాలన.. బాల్క సుమన్ అరెస్టుపై హరీశ్ రావు విమర్శలు</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ గూండాగిరి రాజ్యమేలుతోందని, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/harish-raos-criticism-of-the-arrest-of-balka-suman-is/article-8926"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-18-at-6.29.33-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ గూండాగిరి రాజ్యమేలుతోందని, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల ఉత్కంఠ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించకుండా కిడ్నాప్‌లు, అక్రమ అరెస్టులతో చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవాలని చూడటం దుర్మార్గమని విమర్శించారు. క్యాతనపల్లిలో ప్రజలు స్పష్టంగా బీఆర్ఎస్‌కు పట్టం కట్టారని, కానీ ఆ తీర్పును తుంగలో తొక్కేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని హరీశ్ రావు మండిపడ్డారు.</p>
<p><strong>పదవుల కబ్జా కాంగ్రెస్ నైజం</strong><br />భూములను కబ్జా చేసినట్లే మున్సిపల్ పదవులను కూడా కబ్జా చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడం, వారిని ప్రలోభపెట్టడం వంటి చర్యల ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని ఆరోపించారు. బాల్క సుమన్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడం ద్వారా ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తున్నారని, ఇలాంటి అణచివేత ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి తొత్తుగా మారడం శోచనీయమని, ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.</p>
<p><strong>ఐక్య పోరాటానికి పిలుపు</strong><br />అరెస్ట్ చేసిన బాల్క సుమన్‌ను తక్షణమే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అడ్డదారుల్లో పదవుల కోసం ప్రయత్నించడం మానుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ అణచివేత వైఖరిపై బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా పోరాడుతాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కానీ కాంగ్రెస్ మాత్రం దౌర్జన్యాలతో అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తోందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ పరిణామాలపై తాము చట్టపరంగా, రాజకీయంగా పోరాటం చేస్తామని హరీశ్ రావు తేల్చి చెప్పారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/harish-raos-criticism-of-the-arrest-of-balka-suman-is/article-8926</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/harish-raos-criticism-of-the-arrest-of-balka-suman-is/article-8926</guid>
                <pubDate>Wed, 18 Feb 2026 19:41:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-18-at-6.29.33-pm.jpeg"                         length="26867"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేసీఆర్ త్యాగాల పునాదులపైనే నీ సీఎం కుర్చీ</title>
                                    <description><![CDATA[<p>మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఘాటుగా సమాధానమిచ్చారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/your-cms-chair-is-on-the-foundations-of-kcrs-sacrifices/article-8447"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/98fe8a9f-919f-4d95-ac7e-a368e534902c.jpg" alt=""></a><br /><div><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఘాటుగా సమాధానమిచ్చారు. బుధవారం మెదక్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై విమర్శలు గుప్పించారు. 'జాతిపిత' అనే పదానికి అర్థం తెలియకుండానే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లా త్యాగం చేసిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందని హరీశ్ రావు కొనియాడారు. ప్రాణాలకు తెగించి స్వరాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ వీరుడిని విమర్శించే అర్హత రేవంత్‌కు లేదని స్పష్టం చేశారు.</div>
<div> </div>
<div>తెలంగాణ పోరాట సమయంలో ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది కాదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. పార్టీ కండువాలు మారుస్తూ, కాంగ్రెస్ సీనియర్ నేతలను తొక్కుకుంటూ పదవులు సాధించిన వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణను సాధించకపోయి ఉంటే రేవంత్‌కు ముఖ్యమంత్రి పదవి వచ్చేదా అని నిలదీశారు.</div>
<div> </div>
<div><strong>పదవుల కోసం పాకులాట</strong></div>
<div>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆకాంక్షల కంటే పదవులే ముఖ్యమని హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ గురించి మాట్లాడే ముందు తన గతాన్ని ఒకసారి చూసుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి గతంలో ఏనాడూ తెలంగాణ కోసం కొట్లాడిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఉద్యమ నాయకుడిని కించపరచడం సరికాదని హరీశ్ రావు హితవు పలికారు.</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/your-cms-chair-is-on-the-foundations-of-kcrs-sacrifices/article-8447</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/your-cms-chair-is-on-the-foundations-of-kcrs-sacrifices/article-8447</guid>
                <pubDate>Wed, 04 Feb 2026 20:02:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/98fe8a9f-919f-4d95-ac7e-a368e534902c.jpg"                         length="53873"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సజ్జనార్ ట్వీట్‌కు హరీశ్ రావు కౌంటర్</title>
                                    <description><![CDATA[<p>ఒకప్పుడు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా, ప్రజల పాలిట 'రియల్ హీరో'గా నీరాజనాలు అందుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ చుట్టూ ఇప్పుడు వివాదాల ముసురు అలుముకుంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/harish-raos-counter-to-sajjanars-tweet/article-8318"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/8dd6d96a-b6df-4f3f-ab2f-090dad98a61d.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> ఒకప్పుడు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా, ప్రజల పాలిట 'రియల్ హీరో'గా నీరాజనాలు అందుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ చుట్టూ ఇప్పుడు వివాదాల ముసురు అలుముకుంది. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా, సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు 'సిట్' చీఫ్‌గా ఉన్న ఆయన.. తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చిచ్చు పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ బృందం విచారించింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ తన వ్యక్తిగత 'ఎక్స్' ఖాతాలో.. "అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ పూర్తయింది" అంటూ పోస్ట్ చేశారు. అయితే, ఈ పోస్టులో కేసీఆర్‌ను కనీసం 'గారు' అని కూడా సంబోధించకపోవడం, ఆయనకున్న 'ప్రతిపక్ష నేత' హోదాను విస్మరించడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.</p>
<p><strong>'మీరెలా డిసైడ్ చేస్తారు?'</strong><br />సజ్జనార్ తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ప్రధానంగా రెండు అంశాలను ఆయన తప్పుబట్టారు. కేసు విచారణ దశలో ఉండగానే అది 'అక్రమం' అని సజ్జనార్ ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కోర్టులు తేల్చకముందే ఒక ఐపీఎస్ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్‌కు విరుద్ధమని ధ్వజమెత్తారు. దర్యాప్తు అధికారిగా ఉంటూ రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని, మాజీ సీఎం పట్ల కనీస మర్యాద పాటించకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు అని విమర్శించారు. న్యాయ పాలనపై విశ్వాసాన్ని దెబ్బతీసేలా, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా పోలీసుల ప్రకటనలు ఉండకూడదని హరీశ్ రావు తెలిపారు.</p>
<p>గతంలో సైబరాబాద్ సీపీగా ఉన్నప్పుడు మహిళా భద్రత విషయంలో సజ్జనార్ తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది. కానీ, ఇటీవలి కాలంలో ఆయన వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రతినిధుల అరెస్ట్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత సున్నితమైన కేసులో సిట్ చీఫ్‌గా ఉంటూ.. రాజకీయ సెటైర్లు లేదా పక్షపాత ధోరణి కనిపించేలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ సీనియర్ అధికారి, రాజకీయ విమర్శల సుడిగుండం నుండి ఎలా బయటపడతారో.. బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/harish-raos-counter-to-sajjanars-tweet/article-8318</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/harish-raos-counter-to-sajjanars-tweet/article-8318</guid>
                <pubDate>Mon, 02 Feb 2026 21:25:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/8dd6d96a-b6df-4f3f-ab2f-090dad98a61d.jpg"                         length="40898"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ జలహక్కులపై కాంగ్రెస్ 'మరణశాసనం'!</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యం కాదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు వల్ల రాష్ట్రానికి తీరని "జలద్రోహం" జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/congress-death-knell-on-telangana-water-rights/article-8106"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/2e0ca244-2eed-41e3-b8ff-e98384622870.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యం కాదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు వల్ల రాష్ట్రానికి తీరని "జలద్రోహం" జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "ఈ ప్రాంతం వాడే తెలంగాణకు ద్రోహం చేస్తాడని కాళోజీ గారు ఆనాడే చెప్పారు. నేడు రేవంత్ రెడ్డి రూపంలో అది నిజమవుతోంది" అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఏపీ ప్రయోజనాల కోసం, చంద్రబాబు నాయుడుపై ఉన్న మమకారంతో రేవంత్ రెడ్డి తెలంగాణ నీటిని ధారపోస్తున్నారని, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సహకరించడమే దీనికి నిదర్శనమని విమర్శించారు. సుప్రీంకోర్టులో బలహీనమైన రిట్ పిటిషన్ వేసి వెనక్కి తీసుకోవడం ద్వారా తెలంగాణ నీటి చరిత్రలో నేడు ఒక 'చీకటి రోజు' గా మిగిలిపోతుందని తెలిపారు.</p>
<p><strong>నల్లమల సాగర్ కుట్ర</strong><br />నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు రావాల్సిన 200 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. డీపీఆర్ ఆపాలని, కేంద్రం అనుమతులు రద్దు చేయాలని గతంలో లేఖ రాసిన ప్రభుత్వం.. ఆ షరతులకు కేంద్రం/ఏపీ అంగీకరించకుండానే ఢిల్లీ మీటింగ్‌కు ఎందుకు వెళ్లింది? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన ఇంజనీర్ ఆదిత్యనాథ్‌ను ఈ కీలక చర్చలకు ఎందుకు పంపారు? అని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ సమావేశాన్ని ప్రభుత్వం ఎందుకు బహిష్కరించలేదని హరీశ్ రావు అడిగారు.</p>
<p><strong>కేంద్ర మంత్రులపై విమర్శలు</strong><br />రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదని హరీష్ రావు నిలదీశారు. రేవంత్ రెడ్డికి కేవలం ఢిల్లీ, దావోస్ పర్యటనలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర పాలనపై లేదని ఎద్దేవా చేశారు. జల ద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుది అయితే.. పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి. ఈ దుర్మార్గాన్ని ప్రజల్లో ఎండగడతాం. నీటి హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధమవుతామని హరీశ్ రావు తెలిపారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/congress-death-knell-on-telangana-water-rights/article-8106</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/congress-death-knell-on-telangana-water-rights/article-8106</guid>
                <pubDate>Fri, 30 Jan 2026 14:31:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/2e0ca244-2eed-41e3-b8ff-e98384622870.jpeg"                         length="59267"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బొగ్గు స్కామ్ నుంచి రేవంత్‌ను కాపాడేందుకే యత్నం: హరీశ్ రావు</title>
                                    <description><![CDATA[<p>ష్ట్ర రాజకీయాల్లో బొగ్గు టెండర్ల ప్రక్రియ పెను దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని వాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/harish-rao-is-trying-to-save-revanth-from-the-coal/article-7928"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/image-(77).jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> రాష్ట్ర రాజకీయాల్లో బొగ్గు టెండర్ల ప్రక్రియ పెను దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని వాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. నిజాలను దాచిపెట్టి, స్కామ్‌ను బయటపెట్టిన తమ పార్టీపై బురద జల్లడం తగదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టెండర్ల ప్రక్రియలో జరిగిన లోపాలపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు.</p>
<p>2025 మే నెలలో 'సైట్‌ సర్టిఫికెట్‌' అనే కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారని హరీశ్ రావు తెలిపారు. ఈ నిబంధన వల్ల తొలి లబ్ధిదారు సీఎం బంధువు, శోధా కన్‌స్ట్రక్షన్‌ యజమాని సృజన్‌రెడ్డి అని హరీశ్‌రావు ఆరోపించారు. అప్పటి నుంచి ప్రతి టెండర్‌కు 'సైట్ విజిట్' నిబంధన పెట్టి, 'ప్లస్ టెన్' పద్ధతిని ఫాలో అవుతూ అక్రమాలకు తెరలేపారని విమర్శించారు. </p>
<p>కుంభకోణం జరగలేదని భట్టి విక్రమార్క నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, పారదర్శకత ఉంటే ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. "నైనీ కోల్‌ బ్లాక్‌ ఒక్కటే కాదు.. సైట్‌ విజిట్‌ నిబంధన పెట్టిన అన్ని టెండర్లను రద్దు చేయాలి. 2025 మే నుంచి ఇప్పటివరకు ఎన్ని టెండర్లు పిలిచారు? ఎంతమందికి సర్టిఫికెట్లు ఇచ్చారు? అనే అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి." అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.</p>
<p><strong>నా దగ్గర ఆధారాలు ఉన్నాయి</strong><br />ప్రభుత్వ తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. జీసీసీ, మహాలక్ష్మి వంటి కంపెనీలకు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా, కేవలం తమకు కావలసిన వారికే ఇచ్చారని ఆయన మండిపడ్డారు. తన వద్ద ఫోటోలు, వీడియోలు, కంపెనీలు పంపిన ఈమెయిల్స్ ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఈ ఆధారాలన్నీ సమర్పిస్తానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి బయటపెడతానని హెచ్చరించారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/harish-rao-is-trying-to-save-revanth-from-the-coal/article-7928</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/harish-rao-is-trying-to-save-revanth-from-the-coal/article-7928</guid>
                <pubDate>Sun, 25 Jan 2026 18:49:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/image-%2877%29.jpg"                         length="27585"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హరీశ్, కేటీఆర్‌లపై కవిత ఘాటు విమర్శలు</title>
                                    <description><![CDATA[<p><strong> </strong>తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/kavitha-criticizes-harish-ktr/article-7918"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/43c8d8c4-6b20-4fcb-8e38-939ff22df464.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నైనీ టెండర్ల విషయంలో హరీశ్ రావు వైఖరిని కవిత తీవ్రంగా తప్పుబట్టారు. "భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టగానే మా 'గుంట నక్క' (హరీశ్ రావు) రంగంలోకి దిగారు. ఆ మాటలను గుడ్డిగా నమ్మి కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు" అని ఎద్దేవా చేశారు.</p>
<p>ఈ వ్యవహారంలో సృజన్ రెడ్డి కేవలం చిన్న చేప మాత్రమేనని, అసలు తిమింగలం లాంటి కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కాపాడేందుకే హరీశ్ రావు తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. ఒక కాంట్రాక్టర్‌కు అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్ ఆవేదన చెందడం హాస్యాస్పదమని మండిపడ్డారు.</p>
<p>ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరుపై కవిత సెటైర్లు వేశారు. ఈ కేసు విచారణ రెండేళ్లుగా సాగుతూ.. ఏళ్ల తరబడి సాగే 'కార్తీకదీపం' సీరియల్‌ను తలపిస్తోందని విమర్శించారు. కేవలం ఎన్నికల లబ్ధి కోసమే దీనిని వాడుకుంటున్నారని ఆరోపించారు. తీవ్రవాదుల కోసం వాడాల్సిన ట్యాపింగ్‌ను రాజకీయాల కోసం వాడటం సరికాదని, బాధితులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><strong>కొత్త పార్టీపై సంకేతాలు: ‘జాగృతి పార్టీ’లో చేరండి!</strong></p>
<p>తన రాజకీయ భవిష్యత్తుపై కవిత స్పష్టతనిస్తూనే, కొత్త పార్టీ పేరుపై హింట్ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరుతానన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. "నేను కాంగ్రెస్‌లో చేరను. మీరే జాగృతి పార్టీలో చేరండి. భవిష్యత్తులో నేను స్థాపించే పార్టీనే అధికారంలోకి వస్తుంది.. అప్పుడు మీకు కీలక పదవి ఇస్తా" అని వ్యాఖ్యానించారు. దీనితో ఆమె స్థాపించబోయే కొత్త పార్టీ పేరు 'తెలంగాణ జాగృతి'అని ఉండబోతోందనే చర్చ మొదలైంది.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/kavitha-criticizes-harish-ktr/article-7918</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/kavitha-criticizes-harish-ktr/article-7918</guid>
                <pubDate>Sun, 25 Jan 2026 18:27:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/43c8d8c4-6b20-4fcb-8e38-939ff22df464.jpeg"                         length="48852"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సింగరేణిలో సోలార్‌ సెగ: హరీశ్ రావు</title>
                                    <description><![CDATA[<p>సింగరేణి సంస్థ వేదికగా భారీ కుంభకోణం జరుగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులకు ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలు మార్చారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు సంచలన ఆరోపణలు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/solar-sega-harish-rao-in-singareni/article-7894"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/ce864397-dd7b-4646-b475-b6192360dd9c.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>సింగరేణి సంస్థ వేదికగా భారీ కుంభకోణం జరుగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులకు ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలు మార్చారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని హరీశ్‌ రావు పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ (MSME)లు పాల్గొనకుండా మూడు ప్లాంట్లను కలిపి ఒకే టెండర్‌గా పిలిచారని, నచ్చిన వారికి కట్టబెట్టేందుకే ఈ నిర్ణయమని విమర్శించారు.</p><p>దేశవ్యాప్తంగా మెగావాట్ సోలార్ ఉత్పత్తికి రూ. 3 కోట్లు ఖర్చవుతుంటే, రాష్ట్రంలో మాత్రం రూ. 5.04 కోట్లుకట్టబెట్టారని.. తద్వారా సింగరేణికి రూ. 214 కోట్ల అదనపు భారం పడిందని హరీశ్ రావు ఆరోపించారు. అధిక ధర చెల్లించడమే కాకుండా, సింగరేణికి చెందిన విలువైన భూములను కూడా అప్పనంగా ఇచ్చేశారని మండిపడ్డారు. </p><p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులపై హరీశ్‌ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టెండర్లు వేసిన వారితో సీఎం బావమరిది హోటళ్లలో సమావేశమవుతున్నారని, అందుకే బిడ్ల ప్రక్రియ ఐదారుసార్లు వాయిదా పడుతోందని ఆరోపించారు. సింగరేణిలో కేవలం సోలార్ మాత్రమే కాకుండా, పేలుడు పదార్థాల సరఫరాలోనూ అవినీతి జరిగిందన్నారు. కుంభకోణం ఆధారాలతో సహా బయటపెట్టేసరికి ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. రెండేళ్లు దాటినా ఇంకా లీక్ రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని హరీశ్‌ రావు తెలిపారు.<br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/solar-sega-harish-rao-in-singareni/article-7894</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/solar-sega-harish-rao-in-singareni/article-7894</guid>
                <pubDate>Fri, 23 Jan 2026 21:36:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/ce864397-dd7b-4646-b475-b6192360dd9c.jpg"                         length="40655"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గులాబీ బాస్‌తో హరీశ్ రావు భేటీ</title>
                                    <description><![CDATA[<p>మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం దాదాపు 7 గంటల పాటు సిట్ (SIT) విచారణను ఎదుర్కొన్న మరుసటి రోజే, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/harish-rao-met-rose-boss/article-7789"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/b6195ba7-6479-44c6-9da6-c5a843b774e7.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం దాదాపు 7 గంటల పాటు సిట్ (SIT) విచారణను ఎదుర్కొన్న మరుసటి రోజే, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో విచారణాధికారులు సంధించిన ప్రశ్నలు, తాను ఇచ్చిన సమాధానాలపై హరీశ్ రావు 'గులాబీ బాస్'కు వివరించినట్లు సమాచారం.</p>
<p><strong>విచారణలో అసలేం జరిగింది?</strong><br />మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విచారణలో సిట్ అధికారులు హరీశ్ రావును ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ అధికారులతో ఉన్న సంబంధాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయనకు తెలిసిన అంశాలపై ఆరా తీశారు. అయితే, ఇప్పటికే అరెస్టయిన అధికారులు 'పెద్దాయన' ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుండటంతో, ఆ పెద్దాయన ఎవరనే కోణంలోనే విచారణ సాగినట్లు తెలుస్తోంది.</p>
<p><strong>కాళేశ్వరం సీన్ మళ్ళీ?</strong><br />ప్రస్తుత పరిణామాలు గతంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను గుర్తుచేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు కాళేశ్వరం కేసులో హరీశ్ రావును విచారించిన వెంటనే ఆయన కేసీఆర్‌ను కలిశారు. ఆ భేటీ ముగిసిన కొద్ది రోజులకే కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ విచారణ ముగియడం, తక్షణమే ఎర్రవల్లిలో భేటీ జరగడం చూస్తుంటే.. తదుపరి నోటీసులు నేరుగా కేసీఆర్‌కే అందుతాయా? అనే చర్చ జోరందుకుంది.</p>
<p><strong>సిట్' నెక్స్ట్ టార్గెట్ ఎవరు?</strong><br />దర్యాప్తు సంస్థలు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాల ప్రకారం విచారణ ప్రక్రియ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు వంటి వారు నిందితులుగా ఉండగా, రాజకీయంగా ఈ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. కాగా, ప్రభుత్వ చర్యలను 'రాజకీయ కక్ష సాధింపు'గా అభివర్ణిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు, దీన్ని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి.</p>
<p>వరుస విచారణలు, నోటీసుల నేపథ్యంలో పార్టీ కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు, అలాగే చట్టపరమైన చిక్కుల నుంచి ఎలా బయటపడాలనే అంశంపై హరీశ్ రావుకు కేసీఆర్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/harish-rao-met-rose-boss/article-7789</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/harish-rao-met-rose-boss/article-7789</guid>
                <pubDate>Wed, 21 Jan 2026 19:22:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/b6195ba7-6479-44c6-9da6-c5a843b774e7.jpg"                         length="68324"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘రేవంత్‌ను జైల్లో ఎందుకు పెట్టకూడదు?’.. కేటీఆర్ సంచలన ట్వీట్..!</title>
                                    <description><![CDATA[<p>కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అసత్య ప్రచారాలకు అలవాటు పడిన సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఆయన గురువారం ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలను సంధించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/why-not-put-revanth-in-jail-ktrs-sensational-tweet/article-701"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/ktr-1701598892.jpg" alt=""></a><br /><p>అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్‌ను ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంది. మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు తమదైన శైలిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. </p>
<p>కేటీఆర్ బంధువు రూ.10వేల కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందంటూ ఆరోపించారు. దీనిపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అసత్య ప్రచారాలకు అలవాటు పడిన సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఆయన గురువారం ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలను సంధించారు. </p>
<p>‘నా బంధువుకు 10000 కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ సిగ్గులేని అబద్ధం చెప్పాడు. అదే జోకర్ నేను సెక్రటేరియట్ కింద ఉన్న నిజాం ఆభరణాలను తవ్వినట్లు నకిలీ కథనాన్ని సృష్టించాడు. ⁠కేంద్ర హోంమంత్రికి సంబంధించిన ఫేక్ వీడియోను రేవంత్ సర్క్యులేట్ చేశారు. సీఎం అయినందున ఓయూకి సంబంధించిన నకిలీ సర్క్యులర్‌ పోస్ట్ చేశాడు’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడర్‌ను ఎందుకు జైల్లో పెట్టకూడదంటూ కేటీఆర్ రాసుకొచ్చారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">1. Revanth manufactured a shameless Lie that my relative got 10000 crore Covid Drug Contract <br /><br />2. ⁠The same Joker created Fake narrative that I dug Nizams jewels which were under Secretariat<br /><br />3. ⁠Revanth circulated Fake Video of Union Home Minister<br /><br />4. ⁠Being a CM he posted a…</p>
— KTR (@KTRBRS) <a href="https://twitter.com/KTRBRS/status/1793875877131915340?ref_src=twsrc%5Etfw">May 24, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/why-not-put-revanth-in-jail-ktrs-sensational-tweet/article-701</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/why-not-put-revanth-in-jail-ktrs-sensational-tweet/article-701</guid>
                <pubDate>Fri, 24 May 2024 12:09:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/ktr-1701598892.jpg"                         length="124464"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        