<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/kuwait/tag-3049" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>kuwait - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/3049/rss</link>
                <description>kuwait RSS Feed</description>
                
                            <item>
                <title>కువైట్ మృతులకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా: చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<p>కువైట్ అగ్ని ప్రమాదంలో ఏపీకి చెందిన వారు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కువైట్‌లో మృతి చెందించిన ఆంధ్రప్రదేశ్ వాసులకు సీఎం చంద్రబాబు నష్ట పరిహారం ప్రకటించారు. రూ. 5 లక్షలు సాయమందిస్తామని హామీ ఇచ్చారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-rs-5-lakh-exgratia-for-kuwaiti-dead/article-1866"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/c2e02ac0-288f-11ef-80aa-699d54c46324.jpg.webp" alt=""></a><br /><p>కువైట్ అగ్ని ప్రమాదంలో ఏపీకి చెందిన వారు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కువైట్‌లో మృతి చెందించిన ఆంధ్రప్రదేశ్ వాసులకు సీఎం చంద్రబాబు నష్ట పరిహారం ప్రకటించారు. రూ. 5 లక్షలు సాయమందిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.<br /> <br />మరోవైపు కువైట్ అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలు భారత్‌కు చేరుకున్నాయి. ఇందులో కేరళ వారే ఎక్కువగా ఉన్నారు. మృతదేహాల రాకతో ఢిల్లీ, కొచ్చి విమానాశ్రయాలు రోదనతో మిన్నంటాయి. అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలను వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం సి-130 జె ద్వారా శుక్రవారం స్వదేశానికి తీసుకువచ్చింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-rs-5-lakh-exgratia-for-kuwaiti-dead/article-1866</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-rs-5-lakh-exgratia-for-kuwaiti-dead/article-1866</guid>
                <pubDate>Sat, 15 Jun 2024 08:05:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/c2e02ac0-288f-11ef-80aa-699d54c46324.jpg.webp"                         length="16344"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కువైట్‌ అగ్నిప్రమాదం: కేరళ చేరుకున్న భారతీయుల మృతదేహాలు</title>
                                    <description><![CDATA[<p>గ‌ల్ఫ్ దేశం కువైట్‌లో ఈ నెల 12న‌ ఓ నివాస భ‌వ‌నంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందారు. అయితే, ప్రత్యేక ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇవాళ (శుక్రవారం) కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మృతదేహాలను తీసుకువ‌చ్చింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/international/dead-bodies-of-kuwaiti-fire-victims-reach-kerala/article-1821"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-14-132547.jpg" alt=""></a><br /><p>గ‌ల్ఫ్ దేశం కువైట్‌లో ఈ నెల 12న‌ ఓ నివాస భ‌వ‌నంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందారు. అయితే, ప్రత్యేక ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇవాళ (శుక్రవారం) కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మృతదేహాలను తీసుకువ‌చ్చింది. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మంత్రులు కే రాజన్‌, పీ రాజీవ్‌, వీణా జార్జ్‌ భారతీయుల మృతదేహాలను స్వీకరించారు. అనంతరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోడియం వద్ద మృతదేహాలకు సీఎం, మంత్రులు, అధికారులు నివాళులర్పించారు.</p>
<p>మరోవైపు ప్ర‌మాదం జరిగిన హౌసింగ్ భ‌వ‌నంలో ఉన్న మొత్తం 176 మంది భారతీయ కార్మికులలో 45 మంది మృతిచెందారని, మరో 33 మంది గాయపడ్డారని కువైట్‌లోని భార‌త‌ ఎంబసీ వెల్ల‌డించింది. క్ష‌త‌గాత్రులు ప్రస్తుతం కువైట్‌లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఇక మృతుల్లో కేరళకు చెందిన 23 మంది ఉంటే.. తమిళనాడుకు చెందిన 7, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 3, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 3, కర్ణాటకకు చెందిన వారు ఇద్ద‌రు ఉన్నట్లు తెలుస్తోంది. </p>
<p>అలాగే బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల‌కు చెందిన‌ ఒక్కొక్కరు చొప్పున మృతిచెందిన‌ట్లు పేర్కొంది. అదేవిధంగా కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలోని లేబర్ హౌసింగ్ ప్రాంతం నుంచి ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారి మృతదేహాలు వెంటనే స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ఈ ప్రత్యేక ఐఏఎఫ్‌ విమానాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మృత‌దేహాల‌ను త్వరగా స్వదేశానికి రప్పించడానికి కువైట్ అధికారులతో సమన్వయం చేసిన విదేశాంగ శాఖ స‌హాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సైతం విమానంలో ఉన్నట్లు సమాచారం.</p>
<p> </p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Ernakulam: Special IAF aircraft carrying the mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait reaches Cochin International Airport.<br /><br />(Source: CIAL) <a href="https://t.co/d42RBDAVNz">pic.twitter.com/d42RBDAVNz</a></p>
— ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1801484454197637472?ref_src=twsrc%5Etfw">June 14, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                    

                <link>https://www.vishvambhara.com/international/dead-bodies-of-kuwaiti-fire-victims-reach-kerala/article-1821</link>
                <guid>https://www.vishvambhara.com/international/dead-bodies-of-kuwaiti-fire-victims-reach-kerala/article-1821</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 13:23:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-14-132547.jpg"                         length="104128"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారీ అగ్ని ప్రమాదం.. 40 మంది భారతీయులు మృతి..!</title>
                                    <description><![CDATA[<p> </p>
<p>కువైట్ లో జరిగిన ప్రమాదం<br />మరో 50 మందికి గాయాలు<br />గాయపడిన వారిలో 35 మంది భారతీయులే</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/40-indians-killed-in-massive-fire-accident/article-1718"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(27).jpeg" alt=""></a><br /><p> </p>
<p>గల్ఫ్ కంట్రీ అయిన కువైల్ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఈ అగ్ని ప్రమాదంలో ఏకంగా 41 మంది సజీవదహనమయ్యారు. ఈ మృతుల్లో 40 మంది భారతీయులే కావడం మహా విషాదం నింపింది. ఓ అపార్టుమెంట్ లో చెలరేగిన మంటలు అంతకంతకూ పెరిగి చివరకు జనాల ప్రాణాలను హరించాయి. ఇక ప్రమాదం జరిగిన సమయంలో ఆ బిల్డింగులో దాదాపు 160 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కువైట్ అధికారులు తెలిపారు. </p>
<p>దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ నగరంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నగరంలో ఉన్న ఓ బిల్డింగులో కార్మికులు నివాసం ఉంటున్నారు. వీరంతా ఒకే కంపెనీలో పనిచేసేందుకు వివిధ దేశాల నుంచి అక్కడకు వెళ్లారు. అందులో మన ఇండియా వాళ్లే ఎక్కువ ఉన్నారని తెలుస్తోంది.</p>
<p>అయితే బుధవారం తెల్లవారు జామున కిచెన్ లో మంటలు చెలరేగి.. చూస్తుండగానే బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. అప్పటికే ఆ బిల్డింగులో ఉన్న కార్మికులు అందరూ నిద్రలో ఉండటంతో.. ఎక్కువ మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది మంటలకు భయపడి బిల్డింగ్ మీద నుంచి దూకడంతో వారు కూడా చనిపోయారు. </p>
<p>మంటల్లో కాలిపోయి 35 మంది చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 6 మంది చనిపోయారు. మంటల్లో కాలడం వల్ల మరో 50 మందికి పైగా గాయపడ్డట్టు జాతీయ మీడియా తెలుపుతోంది. ఈ గాయపడ్డ వారిలో 35 మంది మన భారతీయులే ఉన్నారు. ఇక ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. కువైట్ లోని భారత్ రాయబారి ఘటనా స్థలాన్ని పరిశీలించారని.. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. కువైట్ అధికారుల నుంచి మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/40-indians-killed-in-massive-fire-accident/article-1718</link>
                <guid>https://www.vishvambhara.com/national/40-indians-killed-in-massive-fire-accident/article-1718</guid>
                <pubDate>Wed, 12 Jun 2024 18:31:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%2827%29.jpeg"                         length="7169"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        