<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/cm-revanth-reddy/tag-19" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>cm revanth reddy - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/19/rss</link>
                <description>cm revanth reddy RSS Feed</description>
                
                            <item>
                <title>డీలిమిటేష‌న్‌తో ద‌క్షిణాదికి అన్యాయం.. సీఎం రేవంత్ చెప్పింది నిజ‌మే : జ‌గ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>బండి సంజయ్ ఏం మాట్లాడినా పట్టించుకోవద్దు..ఆయన విమర్శల లీడర్</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సంగారెడ్డి, పటాన్ చేరు పరిధిలో పొంగులేటి భూదందా లు ఇప్పటి వరకు లేవు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై హరీష్రా వు అభియోగంకి విలువ లేదు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సీతక్క పై బిఆర్ఎస్  నేతలవి కామన్ సెన్స్ లేని ఆరోపణలు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>నాది జనరల్ సీటు, వచ్చే ఎన్నికల్లో నా భార్య (బీసీ) పోటీ ని చేయిస్తున్న</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>కేబినెట్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఉంటే తప్పేంది ?</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>పదేండ్లు ఎవరైనా దళితున్ని సీఎం ఎందుకు చేయలేదు అని కేసీఆర్ ను అడిగారా ?</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong> కోమటిరెడ్డి నీ కంటిన్యు చేయాలి..రాజగోపాల్ రెడ్డి కి కూడా కేబినెట్ లోకి తీసుకోవాలి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong> సీఎం రేవంత్ కి కూడా ఇదే చెప్తా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి </strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/jaggareddy-is-right-when-cm-revanth-said-injustice-to-the/article-13781"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-15-at-8.11.39-am.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>విశ్వంభర,హైదరాబాద్ : </strong></span>డీలిమిటేష‌న్‌తో ద‌క్షిణాదికి అన్యాయం జ‌రుగుతుంద‌న్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు నిజ‌మే అని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర ఇది అని మండిప‌డ్డారు.మంగళవారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజక వర్గాల పున‌ర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జ‌రుగుతుంది. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు నష్టపోతాయి. దక్షిణాదికి రాజకీయ ఉనికి లేకుండా కుట్ర జరుగుతుంది. బీజేపీ మంత్రులు ఏం చేయలేరు..? మాట్లాడలేరు. కాంగ్రెస్ పార్టీలో అయితే సోనియా గాంధీకి చెప్పుకునే స్వాతంత్య్రం ఉండేది. బీజేపీలో అలాంటి అవకాశమే ఉండదు. బండి సంజయ్ ఏమట్లాడినా విలువ ఉండదు. ఆయ‌న విమ‌ర్శ‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల్సి అవ‌స‌రం లేదు. అధికార పార్టీ మీద ప్ర‌తిప‌క్షం ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌హ‌జం. ఉన్న‌ది లేన‌ట్టు.. లేనిది ఉన్న‌ట్టు చెప్ప‌డం స‌హ‌జం అని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు.</p>
<p>రెండున్నరయేండ్లలో సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా భూమి నేను తీసుకున్నట్టు, ఇన్వాల్వ్ అయినట్టు మీకు సమాచారం ఉందా..? అని అడిగారు పొంగులేటి. నా జిల్లాలో భూమి ముట్టుకోవడానికి నాకే వీలు లేకుండా పోతుంది.. ఇంకా పొంగులేటికి ఎక్కడ దొరుకుతుంది. నా జిల్లాలో ఎలాంటి ఆరోపణలు లేవని సర్టిఫికెట్ ఇచ్చిన. నాకు ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేసే అలవాటు లేదు. ఒక్కో ఎకరం కొల్లూరు.. ఉస్మాన్‌పూర్ పోతే ఎకరానికి రూ. 20 కోట్లు. ఎవరు వేలు పెట్టినా భగ్గుమంటదని ఆయ‌న తెలిపారు.మళ్ళీ హరీష్ రావు ఆరోపణలు చేస్తే.. వాళ్ళు ఏం చేశారో బయటా పెడతా. పటాన్‌చెరులో ఎవరు దందా చేశారో చెప్తా. 2014 నుండి మూడేళ్లు జగ్గారెడ్డి ఎక్కడైనా భూములు సంపాదించాడా అని వెతికారు. జల్లెడ పట్టినా.. ఏం దొరకలేదు. భూములు దొరకలేదు. ఆస్తులు చూశారు.. ఊర్లో ఇల్లు లేదు అని జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేశారు.</p>
<p>మంత్రి పదవులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ కేబినెట్‌లో చోటు ఉండాలన్నారు. మంత్రి పదవి కావాలంటూ గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్న వేళ.. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ప్రస్తుతం తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రివర్గంలో కొనసాగిస్తూనే.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కేబినెట్‍లో ఉంటే తప్పేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తాను ఇదే చెప్తానని స్పష్టం చేశారు. ప్రస్తుత సమయంలో డబ్బులు లేకుండా రాజకీయం లేదని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు డబ్బు పెడితే వాళ్లే నాయకులు అవుతున్నారని చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అంటే రూ.100 కోట్లు ఖర్చు అవుతున్నాయని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/jaggareddy-is-right-when-cm-revanth-said-injustice-to-the/article-13781</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/jaggareddy-is-right-when-cm-revanth-said-injustice-to-the/article-13781</guid>
                <pubDate>Wed, 15 Apr 2026 08:19:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-15-at-8.11.39-am.jpeg"                         length="179947"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిధుల కోసమే ఢిల్లీ పర్యటనలు</title>
                                    <description><![CDATA[<p>ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/trips-to-delhi-only-for-funds/article-7600"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/15a4000c-492a-472d-9b21-061498fa1536.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong>  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. జిల్లాకు యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, ఎయిర్‌పోర్టు వంటి మెగా ప్రాజెక్టులను ప్రకటించారు. గత పదేళ్ల పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్యాయానికి గురైన ఈ పోరాట గడ్డను, పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.</p>
<p><strong>సీఎం ప్రకటించిన కీలక హామీలు</strong><br />ఎర్రబస్సు రావడమే కష్టమైన ప్రాంతానికి ఎయిర్‌పోర్టును తీసుకొచ్చి, స్వయంగా ప్రధాని మోదీతో ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌కు ప్రత్యేక యూనివర్సిటీతో పాటు, నిర్మల్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చనాకా-కొరాటా ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తామని తెలిపారు. బడ్జెట్ సమావేశాలలోపే తుమ్మడిహట్టి ప్రాజెక్టు ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రతి ఎకరానికి  నీరందిస్తామని తెలిపారు. ఆదిలాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.</p>
<p><strong>కేసీఆర్ సలహాలు ఇవ్వాల్సింది పోయి విమర్శిస్తున్నారు</strong><br />కేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం అభివృద్ధికి ఉపయోగపడటం లేదని సీఎం ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు రాజకీయ సమాధి కడతారని హెచ్చరించారు. ఒక్క పంచ్‌తో కేసీఆర్‌ను ప్రజలు ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారన్నారు. ఇక వారి గురించి మాట్లాడి సమయం వృధా చేయనని తెలిపారు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.</p>
<p><strong>అమలవుతున్న గ్యారెంటీలు</strong><br />గత ప్రభుత్వం చేసిన అప్పుల చిక్కుముడులను విప్పుకుంటూనే ప్రజా సంక్షేమ పథకాలను పరుగులు తీయిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నవడ్లకు రూ.500 బోనస్, రైతులకు భరోసా పథకాలు అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. మేడారం జాతర కోసం అద్భుతమైన ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.</p>
<p><strong>ఢిల్లీ పర్యటనలపై క్లారిటీ</strong><br />ప్రధాని మోదీని పదే పదే కలుస్తున్నారన్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు వ్యక్తిగత ఎజెండా లేదని.. పైరవీలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రావాలంటే ప్రధానిని, కేంద్ర మంత్రులను కలవాల్సిందేనని తెలిపారు.  అడగనిదే అమ్మ కూడా పెట్టదని.. అందుకే ప్రతిసారి వెళ్లి రాష్ట్ర పరిస్థితిని ప్రధానికి వివరిస్తున్నానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అడగడం మర్చిపోయింది కాబట్టే రాష్ట్రానికి నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు కూడా కేవలం రాజకీయాలు చేయకుండా ఢిల్లీ నుంచి నిధులు తీసుకోవాలని హితవు పలికారు.</p>
<p><strong>మున్సిపల్ ఎన్నికల నగారా</strong><br />మున్సిపల్ ఎన్నికలపై రేవంత్ రెడ్డి స్పందించారు. డబ్బులకు ఆశపడి ఓటు వేస్తే ఐదేళ్లు బాధపడాల్సి వస్తుందన్నారు. అభివృద్ధి చేసే వారికే ఓటు వేయండి.. ప్రజా ప్రభుత్వంతో కలిసి నడిచే నాయకులనే ఎన్నుకోవాలని అని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/trips-to-delhi-only-for-funds/article-7600</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/trips-to-delhi-only-for-funds/article-7600</guid>
                <pubDate>Fri, 16 Jan 2026 18:19:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/15a4000c-492a-472d-9b21-061498fa1536.jpg"                         length="52586"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనుల పురోగతిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/kishan-reddys-letter-to-cm-revanth-on-hyderabad-metro-phase-2/article-7583"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/22e28993-a761-486d-9f58-99e6edf37e38.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ, బ్యూరో:</strong> హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనుల పురోగతిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో జరిగిన భేటీ వివరాలను కిషన్ రెడ్డి ఈ లేఖలో వివరించారు. మెట్రో మొదటి దశను L&amp;T సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం (Takeover) చేసుకుంటుందని ఇప్పటికే సీఎం ప్రకటించిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రెండో దశ పనులకు కేంద్రం సహకారం అందించాలంటే, ముందుగా మొదటి దశకు సంబంధించిన ఒప్పందాలు, లావాదేవీలు, టేకోవర్ ప్రక్రియ పూర్తి కావాలని కేంద్ర మంత్రి ఖట్టర్ స్పష్టం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.</p>
<p><strong>సంయుక్త కమిటీ ఏర్పాటులో జాప్యం</strong><br />మెట్రో మలిదశ సన్నాహాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో ఒక సంయుక్త కమిటీ (Joint Committee) ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులతో ఈ కమిటీ ఏర్పడాలని, కేంద్రం తన వంతు ప్రక్రియకు సిద్ధంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారుల పేర్లు ప్రతిపాదించలేదని కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిందని, ఈ ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇద్దరు అధికారుల పేర్లను పంపాలని లేఖలో పేర్కొన్నారు.  </p>
<p><strong>ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు</strong><br />మెట్రో ఫేజ్-2పై కేంద్రం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తూ అధికారుల పేర్లను ఎప్పుడు పంపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కమిటీ ఏర్పాటుతో మెట్రో విస్తరణ పనుల్లో ఉన్న సాంకేతిక, ఆర్థిక అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/kishan-reddys-letter-to-cm-revanth-on-hyderabad-metro-phase-2/article-7583</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/kishan-reddys-letter-to-cm-revanth-on-hyderabad-metro-phase-2/article-7583</guid>
                <pubDate>Fri, 16 Jan 2026 17:20:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/22e28993-a761-486d-9f58-99e6edf37e38.jpg"                         length="43212"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ మార్కు.. </title>
                                    <description><![CDATA[<p>రాష్ట్రంలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ వద్ద చనాక - కొరాట పంప్ హౌస్ ను, జగిత్యాల జిల్లాలోని సదర్‌మాట్ బ్యారేజ్‌ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.<br /> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/all-those-projects-are-kcr-mark/article-7579"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/ea23813f-20f4-460b-8e2d-0875740e29ca.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ, న్యూస్:</strong> రాష్ట్రంలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ వద్ద చనాక - కొరాట పంప్ హౌస్ ను, జగిత్యాల జిల్లాలోని సదర్‌మాట్ బ్యారేజ్‌ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ఈ ప్రాజెక్టుల ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పనులు కేసీఆర్ పాలనలోనే 95 శాతం పూర్తయ్యాయని, సెప్టెంబర్ 2023లోనే విజయవంతంగా ట్రయల్ రన్ కూడా నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అంతర్రాష్ట్ర ఒప్పందం వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని తెలిపారు. 0.98 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని 89 గ్రామాలకు చెందిన 51 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.</p>
<p><strong>సదర్‌మాట్ బ్యారేజ్‌తో మారనున్న తలరాత</strong></p>
<p>జగిత్యాల, నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లో గోదావరిపై 1.58 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన సదర్‌మాట్ బ్యారేజ్ కూడా కేసీఆర్ హయాంలోనే 90 శాతం పూర్తి అయ్యిందని వెల్లడించారు.దీని ద్వారా 18 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని తెలిపారు. గత పదేళ్లలో (2014-2023) కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ రంగం ఊహించని రీతిలో అభివృద్ధి చెందిందని కేటీఆర్ కొనియాడారు. నెర్రెలుబారిన తెలంగాణ నేలను దేశానికే ధాన్యాగారంగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పనులు నేడు ఫలాలను ఇస్తుండడం సంతోషదాయకమని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/all-those-projects-are-kcr-mark/article-7579</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/all-those-projects-are-kcr-mark/article-7579</guid>
                <pubDate>Fri, 16 Jan 2026 16:30:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/ea23813f-20f4-460b-8e2d-0875740e29ca.jpg"                         length="94963"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎన్నికల నగారా.. జిల్లాల బాట పట్టనున్న సీఎం రేవంత్! </title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన సభలు నిర్వహించడమే లక్ష్యంగా సీఎం రోడ్‌మ్యాప్ ఖరారైంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revanth-will-follow-the-path-of-election-city-districts/article-7476"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/download-(1)1.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ న్యూస్:</strong> తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన సభలు నిర్వహించడమే లక్ష్యంగా సీఎం రోడ్‌మ్యాప్ ఖరారైంది.</p>
<p>జనవరి 16 నుంచి రెండు దఫాల్లో ఈ పర్యటనలు సాగనున్నాయి. ఈ సారి పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా అటు అభివృద్ధి, ఇటు పోరాట పంథాను ఎంచుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలాన్ని పెంచేలా బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు  వివిధ జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కేంద్రంపై పోరు బాట చేపట్టనున్నారు. </p>
<p><strong>తొలి విడత షెడ్యూల్ </strong><br />మొదటి విడతలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. జనవరి 16న నిర్మల్‌లో బహిరంగ సభ, అభివృద్ధి పనులకు శ్రీకారం చేయనున్నారు. 17న జడ్చర్లలో కార్యకర్తలతో భేటీ, ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.<br />18న పాలేరు, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో పర్యటించనున్నారు. అదే రోజు మేడారంలో జరిగే కేబినెట్ భేటీలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. </p>
<p><strong>పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన..</strong><br />జనవరి 19న సీఎం రేవంత్ రెడ్డి మేడారం అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం నేరుగా విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు.  రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సింగపూర్, అమెరికా, స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలు, సమావేశాల ముగింపు అనంతరం ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. </p>
<p><strong>ఫిబ్రవరి 3 నుంచి మలి విడత </strong><br />విదేశీ పర్యటన ముగిసిన వెంటనే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి రెండో విడత పర్యటనలు ప్రారంభమవుతాయి. వరుసగా ఆరు రోజుల పాటు నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తూనే, ఉపాధి హామీ నిరసన సభలను భారీ ఎత్తున నిర్వహించేలా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తానికి, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణాన్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకోవాలని రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revanth-will-follow-the-path-of-election-city-districts/article-7476</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revanth-will-follow-the-path-of-election-city-districts/article-7476</guid>
                <pubDate>Tue, 13 Jan 2026 19:12:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/download-%281%291.jpg"                         length="9345"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహిళా ఐఏఎస్‌పై అసభ్య ప్రచారం: రంగంలోకి 'సిట్' </title>
                                    <description><![CDATA[<p>తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిణిని కించపరిచేలా సోషల్ మీడియాలో సాగుతున్న అసత్య ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/indecent-propaganda-against-female-ias-is-brought-into-the-field/article-7458"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/712ed790-ed6d-410f-9058-538f12961ecc.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిణిని కించపరిచేలా సోషల్ మీడియాలో సాగుతున్న అసత్య ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎనిమిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నారాయణపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి, మహిళా ఐఏఎస్ అధికారిణి గౌరవానికి భంగం కలిగించేలా, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను అసభ్యకరంగా చిత్రీకరించి పోస్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న కేసు నమోదైంది. మరోవైపు, తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం కూడా సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.</p>
<p><strong>సజ్జనార్ నేతృత్వంలో హై-లెవల్ టీమ్ </strong><br />ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను హైదరాబాద్ సిటీ సీపీ వి.సి. సజ్జనార్‌ కు అప్పగించారు. ఈ బృందంలో జాయింట్ సీపీ శ్వేత, డీసీపీలు యోగేష్ గౌతమ్, వెంకట లక్ష్మి, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద బాబు, ఏసీపీ గురు రాఘవేంద్ర, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్, సైబర్ సెల్ సీఐ శంకర్ రెడ్డి, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్ఐ హరీశ్ ఉన్నారు. </p>
<p><strong>డీజీపీ స్పష్టమైన ఆదేశాలు</strong><br />సోషల్ మీడియా వేదికగా మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే, దర్యాప్తును వీలైనంత వేగంగా పూర్తి చేసి, దోషులపై తక్షణమే చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని డీజీపీ ఈ బృందాన్ని ఆదేశించారు. టెక్నాలజీ సాయంతో ఈ పోస్టుల వెనుక ఉన్న సూత్రధారులను కూడా గుర్తించే పనిలో సిట్ నిమగ్నమైంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/indecent-propaganda-against-female-ias-is-brought-into-the-field/article-7458</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/indecent-propaganda-against-female-ias-is-brought-into-the-field/article-7458</guid>
                <pubDate>Tue, 13 Jan 2026 17:53:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/712ed790-ed6d-410f-9058-538f12961ecc.jpg"                         length="72849"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సర్కారా.. సర్కస్ కంపెనీనా? </title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ సచివాలయంలో ప్రస్తుతం థియేటర్ల కంటే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా విమర్శించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/is-it-a-government-circus-company/article-7358"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/download.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, బ్యూరో: </strong>తెలంగాణ సచివాలయంలో ప్రస్తుతం థియేటర్ల కంటే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉందనే అనుమానం ప్రజలకు కలుగుతోందని మండిపడ్డారు.  సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలియకుండానే టికెట్ల ధరల పెంపు ఫైళ్లు కదులుతున్నాయా ప్రశ్నించారు. "నా ప్రమేయం లేదు.. నా దగ్గరకు ఫైల్ రాలేదు" అని మంత్రి అనడం హాస్యాస్పదమన్నారు. క్యాబినెట్ మంత్రికి తెలియకుండా జీవోలు రావడం ప్రజా పాలననా? లేక పాపిష్టి పాలననా? అని నిలదీశారు. ఓడిపోయిన ఒక వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా మారి, సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, ఒక్కో సినిమాకు కోట్ల రూపాయిల కమీషన్ల దందా సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. </p>
<p>సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలకు, ఇప్పుడు జరుగుతున్న పనులకు పొంతన లేదని దుయ్యబట్టారు. తాను సీట్లో ఉన్నంత కాలం రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు అని మైకు పట్టుకుని ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రాత్రికి రాత్రే మూడు సినిమాలకు రేట్లు ఎలా పెంచారు?" అని నిలదీశారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమన్నారు. ఐటీ మంత్రిని నేనే.. సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖతో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారని, టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కోమటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారన్నారు. </p>
<p>కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని చెప్పినందుకు ఒక హీరోపై, పేరు మర్చిపోయినందుకు మరో హీరోపై కక్ష కడుతున్నారని, నచ్చిన వాళ్లకు మాత్రం రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తూ రాచమర్యాదలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో  సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడటం వల్లే తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి చేరిందని గుర్తు చేశారు. ఈ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ 'టికెట్ రేట్ల కమిషన్ల దందా'పై గవర్నర్ దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ చీకటి ఒప్పందాల వివరాలను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/is-it-a-government-circus-company/article-7358</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/is-it-a-government-circus-company/article-7358</guid>
                <pubDate>Sun, 11 Jan 2026 15:02:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/download.jpg"                         length="3126"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నా రక్తం మరిగిపోతుంది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>కేసీఆర్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యల పట్ల కవిత ఆగ్రహం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఉద్యమ నాయకుడైన కేసీఆర్ ను తిడుతుంటే కూతురిగా నా రక్తం ఉడుకుతోంది </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>"సభకు కేసీఆర్ రావడం తప్పనిసరి. ఆయన రాకపోతే బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>మళ్ళీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీశ్‌కు అవకాశం సరికాదు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>మీడియాతో చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/my-blood-boils-mlc-kalvakuntlas-poem-sensational-comments/article-7219"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/mlc-kavitha.jpg" alt=""></a><br /><p><em><span style="color:rgb(224,62,45);"><strong> విశ్వంభర,హైదరాబాద్ :</strong></span></em> సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను తిడుతుంటే కూతురిగా నా రక్తం ఉండుకుతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కసబ్ తో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అలా మాట్లాడితే నా రక్తం మరిగిపోతుందని కవిత అన్నారు.తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా   ఈరోజు మీడియాతో మాట్లాడిన కవిత, బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. "సభకు కేసీఆర్ రావడం తప్పనిసరి. ఆయన రాకపోతే బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాలి. సభకు రాకుండా పిల్ల కాకుల గురించి మాట్లాడుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఒక కూతురిగా నా రక్తం ఉడుకుతోంది" అని కవిత చెప్పారు.</p>
<p>పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టిన కేసీఆర్ ను ఉరి తీయాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ... కేసీఆర్ ను ఒకసారి ఉరి తీయాలంటే రేవంత్ రెడ్డిని 10 సార్లు ఉరితీయాలని అన్నారు. సొంత జిల్లా మహబూబ్ నగర్ కు రేవంత్ ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారని ప్రశ్నించారు. ఇదే సమయంలో హరీశ్ రావుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే అన్నీ హరీశ్ చూసుకోవడం సరికాదని... కేసీఆర్ సభకు రావాలని వ్యాఖ్యానించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/my-blood-boils-mlc-kalvakuntlas-poem-sensational-comments/article-7219</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/my-blood-boils-mlc-kalvakuntlas-poem-sensational-comments/article-7219</guid>
                <pubDate>Fri, 02 Jan 2026 14:54:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/mlc-kavitha.jpg"                         length="73204"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అసెంబ్లీలో కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం ...వీడియో ఇదిగో</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించిన ముఖ్యమంత్రి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఆరోగ్యం గురించి వాకబు చేసిన రేవంత్</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆసక్తికర సంఘటన</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-shakes-hands-with-kcr-in-assembly/article-7161"><img src="https://www.vishvambhara.com/media/400/2025-12/kcrrevanth_v_jpg--442x260-4g.webp" alt=""></a><br /><div>విశ్వంభర హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం చేశారు. సభలో కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి వాకబు చేశారు. మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌, సీతక్క, ఎమ్మెల్యే నవీన్‌యాదవ్‌ ఆయనను పలకరించి అభివాదం చేశారు.</div>
<div><video style="width:100%;height:auto;" src="https://www.vishvambhara.com/media/2025-12/whatsapp-video-2025-12-29-at-12.50.07-pm.mp4" controls=""></video></div>
<div><strong>రెండు నిమిషాల తర్వాత వెళ్లిపోయిన కేసీఆర్</strong></div>
<div>అసెంబ్లీ సమావేశాల తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు సంతాపం తెలిపారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్‌ సభ నుంచి వెళ్లిపోయారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు సభలో ఉన్నది కేవలం రెండు నిమిషాలు మాత్రమే.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-shakes-hands-with-kcr-in-assembly/article-7161</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-shakes-hands-with-kcr-in-assembly/article-7161</guid>
                <pubDate>Mon, 29 Dec 2025 13:18:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-12/kcrrevanth_v_jpg--442x260-4g.webp"                         length="25952"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న సీఎం రేవంత్</title>
                                    <description><![CDATA[<ul>
<li style="text-align:left;"><span style="color:rgb(224,62,45);"><strong>డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్</strong></span></li>
<li style="text-align:left;"><span style="color:rgb(224,62,45);"><strong>9వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్న రేవంత్ రెడ్డి</strong></span></li>
<li style="text-align:left;"><span style="color:rgb(224,62,45);"><strong>మెస్సీతో మ్యాచ్ కోసం సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి</strong></span></li>
<li style="text-align:left;"><span style="color:rgb(224,62,45);"><strong>సీఎం ప్రాక్టీస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/international/cm-revanth-is-preparing-for-a-match-with-argentine-football/article-6959"><img src="https://www.vishvambhara.com/media/400/2025-12/20251201fr692d2686cf0ad.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైదరాబాద్ :</strong></span> తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ బూట్లు తొడిగి మైదానంలో కసరత్తులు మొదలుపెట్టారు. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ టీమ్ తో జరగనున్న మ్యాచ్ కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం గ్రౌండ్‌లో సీఎం రేవంత్ రెడ్డి గంట పాటు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.</p>
<p>డిసెంబర్ 13న ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప్పల్ స్టేడియంలో ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లో మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన బృందంతో కలిసి ఆడనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ప్రాక్టీస్ సెషన్‌లో ఆయన బాల్‌ను డ్రిబ్లింగ్ చేస్తూ, పాసింగ్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.<img src="https://www.vishvambhara.com/media/2025-12/20251201fr692d267e95760.jpg" alt="20251201fr692d267e95760" width="1280" height="853"></img></p>
<p>ఈ మ్యాచ్‌లో మెస్సీ తన ట్రేడ్‌మార్క్ 10వ నంబర్ జెర్సీతో ఆడనుండగా, సీఎం రేవంత్ రెడ్డి 9వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ ద్వారా రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంచడంతో పాటు, యువతను ఫుట్‌బాల్ వైపు ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం స్వయంగా క్రీడల్లో పాల్గొనడంపై సోషల్ మీడియాలో "సూపర్ సీఎం" అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ కీర్తిని ప్రపంచ క్రీడాపటంలో మరింత పెంచుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                            <category>International</category>
                                    

                <link>https://www.vishvambhara.com/international/cm-revanth-is-preparing-for-a-match-with-argentine-football/article-6959</link>
                <guid>https://www.vishvambhara.com/international/cm-revanth-is-preparing-for-a-match-with-argentine-football/article-6959</guid>
                <pubDate>Mon, 01 Dec 2025 11:28:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-12/20251201fr692d2686cf0ad.jpg"                         length="128959"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి,టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పినా వినను : జగ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>నేను వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయను..నా భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేస్తారు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సంగారెడ్డి నియోజవర్గంలో 84 గ్రామ సర్పంచ్ లను కాంగ్రెస్ కండువాతో గెలిపించుకురండి..</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సీఎం రేవంత్ రెడ్డిని కలిపించి గ్రామాలకు నిధులు ఇప్పిస్తా.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>అధికారంలో లేనప్పుడు, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టండి.. గెలిపించుకుని రండి.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేయకండి.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సంగారెడ్డిలో పంచాయతీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు. </strong></span></li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/rahul-gandhi-cm-revanth-reddy-will-not-listen-to-pcc/article-6926"><img src="https://www.vishvambhara.com/media/400/2025-11/whatsapp-image-2025-11-26-at-10.25.30-am.jpeg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(224,62,45);"><em>విశ్వంభర</em></span></strong>,సంగారెడ్డి : సంగారెడ్డిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. తన స్థానంలో భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేయనున్నారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పినా కూడా తాను మళ్లీ పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు.</p>
<p>సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని ఓడించినా ఇంట్లో కూర్చోను. పదేళ్లుగా అధికారం లేకున్నా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ జెండా మోసిన వారినే అభ్యర్థులుగా నిలబెట్టాం” అని జగ్గారెడ్డి గుర్తుచేశారు. నియోజకవర్గంలోని అన్ని సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపడాలని, ప్రజల్లో మంచి పేరు ఉన్న వారే గెలవాలని ఆయన సూచించారు. సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని, గ్రామాల్లో మాట్లాడుకుని నాయకులు, కార్యకర్తలే అభ్యర్థులను తుది నిర్ణయానికి రావాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము చేర్చుకోబోమని స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/rahul-gandhi-cm-revanth-reddy-will-not-listen-to-pcc/article-6926</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/rahul-gandhi-cm-revanth-reddy-will-not-listen-to-pcc/article-6926</guid>
                <pubDate>Wed, 26 Nov 2025 10:32:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-11/whatsapp-image-2025-11-26-at-10.25.30-am.jpeg"                         length="58897"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ  సర్కార్‌కు షాక్</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లండి..</strong></span></li>
<li><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>రేవంత్ సర్కార్‌కు సుప్రీం కోర్టు ఆదేశం</strong></span></li>
<li><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/shock-for-telangana-government-in-supreme-court-on-bc-reservation/article-6644"><img src="https://www.vishvambhara.com/media/400/2025-10/bc-e.png" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>విశ్వంభర,హైదరాబాద్</strong></span> : తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. అత్యున్నత న్యాయస్థానం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో జరుగనున్న కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చిస్తారా? అనే సందేహం వ్యక్తమౌతోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/shock-for-telangana-government-in-supreme-court-on-bc-reservation/article-6644</link>
                <guid>https://www.vishvambhara.com/national/shock-for-telangana-government-in-supreme-court-on-bc-reservation/article-6644</guid>
                <pubDate>Thu, 16 Oct 2025 13:28:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-10/bc-e.png"                         length="858665"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        