<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/hyderabad/tag-358" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Hyderabad - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/358/rss</link>
                <description>Hyderabad RSS Feed</description>
                
                            <item>
                <title>హైదరాబాద్ మెట్రో సర్కార్ వశం</title>
                                    <description><![CDATA[<p> హైదరాబాద్ నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఎల్&amp;టీ సంస్థ పర్యవేక్షణలో కొనసాగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తిగా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/hyderabad-metro-sarkar/article-9385"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-8.52.07-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>హైదరాబాద్ నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఎల్&amp;టీ సంస్థ పర్యవేక్షణలో కొనసాగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తిగా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం భాగ్యనగర ప్రయాణికులకు ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది. నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే చేపడితే ప్రయాణ ఛార్జీలు, సౌకర్యాల విషయంలో సామాన్యులకు మరింత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.</p>
<p><strong>రెండో దశ విస్తరణపై భారీ కసరత్తు</strong><br />నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మెట్రో రెండో దశ పనులను అత్యంత ప్రాధాన్యతతో పట్టాలెక్కించాలని సర్కార్ నిశ్చయించుకుంది. మొత్తం 86.1 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ విస్తరణ ప్రాజెక్టు కోసం సుమారు రూ.19,579 కోట్ల అంచనా వ్యయాన్ని ఖరారు చేశారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. కేంద్రం కూడా ఈ ప్రాజెక్టు పట్ల సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు వేగవంతం కానున్నాయి.</p>
<p><strong>నిర్వహణ మార్పుతో కొత్త సవాళ్లు</strong><br />మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం వెనుక ఆర్థిక, సాంకేతిక కారణాలు ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎల్&amp;టీ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకునే యోచనలో ఉందన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారీ పెట్టుబడితో కూడిన ఈ ప్రాజెక్టును సొంతంగా నిర్వహించడం ప్రభుత్వానికి ఒక సవాలుతో కూడుకున్న పని. ఎల్&amp;టీ సంస్థ తన వాటాలను, బాధ్యతలను ఏ విధంగా బదిలీ చేస్తుందనే అంశంపై ప్రస్తుతం స్పష్టత రావాల్సి ఉంది.</p>
<p><strong>ప్రయాణికులకు చేకూరనున్న లబ్ధి</strong><br />రవాణా వ్యవస్థ బలోపేతం కావడం వల్ల నగరంలోని ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. రెండో దశ పూర్తయితే విమానాశ్రయం సహా శివారు ప్రాంతాలకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం పూర్తి బాధ్యత చేపడితే ప్రజారవాణా వ్యవస్థగా మెట్రో మరింత మెరుగైన ఫలితాలు ఇస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది. భవిష్యత్తులో ఈ నిర్ణయం మెట్రో రైలు మనుగడను, విస్తరణను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/hyderabad-metro-sarkar/article-9385</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/hyderabad-metro-sarkar/article-9385</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 20:53:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-23-at-8.52.07-pm.jpeg"                         length="83510"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కష్టపడే వారికే కాంగ్రెస్‌లో గుర్తింపు..డీసీసీ శిక్షణా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<p> వికారాబాద్‌లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/only-those-who-struggle-are-recognized-in-congress/article-9156"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-21-at-7.15.32-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>వికారాబాద్‌లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. డీసీసీ పదవి ఎంతో విలువైనదని, వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినయోగం చేయవద్దని సూచించారు. వారసత్వంగా ఎవరికీ అవకాశాలు రావని, మనం పడే కష్టం, శ్రమ ఎప్పటికీ వృథా పోవని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ శిక్షణను శిక్షగా భావించవద్దని కోరారు.</p>
<p>డీసీసీలుగా ఎన్నికైనంత మాత్రాన ఆ జిల్లాలపై తమదే ఆధిపత్యమని, తామే అధిపతులమని భావిస్తే అది పెద్ద తప్పిదమని రేవంత్ హెచ్చరించారు. డీసీసీ పోస్టు అనేది కేవలం అధికారం మాత్రమే కాదని, అది ఒక కుటుంబ పెద్దలాంటి బాధ్యత అని గుర్తు చేశారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారు ఉంటారని, ఇది మహాత్మా గాంధీ కాలం నుండి కొనసాగుతున్న సంప్రదాయమని పేర్కొన్నారు. భిన్న స్వరాలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించాలే తప్ప, వ్యతిరేకించే వారిని పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తే అది పార్టీకి కీడు చేసినట్లవుతుందని హితవు పలికారు.</p>
<p>తాను పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సమయంలో పార్టీ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని, సొంత పార్టీలోనే కొందరి నుంచి వ్యతిరేకత ఎదురైందని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ నేతలందరి ఇళ్లకు వెళ్లి వారిని కలిసినట్లు వివరించారు. వయసులో, అనుభవంలో చిన్నవాడినైనా పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని, సహకరించాలని కోరి అందరినీ ఒప్పించినట్లు చెప్పారు. అందరం సమిష్టిగా కృషి చేయడం వల్లే పార్టీ ఓటింగ్ శాతం 2.5 నుండి 40 శాతానికి చేరిందని విశ్లేషించారు. గతంలో డీసీసీ అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని, అక్కడ అవకాశం రాని వారికి ఎమ్మెల్సీ పదవులు కల్పించామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన మరో 60 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని, కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/only-those-who-struggle-are-recognized-in-congress/article-9156</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/only-those-who-struggle-are-recognized-in-congress/article-9156</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 19:25:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-21-at-7.15.32-pm.jpeg"                         length="34935"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి సీబీఐ కోర్టుకు వరుస బాంబు బెదిరింపులు రావడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bomb-threat-to-nampally-court-again/article-9081"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-20-at-3.05.04-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి సీబీఐ కోర్టుకు వరుస బాంబు బెదిరింపులు రావడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా అపరిచిత వ్యక్తుల నుంచి వస్తున్న మెయిల్స్‌తో న్యాయస్థాన ప్రాంగణంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. తాజాగా ఇవాళ మరోసారి సీబీఐ కోర్టులో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టుకు చేరుకుని అణువణువూ గాలించాయి. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టులోని సిబ్బందిని, న్యాయవాదులను, కక్షిదారులను వెంటనే బయటకు పంపించి ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.</p>
<p><strong>అప్రమత్తమైన భద్రతా బలగాలు</strong><br />రెండ్రోజుల క్రితం కూడా ఇదే తరహాలో బాంబు ఉందంటూ మెయిల్ రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టింది. అయితే అదంతా ఫేక్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో మెయిల్ రావడంతో పోలీసులు విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కోర్టు హాల్స్, రికార్డు రూములు, పార్కింగ్ ఏరియాలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల కారణంగా కోర్టు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతిసారీ ఇది ఫేక్ కాల్ అని తేలుతున్నా, భద్రత విషయంలో ఎలాంటి అజాగ్రత్త వహించకూడదని పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.</p>
<p><strong>తమిళనాడు పోలీసుల హస్తం?</strong><br />ప్రాథమిక విచారణలో ఈ బెదిరింపుల వెనుక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో వచ్చిన బెదిరింపు మెయిల్స్‌కు తమిళనాడుకు చెందిన కొందరు పోలీసు సిబ్బందికి సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తమ శాఖలోని ఉన్నతాధికారుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన వేధింపులను తట్టుకోలేక, ఏం చేయాలో పాలుపోక దృష్టి మళ్లించేందుకే న్యాయస్థానాలను టార్గెట్ చేసుకుని ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. తాజాగా వచ్చిన మెయిల్ కూడా అదే ముఠా పనినా లేక మరెవరైనా ఆకతాయిలు పంపారా అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bomb-threat-to-nampally-court-again/article-9081</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bomb-threat-to-nampally-court-again/article-9081</guid>
                <pubDate>Fri, 20 Feb 2026 15:10:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-20-at-3.05.04-pm.jpeg"                         length="55583"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పోలీస్ వేషం చూసి మోసపోకు.. ప్రజలను హెచ్చరించిన సీపీ సజ్జనార్</title>
                                    <description><![CDATA[<p>సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సాగుతున్న నయా మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/dont-be-fooled-by-the-police-uniform/article-8862"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-14-at-6.15.19-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సాగుతున్న నయా మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. శనివారం ఆయన తన 'ఎక్స్' ఖాతా ద్వారా ఒక వీడియోను షేర్ చేస్తూ, పోలీస్ వేషధారణలో వచ్చే వీడియో కాల్స్ నమ్మవద్దని సూచించారు.</p>
<p><strong>పోలీస్ వేషంలో పక్కా మోసం</strong><br />నేరగాళ్లు పోలీస్ స్టేషన్ తరహా సెటప్ ఏర్పాటు చేసుకుని, పోలీసు యూనిఫాం ధరించి వీడియో కాల్స్ చేస్తున్నారని సీపీ తెలిపారు. అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, డబ్బులు దండుకుంటున్నారని ఆయన వివరించారు. ‘పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. పోలీసులు ఎప్పుడూ వాట్సాప్ లేదా స్కైప్ వంటి వీడియో కాల్స్ ద్వారా నిందితులను విచారించరని సీపీ సజ్జనార్ తెలిపారు. విచారణ పేరుతో పోలీసులు ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయరని పేర్కొన్నారు. భారత చట్టాల్లో 'డిజిటల్ అరెస్ట్' అనే పదమే లేదు. దీనికి చట్టబద్ధత లేదని చెప్పారు.</p>
<p><strong>అప్రమత్తతే రక్ష</strong><br />నగర పోలీసులు చేపట్టిన 'జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీపీ కోరారు. ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే ఆందోళన చెందవద్దని, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులు, మిత్రులకు షేర్ చేసి వారికి కూడా అవగాహన కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/dont-be-fooled-by-the-police-uniform/article-8862</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/dont-be-fooled-by-the-police-uniform/article-8862</guid>
                <pubDate>Sat, 14 Feb 2026 18:17:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-14-at-6.15.19-pm.jpeg"                         length="46947"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అత్తాపూర్‌లో న్యాయవాది ఖదీర్ దారుణ హత్య</title>
                                    <description><![CDATA[<p>రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. న్యాయవాది ఖదీర్‌ను దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేసి పరారయ్యారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/lawyer-qadir-was-brutally-murdered/article-8838"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-14-at-4.48.28-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. న్యాయవాది ఖదీర్‌ను దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సులేమాన్‌ నగర్‌లోని తన కార్యాలయంలో న్యాయవాది ఖదీర్ ఉన్న సమయంలో దుండగులు ఆకస్మికంగా దాడి చేశారు. కత్తులతో ఆయనపై పలుమార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై ఖదీర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఖదీర్ మరణించినట్లు నిర్ధారించుకున్న అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.</p>
<p>సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కుటుంబ విభేదాల కారణంగా ఖదీర్ బావమరుదులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/lawyer-qadir-was-brutally-murdered/article-8838</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/lawyer-qadir-was-brutally-murdered/article-8838</guid>
                <pubDate>Sat, 14 Feb 2026 16:50:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-14-at-4.48.28-pm.jpeg"                         length="26219"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దుబ్బాకలో 'లక్కీ' విక్టరీ</title>
                                    <description><![CDATA[<p>ఎన్నికల రణరంగంలో ఒక్క ఓటు కూడా ఎంత విలువైనదో దుబ్బాక మున్సిపాలిటీ ఫలితం మరోసారి నిరూపించింది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక 3వ వార్డులో జరిగిన పోరు సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/lucky-victory-in-dubbaka/article-8830"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-13-at-5.55.41-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>ఎన్నికల రణరంగంలో ఒక్క ఓటు కూడా ఎంత విలువైనదో దుబ్బాక మున్సిపాలిటీ ఫలితం మరోసారి నిరూపించింది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక 3వ వార్డులో జరిగిన పోరు సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. ఇక్కడ గెలుపు గుర్రం ఎవరనేది ఓటర్ల తీర్పుతో కాకుండా, చివరకు అదృష్టం ద్వారా తేలడం విశేషం. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లు సాగింది. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం దోబూచులాడింది. చివరకు లెక్కింపు పూర్తయ్యేసరికి ఇద్దరు అభ్యర్థులకు ఖచ్చితంగా సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు అధికారులు ఎక్కడా పొరపాట్లకు తావుండకూడదని భావించి ఏకంగా రెండుసార్లు రీ-కౌంటింగ్ నిర్వహించారు. కానీ, ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు.</p>
<p>ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఓట్లు సమానంగా వస్తే విజేతను 'లక్కీ డ్రా' ద్వారా నిర్ణయించాల్సి ఉంటుంది. దీంతో అధికారులు ఇద్దరు అభ్యర్థుల పేర్లను చిన్న కాగితపు స్లిప్పులపై రాసి, ఒక బాక్సులో వేశారు. కౌంటింగ్ కేంద్రంలోని అధికారులు తీసిన ఆ లక్కీ డ్రాలో బీఆర్ఎస్ అభ్యర్థి పేరు వచ్చింది. దీంతో గులాబీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కేవలం అదృష్టంతోనే ఈ విజయం వరించడంతో ఇది స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. గెలిచిన అభ్యర్థి తన విజయాన్ని దైవ నిర్ణయంగా భావిస్తుండగా, బీజేపీ అభ్యర్థి మాత్రం అత్యల్ప తేడాతో, అది కూడా లక్కీ డ్రాలో ఓడిపోవడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, దుబ్బాక మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఈ 'లక్కీ డ్రా' విజయం ఒక ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచిపోనుంది.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/lucky-victory-in-dubbaka/article-8830</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/lucky-victory-in-dubbaka/article-8830</guid>
                <pubDate>Fri, 13 Feb 2026 21:19:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-13-at-5.55.41-pm.jpeg"                         length="118451"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>2029 వరకు తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబజీగా సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుపుతూనే, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/i-am-the-king-of-telangana-until-2029-i-am/article-8754"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-12-at-7.22.28-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబజీగా సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుపుతూనే, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, అశ్వినీ వైష్ణవ్‌లతో సమావేశమైన రేవంత్ రెడ్డి.. అనంతరం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో పాటు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.</p>
<p><strong>2029 వరకు నాదే పగ్గాలు.. నేనే రాజు.. నేనే మంత్రి</strong><br />రాష్ట్రంలో వచ్చే పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయని అన్నారు. తెలంగాణలో నేనే రాజు, నేనే మంత్రి అని, తనకు పోటీ ఎవరూ లేరని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పదిన్నరేళ్ల పాటు పగ్గాలు తన చేతిలోనే ఉంటాయని పేర్కొంటూ, ప్రత్యర్థులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.</p>
<p><strong>ఫోన్ ట్యాపింగ్ - కేసీఆర్ జైలు ప్రస్తావన</strong><br />ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరిందని, దర్యాప్తు ఆధారంగానే చర్యలు ఉంటాయని రేవంత్ తెలిపారు. తాము ఫోన్లు ట్యాప్ చేయడం లేదని, ట్యాప్ చేసిన సంభాషణలు వింటే ఆయుష్షు తగ్గుతుందని సెటైర్ వేశారు. కక్ష సాధింపు లేదని, కేసీఆర్‌ను జైల్లో వేయాలనుకుంటే నిబంధనల ప్రకారమే వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.</p>
<p><strong>కాళేశ్వరం - కేటీఆర్‌పై ఈడీ ఎక్కడ?</strong><br />కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనం బాధ్యతను నిపుణుల కమిటీకి అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఖండించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ, కేటీఆర్‌ను ఎందుకు విచారించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ-రేసు అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలోనే అన్ని డాక్యుమెంట్లను సభలో పెడతామని ఆయన హెచ్చరించారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/i-am-the-king-of-telangana-until-2029-i-am/article-8754</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/i-am-the-king-of-telangana-until-2029-i-am/article-8754</guid>
                <pubDate>Thu, 12 Feb 2026 19:24:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-12-at-7.22.28-pm.jpeg"                         length="38841"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యోగులకు ఆరోగ్య వరం.. 15 రోజుల్లో కొత్త హెల్త్ స్కీమ్</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/health-boon-for-employees-new-health-scheme-in-15-days/article-8750"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-12-at-7.03.28-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్య పరిష్కారానికి ఇవాళ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ కె.రామకృష్ణారావు అధ్యక్షతన ఈహెచ‌ఎస్ ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులతో పాటు ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. పథకం అమలులో పారదర్శకత, ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై చర్చించారు.</p>
<p>ఈ భేటీలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకాన్ని 15 రోజుల్లోగా ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను వెంటనే సిద్ధం చేయాలని సీఎస్ రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న హెల్త్ కార్డుల సమస్యకు దీనితో పరిష్కారం లభించనుంది. </p>
<p><strong>ఆర్థికపరమైన నిర్ణయాలు</strong><br />కొత్త ఆరోగ్య పథకానికి సంబంధించి కంట్రిబ్యూషన్ విషయంలో ట్రస్ట్ స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల మూల వేతనంలో 1.5 శాతం ఆరోగ్య పథకానికి మినహాయించనున్నారు. ఉద్యోగులు చెల్లించే మొత్తానికి సమానంగా ప్రభుత్వం కూడా మరో 1.5 శాతం వాటాను చెల్లిస్తుంది. </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/health-boon-for-employees-new-health-scheme-in-15-days/article-8750</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/health-boon-for-employees-new-health-scheme-in-15-days/article-8750</guid>
                <pubDate>Thu, 12 Feb 2026 19:04:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-12-at-7.03.28-pm.jpeg"                         length="88191"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాదాపూర్‌లో హైడ్రా మెరుపు దాడి.. 11 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్ నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములను రక్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా తన దూకుడును ప్రదర్శించింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/hydra-lightning-strike-at-madhapur/article-8746"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/772e901f-0f77-49ed-b39e-85793eb649f5.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>హైదరాబాద్ నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములను రక్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా తన దూకుడును ప్రదర్శించింది. మాదాపూర్ హైటెక్స్ సమీపంలోని ఖానామెట్ గ్రామ పరిధిలో ఉన్న మొండికుంట చెరువు ప్రాంతంలో భారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 11 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ ధర ప్రకారం దీని విలువ సుమారు రూ.2,200 కోట్లు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.</p>
<p><strong>ప్రజావాణి ఫిర్యాదుతో కదలిక</strong><br />మొండికుంట చెరువును ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు 53, 55 లోని ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు వెలిశాయని హైడ్రా ప్రజావాణి ద్వారా అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. ఆక్రమణల నిర్ధారణ కోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ సేకరించి, ఆక్రమణలను శాస్త్రీయంగా నిర్ధారించారు. గత నెల జనవరి 31న జరిగిన విచారణలో ఆక్రమణదారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఈ భూమి ప్రభుత్వానిదేనని తేలింది.</p>
<p><strong>వందలాది షెడ్ల కూల్చివేత</strong><br />భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగిన ఈ ఆపరేషన్‌లో వందలాది తాత్కాలిక షెడ్లు, 30కి పైగా వాణిజ్య దుకాణాలను నేలమట్టం చేశారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఒక ఆలయ ప్రహరీ గోడను సాకుగా చూపి కబ్జాదారులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. ఇక్కడ మెకానిక్ షెడ్లు, ఐరన్, స్టీల్ దుకాణాలను ఏర్పాటు చేసి నెలకు లక్షల రూపాయల అద్దె వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. బాధితులకు తగిన సమయం ఇచ్చిన తర్వాతే ఈ కూల్చివేతలు చేపట్టారు.</p>
<p><strong>పర్యాటక కేంద్రంగా మొండికుంట</strong><br />అక్రమ నిర్మాణాల తొలగింపుపై చుట్టుపక్కల వాసులు హర్షం వ్యక్తం చేశారు. స్వాధీనం చేసుకున్న ఈ 11 ఎకరాల భూమిలో సుందరమైన పార్కులను నిర్మించాలని, మొండికుంట చెరువును పర్యాటక కేంద్రంగా మార్చాలని అధికారులను కోరారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/hydra-lightning-strike-at-madhapur/article-8746</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/hydra-lightning-strike-at-madhapur/article-8746</guid>
                <pubDate>Thu, 12 Feb 2026 18:45:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/772e901f-0f77-49ed-b39e-85793eb649f5.jpg"                         length="72466"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆన్‌లైన్ గేమింగ్.. రూ.5వేల కోట్ల భారీ కుంభకోణం</title>
                                    <description><![CDATA[<p>ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముసుగులో సాగుతున్న ఒక భారీ ‘సిండికేట్‌’ గుట్టును హైదరాబాద్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు రట్టు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/online-gaming-is-a-huge-rs-5000-crore-scam/article-8611"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-08-at-2.35.11-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముసుగులో సాగుతున్న ఒక భారీ ‘సిండికేట్‌’ గుట్టును హైదరాబాద్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు రట్టు చేశారు. ఏకంగా రూ.5,000 కోట్ల విలువైన ఈ అక్రమ సామ్రాజ్యంపై దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఈ భారీ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న ప్రధాన సూత్రధారులుగా ముంబయికి చెందిన వైఎస్‌ ప్రభుకుమార్‌, హైదరాబాద్‌కు చెందిన రాజశేఖర్‌రెడ్డిని అధికారులు గుర్తించారు. వీరిద్దరూ కలిసి దేశవ్యాప్తంగా ఒక పకడ్బందీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ అక్రమ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు విచారణలో తేలింది.</p>
<p>పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం.. ఒకేసారి మూడు ప్రధాన నగరాల్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో నిర్వహించిన సోదాల్లో భారీ ఎత్తున జీఎస్టీ ఎగవేతకు సంబంధించిన పత్రాలు, అక్రమ లావాదేవీల రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతున్నా, పన్నులు చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న తీరును చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. కేవలం గేమింగ్ మాత్రమే కాకుండా, ఈ లావాదేవీల వెనుక మనీ లాండరింగ్ కోణాలు కూడా ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని, త్వరలోనే మరిన్ని కీలక వివరాలు, అలాగే ఈ సిండికేట్‌లో భాగస్వాములుగా ఉన్న ఇతర వ్యక్తుల పేర్లు బయటపెడతామని అధికారులు వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/online-gaming-is-a-huge-rs-5000-crore-scam/article-8611</link>
                <guid>https://www.vishvambhara.com/national/online-gaming-is-a-huge-rs-5000-crore-scam/article-8611</guid>
                <pubDate>Sun, 08 Feb 2026 14:37:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-08-at-2.35.11-pm.jpeg"                         length="80957"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేసీఆర్ త్యాగాల పునాదులపైనే నీ సీఎం కుర్చీ</title>
                                    <description><![CDATA[<p>మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఘాటుగా సమాధానమిచ్చారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/your-cms-chair-is-on-the-foundations-of-kcrs-sacrifices/article-8447"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/98fe8a9f-919f-4d95-ac7e-a368e534902c.jpg" alt=""></a><br /><div><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఘాటుగా సమాధానమిచ్చారు. బుధవారం మెదక్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై విమర్శలు గుప్పించారు. 'జాతిపిత' అనే పదానికి అర్థం తెలియకుండానే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లా త్యాగం చేసిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందని హరీశ్ రావు కొనియాడారు. ప్రాణాలకు తెగించి స్వరాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ వీరుడిని విమర్శించే అర్హత రేవంత్‌కు లేదని స్పష్టం చేశారు.</div>
<div> </div>
<div>తెలంగాణ పోరాట సమయంలో ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది కాదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. పార్టీ కండువాలు మారుస్తూ, కాంగ్రెస్ సీనియర్ నేతలను తొక్కుకుంటూ పదవులు సాధించిన వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణను సాధించకపోయి ఉంటే రేవంత్‌కు ముఖ్యమంత్రి పదవి వచ్చేదా అని నిలదీశారు.</div>
<div> </div>
<div><strong>పదవుల కోసం పాకులాట</strong></div>
<div>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆకాంక్షల కంటే పదవులే ముఖ్యమని హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ గురించి మాట్లాడే ముందు తన గతాన్ని ఒకసారి చూసుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి గతంలో ఏనాడూ తెలంగాణ కోసం కొట్లాడిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఉద్యమ నాయకుడిని కించపరచడం సరికాదని హరీశ్ రావు హితవు పలికారు.</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/your-cms-chair-is-on-the-foundations-of-kcrs-sacrifices/article-8447</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/your-cms-chair-is-on-the-foundations-of-kcrs-sacrifices/article-8447</guid>
                <pubDate>Wed, 04 Feb 2026 20:02:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/98fe8a9f-919f-4d95-ac7e-a368e534902c.jpg"                         length="53873"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సజ్జనార్ ట్వీట్‌కు హరీశ్ రావు కౌంటర్</title>
                                    <description><![CDATA[<p>ఒకప్పుడు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా, ప్రజల పాలిట 'రియల్ హీరో'గా నీరాజనాలు అందుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ చుట్టూ ఇప్పుడు వివాదాల ముసురు అలుముకుంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/harish-raos-counter-to-sajjanars-tweet/article-8318"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/8dd6d96a-b6df-4f3f-ab2f-090dad98a61d.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> ఒకప్పుడు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా, ప్రజల పాలిట 'రియల్ హీరో'గా నీరాజనాలు అందుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ చుట్టూ ఇప్పుడు వివాదాల ముసురు అలుముకుంది. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా, సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు 'సిట్' చీఫ్‌గా ఉన్న ఆయన.. తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చిచ్చు పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ బృందం విచారించింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ తన వ్యక్తిగత 'ఎక్స్' ఖాతాలో.. "అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ పూర్తయింది" అంటూ పోస్ట్ చేశారు. అయితే, ఈ పోస్టులో కేసీఆర్‌ను కనీసం 'గారు' అని కూడా సంబోధించకపోవడం, ఆయనకున్న 'ప్రతిపక్ష నేత' హోదాను విస్మరించడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.</p>
<p><strong>'మీరెలా డిసైడ్ చేస్తారు?'</strong><br />సజ్జనార్ తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ప్రధానంగా రెండు అంశాలను ఆయన తప్పుబట్టారు. కేసు విచారణ దశలో ఉండగానే అది 'అక్రమం' అని సజ్జనార్ ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కోర్టులు తేల్చకముందే ఒక ఐపీఎస్ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్‌కు విరుద్ధమని ధ్వజమెత్తారు. దర్యాప్తు అధికారిగా ఉంటూ రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని, మాజీ సీఎం పట్ల కనీస మర్యాద పాటించకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు అని విమర్శించారు. న్యాయ పాలనపై విశ్వాసాన్ని దెబ్బతీసేలా, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా పోలీసుల ప్రకటనలు ఉండకూడదని హరీశ్ రావు తెలిపారు.</p>
<p>గతంలో సైబరాబాద్ సీపీగా ఉన్నప్పుడు మహిళా భద్రత విషయంలో సజ్జనార్ తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది. కానీ, ఇటీవలి కాలంలో ఆయన వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రతినిధుల అరెస్ట్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత సున్నితమైన కేసులో సిట్ చీఫ్‌గా ఉంటూ.. రాజకీయ సెటైర్లు లేదా పక్షపాత ధోరణి కనిపించేలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ సీనియర్ అధికారి, రాజకీయ విమర్శల సుడిగుండం నుండి ఎలా బయటపడతారో.. బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/harish-raos-counter-to-sajjanars-tweet/article-8318</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/harish-raos-counter-to-sajjanars-tweet/article-8318</guid>
                <pubDate>Mon, 02 Feb 2026 21:25:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/8dd6d96a-b6df-4f3f-ab2f-090dad98a61d.jpg"                         length="40898"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        