<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/revanthreddy/tag-5490" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Revanthreddy - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/5490/rss</link>
                <description>Revanthreddy RSS Feed</description>
                
                            <item>
                <title>సీఎం రేవంత్‌తో మాజీ మావోయిస్టు అగ్రనేతల భేటీ</title>
                                    <description><![CDATA[<p><strong> </strong>సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మావోయిస్టు నేతలు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి తదితరులు కలిశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/meeting-of-former-maoist-leaders-with-cm-revanth/article-9944"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-5.22.29-pm.jpeg" alt=""></a><br /><p><br /><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మావోయిస్టు నేతలు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి తదితరులు కలిశారు. అడవి బాట వీడి సమాజంలో కలిసిన తమకు ప్రభుత్వం నుంచి అందాల్సిన తోడ్పాటుపై వీరు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అగ్రనేతలు నేరుగా ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో బలగాలు విరుచుకుపడుతుంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం శాంతియుత మార్గానికి ప్రాముఖ్యత ఇస్తోంది. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించినట్లు సమాచారం.</p>
<p><strong>పునరావాస ప్యాకేజీపై కసరత్తు</strong><br />లొంగిపోయిన నేతలకు ఇళ్ల స్థలాలు, పిల్లల చదువు, ఉపాధి వంటి అంశాలపై అధికారులు ఇప్పటికే ఒక నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ చర్చల్లో, మాజీ నక్సలైట్లు ఎదుర్కొంటున్న న్యాయపరమైన ఇబ్బందులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే వీరందరి కోసం ఒక సమగ్రమైన 'సంక్షేమ ప్యాకేజీ'ని ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/meeting-of-former-maoist-leaders-with-cm-revanth/article-9944</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/meeting-of-former-maoist-leaders-with-cm-revanth/article-9944</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 17:25:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.22.29-pm.jpeg"                         length="142203"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కష్టపడే వారికే కాంగ్రెస్‌లో గుర్తింపు..డీసీసీ శిక్షణా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<p> వికారాబాద్‌లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/only-those-who-struggle-are-recognized-in-congress/article-9156"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-21-at-7.15.32-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>వికారాబాద్‌లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. డీసీసీ పదవి ఎంతో విలువైనదని, వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినయోగం చేయవద్దని సూచించారు. వారసత్వంగా ఎవరికీ అవకాశాలు రావని, మనం పడే కష్టం, శ్రమ ఎప్పటికీ వృథా పోవని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ శిక్షణను శిక్షగా భావించవద్దని కోరారు.</p>
<p>డీసీసీలుగా ఎన్నికైనంత మాత్రాన ఆ జిల్లాలపై తమదే ఆధిపత్యమని, తామే అధిపతులమని భావిస్తే అది పెద్ద తప్పిదమని రేవంత్ హెచ్చరించారు. డీసీసీ పోస్టు అనేది కేవలం అధికారం మాత్రమే కాదని, అది ఒక కుటుంబ పెద్దలాంటి బాధ్యత అని గుర్తు చేశారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారు ఉంటారని, ఇది మహాత్మా గాంధీ కాలం నుండి కొనసాగుతున్న సంప్రదాయమని పేర్కొన్నారు. భిన్న స్వరాలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించాలే తప్ప, వ్యతిరేకించే వారిని పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తే అది పార్టీకి కీడు చేసినట్లవుతుందని హితవు పలికారు.</p>
<p>తాను పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సమయంలో పార్టీ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని, సొంత పార్టీలోనే కొందరి నుంచి వ్యతిరేకత ఎదురైందని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ నేతలందరి ఇళ్లకు వెళ్లి వారిని కలిసినట్లు వివరించారు. వయసులో, అనుభవంలో చిన్నవాడినైనా పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని, సహకరించాలని కోరి అందరినీ ఒప్పించినట్లు చెప్పారు. అందరం సమిష్టిగా కృషి చేయడం వల్లే పార్టీ ఓటింగ్ శాతం 2.5 నుండి 40 శాతానికి చేరిందని విశ్లేషించారు. గతంలో డీసీసీ అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని, అక్కడ అవకాశం రాని వారికి ఎమ్మెల్సీ పదవులు కల్పించామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన మరో 60 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని, కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/only-those-who-struggle-are-recognized-in-congress/article-9156</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/only-those-who-struggle-are-recognized-in-congress/article-9156</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 19:25:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-21-at-7.15.32-pm.jpeg"                         length="34935"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఖూనీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామాన్ని ఖూనీ చేశారని, ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/murderer-of-democracy-in-the-state/article-9061"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-19-at-7.42.20-pm-(1).jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామాన్ని ఖూనీ చేశారని, ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. శుక్రవారం ఆదిలాబాద్ జైలులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసిందని ఆరోపించారు.</p>
<p><strong>మహిళల పట్ల కాంగ్రెస్ నేతల అసభ్య ప్రవర్తన</strong><br />మహిళల పట్ల కాంగ్రెస్ నేతలు అసభ్యకరంగా ప్రవర్తించడం సరికాదని, మంత్రి వివేక్ సైతం పట్టించుకోలేదని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మద్యం మత్తులో బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లను అగౌరవపరిచారని ఆరోపించారు. కానీ ఈ విషయాన్ని మంత్రి సైతం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఇంత జరిగినా ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తోందా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు సైతం కాంగ్రెస్ నాయకులకు చుట్టంలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.</p>
<p><strong>పోలీసుల అత్యుత్సాహంపై హెచ్చరిక</strong><br />బాల్క సుమన్‌ను సమీపంలో ఉన్న జైల్లో పెట్టకుండా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైలుకు తరలించడం అన్యాయమని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రాజ్యాంగం ఖూనీ చేస్తుంటే రాహుల్ గాంధీకి పట్టదా అని ఆయన నిలదీశారు. పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చుట్టంలా వ్యవహరిస్తున్నారని, చట్టం ఎవరికీ చుట్టం కాదని ఆయన హితవు పలికారు. పోలీసులు తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/murderer-of-democracy-in-the-state/article-9061</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/murderer-of-democracy-in-the-state/article-9061</guid>
                <pubDate>Thu, 19 Feb 2026 19:48:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-19-at-7.42.20-pm-%281%29.jpeg"                         length="67465"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>క్షేత్రస్థాయికి రండి.. లేదంటే సస్పెన్షన్లే: సీఎం రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p> మున్సిపల్ అధికారులు, కమిషనర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-come-to-field-level-or-else-suspension/article-8876"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-17-at-5.52.40-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మున్సిపల్ అధికారులు, కమిషనర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయం వేళ ఖచ్చితంగా ఫీల్డ్‌లో ఉండి పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. నగరంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. త్వరలో తానే స్వయంగా ప్రతి జోన్‍లో పర్యటిస్తానని, రోడ్లు శుభ్రంగా లేకపోతే బాధ్యులైన అధికారులను అక్కడిక్కడే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ విభజన కారణంగా తలెత్తిన పలు సమస్యలను పరిష్కరించాలని సూచించారు.</p>
<p><strong>పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాలు</strong><br />హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి పీపీపీ విధానంలో స్కైవాక్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసే అంశాన్ని అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని, జంక్షన్ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు.</p>
<p><strong>ప్రకటనల బోర్డుల ద్వారా ఆదాయం పెంపు</strong><br />అడ్వర్టైజింగ్ బోర్డుల నిర్వహణపై జాగ్రత్తలు తీసుకోవాలని, దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10 శాతం ప్రకటన బోర్డులను కేటాయించాలన్నారు. అన్ని ప్రకటనల బోర్డుల నుండి సంవత్సరానికి ఒకసారి ఫీజు వసూలు చేయాలని, అనధికార బోర్డులను తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.</p>
<p><strong>ప్రజా ప్రతినిధులకు శిక్షణ</strong><br />రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు పట్టణ పరిపాలనపై ఒక రోజు శిక్షణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ సెక్రటరీ మాణిక్‌రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-come-to-field-level-or-else-suspension/article-8876</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-come-to-field-level-or-else-suspension/article-8876</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 17:57:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-17-at-5.52.40-pm.jpeg"                         length="63402"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ భేటీ</title>
                                    <description><![CDATA[<p>మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయంపై ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revanth-meets-priyanka-gandhi/article-8828"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-13-at-9.14.42-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయంపై ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని, మేయర్, చైర్‌పర్సన్ స్థానాలను దక్కించుకోవడంలో చూపిన ప్రతిభకు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్‌ను ప్రత్యేకంగా అభినందించారు.</p>
<p><strong>సంక్షేమ పాలనకు ప్రజల ఆమోదం</strong><br />తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రియాంక గాంధీకి సీఎం రేవంత్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అదే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కారణమైందని రేవంత్ పేర్కొన్నారు. ఈ విజయం కాంగ్రెస్ శ్రేణులలో నూతన ఉత్తేజాన్ని నింపిందని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చర్చించారు.</p>
<p><strong>తెలంగాణ భవిష్యత్ కార్యాచరణ</strong><br />మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో తిరుగులేని ఆదరణ ఉందని తేలిందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని, పార్టీ సంస్థాగత బలోపేతం మరియు రాష్ట్ర అభివృద్ధిపై భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revanth-meets-priyanka-gandhi/article-8828</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revanth-meets-priyanka-gandhi/article-8828</guid>
                <pubDate>Fri, 13 Feb 2026 21:16:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-13-at-9.14.42-pm.jpeg"                         length="80984"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజా పాలనకు దక్కిన గౌరవం</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన భారీ విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/respect-for-public-governance/article-8803"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/e8517a2c-b238-4410-aad8-5be91fd51d04.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన భారీ విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫలితాలు ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన విశ్వాసాన్ని చాటిచెప్పాయని ఆయన పేర్కొన్నారు. ఈ అఖండ విజయాన్ని పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం అంకితం చేశారు. ''భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం. కార్యకర్తల శ్రమ, పార్టీ పట్ల వారికున్న అనంతమైన అభిమానమే నేడు కాంగ్రెస్ ప్రభంజనానికి కారణం." అని రేవంత్ రెడ్డి కొనియాడారు.</p>
<p><strong>అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజా ఆమోదం</strong><br />రాష్ట్రంలో గత రెండేళ్లుగా సాగుతున్న ‘ప్రజా పాలన’కు ఈ తీర్పు ఒక సాక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణకు ప్రజలు ఈ ఓటు ద్వారా తమ సంపూర్ణ ఆమోదాన్ని తెలిపారని వివరించారు. ఈ తీర్పు ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు.</p>
<p>ఈ విజయోత్సాహంతో ఆగిపోకుండా, భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. నగరాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని చెప్పారు. పేదల సంక్షేమమే పరమావధిగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని, ఈ మద్దతును స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/respect-for-public-governance/article-8803</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/respect-for-public-governance/article-8803</guid>
                <pubDate>Fri, 13 Feb 2026 20:13:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/e8517a2c-b238-4410-aad8-5be91fd51d04.jpg"                         length="119669"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీబిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు</title>
                                    <description><![CDATA[<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revanth-held-a-series-of-meetings-with-bgbg-union/article-8767"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/ha8lz_wbuaamfoh.jpg" alt=""></a><br /><p>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'గాంధీ సరోవర్' ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టు విశేషాలను ముఖ్యమంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు వివరించారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని తెలిపారు. 1948 ఫిబ్రవరిలో మహాత్మాగాంధీ చితాభస్మాన్ని సరిగ్గా ఆ ప్రాంతంలోనే నిమజ్జనం చేశారని, ఆ చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేస్తూ, ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా, పవిత్రంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.</p>
<p><strong>కొత్త విమానాశ్రయాలపై దృష్టి</strong><br />కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ తర్వాత, ముఖ్యమంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన అనుమతులు, నిధుల కోసం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం విజ్ఞప్తి చేశారు. మామూనూరు విమానాశ్రయం భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున, నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కోరారు. కొత్తగూడెం విమానాశ్రయం పాల్వంచలో స్థలం గుర్తించినందున, ఓఎల్ఎస్ సర్వే మరియు ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్గాం విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి అదనంగా 249.82 ఎకరాల భూమి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రికి తెలియజేశారు.</p>
<p><strong>రైల్వే ప్రాజెక్టులపై చర్చ</strong><br />అనంతరం కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని ఆయనను కోరారు. కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ 'తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్'ను ముఖ్యమంత్రి వారికి అందజేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ డాక్యుమెంట్ ద్వారా తెలంగాణను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revanth-held-a-series-of-meetings-with-bgbg-union/article-8767</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revanth-held-a-series-of-meetings-with-bgbg-union/article-8767</guid>
                <pubDate>Thu, 12 Feb 2026 20:14:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/ha8lz_wbuaamfoh.jpg"                         length="174951"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>2029 వరకు తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబజీగా సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుపుతూనే, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/i-am-the-king-of-telangana-until-2029-i-am/article-8754"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-12-at-7.22.28-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబజీగా సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుపుతూనే, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, అశ్వినీ వైష్ణవ్‌లతో సమావేశమైన రేవంత్ రెడ్డి.. అనంతరం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో పాటు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.</p>
<p><strong>2029 వరకు నాదే పగ్గాలు.. నేనే రాజు.. నేనే మంత్రి</strong><br />రాష్ట్రంలో వచ్చే పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయని అన్నారు. తెలంగాణలో నేనే రాజు, నేనే మంత్రి అని, తనకు పోటీ ఎవరూ లేరని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పదిన్నరేళ్ల పాటు పగ్గాలు తన చేతిలోనే ఉంటాయని పేర్కొంటూ, ప్రత్యర్థులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.</p>
<p><strong>ఫోన్ ట్యాపింగ్ - కేసీఆర్ జైలు ప్రస్తావన</strong><br />ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరిందని, దర్యాప్తు ఆధారంగానే చర్యలు ఉంటాయని రేవంత్ తెలిపారు. తాము ఫోన్లు ట్యాప్ చేయడం లేదని, ట్యాప్ చేసిన సంభాషణలు వింటే ఆయుష్షు తగ్గుతుందని సెటైర్ వేశారు. కక్ష సాధింపు లేదని, కేసీఆర్‌ను జైల్లో వేయాలనుకుంటే నిబంధనల ప్రకారమే వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.</p>
<p><strong>కాళేశ్వరం - కేటీఆర్‌పై ఈడీ ఎక్కడ?</strong><br />కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనం బాధ్యతను నిపుణుల కమిటీకి అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఖండించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ, కేటీఆర్‌ను ఎందుకు విచారించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ-రేసు అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలోనే అన్ని డాక్యుమెంట్లను సభలో పెడతామని ఆయన హెచ్చరించారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/i-am-the-king-of-telangana-until-2029-i-am/article-8754</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/i-am-the-king-of-telangana-until-2029-i-am/article-8754</guid>
                <pubDate>Thu, 12 Feb 2026 19:24:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-12-at-7.22.28-pm.jpeg"                         length="38841"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.'ప్రజా పాలన – ప్రగతి బాట' కార్యక్రమంలో భాగంగా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/kcrs-adopted-son-kishan-reddy-is-cm-revanth-reddy/article-8538"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-06-at-7.31.52-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.'ప్రజా పాలన – ప్రగతి బాట' కార్యక్రమంలో భాగంగా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీరును విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ముందుకెళ్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. "బీజేపీకి ఓటు వేసినా, బీఆర్ఎస్‌కు ఓటు వేసినా అది మూసీలో వేసినట్లే. ఆ రెండు పార్టీల మధ్య ఉన్నది ఫెవీకాల్ బంధం" అని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ను కాపాడటమే కిషన్ రెడ్డి ప్రధాన అజెండా అని, అందుకే ఆయన ఇప్పుడు 'కల్వకుంట్ల కిషన్ రావు'గా మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డిని కేసీఆర్ దత్తపుత్రుడిగా అభివర్ణిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.</p>
<p><strong>స్మార్ట్ సిటీ ఏది? నిధులు ఏవి? </strong><br />నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను రెండుసార్లు గెలిపించినా జిల్లాకు సాధించిందేమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ మూడుసార్లు ప్రధాని అయినా నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా మార్చలేకపోయారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ మురికికూపంగా మారిందని, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో బీజేపీ విఫలమైందని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వని బీజేపీకి, ఇక్కడి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.</p>
<p><strong>కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం</strong><br />మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మన వార్డుల్లో మన కార్పొరేటర్లు ఉంటేనే నిధుల ప్రవాహం సాధ్యమవుతుందని, అభివృద్ధికి బాటలు పడతాయని ప్రజలకు వివరించారు. "నేను అందరివాడిని.. నాకు కులం, మతం లేదు.. నా లక్ష్యం కేవలం అభివృద్ధి మాత్రమే" అని చెబుతూ, నిజామాబాద్ ఓటర్లు ఈ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇవ్వాలని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/kcrs-adopted-son-kishan-reddy-is-cm-revanth-reddy/article-8538</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/kcrs-adopted-son-kishan-reddy-is-cm-revanth-reddy/article-8538</guid>
                <pubDate>Fri, 06 Feb 2026 19:34:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-06-at-7.31.52-pm.jpeg"                         length="154596"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేసీఆర్ త్యాగాల పునాదులపైనే నీ సీఎం కుర్చీ</title>
                                    <description><![CDATA[<p>మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఘాటుగా సమాధానమిచ్చారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/your-cms-chair-is-on-the-foundations-of-kcrs-sacrifices/article-8447"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/98fe8a9f-919f-4d95-ac7e-a368e534902c.jpg" alt=""></a><br /><div><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఘాటుగా సమాధానమిచ్చారు. బుధవారం మెదక్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై విమర్శలు గుప్పించారు. 'జాతిపిత' అనే పదానికి అర్థం తెలియకుండానే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లా త్యాగం చేసిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందని హరీశ్ రావు కొనియాడారు. ప్రాణాలకు తెగించి స్వరాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ వీరుడిని విమర్శించే అర్హత రేవంత్‌కు లేదని స్పష్టం చేశారు.</div>
<div> </div>
<div>తెలంగాణ పోరాట సమయంలో ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది కాదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. పార్టీ కండువాలు మారుస్తూ, కాంగ్రెస్ సీనియర్ నేతలను తొక్కుకుంటూ పదవులు సాధించిన వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణను సాధించకపోయి ఉంటే రేవంత్‌కు ముఖ్యమంత్రి పదవి వచ్చేదా అని నిలదీశారు.</div>
<div> </div>
<div><strong>పదవుల కోసం పాకులాట</strong></div>
<div>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆకాంక్షల కంటే పదవులే ముఖ్యమని హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ గురించి మాట్లాడే ముందు తన గతాన్ని ఒకసారి చూసుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి గతంలో ఏనాడూ తెలంగాణ కోసం కొట్లాడిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఉద్యమ నాయకుడిని కించపరచడం సరికాదని హరీశ్ రావు హితవు పలికారు.</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/your-cms-chair-is-on-the-foundations-of-kcrs-sacrifices/article-8447</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/your-cms-chair-is-on-the-foundations-of-kcrs-sacrifices/article-8447</guid>
                <pubDate>Wed, 04 Feb 2026 20:02:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/98fe8a9f-919f-4d95-ac7e-a368e534902c.jpg"                         length="53873"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతు భరోసాపై కీలక ప్రకటన</title>
                                    <description><![CDATA[<p>రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా గూడూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/key-statement-on-farmer-assurance/article-8416"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/b0236336-13bb-4a85-a3e2-fbd2c0275830.jpg" alt=""></a><br /><div><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా గూడూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగానే రైతు భరోసా నిధులను నేరుగా అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. వరి ఉత్పత్తిలో ఆసియాలోనే మిర్యాలగూడ అగ్రస్థానంలో ఉండటం గర్వకారణమని కొనియాడారు. రైతు సంక్షేమం కోసం ఇప్పటి వరకు మొత్తం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. సన్నబియ్యం పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.</div>
<div> </div>
<div>అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేశామని సీఎం గుర్తు చేశారు. తాము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పాలకులు వరి వేస్తే ఉరి అన్నచోట, క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. 3.17 కోట్ల మంది నిరుపేదలకు 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేదల ఇళ్లకు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/key-statement-on-farmer-assurance/article-8416</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/key-statement-on-farmer-assurance/article-8416</guid>
                <pubDate>Wed, 04 Feb 2026 18:26:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/b0236336-13bb-4a85-a3e2-fbd2c0275830.jpg"                         length="31918"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేపు జూబ్లీహిల్స్‌లో పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి మంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశం</title>
                                    <description><![CDATA[<p>సుదీర్ఘ విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలనా పగ్గాలను వేగంగా అందుకున్నారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/revanth-reddys-meeting-with-the-in-charge-ministers-of-parliament-constituency/article-8316"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/2cc09568-5e1b-4880-b46a-2277cf1f69881.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> సుదీర్ఘ విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలనా పగ్గాలను వేగంగా అందుకున్నారు. విదేశాల్లో పెట్టుబడుల వేట ముగియగానే, ఇప్పుడు రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు, అభివృద్ధి పనులపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ కొత్త సారథి మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా హాజరుకానున్నారు. వీరితో పాటు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు తీసుకున్న ఇంచార్జ్ మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు.</p>
<p>ఈ సమావేశం కేవలం సాధారణ భేటీ కాదని, రాష్ట్రంలో రాబోయే రాజకీయ పరిణామాలకు ఒక దిశానిర్దేశమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జ్‌లుగా ఉన్న మంత్రులకు వారి పరిధిలోని అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన గడువులను విధించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి? జిల్లాల వారీగా అమలులో ఎదురవుతున్న ఇబ్బందులేంటి? అనే అంశాలపై సీఎం నివేదికలు కోరనున్నారు. రాబోయే ఎన్నికలు, స్థానిక సంస్థల బలోపేతం దిశగా పార్టీ క్యాడర్‌ను ఎలా సమాయత్తం చేయాలనే దానిపై మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి సీఎం చర్చించనున్నారు. </p>
<p>తన పర్యటనలో భాగంగా విదేశీ పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, రాష్ట్రానికి రాబోతున్న పెట్టుబడుల గురించి కూడా సీఎం ఈ భేటీలో ప్రస్తావించనున్నారు. పాలనలో కొత్త సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి, దానికి అనుగుణంగా మంత్రులను, పార్టీని ఎలా ముందుకు నడిపించాలనే దానిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/revanth-reddys-meeting-with-the-in-charge-ministers-of-parliament-constituency/article-8316</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/revanth-reddys-meeting-with-the-in-charge-ministers-of-parliament-constituency/article-8316</guid>
                <pubDate>Mon, 02 Feb 2026 21:24:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/2cc09568-5e1b-4880-b46a-2277cf1f69881.jpg"                         length="32323"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        