<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/andhrapradesh/tag-1947" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>andhrapradesh - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1947/rss</link>
                <description>andhrapradesh RSS Feed</description>
                
                            <item>
                <title>మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట</title>
                                    <description><![CDATA[<p>వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. 2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా వ్యవహారంలో నమోదైన కేసులో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/relief-for-former-minister-ambati-rambabu/article-8903"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-18-at-1.36.42-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, ఏపీ బ్యూరో: </strong>వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. 2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా వ్యవహారంలో నమోదైన కేసులో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా అంబటిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సత్తెనపల్లి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. దీంతో గత కొంతకాలంగా వరుస కేసులతో ఇబ్బందులు పడుతున్న ఆయనకు ఈ తీర్పు పెద్ద ఉపశమనంగా మారింది.</p>
<p><strong>విడుదలపై వీడని ఉత్కంఠ</strong><br />ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుతో పాటు మరికొన్ని ఫిర్యాదుల నేపథ్యంలో అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల సమయంలో పోలీసులను బెదిరించారన్న ఆరోపణలపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో ఈనెల 11నే ఆయనకు గుంటూరు ఎక్సైజ్ కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే, అదే సమయంలో సంక్రాంతి లక్కీ డ్రా కేసులో పీటీ వారెంట్ జారీ కావడంతో ఆయన జైలు నుండి విడుదల కాకుండా అడ్డంకులు ఎదురయ్యాయి. తాజా కోర్టు నిర్ణయంతో ఆ అడ్డంకులు తొలగిపోయాయి.</p>
<p><strong>రాజకీయ కోణంలో విచారణ</strong><br />సంక్రాంతి సంబరాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా లక్కీ డ్రా నిర్వహించి నిధులు వసూలు చేశారన్నది అంబటిపై ఉన్న ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, పోలీసుల కస్టడీ విన్నపాన్ని తిరస్కరిస్తూనే బెయిల్ మంజూరు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం కావాలనే పాత కేసులను తిరగదోడి తనను ఇబ్బంది పెడుతోందని అంబటి తరపు న్యాయవాదులు వాదించగా, విచారణకు సహకరించడం లేదని పోలీసులు పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/relief-for-former-minister-ambati-rambabu/article-8903</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/relief-for-former-minister-ambati-rambabu/article-8903</guid>
                <pubDate>Wed, 18 Feb 2026 13:58:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-18-at-1.36.42-pm.jpeg"                         length="66221"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు కలకలం</title>
                                    <description><![CDATA[<p>తెలుగు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు బుధవారం బాంబు బెదిరింపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తెలంగాణలోని నాంపల్లి సీబీఐ కోర్టు, కరీంనగర్ కోర్టులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, రాజమండ్రి సెంట్రల్ నజారత్ జిల్లా కోర్టులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈ-మెయిల్స్ రావడంతో కలకలం రేగింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/many-courts-in-telugu-states-are-bombed/article-8899"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-18-at-1.52.32-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>తెలుగు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు బుధవారం బాంబు బెదిరింపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తెలంగాణలోని నాంపల్లి సీబీఐ కోర్టు, కరీంనగర్ కోర్టులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, రాజమండ్రి సెంట్రల్ నజారత్ జిల్లా కోర్టులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈ-మెయిల్స్ రావడంతో కలకలం రేగింది. కోర్టు ఆవరణలో 12 RDX బాంబులను అమర్చామని, మధ్యాహ్నం 12:05 గంటలకు ఇవి పేలుతాయని మెయిల్‌లో పేర్కొనడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇస్లామిక్ ప్రార్థనలకు ముందే న్యాయమూర్తులందరినీ కోర్టుల నుంచి ఖాళీ చేయించాలని ఆ మెయిల్‌లో హెచ్చరించడం భద్రతా బలగాలను మరింత ఆందోళనకు గురిచేసింది. దీంతో హుటాహుటిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపి కోర్టు పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.</p>
<p><strong>రంగంలోకి బాంబు స్క్వాడ్.. ముమ్మర తనిఖీలు</strong><br />బెదిరింపులు వచ్చిన వెంటనే పోలీసులు ఆయా కోర్టుల్లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు చేపట్టారు. నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణలు జరుగుతున్న సమయంలోనే ఈ హెచ్చరిక రావడంతో భద్రతను భారీగా పెంచారు. ప్రతి గదిని, వాహనాలను, అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఇది కేవలం కోర్టు కార్యకలాపాలను అడ్డుకోవడానికి లేదా ఏదైనా కీలక కేసును తప్పుదోవ పట్టించడానికి ఆకతాయిలు చేసిన పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయినప్పటికీ, ఎక్కడా అశ్రద్ధ వహించకుండా పూర్తిస్థాయిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు.</p>
<p><strong>ఆగంతకుల కోసం సైబర్ సెల్ వేట</strong><br />వరుసగా రెండు రాష్ట్రాల్లోని ప్రధాన కోర్టులనే లక్ష్యంగా చేసుకుని ఈ-మెయిల్స్ రావడం వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ఈ ఈ-మెయిల్ ఏ ఐపీ అడ్రస్ (IP Address) నుండి వచ్చింది? ఎక్కడి నుంచి పంపారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. గతంలో కూడా దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థలు, విమానాశ్రయాలకు ఇలాంటి హోక్స్ మెయిల్స్ వచ్చిన దాఖలాలు ఉండటంతో, దీని వెనుక ఉన్న మూలాలను కనిపెట్టేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/many-courts-in-telugu-states-are-bombed/article-8899</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/many-courts-in-telugu-states-are-bombed/article-8899</guid>
                <pubDate>Wed, 18 Feb 2026 13:54:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-18-at-1.52.32-pm.jpeg"                         length="191969"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ వార్షిక బడ్జెట్</title>
                                    <description><![CDATA[<p>ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,32,205 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజల అవసరాలను, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు ఆయన వెల్లడించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ap-annual-budget-aims-at-comprehensive-development/article-8850"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-14-at-5.36.41-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, ఏపీ బ్యూరో: </strong>ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,32,205 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజల అవసరాలను, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ వార్షిక బడ్జెట్‌లో సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు.</p>
<p><strong>వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు</strong><br />రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయ రంగానికి మొత్తంగా రూ.11,745 కోట్లను కేటాయించింది. ఇందులో పంట బీమా పథకం కోసం రూ.250 కోట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న 'ప్రధాన మంత్రి కృషి సంచాయ్ యోజన' పథకానికి రూ.190 కోట్లు కేటాయించారు. దీనివల్ల రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.</p>
<p><strong>బలోపేతం కానున్న మున్సిపాలిటీలు</strong><br />రాష్ట్రంలోని మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా మున్సిపల్ శాఖకు రూ.14,339 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. ఈ నిధుల ద్వారా పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా వంటి పనులను వేగవంతం చేయనున్నారు.</p>
<p><strong>పోలీస్ శాఖ ఆధునీకరణ</strong><br />శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ప్రభుత్వం భారీగా నిధులు ప్రకటించింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పోలీసు శాఖ వాహనాల కొనుగోలు కోసం రూ. 3,000 కోట్లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రంలో అత్యాధునిక పోలీస్ అకాడమీని ఏర్పాటు చేయడానికి 94 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.</p>
<p><strong>విద్యారంగానికి నిధుల వర్షం</strong><br />విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతర స్కాలర్‌షిప్‌ల కోసం రూ.3,836 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. దీనితో పాటు 'తల్లికి వందనం' పథకానికి రూ.9,668 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.32,308 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.2,567 కోట్లు కేటాయిస్తూ విద్యారంగానికి పెద్దపీట వేశారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-annual-budget-aims-at-comprehensive-development/article-8850</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-annual-budget-aims-at-comprehensive-development/article-8850</guid>
                <pubDate>Sat, 14 Feb 2026 17:37:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-14-at-5.36.41-pm.jpeg"                         length="42069"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీలో జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ</title>
                                    <description><![CDATA[<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఆయుష్ వైద్యానికి హబ్ గా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రాచీన వైద్య విధానాలను ఆధునిక చికిత్సలతో అనుసంధానించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా భారీ ప్రాజెక్టులను రూపొందించింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/national-institute-of-ayurvedic-medicine-in-ap/article-8777"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-12-at-8.51.38-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, ఏపీ బ్యూరో:</strong> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఆయుష్ వైద్యానికి హబ్ గా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రాచీన వైద్య విధానాలను ఆధునిక చికిత్సలతో అనుసంధానించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా భారీ ప్రాజెక్టులను రూపొందించింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని 'మెడికల్ హబ్'గా మార్చే ప్రణాళికలో భాగంగా, అక్కడ ఒక ప్రతిష్టాత్మక జాతీయ ఆయుర్వేద సంస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.</p>
<p>ఇప్పటికే తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆయుర్వేద కళాశాలను జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయడం, లేదా కేంద్ర నిధులతో కొత్త సంస్థను నిర్మించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాజధాని అమరావతిలో, 2026 కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా రెండు జాతీయ స్థాయి వైద్య పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. అమరావతిలో నిర్మించబోయే 'హెల్త్ సిటీ'లో ఈ సంస్థలు అత్యాధునిక వైద్య పరిశోధనలను చేపట్టడంతో పాటు, ఉన్నత వైద్య విద్యను కూడా అందించనున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/national-institute-of-ayurvedic-medicine-in-ap/article-8777</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/national-institute-of-ayurvedic-medicine-in-ap/article-8777</guid>
                <pubDate>Thu, 12 Feb 2026 20:53:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-12-at-8.51.38-pm.jpeg"                         length="69611"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి పవన్‌ కల్యాణ్</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార బరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/pawan-kalyan-for-municipal-election-campaign/article-8451"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/cded22a5-c29d-4cd6-b5d5-784ccb3039e2.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార బరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నట్లు జనసేన కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన సభల్లో ప్రసంగించనున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ రూపకల్పనలో పార్టీ నిమగ్నమైంది. త్వరలోనే ఆయన ఏయే పట్టణాల్లో ప్రచారం చేస్తారు, ఏ మార్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తారు అనే అంశాలపై స్పష్టత రానుంది. ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న తరుణంలో పవన్ కల్యాణ్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో  బీజేపీకి మద్దతు తెలిపిన జనసేన, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనడం విశేషం. ఈ పర్యటన ద్వారా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో తమ కూటమి బలాన్ని చాటాలని జనసేనాని భావిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/pawan-kalyan-for-municipal-election-campaign/article-8451</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/pawan-kalyan-for-municipal-election-campaign/article-8451</guid>
                <pubDate>Wed, 04 Feb 2026 20:24:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/cded22a5-c29d-4cd6-b5d5-784ccb3039e2.jpg"                         length="125978"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అమెరికాతో వాణిజ్య ఒప్పందం చారిత్రకం: చంద్రబాబు </title>
                                    <description><![CDATA[<p>భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక కీలక మైలురాయి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-history-of-trade-agreement-with-america/article-8327"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/02c26843-270a-4f55-b3d1-7f495bd27d8d.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, ఏపీ బ్యూరో: </strong>భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక కీలక మైలురాయి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఈ బృహత్తర కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. దిగుమతి సుంకాలను 18 శాతానికి* తగ్గించడం ద్వారా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధం మరింత దృఢంగా మారుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు. నిరంతర ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందన్నారు.మోదీ నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోందని చంద్రబాబు పేర్కొన్నారు.</p>
<p>ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ.. ఇది భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు మార్గం సుగమమై రైతులకు విస్తృత అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ ముద్ర వేసేలా ఈ ఒప్పందం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. దేశీయ ఉత్పత్తులకు అమెరికా వంటి పెద్ద మార్కెట్‌లో సానుకూల వాతావరణం ఏర్పడటం దేశ పురోగతికి సంకేతమని ఆయన పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-history-of-trade-agreement-with-america/article-8327</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-history-of-trade-agreement-with-america/article-8327</guid>
                <pubDate>Tue, 03 Feb 2026 13:33:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/02c26843-270a-4f55-b3d1-7f495bd27d8d.jpeg"                         length="240104"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్ టు బెంగళూరు.. ఇక కేవలం 2 గంటలే!</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను, హెల్త్ టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు హైస్పీడ్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/hyderabad-to-bangalore-is-just-2-hours-away/article-8298"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/7feed9bc-a995-438b-abc6-a657c0774a40.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో: </strong>తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను, హెల్త్ టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు హైస్పీడ్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రాలకు 'గేమ్ ఛేంజర్'గా మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం రూ.5,454 కోట్లను కేటాయించిందని, ప్రయాణ సమయాన్ని ఊహించని విధంగా తగ్గించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.</p>
<p>గంటకు 350 కి.మీ వేగం<br />హైదరాబాద్ కేంద్రంగా మూడు ప్రధాన నగరాలకు హైస్పీడ్ రైళ్లను అనుసంధానించనున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ఈ రైళ్లు గంటకు గరిష్టంగా 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తాయని, దీనివల్ల నగరాల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. హైదరాబాద్-బెంగళూరు ఐటీ కారిడార్ల మధ్య ప్రయాణం కేవలం రెండు గంటల్లోనే పూర్తవుతుంది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని కీలక నగరానికి కేవలం 1.55 గంటల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి తమిళనాడు రాజధాని చెన్నైకి కేవలం 2.55 గంటల్లో చేరుకునేలా ట్రాక్‌లను సిద్ధం చేస్తున్నారు. ఈ హైస్పీడ్ రైళ్ల రాకతో వ్యాపార వేగం పెరగడమే కాకుండా, అత్యవసర వైద్య సేవల కోసం ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లే రోగులకు ఇది గొప్ప వరంగా మారుతుందని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/hyderabad-to-bangalore-is-just-2-hours-away/article-8298</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/hyderabad-to-bangalore-is-just-2-hours-away/article-8298</guid>
                <pubDate>Mon, 02 Feb 2026 20:35:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/7feed9bc-a995-438b-abc6-a657c0774a40.jpg"                         length="175541"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నాందేడ్ గురుద్వారాలో పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు</title>
                                    <description><![CDATA[<p>ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించారు. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తఖత్ సచ్‌ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/pawan-kalyan-special-prayers-at-nanded-gurdwara/article-7920"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/c3cbd309-6fa8-46d6-8ee9-01224ec0de3f.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర బ్యూరో:</strong> ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించారు. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తఖత్ సచ్‌ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిక్కు మత తొమ్మిదవ గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవాన్ని (షాహీదీ దివస్) పురస్కరించుకుని నిర్వహిస్తున్న భారీ ఆధ్యాత్మిక సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. </p>
<p>గురుద్వారాలో ఆధ్యాత్మిక అనుభూతి<br />గురుద్వారాకు చేరుకున్న పవన్ కల్యాణ్‌కు సిక్కు మత పెద్దలు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. సచ్‌ఖండ్ గురుద్వారా లోపల ఆయన మోకరిల్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సిక్కు గురువులు ఆయనకు సిక్కు సంప్రదాయ వస్త్రాలను బహూకరించి ఆశీర్వచనాలు అందజేశారు. మానవత్వం, ధర్మ పరిరక్షణ కోసం గురు తేగ్ బహదూర్ చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సనాతన ధర్మం, మానవ హక్కుల రక్షణ కోసం ప్రాణాలర్పించిన గురువుల ఆశీస్సులు తీసుకోవడం అదృష్టమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.</p>
<p>రాజకీయ దిగ్గజాల సమక్షంలో..<br />నాందేడ్ చేరుకున్న పవన్ కల్యాణ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఘనస్వాగతం పలికింది. ఈ పర్యటనలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, రాజ్యసభ సభ్యుడు అశోక్ చవాన్, భోకర్ ఎమ్మెల్యే శ్రీజయ చవాన్, నాందేడ్ జిల్లా కలెక్టర్ రాహుల్ ఖరడ్లే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఈ చారిత్రాత్మక వేడుక కోసం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది భక్తులు నాందేడ్ చేరుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/pawan-kalyan-special-prayers-at-nanded-gurdwara/article-7920</link>
                <guid>https://www.vishvambhara.com/national/pawan-kalyan-special-prayers-at-nanded-gurdwara/article-7920</guid>
                <pubDate>Sun, 25 Jan 2026 18:29:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/c3cbd309-6fa8-46d6-8ee9-01224ec0de3f.jpeg"                         length="46190"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లిక్కర్‌ స్కామ్‌ లో మిథున్ రెడ్డి ఈడీ విచారణ</title>
                                    <description><![CDATA[<p>ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేసింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ed-investigation-of-mithun-reddy-in-liquor-scam/article-7886"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/26df69ad-75cb-46b0-b1ee-3cf1c0da60a2.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, ఏపీ బ్యూరో: </strong>ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేసింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని శుక్రవారం ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు ఏడు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది.</p>
<p>మద్యం వ్యాపారంలో పెట్టుబడులు, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు మిథున్‌రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ రూపకల్పన, డిస్టిలరీల కేటాయింపులు, ప్రైవేట్ వ్యక్తులకు చేరిన ముడుపుల అంశంపై ఈడీ విచారించింది. అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన రాతపూర్వక సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. విచారణ ముగిసిన అనంతరం ఆయన నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు.</p>
<p>ఈ కేసులో గురువారం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని అధికారులు 7 గంటల పాటు విచారించి కీలక సమాచారం సేకరించారు. మిథున్‌రెడ్డిని విచారించడంతో పాటు ఆయన వాంగ్మూలాన్ని సెక్షన్ 50 (PMLA) కింద రికార్డ్ చేశారు. వీరిద్దరి స్టేట్‌మెంట్లలో ఏవైనా పొంతన లేని అంశాలు ఉంటే, మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. మిథున్‌రెడ్డి విచారణ ముగియడంతో, ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న మరికొందరు కీలక నేతలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. </p>
<p><strong>కేసు నేపథ్యమిదే</strong><br />ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాల్లో భారీగా నగదు అక్రమాలు జరిగాయని, డిస్టిలరీల నుంచి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులను విచారించిన అధికారులు, ఇప్పుడు రాజకీయ ప్రముఖుల పాత్రపై దృష్టి సారించారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ed-investigation-of-mithun-reddy-in-liquor-scam/article-7886</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ed-investigation-of-mithun-reddy-in-liquor-scam/article-7886</guid>
                <pubDate>Fri, 23 Jan 2026 21:29:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/26df69ad-75cb-46b0-b1ee-3cf1c0da60a2.jpg"                         length="43209"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కల్తీ నెయ్యి కేసులో 'సిట్' తుది ఛార్జిషీట్</title>
                                    <description><![CDATA[<p>తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసులో విచారణ ముగిసింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/sit-final-charge-sheet-in-adulterated-ghee-case/article-7884"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/501f16f1-1f3a-4562-996f-9834af0df41c.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, ఏపీ బ్యూరో:</strong> తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసులో విచారణ ముగిసింది. సుమారు 15 నెలల పాటు, 12 రాష్ట్రాల్లో విస్తృతంగా సాగిన దర్యాప్తు అనంతరం సీబీఐ నేతృత్వంలోని సిట్ అధికారులు శుక్రవారం నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్‌ను సమర్పించారు. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న 24 మందిని నిందితులుగా పేర్కొనగా, మరో 12 మంది పాత్రపై విచారణ కొనసాగుతోందని కోర్టుకు వెల్లడించారు.</p>
<p>ఉత్తరాఖండ్‌కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్‌లను ఈ భారీ స్కామ్‌లో ప్రధాన సూత్రధారులుగా సిట్ నిర్ధారించింది. ఈ డెయిరీ కనీసం ఒక్క చుక్క పాలు కూడా సేకరించకుండానే, కెమికల్స్, పాల్ ఆయిల్‌ను మిక్స్ చేసి 'సింథటిక్ నెయ్యి'ని తయారు చేసిందని దర్యాప్తులో తేలింది. గతంలో బ్లాక్ లిస్ట్‌లో ఉన్నప్పటికీ, ఇతర డెయిరీల పేర్లను అడ్డం పెట్టుకుని టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ఉన్నత స్థాయి బృందం ఈ విచారణను చేపట్టింది. కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మాత్రమే కాకుండా.. ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తులకు ఈ కల్తీ నెయ్యి నెట్‌వర్క్‌తో సంబంధం ఉందని సిట్ తేల్చింది. </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/sit-final-charge-sheet-in-adulterated-ghee-case/article-7884</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/sit-final-charge-sheet-in-adulterated-ghee-case/article-7884</guid>
                <pubDate>Fri, 23 Jan 2026 21:27:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/501f16f1-1f3a-4562-996f-9834af0df41c.jpg"                         length="99929"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>25 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం: విజయసాయిరెడ్డి</title>
                                    <description><![CDATA[<p>ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిజాలను బయటపెట్టారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/entered-politics-after-25/article-7808"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/a10c3d18-79cd-41bb-9d68-ec6baa3b05f9.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, ఏపీ బ్యూరో: </strong>ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిజాలను బయటపెట్టారు. పార్టీలో తన ప్రాధాన్యత, జగన్‌తో ఉన్న సంబంధాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.లిక్కర్ స్కామ్ గురించి తనకేమీ తెలియదని ఈడీ అధికారులకు స్పష్టంగా చెప్పానని అన్నారు. వైసీపీలో నంబర్ 2 స్థానంలో ఉన్న మీకు ఈ విషయం తెలియకపోవడమేంటని వారు ప్రశ్నించారు. దానికి సమాధానంగా.. స్వయంగా జగన్ గారే తనను నంబర్ 2 అని చెప్పారని వారికి వివరించాను. కానీ, వాస్తవానికి కేసుల విషయంలోనే తాను నంబర్ 2 అని వ్యాఖ్యానించారు. లాభాల విషయానికి వస్తే వంద స్థానాల తర్వాత కూడా తాను ఉండనని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తోందని ఆయన ఆరోపించారు. తాను రాజకీయాల నుండి తప్పుకోలేదని స్పష్టం చేస్తూ.. ఈ నెల 25 తర్వాత తన అసలు రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని విజయసాయిరెడ్డి సంకేతాలిచ్చారు.</p>
<p><strong>జగన్ మనసులో 'వెన్నుపోటు' భయం!</strong><br />2018 వరకు జగన్ మనసులో తనకు ప్రత్యేక స్థానం ఉండేదని, కానీ అధికారంలోకి వచ్చాక ఒక 'కోటరీ' తనను పక్కన పెట్టిందని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లు, తాను కూడా జగన్‌ను వెన్నుపోటు పొడుస్తాననే భయాన్ని ఆయనలో కల్పించారని..  అందుకే తనను సైడ్ చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. మీడియా, వైసీపీ సోషల్ మీడియా మాత్రమే తనను నంబర్ 2గా చూపిస్తున్నాయని.. అంతర్గతంగా పరిస్థితి వేరని వివరించారు.</p>
<p><strong>కూటమి విడిపోతేనే జగన్‌కు ఛాన్స్</strong><br />రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ.. ప్రస్తుత కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) బలంగా ఉన్నంత కాలం జగన్ అధికారంలోకి రావడం అసాధ్యమని విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు. కూటమి విడిపోతేనే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. జగన్ కూడా 20 ఏళ్లు ఉంటామనుకున్నారు.. ఇప్పుడు చంద్రబాబు కూడా 25 ఏళ్లు ఉంటానని భావిస్తున్నారు. కానీ ఏదీ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/entered-politics-after-25/article-7808</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/entered-politics-after-25/article-7808</guid>
                <pubDate>Thu, 22 Jan 2026 20:22:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/a10c3d18-79cd-41bb-9d68-ec6baa3b05f9.jpg"                         length="17320"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title> చారిత్రక ఘట్టం వైపు అమరావతి</title>
                                    <description><![CDATA[<p>ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చట్టబద్ధత కల్పించబోతోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/amaravati-towards-the-historical-moment/article-7800"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/4b58cfb9-59ef-4be7-b658-6d18f535ddac.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, ఏపీ బ్యూరో:  </strong>ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చట్టబద్ధత కల్పించబోతోంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. తొలుత కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత, పార్లమెంట్‌లో బిల్లు పెట్టి అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా ప్రకటించనున్నారు. </p>
<p>విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే. 2024 జూన్ 2తో హైదరాబాద్‌పై ఏపీకి ఉన్న హక్కుల గడువు ముగిసింది.ఈ నేపథ్యంలో తమ రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదిక ఇచ్చింది. జూన్ 2, 2024 నుంచే అమరావతిని రాజధానిగా పరిగణించాలని రాష్ట్రం కోరగా, కేంద్రం కూడా ఇందుకు సానుకూలంగా స్పందించింది.</p>
<p>కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీగా ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే పలు కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలను సేకరించిన హోంశాఖ.. పట్టణాభివృద్ధి, న్యాయ, వ్యవసాయ శాఖల తుది నివేదికల కోసం వేచి చూస్తోంది. ఈ బిల్లు రూపకల్పనలో నీతి ఆయోగ్ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. అన్ని శాఖల నుంచి సానుకూల నివేదికలు అందగానే, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేందుకు హోంశాఖ తుది నోట్‌ను సిద్ధం చేయనుంది.</p>
<p><strong>ఏపీ ప్రభుత్వ నోట్ కీలకం</strong><br />అమరావతిలో ఇప్పటికే జరిగిన నిర్మాణ పనులు, రాజధాని ఎంపిక ప్రక్రియ, రైతుల భూసేకరణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లోతైన వివరాలు కేంద్రానికి కీలక ఆధారాలుగా మారాయి. కేంద్ర గుర్తింపు లభిస్తే, అమరావతి నిర్మాణానికి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు, కేంద్ర గ్రాంట్ల రాక మరింత సులభం కానుంది. కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు ఆమోదిస్తే, ఇకపై అమరావతికి ఎదురుండదని రాజధాని ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చట్టబద్ధమైన రాజధానిగా అమరావతికి ముద్ర పడితే, ఏపీ అభివృద్ధిలో ఇది ఒక మైలురాయిగా నిలవనుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/amaravati-towards-the-historical-moment/article-7800</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/amaravati-towards-the-historical-moment/article-7800</guid>
                <pubDate>Wed, 21 Jan 2026 20:37:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/4b58cfb9-59ef-4be7-b658-6d18f535ddac.jpg"                         length="153337"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        