<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/telangana-politics/tag-41" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Telangana Politics - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/41/rss</link>
                <description>Telangana Politics RSS Feed</description>
                
                            <item>
                <title>KTR: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్‎కి బుద్ధి చెప్పడం ఖాయం: కేటీఆర్</title>
                                    <description><![CDATA[<p>KTR: రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/ktr-is-sure-that-the-urban-people-will-give-advice/article-7315"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/ktr.jpg" alt=""></a><br /><p>రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత రెండేళ్లుగా పట్టణాలను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రెండు సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా పట్టణాలకు విడుదల చేయని ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.</p><p>కాంగ్రెస్ పాలనలో పట్టణాల పరిపాలన పూర్తిగా దెబ్బతిందని, పారిశుద్ధ్యం నుంచి తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల వరకు ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించి, నిధులు కేటాయించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేవలం మళ్లీ శిలాఫలకాలు వేయడం తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీలేదన్నారు. రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మోడల్ మార్కెట్లు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు నిలిపివేయడంతో అవన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయని తెలిపారు.</p><p>ఒకవైపు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టుతూ, మరోవైపు పట్టణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని కేటీఆర్ అన్నారు. ఈ రెండేళ్లలో పట్టణాలకు ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందుంచి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు.</p><p>మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా కేటీఆర్ హైదరాబాద్‌లో నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పార్టీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న పురపాలక ఎన్నికల వ్యూహాలు, పార్టీ చేయాల్సిన ఏర్పాట్లు, ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రెండు జిల్లాల్లోని ప్రతి మున్సిపాలిటీలోని క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్ సమగ్రంగా సమీక్షించారు.</p><p>పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు, అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొని పార్టీ మంచి ఫలితాలు సాధించిందని గుర్తు చేసిన కేటీఆర్, అదే స్పూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన విజయాలు సాధించాలని నేతలకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా పాల్గొని, కలిసికట్టుగా సమిష్టిగా పోరాడితే విజయం తప్పక సాధ్యమని అన్నారు. పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై హరీష్ రావు నేతలకు పలు సూచనలు చేశారు.</p><p>జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను నేతలు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, పార్టీకి అనుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని వారు నాయకత్వానికి తెలియజేశారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే సంకల్పంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయని సమావేశంలో స్పష్టం అయ్యింది.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/ktr-is-sure-that-the-urban-people-will-give-advice/article-7315</link>
                <guid>https://www.vishvambhara.com/ktr-is-sure-that-the-urban-people-will-give-advice/article-7315</guid>
                <pubDate>Sat, 10 Jan 2026 16:50:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/ktr.jpg"                         length="6262"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కల్వకుర్తి ఎమ్మెల్యే కు బిజెపి నాయకుల వినతి పత్రాలు</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/19.jpg" alt="19" width="1200" height="720" /></p>
<p><strong>  తెలంగాణ పత్రిక ప్రతినిధి, ఆమనగల్లు, జులై 11:- </strong>ఆమనగల్లులో ప్రభుత్వ వైద్యశాల ప్రారంభానికి బుధవారం వచ్చిన కల్వకుర్తి  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి బిజెపి నాయకులు విడి విడిగా వినతి పత్రాలు అందజేశారు నాలుగు సంవత్సరాల కింద ఆమనగల్లులో సొంత భవనం లేక గురుకుల పాఠశాలను తరలించి షాద్నగర్ మండలంలో కొనసాగిస్తున్నారు సొంత భవనాన్ని నిర్మించి ఆమనగల్లు కు గురుకుల పాఠశాలను తీసుకురావాలని బీజేవైఎం సీనియర్ నాయకులు రేవల్లి రాజు వినతి పత్రం అందజేశారు కాగా తలకొండపల్లికి చెందిన పోతుగంటి మహేష్ మండలంలో బీటీ రోడ్లు నిర్మించాలని, కాలేజీకి సొంత భవనం నిర్మించాలని, రోడ్డు విస్తరణ పనులు తొందరగా చేపట్టాలని మరో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎడవల్లి  మహేష్,రేవల్లి వెంకటేష్ తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bjp-leaders-petitions-to-kalvakurthi-mla/article-2775"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/19.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/19.jpg" alt="19" width="1280" height="720"></img></p>
<p><strong> తెలంగాణ పత్రిక ప్రతినిధి, ఆమనగల్లు, జులై 11:- </strong>ఆమనగల్లులో ప్రభుత్వ వైద్యశాల ప్రారంభానికి బుధవారం వచ్చిన కల్వకుర్తి  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి బిజెపి నాయకులు విడి విడిగా వినతి పత్రాలు అందజేశారు నాలుగు సంవత్సరాల కింద ఆమనగల్లులో సొంత భవనం లేక గురుకుల పాఠశాలను తరలించి షాద్నగర్ మండలంలో కొనసాగిస్తున్నారు సొంత భవనాన్ని నిర్మించి ఆమనగల్లు కు గురుకుల పాఠశాలను తీసుకురావాలని బీజేవైఎం సీనియర్ నాయకులు రేవల్లి రాజు వినతి పత్రం అందజేశారు కాగా తలకొండపల్లికి చెందిన పోతుగంటి మహేష్ మండలంలో బీటీ రోడ్లు నిర్మించాలని, కాలేజీకి సొంత భవనం నిర్మించాలని, రోడ్డు విస్తరణ పనులు తొందరగా చేపట్టాలని మరో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎడవల్లి  మహేష్,రేవల్లి వెంకటేష్ తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bjp-leaders-petitions-to-kalvakurthi-mla/article-2775</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bjp-leaders-petitions-to-kalvakurthi-mla/article-2775</guid>
                <pubDate>Thu, 11 Jul 2024 18:02:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/19.jpg"                         length="266083"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ గవర్నర్‌గా మాజీ సీఎం?</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్‌గా నియమించే అవకాశాలు</strong></li>
<li><strong>కీలక పదవిని కట్టబెట్టే యోచనలో బీజేపీ అధిష్టానం</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/former-cm-as-governor-of-telangana/article-2007"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/kiran_kumar_reddy_17b857413d.jpg" alt=""></a><br /><p>తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన బీజేపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాజంపేట నుంచి ఆయన పోటీ చేశారు. అయితే ఆయన ఓడిపోవడంతో బీజేపీ హైకమాండ్ ఆయనకు కీలక పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. </p>
<p>తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న ఆయనను గవర్నర్‌గా నియమిస్తే తమకు కలిసి వస్తుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కిరణ్ కుమార్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా రికార్డులకు ఎక్కారు. 2009లో వై.యస్.రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అప్పటి కాంగ్రెస్ హై కమాండ్ రోశయ్యను సీఎంగా చేసింది. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీ శాసన సభ స్పీకర్‌గా వ్యవహరించారు. రోశయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఇక్కడ కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. </p>
<p>దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం అప్పటి వరకు స్పీకర్‌గా, చీఫ్ విప్‌గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిని ఎలాంటి మంత్రి పదవిని అనుభవం లేకున్నప్పటికీ అనూహ్యంగా ముఖ్యమంత్రిని చేసింది. ఆంధ్ర ప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన చివరి వరకు పోరాడారు. ఫలితం లేకపోవడంతో సీఎం పదవికీ రాజీనామా చేశారు. ఆ తర్వాత సొంతంగా జై సమైఖ్యాంద్ర పార్టీ స్థాపించి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే, అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తే ప్రజలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/former-cm-as-governor-of-telangana/article-2007</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/former-cm-as-governor-of-telangana/article-2007</guid>
                <pubDate>Mon, 17 Jun 2024 08:27:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/kiran_kumar_reddy_17b857413d.jpg"                         length="97846"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రుణమాఫీపై కసరత్తు.. 15 లేదా 18న కేబినెట్ భేటీ..?</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రుణమాఫీపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విధి విధానాలపై అధికారులు అన్ని పనులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 9నే చేస్తామన్న రుణమాఫీ కాస్తా ఆగస్టు 15 కు మారింది. ఇక ఇచ్చిన హామీ సమయం గడువు దగ్గర పడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ మీద దృష్టి సారించారు.</p>
<p>ఈ మేరకు ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల అకౌంట్లకే డబ్బులు వేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు స్టార్ట్ చేశారు. ఈ నెల 15 లేదా 18న రుణమాఫీ అంశం మీద కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. </p>
<p>ఏ తేదీని కటాఫ్ గా పరిగణించాలి, శాఖల సమన్వయంతో పాటు రుణమాఫీ అర్హులను ఎలా గుర్తించాలి, నిధుల సమీకరణపై రేవంత్ రెడ్డి సమీక్షించబోతున్నారు. డిసెంబర్ నెలలోని ఏదో ఒక తేదీని కటాఫ్ గా పరిగణించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cabinet-meeting-on-loan-waiver-exercise-on-15th-or-18th/article-1771"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/af1a2962-02ff-4dc7-99e0-6e933ed9a9df1.jpeg" alt=""></a><br /><p> </p>
<p>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రుణమాఫీపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విధి విధానాలపై అధికారులు అన్ని పనులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 9నే చేస్తామన్న రుణమాఫీ కాస్తా ఆగస్టు 15 కు మారింది. ఇక ఇచ్చిన హామీ సమయం గడువు దగ్గర పడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ మీద దృష్టి సారించారు.</p>
<p>ఈ మేరకు ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల అకౌంట్లకే డబ్బులు వేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు స్టార్ట్ చేశారు. ఈ నెల 15 లేదా 18న రుణమాఫీ అంశం మీద కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. </p>
<p>ఏ తేదీని కటాఫ్ గా పరిగణించాలి, శాఖల సమన్వయంతో పాటు రుణమాఫీ అర్హులను ఎలా గుర్తించాలి, నిధుల సమీకరణపై రేవంత్ రెడ్డి సమీక్షించబోతున్నారు. డిసెంబర్ నెలలోని ఏదో ఒక తేదీని కటాఫ్ గా పరిగణించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎలా రుణమాఫీ చేశారనే దానిపై అధికారులు అధ్యయనాలు చేస్తున్నారు. మహారాష్ట్రలో నేరుగా రైతుల అకౌంట్లలోకి ఎలా డబ్బులు జమ చేశారనే దానిపై కసరత్తులు మొదలు పెట్టారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cabinet-meeting-on-loan-waiver-exercise-on-15th-or-18th/article-1771</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cabinet-meeting-on-loan-waiver-exercise-on-15th-or-18th/article-1771</guid>
                <pubDate>Thu, 13 Jun 2024 14:32:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/af1a2962-02ff-4dc7-99e0-6e933ed9a9df1.jpeg"                         length="76124"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం </title>
                                    <description><![CDATA[<p>ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/tirmar-mallanna-sworn-in-as-mlc%C2%A0/article-1754"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/telugu-samayam.webp" alt=""></a><br /><p>ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు శాసమండలి చైర్మన్ చాంబర్‌లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.</p>
<p>ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి అనుగుల రాకేష్ రెడ్డిపై 18వేల పైచిలుకు ఓట్లతో తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నేతలు హాజరయ్యారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/tirmar-mallanna-sworn-in-as-mlc%C2%A0/article-1754</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/tirmar-mallanna-sworn-in-as-mlc%C2%A0/article-1754</guid>
                <pubDate>Thu, 13 Jun 2024 13:00:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/telugu-samayam.webp"                         length="21862"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం రేవంత్‌రెడ్డి‌తో బాలయ్య భేటీ..!</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్‌లోని సీఎం నివాసానికి వెళ్లి  ముఖ్యమంత్రి అయిన సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ సహా పలు అంశాలపై చర్చించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/movies/balayya-met-cm-revanth-reddy/article-854"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/screenshot-2024-05-26-142033.jpg" alt=""></a><br /><p>తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసానికి వెళ్లి  ముఖ్యమంత్రి అయిన సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ సహా పలు అంశాలపై చర్చించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక వీరిద్దరూ భేటీ కావడం ఇదే తొలిసారి. </p>
<p>మొన్నటి దాకా ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన హైదరాబాద్ వచ్చి ఇప్పుడు మళ్ళీ బసవతారకం ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలతో పాటు సినిమాల్లో నిమగ్నమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో బాలయ్యతో పాటు బసవతారక కేన్సర్ ఆస్పత్రికి చెందిన పలువురు ఉన్నారు. కొంతకాలంగా ఆ ఆస్ప్రతిని విస్తరించాలని బాలయ్య అనుకుంటున్నారు. ఈ విషయంపైనే సీఎంతో చర్చించినట్లు సమాచారం. </p>
<p>ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ శివారులో స్థలం కేటాయింపుస‌హా ఇత‌ర అనుమ‌తుల విష‌యంపై సీఎం రేవంత్‌ను నేరుగా క‌లిసి ఉంటార‌ని చ‌ర్చసాగుతోంది. అదేస‌మ‌యంలో హైదరాబాద్‌లోని రామ‌కృష్ణా సినీ స్టూడియోస్‌ను ఆధునీకరించ‌నున్నారు. దీనిని మ‌ణికొండకు షిఫ్ట్ చేయాల‌ని నిర్ణ‌యించారు. దీనిపైనా సీఎంకు స‌మాచారం అందించి త‌గు విధంగా భూమిని కోరిన‌ట్లు తెలుస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Movies</category>
                                    

                <link>https://www.vishvambhara.com/movies/balayya-met-cm-revanth-reddy/article-854</link>
                <guid>https://www.vishvambhara.com/movies/balayya-met-cm-revanth-reddy/article-854</guid>
                <pubDate>Sun, 26 May 2024 14:23:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/screenshot-2024-05-26-142033.jpg"                         length="121337"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలిశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bjp-mlas-met-cm-revanth-reddy/article-375"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/revanthreddy-3.jpg" alt=""></a><br /><p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేశ్ రెడ్డిలు ఉన్నారు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. </p>
<p>అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై వారు చర్చించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bjp-mlas-met-cm-revanth-reddy/article-375</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bjp-mlas-met-cm-revanth-reddy/article-375</guid>
                <pubDate>Sat, 18 May 2024 17:35:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/revanthreddy-3.jpg"                         length="21840"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదు.. అత్యుత్సాహం చూపారంటూ? </title>
                                    <description><![CDATA[<p>తెలంగాణలో గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఊహించిన విధంగా హస్తం పార్టీ అధికారం అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-is-said-to-have-been-excited-by/article-155"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img_20240514_175838_(700_x_400_pixel).jpg" alt=""></a><br /><p>తెలంగాణలో గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఊహించిన విధంగా హస్తం పార్టీ అధికారం అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ గెలవడంతో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి తెలంగాణ బాధ్యతలను తీసుకున్నారు. అయితే ఈయన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ హామీ పథకాల కారణంగానే అధికారంలోకి వచ్చారని తెలుస్తుంది. </p>
<p> </p>
<p> తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గురించి బీజేపీ రాజ్యసభ ఎంపీ కే లక్ష్మణ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదని హెచ్చరించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడమే కాకుండా అత్యుత్సాహంతో ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించారు. అయితే ఈ హామీలను నెరవేర్చకపోతే ఆయనకు రైతులకు రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడమే కాకుండా అత్యుత్సాహంతో ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించారు.</p>
<p> </p>
<p>ఇక రైతు రుణమాఫీ కనక చేయకపోతే ఆగస్టులో సంక్షోభం తప్పదని తెలిపారు. అప్పు తెచ్చి రాష్ట్రానీ నడిపించాలనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనం కావడం ఖాయం అంటూ ఈ సందర్భంగా లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-is-said-to-have-been-excited-by/article-155</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-is-said-to-have-been-excited-by/article-155</guid>
                <pubDate>Tue, 14 May 2024 17:59:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img_20240514_175838_%28700_x_400_pixel%29.jpg"                         length="51418"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు.. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ బందోబస్తు? </title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు సజావుగా ముగుసాయి. మే 13వ తేదీ జరిగినటువంటి ఈ ఎన్నికలు అన్ని ప్రాంతాలలో కూడా ఏ విధమైనటువంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను చేసి ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశారు. </p>
<p>  </p>
<p>ఈ విధంగా ఎన్నికల పూర్తి కావడంతో ఎన్నికల కేంద్రాల నుంచి ఈవీఎం, వీవీ ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్నాయి. ఎన్నికల అధికారులు కలెక్టరేట్ల సమక్షంలో ఈవీఎం వివి ప్యాట్లను భద్రపరిచారు. ఇకపోతే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ స్థాయిలో బందోబస్తును కూడా నిర్వహించారు. ఈ ప్రాంతంలో పోలీస్ అధికారులు ఎన్నికల అధికారులు 144 సెక్షన్ కూడా అమలు చేశారు.</p>
<p>  </p>
<p>కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్స్‌ సరౌండింగ్ 24/7 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా మూడింతల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఎన్నికల ఫలితాలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/implementation-of-section-144-across-telangana-heavy-deployment-at-strong/article-149"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img_20240514_162543_(1200_x_675_pixel).jpg" alt=""></a><br /><p>తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు సజావుగా ముగుసాయి. మే 13వ తేదీ జరిగినటువంటి ఈ ఎన్నికలు అన్ని ప్రాంతాలలో కూడా ఏ విధమైనటువంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను చేసి ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశారు. </p>
<p> </p>
<p>ఈ విధంగా ఎన్నికల పూర్తి కావడంతో ఎన్నికల కేంద్రాల నుంచి ఈవీఎం, వీవీ ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్నాయి. ఎన్నికల అధికారులు కలెక్టరేట్ల సమక్షంలో ఈవీఎం వివి ప్యాట్లను భద్రపరిచారు. ఇకపోతే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ స్థాయిలో బందోబస్తును కూడా నిర్వహించారు. ఈ ప్రాంతంలో పోలీస్ అధికారులు ఎన్నికల అధికారులు 144 సెక్షన్ కూడా అమలు చేశారు.</p>
<p> </p>
<p>కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్స్‌ సరౌండింగ్ 24/7 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా మూడింతల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీ తెలియజేయునున్న సంగతి తెలిసిందే అప్పటివరకు ఈ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని వెల్లడించారు. ఇక స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేయడమే కాకుండా అందుబాటులో అగ్నిమాపక సిబ్బంది ఉంటున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/implementation-of-section-144-across-telangana-heavy-deployment-at-strong/article-149</link>
                <guid>https://www.vishvambhara.com/implementation-of-section-144-across-telangana-heavy-deployment-at-strong/article-149</guid>
                <pubDate>Tue, 14 May 2024 16:28:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img_20240514_162543_%281200_x_675_pixel%29.jpg"                         length="265804"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(132,63,161);"><em><strong>* తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్న గుడ్డు, కాయ</strong></em></span><br /><span style="color:rgb(132,63,161);"><em><strong>* గాడిద గుడ్డును ఎత్తుకుని తిరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి</strong></em></span><br /><span style="color:rgb(132,63,161);"><em><strong>* వంకాయను పట్టుకుని తిరుగుతున్న బీజేపీ నాయకులు</strong></em></span><br /><span style="color:rgb(132,63,161);"><em><strong>* కొత్త రకం ప్రచారంతో దేశ రాజకీయాలను ఆకర్షించిన తెలంగాణ నేతలు</strong></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/donkey-egg-and-eggplant-shaking-telangana-politics/article-70"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/333493-bjp-vs-congress.webp" alt=""></a><br /><p><strong>విశ్వంభర, హైదరాబాద్ : </strong> రాష్ట్రంలో ప్రస్తుతం గాడిద గుడ్డు, వంకాయ పాలిటిక్స్ నడుస్తున్నాయి. గాడిద గుడ్డు కాంగ్రెస్ పార్టీది కాగా, వంకాయ బీజేపీది. ఈ రెండు లోక్ సభ ఎన్నికల్లో ప్రచార అస్త్రాలుగా ఎంట్రీ ఇచ్చాయి. ఒకరు గాడిద గుడ్డును చేతపట్టుకుని తిరుగుతుండగా.. మరొకరు వంకాయను భుజాన వేసుకుని తిరుగుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ తెలంగాణలో ఆ విమర్శలు బూతులుగా మారాయి. నోటికి ఏమాట వస్తే అది మాట్లాడుతూ దిగజారిపోతున్నారు. విమర్శ అంటేనే బూతుగా మార్చారు. తాజాగా లోక్ సభ ఎన్నికల సందర్భంగా వ్యంగంగా సంభోదించే గాడిద గుడ్డు, వంకాయలను చేర్చి దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి తెరలేపారు తెలంగాణ లీడర్స్. ఇచ్చిన హామీలు, నెరవేర్చని హామీలపై నీది గాడిద గుడ్డు, నాది వంకాయ అన్నట్లు ప్రచార అస్త్రాలను సంధిస్తున్నారు. ఇదంతా చోటామోట నాయకులు కాదు చేసేది.. ఏకంగా సీఎం, కేంద్రమంత్రులే భుజాన వేసుకుని బహిరంగ సభల్లో దుమ్మెత్తి పోసుకుంటూ ప్రజలను తమవైపు తిప్పుకుంటున్నారు. </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>తెరలేపింది హస్తం పార్టీనే..</strong></span><br />కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డే అంటూ కాంగ్రెస్ ప్రచార అస్త్రాన్ని అందుకుని అందరికీ ఈజీగా రీచ్ అయ్యేలా ప్లాన్ చేసింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన గుడ్డును బహిరంగ సభల్లో ప్రదర్శించడం సంచలనంగా మారింది. తెలంగాణ అడిగింది ఇవీ అంటూ ఓ ఫ్లెక్సీని తయారు చేసి దాని ముందు గాడిద గుడ్డును పెట్టి కేంద్రం ఇచ్చింది ఇదే అని ప్రదర్శించింది. తెలంగాణ అడిగిన వాటిల్లో.. ‘‘రూపాయి పంపిస్తే 43 పైసలు బిచ్చం నుంచి విముక్తి, మేడారం సమ్మక్క-సారక్క జాతరకు జాతీయ హోదా, కనీసం ఒక్క ఐఐఎం, ఎన్ఐడీ విద్యాలయం, కనీసం ఒక్క ఐఐటీ, ఓ మెడికల్ కాలేజీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు  జాతీయ హోదా, బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా, 811 టీఎంసీల కృష్ణా జలాలతో సరైన వాటా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ,స్మార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్’’ ఇవ్వాలని తెలంగాణ అడిగిందని, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం గాడిద గుడ్డు ఇచ్చిందని ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకుంటుంది. </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఏడు గాడిద గుడ్లతో తిప్పికొడుతూ..</strong></span><br />కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని బీజేపీ సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టింది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీలపై గాడిద గుడ్డును ఎక్కుపెట్టింది. ‘‘2 లక్షల రుణమాఫీ 1వ గుడ్డు, వరికి రూ.500 బోనస్ 2వ గుడ్డు, కౌలురైతులకు రూ.15 వేల రైతు బోనస్ 3వ గుడ్డు, రైతుకూలీలకు రూ.12 వేల సాయం 4వ గుడ్డు, విద్యార్థులకు రూ.5లక్షలు 5వ గుడ్డు, నిరుద్యోగులకు  నెలకు రూ.4 వేలు 6వ గుట్టు, మహిళలకు రూ.2500 7వ గుడ్డు ఇచ్చిందంటూ సెటైరికల్‌గా తిప్పికొట్టింది. </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>కొత్తగా పుట్టుకొచ్చిన వంకాయ</strong></span><br />గాడిద గుడ్డు ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చిన బీజేపీ తాజాగా వంకాయను రంగంలోకి దింపింది.  గాడిద గుడ్డుకు కౌంటర్‌గా వంకాయలను చేతబట్టి కాంగ్రెస్ రాష్ట్రానికి ఇచ్చింది ఇదే అంటూ కొత్త ప్రచారాన్ని అందుకుంది.  60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి వంకాయ, 120 రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇచ్చింది వంకాయ, ఉద్యోగులకు, మహిళలకు, నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ఇచ్చింది వంకాయ అంటూ బీజేపీ విస్త్రృతంగా ప్రచారం చేస్తోంది. తెలంగాణ సమాజానికి సీఎం వంకాయ చేతిలో పెట్టాడని, ఈ వంకాయ సీఎం రేవంత్ రెడ్డిని ఇంటికి పంపిద్దామని పిలుపునిస్తున్నారు. ఈ సెటైరికల్ ప్రచారం ప్రజలను తెగ ఆకట్టుకుంటుంది. మరి రాబోయే రోజుల్లో ‘వెంట్రుకలు’ ప్రచారంలోకి వచ్చినా ఆశ్చర్చపోవాల్సిన అవసరం లేదేమో..!</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/donkey-egg-and-eggplant-shaking-telangana-politics/article-70</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/donkey-egg-and-eggplant-shaking-telangana-politics/article-70</guid>
                <pubDate>Thu, 09 May 2024 22:49:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/333493-bjp-vs-congress.webp"                         length="20232"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        