<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/telangana-news/tag-60" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Telangana News - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/60/rss</link>
                <description>Telangana News RSS Feed</description>
                
                            <item>
                <title>అంధకారంలో నారాయణపేట ప్రభుత్వ  ఆసుపత్రి.. రాత్రంతా రోగుల అవస్థలు  </title>
                                    <description><![CDATA[<ul>
<li class="PDq2pG_selectionAnchorContainer"><span style="color:rgb(224,62,45);"><strong>కరెంట్ లేక అంధకారంలో జిల్లా ఆసుపత్రి.. ఉక్కపోతతో రోగుల అవస్థలు</strong></span> </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/narayanapet-government-hospital-in-the-dark-all-night-without-current/article-21080"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/narayanapet-news.jpg" alt=""></a><br /><p class="PDq2pG_selectionAnchorContainer">Narayanpet Government Hospital Power Cut: నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఆసుపత్రిలో విద్యుత్ లేకపోవడంతో వార్డులన్నీ అంధకారంలో మునిగిపోయాయి. చికిత్స కోసం చేరిన రోగులు, వారిని చూసుకునేందుకు వచ్చిన అటెండర్లు తీవ్ర ఉక్కపోత, దోమల బెడదతో రాత్రంతా నిద్రలేక అవస్థలు పడ్డారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఫ్యాన్లు, ఇతర విద్యుత్ పరికరాలు పనిచేయకపోవడం వల్ల రోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.</p>
<p class="PDq2pG_selectionAnchorContainer">ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అత్యవసర చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు సమాచారం. ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విద్యుత్ వ్యవస్థ సక్రమంగా పనిచేయలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో గంటల తరబడి విద్యుత్ లేకపోవడంపై రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేకపోతే ప్రజలు ఎలా వైద్యం పొందాలని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రిలో విద్యుత్ బ్యాకప్ వ్యవస్థను బలోపేతం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/narayanapet-government-hospital-in-the-dark-all-night-without-current/article-21080</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/narayanapet-government-hospital-in-the-dark-all-night-without-current/article-21080</guid>
                <pubDate>Fri, 07 Aug 2026 13:11:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/narayanapet-news.jpg"                         length="145575"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రేమ పేరుతో మోసం.. 7 నెలల గర్భిణినంటూ ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>7 నెలల గర్భిణినంటూ ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన యువతి.. పటాన్‌చెరులో ఉద్రిక్తత</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/fraud-in-the-name-of-love-young-woman-worried-in/article-21038"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/hpb-a9bb0aab1lv.jpg" alt=""></a><br /><p>Patancheru,: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో కలకలం రేపింది.లింగంపల్లిలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో పనిచేస్తున్న సమయంలో పరిచయమైన శ్రవణ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని అరుణ అనే యువతి ఆరోపిస్తూ అతని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. చాలా కాలంగా ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం కొనసాగిందని, పెళ్లి చేసుకుంటానని పదేపదే హామీ ఇవ్వడంతో అతనిని పూర్తిగా నమ్మానని ఆమె తెలిపింది. అయితే ఇప్పుడు తనను పూర్తిగా దూరం పెట్టి, ఎలాంటి సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.</p>
<p>ప్రస్తుతం తాను ఏడు నెలల గర్భిణినని పేర్కొన్న అరుణ, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు శ్రవణే తండ్రి అని ఆరోపించింది. పెళ్లి గురించి మాట్లాడిన ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తూ వచ్చాడని, చివరకు తన ఫోన్ కాల్స్‌కు కూడా స్పందించడం మానేశాడని వాపోయింది. దీంతో తనకు మరో మార్గం లేక ప్రియుడి ఇంటి ముందే న్యాయం కోసం నిరసన చేపట్టాల్సి వచ్చిందని తెలిపింది.</p>
<p>"నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. ఇప్పుడు నేను గర్భవతిని అయిన తర్వాత బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు, నా కడుపులో ఉన్న బిడ్డకు న్యాయం జరగాలి. శ్రవణ్ నన్ను పెళ్లి చేసుకోవాలి. లేకపోతే నాకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం, పోలీసులు స్పందించాలి" అంటూ యువతి కన్నీటి పర్యంతమైంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా యువతికి మద్దతుగా ప్రియుడి ఇంటి ముందు ఆందోళనలో పాల్గొన్నారు.</p>
<p>యువతి ఆందోళనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేసి, యువతి, ఆమె కుటుంబ సభ్యులు, శ్రవణ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఫిర్యాదు ఆధారంగా చట్టపరంగా ఏం చేయాలనే అంశంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.</p>
<p>ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. యువతి ఆవేదనతో స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోగా, పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచారు. ప్రేమ పేరుతో మోసపోయానంటూ యువతి చేసిన ఆరోపణలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/fraud-in-the-name-of-love-young-woman-worried-in/article-21038</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/fraud-in-the-name-of-love-young-woman-worried-in/article-21038</guid>
                <pubDate>Fri, 07 Aug 2026 09:44:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/hpb-a9bb0aab1lv.jpg"                         length="127309"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జోగులాంబ అమ్మవారికి వెండి బోనం సమర్పించిన కొల్లే సరిత</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(35,111,161);"><strong>జోగులాంబ అమ్మవారికి వెండి బోనం సమర్పించిన కొల్లే సరిత.</strong></span></li>
<li><span style="color:rgb(35,111,161);"><strong>మురాద్ మహల్ నల్ల పోచమ్మ దేవాలయం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు.</strong></span></li>
<li><span style="color:rgb(35,111,161);"><strong>రాష్ట్ర ప్రజల సుఖశాంతి, రైతుల సుభిక్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు.</strong></span></li>
<li><span style="color:rgb(35,111,161);"><strong>బోనం సమర్పించే సమయంలో కురిసిన వర్షాన్ని శుభసూచకంగా అభివర్ణించిన కొల్లే సరిత</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/colle-sarita-who-offered-a-silver-bonam-to-goddess-jogulamba/article-18952"><img src="https://www.vishvambhara.com/media/400/2026-07/bonalu.png" alt=""></a><br /><p class="PDq2pG_selectionAnchorContainer">Telangana Ashada bonalu 2026: ఆషాఢ మాస బోనాల మహోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ పాతబస్తీ మురాద్ మహల్ నల్ల పోచమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో వెండి బోనాన్ని తెలంగాణలోని ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారికి ఘనంగా సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ కొల్లే సరిత (తిరుపతయ్య కురుమ) అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వెండి బోనాన్ని సమర్పించారు. భక్తుల జైజైధ్వానాలు, సంప్రదాయ వాద్యాల నడుమ ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది.</p>
<p>ఈ సందర్భంగా కొల్లే సరిత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల జాతరకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. 2025 నుంచి హైదరాబాద్ మురాద్ మహల్ నల్ల పోచమ్మ దేవాలయం నుంచి జోగులాంబ అమ్మవారికి వెండి బోనం సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. బోనం అమ్మవారి గడపలోకి ప్రవేశించిన వెంటనే వర్షం కురవడం శుభసూచకమని, ఇది అమ్మవారి కరుణకు నిదర్శనమని పేర్కొన్నారు.</p>
<p>రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కొల్లే సరిత తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మురాద్ మహల్ నల్ల పోచమ్మ దేవాలయ కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు, భక్తులందరికీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.</p>
<p>ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, జోగులాంబ నియోజకవర్గ ఇన్‌చార్జి మహాలక్ష్మి సంపత్ కుమార్, శివానంద స్వామి, జోగులాంబ దేవాలయం మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు, జోగిని (ఠాగూర్ ఐషు) బృందం, మురాద్ మహల్ నల్ల పోచమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ చిట్టెం శ్యామ్‌రావు, సీనియర్ అడ్వైజర్ ఎడ్మ సత్తెప్ప, వైస్ ప్రెసిడెంట్ కంకర్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆవుల మణికంఠ, దొంగిడి ప్రమోద్, అడ్వైజర్లు, కమిటీ సభ్యులు, బస్తీవాసులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/colle-sarita-who-offered-a-silver-bonam-to-goddess-jogulamba/article-18952</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/colle-sarita-who-offered-a-silver-bonam-to-goddess-jogulamba/article-18952</guid>
                <pubDate>Mon, 20 Jul 2026 12:08:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-07/bonalu.png"                         length="2746742"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>KTR: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్‎కి బుద్ధి చెప్పడం ఖాయం: కేటీఆర్</title>
                                    <description><![CDATA[<p>KTR: రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/ktr-is-sure-that-the-urban-people-will-give-advice/article-7315"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/ktr.jpg" alt=""></a><br /><p>రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత రెండేళ్లుగా పట్టణాలను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రెండు సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా పట్టణాలకు విడుదల చేయని ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.</p><p>కాంగ్రెస్ పాలనలో పట్టణాల పరిపాలన పూర్తిగా దెబ్బతిందని, పారిశుద్ధ్యం నుంచి తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల వరకు ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించి, నిధులు కేటాయించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేవలం మళ్లీ శిలాఫలకాలు వేయడం తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీలేదన్నారు. రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మోడల్ మార్కెట్లు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు నిలిపివేయడంతో అవన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయని తెలిపారు.</p><p>ఒకవైపు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టుతూ, మరోవైపు పట్టణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని కేటీఆర్ అన్నారు. ఈ రెండేళ్లలో పట్టణాలకు ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందుంచి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు.</p><p>మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా కేటీఆర్ హైదరాబాద్‌లో నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పార్టీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న పురపాలక ఎన్నికల వ్యూహాలు, పార్టీ చేయాల్సిన ఏర్పాట్లు, ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రెండు జిల్లాల్లోని ప్రతి మున్సిపాలిటీలోని క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్ సమగ్రంగా సమీక్షించారు.</p><p>పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు, అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొని పార్టీ మంచి ఫలితాలు సాధించిందని గుర్తు చేసిన కేటీఆర్, అదే స్పూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన విజయాలు సాధించాలని నేతలకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా పాల్గొని, కలిసికట్టుగా సమిష్టిగా పోరాడితే విజయం తప్పక సాధ్యమని అన్నారు. పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై హరీష్ రావు నేతలకు పలు సూచనలు చేశారు.</p><p>జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను నేతలు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, పార్టీకి అనుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని వారు నాయకత్వానికి తెలియజేశారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే సంకల్పంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయని సమావేశంలో స్పష్టం అయ్యింది.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/ktr-is-sure-that-the-urban-people-will-give-advice/article-7315</link>
                <guid>https://www.vishvambhara.com/ktr-is-sure-that-the-urban-people-will-give-advice/article-7315</guid>
                <pubDate>Sat, 10 Jan 2026 16:50:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/ktr.jpg"                         length="6262"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వచ్చే జనగణనలో కుల గణన పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాలి</title>
                                    <description><![CDATA[<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">డా. వకుళాభరణం ఓపెన్ లెటర్ ద్వారా ప్రధాన మంత్రికి సూచనలు పంపారు. బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్‌గా, సామాజిక న్యాయ విధానాల్లో నిబద్ధత కలిగిన పరిశోధకుడిగా కొన్ని కీలక అంశాలను కేంద్ర దృష్టికి తీసుకువచ్చారు.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us"><br /></span><span lang="en-us" xml:lang="en-us">దేశాన్ని అనేక సామాజిక, ఆర్థిక సవాళ్ల నుంచి ముందుకు నడిపిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందిస్తున్నానని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలిపారు. ముఖ్యంగా వచ్చే జనగణనలో కుల గణనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">2025లో కుల గణన చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం పరిపాలనా ప్రక్రియ మాత్రమే కాదు. ఇది సామాజిక న్యాయానికి, రాజ్యాంగ సమానత్వానికి ఒక మైలురాయి. పీడిత వర్గాల వాస్తవ స్థితిగతులను ప్రపంచానికి చూపించే అరుదైన అవకాశం అని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">ఈ కుల గణన కార్యక్రమాన్ని శాస్త్రీయంగా,</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/caste-calculation-in-the-next-census-should-be-conducted-transparently/article-5502"><img src="https://www.vishvambhara.com/media/400/2025-05/vakulabharanam.jpg" alt=""></a><br /><p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">డా. వకుళాభరణం ఓపెన్ లెటర్ ద్వారా ప్రధాన మంత్రికి సూచనలు పంపారు. బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్‌గా, సామాజిక న్యాయ విధానాల్లో నిబద్ధత కలిగిన పరిశోధకుడిగా కొన్ని కీలక అంశాలను కేంద్ర దృష్టికి తీసుకువచ్చారు.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us"><br /></span><span lang="en-us" xml:lang="en-us">దేశాన్ని అనేక సామాజిక, ఆర్థిక సవాళ్ల నుంచి ముందుకు నడిపిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందిస్తున్నానని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలిపారు. ముఖ్యంగా వచ్చే జనగణనలో కుల గణనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">2025లో కుల గణన చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం పరిపాలనా ప్రక్రియ మాత్రమే కాదు. ఇది సామాజిక న్యాయానికి, రాజ్యాంగ సమానత్వానికి ఒక మైలురాయి. పీడిత వర్గాల వాస్తవ స్థితిగతులను ప్రపంచానికి చూపించే అరుదైన అవకాశం అని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">ఈ కుల గణన కార్యక్రమాన్ని శాస్త్రీయంగా, న్యాయపరమైన ప్రమాణాలతో, సామాజిక న్యాయపథంలో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.</span></p>
<p class="MsoNormal"><strong><span lang="en-us" xml:lang="en-us">సామాజిక ఆర్థిక కుల గణన – 2011 లోపాలు – పాఠాలు</span></strong></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">SECC–2011 గణన గ్రామీణ, పట్టణ అభివృద్ధి శాఖల ద్వారా నిర్వహించబడింది. ఈ గణనలో పద్ధతిలో స్పష్టత లేకపోవడం, 46 లక్షల కుటుంబాలు మరియు కులాల పేర్లు తప్పుగా నమోదు కావడం చోటు చేసుకున్నాయి.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">వాటిలో పర్యాయ పదాలుగా కులాల పేర్లు, ఇంటి పేర్లు (surnames), గోత్రాలు కూడా తప్పుగా నమోదు అయ్యాయి. వర్గీకరణ జరగకపోవడం వల్ల డేటా విశ్వసనీయంగా మారలేదు. కేంద్రం సుప్రీంకోర్టుకు కూడా ఈ లోపాలను తెలిపింది.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">రూ.5000 కోట్లు ఖర్చయినా, ఆ గణన డేటా పాలనా నిర్ణయాలకు ఉపయోగపడలేదు. 2015లో ఏర్పాటైన పనగరియా కమిటీ కూడా ఈ లోపాలను సరిచేయలేకపోయింది. నివేదిక ఇవ్వలేదు. కొనసాగిస్తూ ఎలాంటి తప్పులను సరిచేసే పనులు కొనసాగలేదని, కేవలం Excel షీట్‌లలో డేటా ఉంచడమే జరిగినందున సరిదిద్దడం సాధ్యపడకపోయినదని ఆ కమిటీ కొన్ని సందర్భాల్లో మీడియాకు వెల్లడించింది.</span></p>
<p class="MsoNormal"><strong><span lang="en-us" xml:lang="en-us">జనాభా గణన చట్ట సవరణ అవసరం ఎందుకు?</span></strong></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">ప్రస్తుతం Census Act, 1948 ప్రకారం ప్రభుత్వం Section 4 ద్వారా అవసరమైన ప్రశ్నలను నిర్ణయించగలదు. కానీ:</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">- చట్టంలో కుల గణన తప్పనిసరిగా నిర్వహించాలి అనే స్పష్టత లేదు.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">- గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా, భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకుండా చట్ట సవరణ అవసరం.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">చట్టంలో స్పష్టత కల్పిస్తే గణనలో సేకరించిన డేటా ప్రభుత్వ విధానాలకు మరియు కోర్టుల్లో నమ్మదగిన ఆధారంగా ఉపయోగపడుతుంది.</span></p>
<p class="MsoNormal"><strong><span lang="en-us" xml:lang="en-us">డా. వకుళాభరణం సూచించిన కీలక అంశాలు</span></strong></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">- అనేక న్యాయపరమైన తీర్పులు, సామాజిక చైతన్య నేపధ్యంలో — భవిష్యత్తులో యేలాంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు చట్ట సవరణను సమర్థవంతంగా చేయడం సముచితం.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">- ఇంద్రా సాహ్నీ తీర్పు (పారా 810, 667) ప్రకారం 50 శాతం పైగా రిజర్వేషన్లకు గణాంక ఆధారాలు అవసరం.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">- పుట్టస్వామి తీర్పు (2017) ప్రకారం కుల గణన గోప్యత హక్కుకు వ్యతిరేకం కాదు.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">- SECC–2011 లోపాలు పునరావృతం కాకుండా నిపుణుల పర్యవేక్షణ అవసరం.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">- జాతీయ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">- బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి జనగణనకు సమన్వయం కల్పించాలి.</span></p>
<p class="MsoNormal"><strong><span lang="en-us" xml:lang="en-us">ముఖ్య విజ్ఞప్తి:</span></strong></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">ఈసారి కుల గణన చట్టబద్ధంగా, న్యాయపరమైన ప్రమాణాలతో, శాస్త్రీయంగా జరగాలి. ఇది సామాజిక న్యాయ సాధనగా మారాలి.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/caste-calculation-in-the-next-census-should-be-conducted-transparently/article-5502</link>
                <guid>https://www.vishvambhara.com/national/caste-calculation-in-the-next-census-should-be-conducted-transparently/article-5502</guid>
                <pubDate>Sat, 03 May 2025 16:16:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-05/vakulabharanam.jpg"                         length="26550"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవు : టీపీసీసీ చీఫ్ హెచ్చరిక</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించినా మార్పు రాలేదు </strong></li>
<li><strong>బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ </strong></li>
<li><strong>మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పు </strong></li>
<li><strong>పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తే స్పందించలేదని ఆగ్రహం</strong></li>
<li><strong>పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని మహేష్ కుమార్ గౌడ్  హెచ్చరిక</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/tpcc-chief-warning-that-whoever-involves-anti-party-activities/article-4716"><img src="https://www.vishvambhara.com/media/400/2025-03/mahesh-kumar-goud-4.jpg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ : పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మల్లన్న కులగణన పత్రాలను తగులబెట్టారని, దీనిని తీవ్రంగా పరిగణించినట్లు చెప్పారు. పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తే, దానికి కూడా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.</p>
<p>ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను తీన్మార్ మల్లన్న తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.పార్టీలో ఉంటూ పార్టీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, కులగణన పత్రాలను తగులబెట్టడంతో ఫిబ్రవరి 5న కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలపై వివరణ కోరింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గడువులోగా తీన్మార్ మల్లన్న నుంచి సమాధానం రాకపోవడంతో తాజాగా సస్పెండ్ చేసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/tpcc-chief-warning-that-whoever-involves-anti-party-activities/article-4716</link>
                <guid>https://www.vishvambhara.com/national/tpcc-chief-warning-that-whoever-involves-anti-party-activities/article-4716</guid>
                <pubDate>Sat, 01 Mar 2025 17:09:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-03/mahesh-kumar-goud-4.jpg"                         length="39506"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తడి బట్టలతో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఫ్లైయాష్ తరలింపుతో పాటు ఓవర్ లోడ్ లారీల ద్వారా పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడ్డాడని.. సుమారు వంద కోట్ల అవినీతి జరిగిందంటూ కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మంత్రితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ మీద కూడా ఆరోపణలు చేశాడు కౌశిక్ రెడ్డి.</p>
<p>అయితే దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తన లాయర్ ద్వారా కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంగళవారం రోజున చెల్పూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. </p>
<p>దాంతో తన ఇంటి వద్దనే తడిబట్టలతో ఆంజనేయ స్వామి ఫొటో మీద ప్రమాణం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mla-kaushik-reddy-took-oath-in-wet-clothes/article-2377"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/deff7153-3f39-4dd7-9bf7-2025b16b95f8.jpeg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఫ్లైయాష్ తరలింపుతో పాటు ఓవర్ లోడ్ లారీల ద్వారా పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడ్డాడని.. సుమారు వంద కోట్ల అవినీతి జరిగిందంటూ కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మంత్రితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ మీద కూడా ఆరోపణలు చేశాడు కౌశిక్ రెడ్డి.</p>
<p>అయితే దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తన లాయర్ ద్వారా కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంగళవారం రోజున చెల్పూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. </p>
<p>దాంతో తన ఇంటి వద్దనే తడిబట్టలతో ఆంజనేయ స్వామి ఫొటో మీద ప్రమాణం చేసి.. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అవినీతి చేయలేదని ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు. అలా చేస్తే పొన్నం ప్రభాకర్ కు తాను క్షమాపణలు చెబుతానని.. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు కౌశిక్ రెడ్డి.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mla-kaushik-reddy-took-oath-in-wet-clothes/article-2377</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mla-kaushik-reddy-took-oath-in-wet-clothes/article-2377</guid>
                <pubDate>Tue, 25 Jun 2024 13:27:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/deff7153-3f39-4dd7-9bf7-2025b16b95f8.jpeg"                         length="56011"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>'కల్కి' సినిమా టికెట్ ధరల పెంపు.. సర్కార్ గ్రీన్‌సిగ్నల్ </title>
                                    <description><![CDATA[<p>ప్రభాస్ హీరోగా నాన్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sarkar-greensignals-kalki-movie-ticket-price-hike%C2%A0/article-2314"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/124116971-680x310.jpg" alt=""></a><br /><p>ప్రభాస్ హీరోగా నాన్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇటీవల టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకుంది. </p>
<p>ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 'కల్కి 2898 ఏడీ' చిత్ర టికెట్‌పై గరిష్ఠంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 75, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 100 వరకు పెంచుకోవచ్చని తెలిపింది. దీంతో పాటు ఈ నెల 27న ఉదయం 5.30 గంటల షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sarkar-greensignals-kalki-movie-ticket-price-hike%C2%A0/article-2314</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sarkar-greensignals-kalki-movie-ticket-price-hike%C2%A0/article-2314</guid>
                <pubDate>Sun, 23 Jun 2024 08:15:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/124116971-680x310.jpg"                         length="90658"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం </title>
                                    <description><![CDATA[<p>ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/tirmar-mallanna-sworn-in-as-mlc%C2%A0/article-1754"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/telugu-samayam.webp" alt=""></a><br /><p>ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు శాసమండలి చైర్మన్ చాంబర్‌లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.</p>
<p>ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి అనుగుల రాకేష్ రెడ్డిపై 18వేల పైచిలుకు ఓట్లతో తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నేతలు హాజరయ్యారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/tirmar-mallanna-sworn-in-as-mlc%C2%A0/article-1754</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/tirmar-mallanna-sworn-in-as-mlc%C2%A0/article-1754</guid>
                <pubDate>Thu, 13 Jun 2024 13:00:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/telugu-samayam.webp"                         length="21862"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రామోజీరావు అస్తమయం.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్</title>
                                    <description><![CDATA[<p>ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-emotional-tweet-on-ramoji-raos-sunset/article-1443"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-08-085541.jpg" alt=""></a><br /><p>ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలిపారు. </p>
<p>అక్షర యోధుడుగా శ్రీరామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారని, తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేశారని కొనియాడారు. శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తిగా అభివర్ణించారు. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు.. దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని కీర్తించారు. </p>
<p>ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని, మీడియా రంగంలో రామోజీది ప్రత్యేకమైన శకమని పునరుద్ఘాటించారు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం పనిచేశారని, మీడియా రంగంలో ఆయనొక శిఖరమని పేర్కొన్నారు. ఆయన ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. </p>
<p>రామోజీరావుతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని, మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు తనను ఆయనకు దగ్గర చేసిందని వెల్లడించారు. సమస్యలపై పోరాటంలో ఆయన తనకెంతో స్ఫూర్తి అని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవని, ఆయన అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి… <a href="https://t.co/jYHQDFJdxF">pic.twitter.com/jYHQDFJdxF</a></p>
— N Chandrababu Naidu (@ncbn) <a href="https://twitter.com/ncbn/status/1799271461775102145?ref_src=twsrc%5Etfw">June 8, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-emotional-tweet-on-ramoji-raos-sunset/article-1443</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-emotional-tweet-on-ramoji-raos-sunset/article-1443</guid>
                <pubDate>Sat, 08 Jun 2024 08:58:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-08-085541.jpg"                         length="118656"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్ఆర్ సంచలన నిర్ణయం</title>
                                    <description><![CDATA[<p>నియోజకవర్గంలోని 29 ప్రభుత్వ హైస్కూల్లో పనిచేస్తున్న స్వీపర్లకు తన జీతం నుంచి వేతనాలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బీఆర్ఆర్ ప్రకటించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/miryalaguda-mla-blr-sensational-decision/article-1143"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-02-113842.jpg" alt=""></a><br /><p>మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కీలక ప్రకటన చేశారు. నియోజకవర్గంలోని 29 ప్రభుత్వ హైస్కూల్లో పనిచేస్తున్న స్వీపర్లకు తన జీతం నుంచి వేతనాలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.</p>
<p>గతంలో జీతాలు ఇవ్వలేక విద్యాశాఖ స్వీపర్లను పక్కన పెట్టిందన్నారు. తన ఎమ్మెల్యే పదవి ఉన్నంత కాలం స్వీపర్లకు జీతాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తానని స్పష్టం చేశారు. వారంలో మూడు రోజులు ఊరు, వాడ,  తండా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/miryalaguda-mla-blr-sensational-decision/article-1143</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/miryalaguda-mla-blr-sensational-decision/article-1143</guid>
                <pubDate>Sun, 02 Jun 2024 11:41:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-02-113842.jpg"                         length="77303"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణతో సోనియాది పేగుబంధం: రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణతో సోనియాది పేగుబంధం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sonias-intestinal-connection-with-telangana-is-revanth-reddy/article-1140"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-02-111402.jpg" alt=""></a><br /><p>తెలంగాణతో సోనియాది పేగుబంధం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలలను నిజం చేసిన సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. </p><p>తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని ఎందుకు ఆహ్వానించారని కొందరు ప్రశ్నిస్తున్నారని రేవంత్ అన్నారు. కానీ తల్లిని పిలవడానికి ఎవరి అనుమతి లేదని రేవంత్ చెప్పుకొచ్చారు. ‘ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతోంది.. ప్రపంచ పటంలోనే హైదరాబాద్‌ను ప్రత్యేకంగా నిలపబోతున్నాం’ అని రేవంత్ రెడ్డి అన్నారు. సర్వ</p><p>అదేవిధంగా 70 రోజుల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు, 11,062 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆరు గ్యారంటీలకు 1.28కోట్ల దరఖాస్తులు వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో డూప్లికేట్ అప్లికేషన్లు మినహాయించగా 1.9కోట్ల దరఖాస్తులు మిగిలినట్లు చెప్పారు. వాటిని కంప్యూటరీకరించి ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందుబాటులోకి తేవాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sonias-intestinal-connection-with-telangana-is-revanth-reddy/article-1140</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sonias-intestinal-connection-with-telangana-is-revanth-reddy/article-1140</guid>
                <pubDate>Sun, 02 Jun 2024 11:16:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-02-111402.jpg"                         length="88267"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        