<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/rajyasabha/tag-5101" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Rajyasabha - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/5101/rss</link>
                <description>Rajyasabha RSS Feed</description>
                
                            <item>
                <title>రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా</title>
                                    <description><![CDATA[<p> దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 37 మంది సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/the-city-that-rang-for-the-rajya-sabha-elections/article-8905"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/image-(74).jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో: </strong>దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 37 మంది సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ స్థానాలకు ఫిబ్రవరి 26న అధికారికంగా నోటిఫికేషన్ జారీ కానుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 5వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 9న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.</p>
<p><strong>తెలంగాణలో ఉత్కంఠ.. రేసులో కీలక నేతలు</strong><br />తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 9న ముగియనుంది. వీరిలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కేఆర్ సురేష్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఉన్నారు. గతంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక ద్వారా ఎన్నికైన సింఘ్వి పదవీకాలం కూడా ఇప్పుడు ముగియనుంది. ఈ రెండు స్థానాలను దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి ఈ రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తుండగా, ప్రతిపక్షాలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.</p>
<p><strong>ముగియనున్న ప్రముఖుల పదవీకాలం</strong><br />కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా మహారాష్ట్ర (7), తమిళనాడు (6), బీహార్ (5), పశ్చిమ బెంగాల్ (5) వంటి రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడనున్నాయి. శరద్ పవార్, రామ్ దాస్ అథవాలే, ప్రియాంక చతుర్వేది వంటి హేమాహేమీల పదవీకాలం కూడా ఈ ఏప్రిల్‌తోనే ముగియనుండటంతో ఈ ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్రంలో ఉన్న ఎన్డీయే కూటమి తన బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తుండగా, 'ఇండియా' కూటమి సభ్యులు గరిష్ట స్థానాలను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. మార్చి 20వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/the-city-that-rang-for-the-rajya-sabha-elections/article-8905</link>
                <guid>https://www.vishvambhara.com/national/the-city-that-rang-for-the-rajya-sabha-elections/article-8905</guid>
                <pubDate>Wed, 18 Feb 2026 14:41:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/image-%2874%29.jpg"                         length="40136"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ -  రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ </title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><strong>హైదరాబాద్, విశ్వంభర :-</strong>కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తిని తీవ్రంగా వ్యతిరేకించి, ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమించి, దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఏక్ దేశ్ మే దో విధాన్, ధో ప్రధాన్, ధో నిషాన్ నహీ ఛలేంగే అంటూ నినదిస్తూ, నెహ్రూ ప్రభుత్వ  విధానాలకు వ్యతిరేకంగా  సైద్ధాంతిక కట్టుబాట్లకు అనుగుణంగా అఖండ భారత్ కోసం పోరాటం చేశారని కొనియాడారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ను తొలగించి జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో కలపడం ద్వారా దేశాన్ని ఒక బలమైన… ఐక్య దేశంగా చూడాలనే డాక్టర్ ముఖర్జీ గారి కలను సాకారం చేసిందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలను ఎండగట్టారు. భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/shyam-prasad-mukherjee-a-great-patriot-who-sacrificed-his-life/article-2602"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/321987-new-project-2022-05-31t114433544.webp" alt=""></a><br /><p> </p>
<p><strong>హైదరాబాద్, విశ్వంభర :-</strong>కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తిని తీవ్రంగా వ్యతిరేకించి, ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమించి, దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఏక్ దేశ్ మే దో విధాన్, ధో ప్రధాన్, ధో నిషాన్ నహీ ఛలేంగే అంటూ నినదిస్తూ, నెహ్రూ ప్రభుత్వ  విధానాలకు వ్యతిరేకంగా  సైద్ధాంతిక కట్టుబాట్లకు అనుగుణంగా అఖండ భారత్ కోసం పోరాటం చేశారని కొనియాడారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ను తొలగించి జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో కలపడం ద్వారా దేశాన్ని ఒక బలమైన… ఐక్య దేశంగా చూడాలనే డాక్టర్ ముఖర్జీ గారి కలను సాకారం చేసిందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలను ఎండగట్టారు. భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ  జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ  చిత్రపటానికి రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్  పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ మహనీయుడి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , కాసం వెంకటేశ్వర్లు , పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ , ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/shyam-prasad-mukherjee-a-great-patriot-who-sacrificed-his-life/article-2602</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/shyam-prasad-mukherjee-a-great-patriot-who-sacrificed-his-life/article-2602</guid>
                <pubDate>Sat, 06 Jul 2024 13:36:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/321987-new-project-2022-05-31t114433544.webp"                         length="43682"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        