<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/congress/tag-43" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Congress - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/43/rss</link>
                <description>Congress RSS Feed</description>
                
                            <item>
                <title>కష్టపడే వారికే కాంగ్రెస్‌లో గుర్తింపు..డీసీసీ శిక్షణా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<p> వికారాబాద్‌లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/only-those-who-struggle-are-recognized-in-congress/article-9156"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-21-at-7.15.32-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>వికారాబాద్‌లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. డీసీసీ పదవి ఎంతో విలువైనదని, వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినయోగం చేయవద్దని సూచించారు. వారసత్వంగా ఎవరికీ అవకాశాలు రావని, మనం పడే కష్టం, శ్రమ ఎప్పటికీ వృథా పోవని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ శిక్షణను శిక్షగా భావించవద్దని కోరారు.</p>
<p>డీసీసీలుగా ఎన్నికైనంత మాత్రాన ఆ జిల్లాలపై తమదే ఆధిపత్యమని, తామే అధిపతులమని భావిస్తే అది పెద్ద తప్పిదమని రేవంత్ హెచ్చరించారు. డీసీసీ పోస్టు అనేది కేవలం అధికారం మాత్రమే కాదని, అది ఒక కుటుంబ పెద్దలాంటి బాధ్యత అని గుర్తు చేశారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారు ఉంటారని, ఇది మహాత్మా గాంధీ కాలం నుండి కొనసాగుతున్న సంప్రదాయమని పేర్కొన్నారు. భిన్న స్వరాలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించాలే తప్ప, వ్యతిరేకించే వారిని పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తే అది పార్టీకి కీడు చేసినట్లవుతుందని హితవు పలికారు.</p>
<p>తాను పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సమయంలో పార్టీ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని, సొంత పార్టీలోనే కొందరి నుంచి వ్యతిరేకత ఎదురైందని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ నేతలందరి ఇళ్లకు వెళ్లి వారిని కలిసినట్లు వివరించారు. వయసులో, అనుభవంలో చిన్నవాడినైనా పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని, సహకరించాలని కోరి అందరినీ ఒప్పించినట్లు చెప్పారు. అందరం సమిష్టిగా కృషి చేయడం వల్లే పార్టీ ఓటింగ్ శాతం 2.5 నుండి 40 శాతానికి చేరిందని విశ్లేషించారు. గతంలో డీసీసీ అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని, అక్కడ అవకాశం రాని వారికి ఎమ్మెల్సీ పదవులు కల్పించామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన మరో 60 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని, కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/only-those-who-struggle-are-recognized-in-congress/article-9156</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/only-those-who-struggle-are-recognized-in-congress/article-9156</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 19:25:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-21-at-7.15.32-pm.jpeg"                         length="34935"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాజకీయ విరాళాల్లో బీజేపీ రికార్డు సృష్టి</title>
                                    <description><![CDATA[<p>దేశీయ రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/bjp-sets-record-in-political-donations/article-8860"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-14-at-6.08.41-pm-(1).jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో:</strong> దేశీయ రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్  తాజాగా విడుదల చేసిన 2024–25 ఆర్థిక సంవత్సర నివేదిక ప్రకారం.. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల ద్వారా అందిన విరాళాల్లో సింహభాగం బీజేపీకే దక్కాయి. దేశవ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి ఎలక్టోరల్ ట్రస్ట్‌లకు రూ.3,826 కోట్ల విరాళాలు అందాయి. ఈ మొత్తం నిధుల్లో, బీజేపీకి రూ.3,157 కోట్లు (సుమారు 82.5%) దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం రూ.298.78 కోట్లు (7.8%) మాత్రమే దక్కాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.102 కోట్లు అందాయి.</p>
<p><strong>ప్రధాన దాతలు - కార్పొరేట్ దిగ్గజాల వాటా</strong><br />రాజకీయ విరాళాల్లో కార్పొరేట్ సంస్థల వాటా అత్యధికంగా ఉంది. ఎలివేటెడ్ అవెన్యూ రియల్టీ రూ.500 కోట్లు అందజేసి అగ్రస్థానంలో నిలిచింది. టాటా గ్రూప్ (టాటా సన్స్ &amp; TCS) సుమారు రూ.525 కోట్ల నిధులను సమకూర్చింది. మేఘా ఇంజనీరింగ్ తెలుగు రాష్ట్రాల నుండి రూ.175 కోట్లను విరాళంగా ఇచ్చి ప్రముఖ దాతల జాబితాలో నిలిచింది. ఈ భారీ నిధుల సమీకరణ బీజేపీకి పార్టీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు, ఎన్నికల వ్యయానికి భారీ ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నిధుల సమీకరణలో కనిపిస్తున్న ఈ భారీ వ్యత్యాసం, భవిష్యత్తులో ఎన్నికల ప్రచారాలు, పోటీ తత్వాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/bjp-sets-record-in-political-donations/article-8860</link>
                <guid>https://www.vishvambhara.com/national/bjp-sets-record-in-political-donations/article-8860</guid>
                <pubDate>Sat, 14 Feb 2026 18:09:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-14-at-6.08.41-pm-%281%29.jpeg"                         length="26318"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నల్గొండలో 'హస్తం' విజయకేతనం</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపితమైంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి, ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/hastam-vijayaketana-in-nalgonda/article-8826"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-13-at-5.59.02-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపితమైంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి, ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తమ పట్టును చాటుకుంటూ, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మున్సిపాలిటీలపై జెండా ఎగురవేసింది. ముఖ్యంగా హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. హాలియాలో మొత్తం 12 వార్డులకు గాను ఏకంగా 11 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. అటు నందికొండలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. అక్కడ కూడా 11 వార్డులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోగా, బీఆర్ఎస్ ఒకే ఒక్క వార్డుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.</p>
<p><strong>మిర్యాలగూడ, దేవరకొండలోనూ అదే జోరు</strong><br />జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీ అయిన మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇక్కడ మొత్తం 48 వార్డుల్లో పోటీ జరగగా, 31 స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ 14 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీకి ఒక చోట, ఇతరులకు రెండు చోట్ల విజయం దక్కింది. ఇక దేవరకొండలోనూ కాంగ్రెస్ 11 వార్డులను గెలుచుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకోగా.. బీఆర్ఎస్ 6, బీజేపీ 1, ఇతరులు 2 వార్డుల్లో విజయం సాధించారు.</p>
<p><strong>చిట్యాల, చండూరులో గులాబీ పార్టీకి నిరాశే</strong><br />చిట్యాల మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను 9 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. బీఆర్ఎస్ కేవలం 2 వార్డులకే పరిమితం కాగా, మరొకటి ఇతరుల పరమైంది. అటు చండూరులోనూ 10 వార్డుల్లో 6 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించగా, బీఆర్ఎస్ 3 చోట్ల, ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక చోట విజయం సాధించారు.</p>
<p><strong>కాంగ్రెస్ క్యాంప్‌లో సంబరాలు</strong><br />ఈ ఫలితాలతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. మిఠాయిలు పంచుకుంటూ, బాణసంచా కాలుస్తూ తమ విజయాన్ని ఘనంగా చాటుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోనూ రెండో స్థానానికే పరిమితం కాగా, బీజేపీ ప్రభావం నామమాత్రంగానే ఉండిపోయింది. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, స్థానిక నేతల కృషే ఈ విజయానికి కారణమని గెలిచిన అభ్యర్థులు పేర్కొంటున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/hastam-vijayaketana-in-nalgonda/article-8826</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/hastam-vijayaketana-in-nalgonda/article-8826</guid>
                <pubDate>Fri, 13 Feb 2026 21:06:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-13-at-5.59.02-pm.jpeg"                         length="128151"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదు</title>
                                    <description><![CDATA[<p>కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎఫ్‌టీఎస్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/case-registered-against-former-mla-jaggareddy/article-8752"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-12-at-7.09.40-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎఫ్‌టీఎస్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జగ్గారెడ్డిపై 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>
<p>కేసు నమోదుపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. సంగారెడ్డిలో దొంగ ఓట్లను అడ్డుకున్న కాంగ్రెస్ నేతపై సీఐ చేయిచేసుకున్నారని ఆయన ఆరోపించారు. తమ నేతను కొట్టినందుకే సీఐని తిట్టాల్సి వచ్చిందని జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. సీఐ శివకుమార్ బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చర్యలు ఉండాలని ఆయన అన్నారు. నిన్న జరిగిన ఘటనలో తప్పు ఎవరిదనేది న్యాయస్థానంలో తేలుతుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/case-registered-against-former-mla-jaggareddy/article-8752</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/case-registered-against-former-mla-jaggareddy/article-8752</guid>
                <pubDate>Thu, 12 Feb 2026 19:11:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-12-at-7.09.40-pm.jpeg"                         length="96643"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేనో.. పోలీసులో తేలిపోవాలి</title>
                                    <description><![CDATA[<p>సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి, పోలీసుల మధ్య హైడ్రామా చోటు చేసుకుంది. 34వ వార్డులో మొదలైన చిన్న వివాదం, మాజీ ఎమ్మెల్యే ఎంట్రీతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/i-need-to-get-into-the-police/article-8738"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-11-at-19.06.37.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి, పోలీసుల మధ్య హైడ్రామా చోటు చేసుకుంది. 34వ వార్డులో మొదలైన చిన్న వివాదం, మాజీ ఎమ్మెల్యే ఎంట్రీతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.</p>
<p><strong>ఘర్షణకు బీజం పడిందిలా</strong><br />34వ వార్డు పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందని కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సీఐ శివకుమార్‌ కు, అభ్యర్థికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయి దాటి, అభ్యర్థి ఏకంగా సీఐ కాలర్ పట్టుకోవడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పోలీసులు అభ్యర్థిని పక్కకు నెట్టివేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.</p>
<p><strong>రంగంలోకి జగ్గారెడ్డి.. బూత్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం!</strong><br />తమ అభ్యర్థిపై పోలీసులు చేయి చేసుకున్నారని వార్త తెలియగానే జగ్గారెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ స్పాట్‌కు చేరుకున్నారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి, పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. "రిగ్గింగ్‌ను అడ్డుకోలేరు గానీ, మా వాళ్లపై ప్రతాపం చూపిస్తారా?" అంటూ పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. పోలింగ్ ఆపేస్తా.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఆయన చేసిన హెచ్చరికలతో అక్కడ వాతావరణం మరింత వేడెక్కింది.</p>
<p><strong>నేనో.. పోలీసులో తేలిపోవాలి: జగ్గారెడ్డి  </strong><br />పోలీసులను ఉద్దేశించి జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. “రిగ్గింగ్ చేస్తున్నారని మా అభ్యర్థి చెబితే, సీఐ శివకుమార్ గల్లా పట్టుకుంటాడా? ఆ సీఐ నా ముందుకు రావాలి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే దానికి కారణం సీఐ, ఈ హోంగార్డులే. నేనో.. పోలీసులో ఈరోజు తేలిపోవాలి!" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.</p>
<p>జగ్గారెడ్డి పోలీసులకు వేళ్లను చూపిస్తూ, గట్టిగా కేకలు వేస్తూ హెచ్చరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఆయనను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ, "న్యాయం జరిగే వరకు కదిలేది లేదు" అంటూ జగ్గారెడ్డి భీష్మించారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.</p>
<p>ఈ ఘటన నేపథ్యంలో సంగారెడ్డిలో మున్సిపల్ పోలింగ్ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగింది. పోలీసులపై దాడికి ప్రయత్నించిన అభ్యర్థిపై, విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/i-need-to-get-into-the-police/article-8738</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/i-need-to-get-into-the-police/article-8738</guid>
                <pubDate>Wed, 11 Feb 2026 19:10:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-11-at-19.06.37.jpeg"                         length="53638"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ దేశానికి పట్టిన పెద్ద పీడ: కిషన్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/kishan-reddy-is-the-big-burden-of-the-congress-nation/article-8553"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-06-at-9.02.17-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. సనాతన ధర్మానికి, దేశాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద అవరోధమని, ఆ పార్టీ పాలనలో దేశం భ్రష్టు పట్టిందని ఆయన మండిపడ్డారు. ఈ ఎన్నికలు కేవలం వార్డుల గెలుపు కోసం కాదని, తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల పరిస్థితి ప్రస్తుతం "పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా" తయారైందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పదేళ్ల కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలని ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే, ఇప్పుడు ఆ పార్టీ మంత్రులు దోచుకున్నది పంచుకోవడానికి కొట్టుకుంటున్నారని ఆరోపించారు. అమరవీరుల ఆకాంక్షలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తుంగలో తొక్కాయని, కేవలం బీజేపీతోనే నిజమైన మార్పు సాధ్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.</p>
<p>అభివృద్ధి విషయంలో కేంద్రం వెనకాడటం లేదని చెబుతూ కిషన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో రూ.3.50 లక్షల కోట్ల నిధులతో హైస్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్ కేంద్రంగా మూడు హైస్పీడ్ రైలు మార్గాలను ప్రకటించామని, ఇవి రాష్ట్ర ఆర్థిక రూపురేఖలను మార్చబోతున్నాయని చెప్పారు. కేంద్రం ఇస్తున్న నిధులను వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం 'పెద్దరికం' చేస్తోందే తప్ప, అదనంగా ఏమీ చేయడం లేదని విమర్శించారు.</p>
<p>గత పార్లమెంటు ఎన్నికల్లో 50 శాతం ఎంపీ స్థానాలను బీజేపీకి కట్టబెట్టిన ప్రజలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే తరహాలో నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తారని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య జాతీయ స్థాయిలో రహస్య ఒప్పందం ఉందని, అందుకే విచారణల పేరుతో రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను రక్షించాలంటే కమల దళాన్ని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/kishan-reddy-is-the-big-burden-of-the-congress-nation/article-8553</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/kishan-reddy-is-the-big-burden-of-the-congress-nation/article-8553</guid>
                <pubDate>Fri, 06 Feb 2026 21:25:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-06-at-9.02.17-pm.jpeg"                         length="37151"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.'ప్రజా పాలన – ప్రగతి బాట' కార్యక్రమంలో భాగంగా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/kcrs-adopted-son-kishan-reddy-is-cm-revanth-reddy/article-8538"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-06-at-7.31.52-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.'ప్రజా పాలన – ప్రగతి బాట' కార్యక్రమంలో భాగంగా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీరును విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ముందుకెళ్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. "బీజేపీకి ఓటు వేసినా, బీఆర్ఎస్‌కు ఓటు వేసినా అది మూసీలో వేసినట్లే. ఆ రెండు పార్టీల మధ్య ఉన్నది ఫెవీకాల్ బంధం" అని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ను కాపాడటమే కిషన్ రెడ్డి ప్రధాన అజెండా అని, అందుకే ఆయన ఇప్పుడు 'కల్వకుంట్ల కిషన్ రావు'గా మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డిని కేసీఆర్ దత్తపుత్రుడిగా అభివర్ణిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.</p>
<p><strong>స్మార్ట్ సిటీ ఏది? నిధులు ఏవి? </strong><br />నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను రెండుసార్లు గెలిపించినా జిల్లాకు సాధించిందేమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ మూడుసార్లు ప్రధాని అయినా నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా మార్చలేకపోయారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ మురికికూపంగా మారిందని, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో బీజేపీ విఫలమైందని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వని బీజేపీకి, ఇక్కడి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.</p>
<p><strong>కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం</strong><br />మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మన వార్డుల్లో మన కార్పొరేటర్లు ఉంటేనే నిధుల ప్రవాహం సాధ్యమవుతుందని, అభివృద్ధికి బాటలు పడతాయని ప్రజలకు వివరించారు. "నేను అందరివాడిని.. నాకు కులం, మతం లేదు.. నా లక్ష్యం కేవలం అభివృద్ధి మాత్రమే" అని చెబుతూ, నిజామాబాద్ ఓటర్లు ఈ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇవ్వాలని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/kcrs-adopted-son-kishan-reddy-is-cm-revanth-reddy/article-8538</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/kcrs-adopted-son-kishan-reddy-is-cm-revanth-reddy/article-8538</guid>
                <pubDate>Fri, 06 Feb 2026 19:34:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-06-at-7.31.52-pm.jpeg"                         length="154596"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేపు జూబ్లీహిల్స్‌లో పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి మంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశం</title>
                                    <description><![CDATA[<p>సుదీర్ఘ విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలనా పగ్గాలను వేగంగా అందుకున్నారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/revanth-reddys-meeting-with-the-in-charge-ministers-of-parliament-constituency/article-8316"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/2cc09568-5e1b-4880-b46a-2277cf1f69881.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> సుదీర్ఘ విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలనా పగ్గాలను వేగంగా అందుకున్నారు. విదేశాల్లో పెట్టుబడుల వేట ముగియగానే, ఇప్పుడు రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు, అభివృద్ధి పనులపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ కొత్త సారథి మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా హాజరుకానున్నారు. వీరితో పాటు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు తీసుకున్న ఇంచార్జ్ మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు.</p>
<p>ఈ సమావేశం కేవలం సాధారణ భేటీ కాదని, రాష్ట్రంలో రాబోయే రాజకీయ పరిణామాలకు ఒక దిశానిర్దేశమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జ్‌లుగా ఉన్న మంత్రులకు వారి పరిధిలోని అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన గడువులను విధించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి? జిల్లాల వారీగా అమలులో ఎదురవుతున్న ఇబ్బందులేంటి? అనే అంశాలపై సీఎం నివేదికలు కోరనున్నారు. రాబోయే ఎన్నికలు, స్థానిక సంస్థల బలోపేతం దిశగా పార్టీ క్యాడర్‌ను ఎలా సమాయత్తం చేయాలనే దానిపై మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి సీఎం చర్చించనున్నారు. </p>
<p>తన పర్యటనలో భాగంగా విదేశీ పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, రాష్ట్రానికి రాబోతున్న పెట్టుబడుల గురించి కూడా సీఎం ఈ భేటీలో ప్రస్తావించనున్నారు. పాలనలో కొత్త సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి, దానికి అనుగుణంగా మంత్రులను, పార్టీని ఎలా ముందుకు నడిపించాలనే దానిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/revanth-reddys-meeting-with-the-in-charge-ministers-of-parliament-constituency/article-8316</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/revanth-reddys-meeting-with-the-in-charge-ministers-of-parliament-constituency/article-8316</guid>
                <pubDate>Mon, 02 Feb 2026 21:24:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/2cc09568-5e1b-4880-b46a-2277cf1f69881.jpg"                         length="32323"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్‌లో ‘సయోధ్య’ రాజకీయం..</title>
                                    <description><![CDATA[<div>కాంగ్రెస్‌ పార్టీలో గత కొంతకాలంగా వినిపిస్తున్న అసమ్మతి స్వరాలకు బ్రేక్ పడింది. పార్టీ అగ్ర నాయకత్వంపై శశిథరూర్‌ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారానికి తెరదించుతూ.. పార్లమెంట్‌ ప్రాంగణంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్‌ గాంధీలతో థరూర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.</div>
<div> </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/politics-of-reconciliation-in-congress/article-8100"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/80f94f1a-7cfb-45b5-8f65-0afcf9382a8d.jpg" alt=""></a><br /><div><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో:</strong> కాంగ్రెస్‌ పార్టీలో గత కొంతకాలంగా వినిపిస్తున్న అసమ్మతి స్వరాలకు బ్రేక్ పడింది. పార్టీ అగ్ర నాయకత్వంపై శశిథరూర్‌ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారానికి తెరదించుతూ.. పార్లమెంట్‌ ప్రాంగణంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్‌ గాంధీలతో థరూర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. తన సొంత పార్టీ నేతలను కలవడంలో ప్రాధాన్యత ఏముందని భేటీకి ముందు వ్యాఖ్యానించిన థరూర్, సమావేశం ముగిశాక మాత్రం పూర్తి సానుకూలత వ్యక్తం చేయడం గమనార్హం.</div>
<div> </div>
<div> </div>
<div><strong>క్లారిటీ ఇచ్చిన థరూర్..</strong></div>
<div>సమావేశం అనంతరం శశిథరూర్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ భేటీకి సంబంధించిన ఫొటోను పంచుకున్నారు. "అనేక అంశాలపై ఖర్గే, రాహుల్‌లతో ఆత్మీయంగా చర్చించాం. మేమంతా ఒకే అభిప్రాయంతో ఉన్నాం. దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఐక్యంగా ముందుకు సాగుతాం" అని స్పష్టం చేశారు. గతంలో విదేశీ వ్యవహారాలపై పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడటం, కొన్ని సందర్భాల్లో ప్రధాని మోదీని ప్రశంసించడం ద్వారా థరూర్‌ సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజా భేటీ ద్వారా అధిష్ఠానంతో ఉన్న గ్యాప్‌ను ఆయన భర్తీ చేసుకున్నట్లు కనిపిస్తోంది.</div>
<div> </div>
<div><strong>పాత గొడవలు పక్కన పెట్టి.. ముందడుగు..</strong></div>
<div>గతేడాది 'ఆపరేషన్‌ సిందూర్‌' సమయంలో దౌత్యపరమైన అంశాలపై థరూర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అప్పటి నుంచి పార్టీకి, ఆయనకు మధ్య దూరం పెరిగిందనే చర్చ నడుస్తోంది. అయితే, పార్లమెంటరీ నిబంధనలను తాను ఎప్పుడూ ఉల్లంఘించలేదని, కేవలం అభిప్రాయభేదాలు మాత్రమే ఉండేవని థరూర్‌ తాజాగా వివరణ ఇచ్చారు. తాజా భేటీతో కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయిందని, కీలక నేతల మధ్య సయోధ్య కుదిరిందని విశ్లేషకులు భావిస్తున్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/politics-of-reconciliation-in-congress/article-8100</link>
                <guid>https://www.vishvambhara.com/national/politics-of-reconciliation-in-congress/article-8100</guid>
                <pubDate>Thu, 29 Jan 2026 20:39:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/80f94f1a-7cfb-45b5-8f65-0afcf9382a8d.jpg"                         length="56668"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయి : ఎంపీ లక్ష్మణ్</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విరుచుకుపడ్డారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mp-laxman-is-playing-brs-congress-dramas/article-8090"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/d7b33e76-446a-4aef-ad5e-b3c66a02d326.jpg" alt=""></a><br /><div><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కలిసి ప్రజల కళ్లకు గంతలు కడుతున్నాయని, ఇరు పార్టీలు పరస్పర అవగాహనతో పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన ఈ తీవ్రమైన అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.</div>
<div> </div>
<div><strong>సిట్ నోటీసులు కేవలం కాలయాపనే! </strong></div>
<div>మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. ఈ నోటీసుల పర్వం అంతా ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతున్న నాటకమని ఆయన కొట్టిపారేశారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ, ప్రధాన నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రజల్లో తాము ఏదో చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని, కానీ క్షేత్రస్థాయిలో అడుగు ముందుకు పడటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.</div>
<div> </div>
<div><strong>ఎండ్ లేని 'డైలీ సీరియల్'.. అసలు సూత్రధారులు ఎక్కడ?**</strong></div>
<div>కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ట్యాపింగ్ ఇష్యూను ఒక అంతులేని 'డైలీ సీరియల్'లా మార్చేసిందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. రోజుకో కొత్త లీక్ ఇవ్వడం, సోషల్ మీడియాలో హడావిడి చేయడం తప్ప, గడిచిన రెండేళ్ల కాలంలో ఈ కుట్ర వెనుక ఉన్న అసలైన సూత్రధారులను ఎందుకు పట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం కొందరు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం వల్ల ప్రయోజనం లేదని, ఆ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన రాజకీయ శక్తులను ఎప్పుడు బోనులో నిలబెడతారని ఆయన నిలదీశారు.</div>
<div> </div>
<div><strong>బీఆర్ఎస్ - కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం? </strong></div>
<div>ఈ కేసులో జరుగుతున్న జాప్యం చూస్తుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏదో రహస్య ఒప్పందం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుకుంటూ, కేవలం ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ సమాజం ఈ మోసపూరిత రాజకీయాలను గమనిస్తోందని, నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mp-laxman-is-playing-brs-congress-dramas/article-8090</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mp-laxman-is-playing-brs-congress-dramas/article-8090</guid>
                <pubDate>Thu, 29 Jan 2026 20:28:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/d7b33e76-446a-4aef-ad5e-b3c66a02d326.jpg"                         length="10541"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ రాజకీయాల్లో ‘అనర్హత’ సెగ</title>
                                    <description><![CDATA[<p> ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/disqualification-in-telangana-politics-sec/article-8031"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/d6edb4e9-e21b-4e75-bc4e-8237c04a6f91.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>తెలంగాణలో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు మరో మలుపు తిరిగింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నోటీసుల గ్రహీతలలో దానం నాగేందర్‌తో పాటు ఆయనపై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ ఈ నెల 30న స్పీకర్ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది.</p>
<p><strong>సుప్రీంకోర్టు కొరడా.. స్పీకర్ యాక్షన్!</strong><br />ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 19న స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ, చర్యలు తీసుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే పెండింగ్‌లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ కదలిక మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.</p>
<p><strong>దానం కేసులో ‘బి-ఫామ్’ చిక్కులు</strong><br />మిగిలిన ఎమ్మెల్యేలతో పోలిస్తే దానం నాగేందర్ కేసు భిన్నంగా ఉంది. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా బి-ఫామ్ పై పోటీ చేశారు. ఇది స్పష్టమైన పార్టీ ఫిరాయింపు కిందకు వస్తుందని, బలమైన ఆధారాలు ఉన్నందున ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం మెండుగా ఉందని ప్రచారం జరుగుతోంది.</p>
<p><strong>ఏడుగురికి క్లీన్ చిట్.. ముగ్గురిపై ఉత్కంఠ</strong><br />మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందగా, స్పీకర్ ఇప్పటికే ఏడుగురికి 'క్లీన్ చిట్' ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య గుర్తింపు పొందారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ లకు సంబంధించి స్పీకర్ ఇంకా విచారణ జరపలేదు.</p>
<p><strong>రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తారా?</strong><br />అనర్హత వేటు పడితే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో, స్పీకర్ నిర్ణయం వెలువడక ముందే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తద్వారా నేరుగా ఉప ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. 30వ తేదీన జరగబోయే విచారణలో దానం నాగేందర్ ఎలాంటి వివరణ ఇస్తారు? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనే అంశంపై ఇప్పుడు యావత్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ దానం రాజీనామా చేస్తే హైదరాబాద్ రాజకీయాల్లో మరో ఉప ఎన్నిక పోరు తప్పదని తెలుస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/disqualification-in-telangana-politics-sec/article-8031</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/disqualification-in-telangana-politics-sec/article-8031</guid>
                <pubDate>Wed, 28 Jan 2026 15:47:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/d6edb4e9-e21b-4e75-bc4e-8237c04a6f91.jpeg"                         length="29718"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బొగ్గు స్కామ్ నుంచి రేవంత్‌ను కాపాడేందుకే యత్నం: హరీశ్ రావు</title>
                                    <description><![CDATA[<p>ష్ట్ర రాజకీయాల్లో బొగ్గు టెండర్ల ప్రక్రియ పెను దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని వాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/harish-rao-is-trying-to-save-revanth-from-the-coal/article-7928"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/image-(77).jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> రాష్ట్ర రాజకీయాల్లో బొగ్గు టెండర్ల ప్రక్రియ పెను దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని వాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. నిజాలను దాచిపెట్టి, స్కామ్‌ను బయటపెట్టిన తమ పార్టీపై బురద జల్లడం తగదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టెండర్ల ప్రక్రియలో జరిగిన లోపాలపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు.</p>
<p>2025 మే నెలలో 'సైట్‌ సర్టిఫికెట్‌' అనే కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారని హరీశ్ రావు తెలిపారు. ఈ నిబంధన వల్ల తొలి లబ్ధిదారు సీఎం బంధువు, శోధా కన్‌స్ట్రక్షన్‌ యజమాని సృజన్‌రెడ్డి అని హరీశ్‌రావు ఆరోపించారు. అప్పటి నుంచి ప్రతి టెండర్‌కు 'సైట్ విజిట్' నిబంధన పెట్టి, 'ప్లస్ టెన్' పద్ధతిని ఫాలో అవుతూ అక్రమాలకు తెరలేపారని విమర్శించారు. </p>
<p>కుంభకోణం జరగలేదని భట్టి విక్రమార్క నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, పారదర్శకత ఉంటే ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. "నైనీ కోల్‌ బ్లాక్‌ ఒక్కటే కాదు.. సైట్‌ విజిట్‌ నిబంధన పెట్టిన అన్ని టెండర్లను రద్దు చేయాలి. 2025 మే నుంచి ఇప్పటివరకు ఎన్ని టెండర్లు పిలిచారు? ఎంతమందికి సర్టిఫికెట్లు ఇచ్చారు? అనే అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి." అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.</p>
<p><strong>నా దగ్గర ఆధారాలు ఉన్నాయి</strong><br />ప్రభుత్వ తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. జీసీసీ, మహాలక్ష్మి వంటి కంపెనీలకు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా, కేవలం తమకు కావలసిన వారికే ఇచ్చారని ఆయన మండిపడ్డారు. తన వద్ద ఫోటోలు, వీడియోలు, కంపెనీలు పంపిన ఈమెయిల్స్ ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఈ ఆధారాలన్నీ సమర్పిస్తానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి బయటపెడతానని హెచ్చరించారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/harish-rao-is-trying-to-save-revanth-from-the-coal/article-7928</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/harish-rao-is-trying-to-save-revanth-from-the-coal/article-7928</guid>
                <pubDate>Sun, 25 Jan 2026 18:49:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/image-%2877%29.jpg"                         length="27585"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        