<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/bakrid/tag-3724" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>bakrid - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/3724/rss</link>
                <description>bakrid RSS Feed</description>
                
                            <item>
                <title>రుషికొండ ప్యాలెస్ చిత్రాలు ఇంకా బయటపడాల్సివుంది: నారా లోకేశ్</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నడుచుకుంటాం</strong></li>
<li><strong>100 రోజుల్లో గంజాయి విక్రయాలకు చెక్ </strong></li>
<li><strong>ఏపీ ఐటీశాఖ మంత్రి నారాలోకేశ్</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/rushikonda-palace-pictures-are-yet-to-be-released-nara-lokesh/article-2023"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-17-123746.jpg" alt=""></a><br /><p>రుషికొండ ప్యాలెస్‌కు సంబంధించి ఇంకా చాలా చిత్రాలు బయటపడాల్సివుందని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ఆన మాట్లాడుతూ..  శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పారు. </p>
<p>తమ కార్యకర్తలపై దాడులు చేస్తే వారు ఎక్కడ ఉంటారో అర్థం చేసుకోవాలన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామన్నారు. ప్రజా దర్భార్‌ను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో బయటకు రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయంటూ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. </p>
<p>ఇదిలా ఉండగా, దాదాపు రూ.500 కోట్ల ప్రజాధనంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రుషికొండలో భవనాలను నిర్మించారు. అయితే అందులో ఏం నిర్మించారు అనేది ఆదివారం వరకు బయటి ప్రపంచానికి తెలియదు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టాక  రుషికొండకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆదివారం టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారాయి. రుషికొండలో నిర్మించిన ఈ భవనాలను ముందు పర్యాటకం కోసం నిర్మించినట్లు వైసీపీ చెప్పగా, తాజాగా ఇవి పరిపాలన భవనాలు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/rushikonda-palace-pictures-are-yet-to-be-released-nara-lokesh/article-2023</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/rushikonda-palace-pictures-are-yet-to-be-released-nara-lokesh/article-2023</guid>
                <pubDate>Mon, 17 Jun 2024 12:41:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-17-123746.jpg"                         length="139580"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముస్లింలకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి కోమటిరెడ్డి </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>బక్రీద్ సందర్భంగా మంత్రి కీలక ప్రకటన </strong></li>
<li><strong>నల్గొండ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/minister-komatireddy-will-provide-outsourcing-jobs-to-muslims%C2%A0/article-2019"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-17-112406.jpg" alt=""></a><br /><p>రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. ముస్లింలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. బక్రీద్ సందర్భంగా సోమవారం నల్గొండలోని ఈద్గా వద్ద ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు ప్రతీక బక్రీద్ అని అన్నారు. </p>
<p>అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 30ఏళ్లు మత సామరస్యాన్ని కాపాడుతోందని చెప్పుకొచ్చారు. పేద ముస్లింలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉండేలా ఈద్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. ముస్లింలకు విద్యారంగంలో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల ద్వారా ముస్లిం యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. అందరూ బాగుండాలని అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/minister-komatireddy-will-provide-outsourcing-jobs-to-muslims%C2%A0/article-2019</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/minister-komatireddy-will-provide-outsourcing-jobs-to-muslims%C2%A0/article-2019</guid>
                <pubDate>Mon, 17 Jun 2024 11:26:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-17-112406.jpg"                         length="152882"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        