<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/andhra-pradesh/tag-174" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>andhra pradesh - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/174/rss</link>
                <description>andhra pradesh RSS Feed</description>
                
                            <item>
                <title>పోలవరం నీటిపై తెలంగాణకు హక్కు ఉందన్న చంద్రబాబు..!!</title>
                                    <description><![CDATA[<p><br />విశ్వంభర, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టులో మిగిలే జలాలను తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>పోలవరం ప్రాజెక్టులో మిగిలే జలాలను తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించిన సమయంలో తాను ఎప్పుడూ అడ్డంకులు సృష్టించలేదని, పరస్పర సహకారంతోనే ముందుకు వెళ్లాలని తన అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.</p>
<p>సమీక్ష సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పోలవరం నుంచి విడుదలయ్యే నీటిని నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ విధానంతో ఎవరికీ నష్టం వాటిల్లదని, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో మిగిలే నీటిని తెలంగాణ కూడా ఉపయోగించుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు.</p>
<p>రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తోందని, ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి తీసుకురావడంలో విజయవంతమయ్యామని చంద్రబాబు అన్నారు. 2025 సంవత్సరం రాష్ట్రానికి అనుకూలమైన ఫలితాలను తీసుకొచ్చిందని, గతంలో దెబ్బతిన్న పాలనా వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టామని తెలిపారు. సూపర్ సిక్స్ కార్యక్రమాల ద్వారా సంక్షేమం, అభివృద్ధికి వేగం వచ్చిందని చెప్పారు. ఈ ఏడాది కూడా మరింత కష్టపడి పనిచేయాలని మంత్రులు, అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. అమలు చేసిన పథకాలు, వాటి ద్వారా లబ్ధిపొందిన ప్రజల వివరాలను కూడా ఆయన ప్రస్తావించారు.</p>
<p>రాజధాని అమరావతిని గతంలో కొందరు శ్మశానం, ఎడారిగా విమర్శించారని గుర్తు చేస్తూ, ప్రస్తుతం అది దేశానికే స్ఫూర్తినిచ్చే అభివృద్ధి ప్రాజెక్టుగా మారిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో రైతులను భాగస్వాములుగా మారుస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును అద్భుతమైన ప్రాజెక్టుగా అభివర్ణించిన ఆయన, అది పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడలేని స్థాయికి రాష్ట్రం చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.</p>
<p>త్వరలో భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకున్నామని, విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అని స్పష్టం చేశారు. దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో దాదాపు 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయని పేర్కొంటూ, రాష్ట్రం ఇప్పుడు పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారిందని చంద్రబాబు నాయుడు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-said-that-telangana-has-the-right-to-polavaram-water/article-7412</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-said-that-telangana-has-the-right-to-polavaram-water/article-7412</guid>
                <pubDate>Mon, 12 Jan 2026 18:16:23 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Chandrababu Naidu: జగన్‌కు నాగరికత గురించి తెలియదు: చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<p><br /><strong>విశ్వంభర ఏపీ, బ్యూరో: </strong>మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు నాగరికతపై కనీస అవగాహన ఉంటే నదులపై ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-jagan-doesnt-know-about-civilization-chandrababu/article-7329"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/chandrababu.jpg" alt=""></a><br /><p>మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు నాగరికతపై కనీస అవగాహన ఉంటే నదులపై ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధు నాగరికత ఎలా పుట్టిందో, ప్రపంచంలోని గొప్ప నగరాలు ఎలా అభివృద్ధి చెందాయో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి లండన్ వరకు ప్రపంచ ప్రఖ్యాత నగరాలన్నీ నదీ తీరాల వెంబడే రూపుదిద్దుకున్నాయని ఆయన గుర్తు చేశారు.</p>
<p>శనివారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న చంద్రబాబు, రాజధాని మరియు నీటి వనరుల అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. నదీ గర్భం అంటే ఏమిటి, నదీ పరివాహక ప్రాంతం అంటే ఏమిటి అనే కనీస అవగాహన లేకుండానే వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, రాజధాని అంశంలో ఇప్పటికీ విషప్రచారం మానడం లేదని విమర్శించారు.</p>
<p>నీటి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగితే చివరికి నష్టపోయేది సామాన్య ప్రజలేనని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణతో కలిసి సమన్వయంగా పనిచేసి మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. పరస్పర సహకారమే శాశ్వత పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.</p>
<p>నీటిని సమర్థంగా వినియోగించుకోవడం వల్లే రాయలసీమ ముఖచిత్రం మారిందని చంద్రబాబు గుర్తుచేశారు. పట్టిసీమ ప్రాజెక్టు దీనికి స్పష్టమైన ఉదాహరణ అని చెప్పారు. ఆ ప్రాజెక్టు ఫలితంగా రాయలసీమలో ఉద్యాన పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం దేశంలోనే ఉద్యాన రంగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని గర్వంగా తెలిపారు. రానున్న పదేళ్లలో ఈ రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.</p>
<p>గత ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పూర్తి చేయకుండా అడ్డుకుందని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. 2020లో కేవలం మట్టి పనులు చేసి రూ.900 కోట్ల బిల్లులు పెట్టుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వానికి నీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని, ఈ అంశంలో ఎలాంటి రాజీ ఉండదని తేల్చిచెప్పారు.</p>
<p>రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చూసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అభివృద్ధికి నీరు కీలకమని, నదులపై అవగాహనతో కూడిన విధానాలే రాష్ట్ర భవిష్యత్తును మార్చగలవని ఆయన స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-jagan-doesnt-know-about-civilization-chandrababu/article-7329</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-jagan-doesnt-know-about-civilization-chandrababu/article-7329</guid>
                <pubDate>Sat, 10 Jan 2026 20:06:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/chandrababu.jpg"                         length="18089"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీలో ఆ చానల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు !</title>
                                    <description><![CDATA[<p>ఏపీలో కొన్ని టీవీ చానల్ల ప్రసారాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ టీవీ ఛానల్ లో ప్రసారాలు మళ్లీ యధావిధిగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటించింది. కాగా </p>
<p>  ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల అనగా జూన్ 6 నుంచి నిలిచిపోయిన టీవీ9, సాక్షి టీవీ, ఎన్టీవీ న్యూస్ ఛానెల్‌ ల ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌ లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది. ఈ మేరకు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది. </p>
<p>ఆ ప్రకటనలో ఈ విధంగా రాసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో వార్తా ఛానళ్ల ప్రసారాలను ఏకపక్షంగా, చట్టవిరుద్ధమైన నిలిపివేతను తాజాగా ఢిల్లీ హైకోర్ట్ ఖండించింది. తద్వారా న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య సమాజానికి మూలస్తంభాలైన వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక సూత్రాలను బలోపేతం చేస్తుందని ఫెడరేషన్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/delhi-high-court-gave-green-signal-to-those-channels-in/article-2398"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/images---2024-06-25t201435.504.jpeg" alt=""></a><br /><p>ఏపీలో కొన్ని టీవీ చానల్ల ప్రసారాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ టీవీ ఛానల్ లో ప్రసారాలు మళ్లీ యధావిధిగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటించింది. కాగా </p>
<p> ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల అనగా జూన్ 6 నుంచి నిలిచిపోయిన టీవీ9, సాక్షి టీవీ, ఎన్టీవీ న్యూస్ ఛానెల్‌ ల ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌ లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది. ఈ మేరకు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది. </p>
<p>ఆ ప్రకటనలో ఈ విధంగా రాసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో వార్తా ఛానళ్ల ప్రసారాలను ఏకపక్షంగా, చట్టవిరుద్ధమైన నిలిపివేతను తాజాగా ఢిల్లీ హైకోర్ట్ ఖండించింది. తద్వారా న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య సమాజానికి మూలస్తంభాలైన వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక సూత్రాలను బలోపేతం చేస్తుందని ఫెడరేషన్ సభ్యులు ప్రకటించారు. కాగా జూన్ 6 నుంచి టీవీ9 తెలుగు, ఎన్టీవీ, సాక్షి టీవీ, సహా పలు న్యూస్ ఛానెల్‌ల ప్రసారాలు ఏపీలో బ్లాక్‌ఔట్ కావడం పత్రికా స్వేచ్ఛపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది. దాంతో ఏపీ రాష్ట్రంలో రాజకీయ నాయకత్వంలో మార్పు కారణంగా ఈ వార్తా ఛానళ్లను బ్లాక్ ఔట్ చేయాలని కేబుల్ ఆపరేటర్లందరిపై ఒత్తిడి తీసుకురావడం తగదని అన్నారు.</p>
<p> ఇక్కడ సెట్ టాప్ బాక్స్ ద్వారా దాదాపు 65 లక్షల మంది వార్తలను వీక్షిస్తారని, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వార్త ఛానెల్స్ ని దాదాపుగా 62 లక్షల బాక్స్‌ల నుంచి తప్పించి, ప్రేక్షకులకు సమాచార హక్కును నిరాకరించే ప్రయత్నం జరగడం దురదృష్టకరమని అన్నారు. కాగా ఛానెల్స్‌ను డిస్‌కనెక్ట్ చేయడం చట్టవిరుద్ధమని, పంపిణీ సంస్థలతో కుదుర్చుకున్న ఇంటర్ కనెక్షన్ ఒప్పందానికి విరుద్ధంగా ఉందని ఢిల్లీ హైకోర్టులో టీవీ9 పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో హైకోర్టు జోక్యం ప్రజాస్వామ్య పనితీరుకు అవసరమైన బహిరంగ, పారదర్శక మీడియా వాతావరణాన్ని నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఏపీ ప్రజలు తమకు ఆసక్తి ఉన్న వార్త చానెళ్లను వీక్షించే హక్కును కొనసాగుతుందని నిర్ధారిస్తూ అనధికారికంగా నిలిపివేయబడ్డ వార్తా చానెళ్లను పునరుద్దరించాలని ఈ ఉత్తర్వుల ద్వారా ఆదేశించింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/delhi-high-court-gave-green-signal-to-those-channels-in/article-2398</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/delhi-high-court-gave-green-signal-to-those-channels-in/article-2398</guid>
                <pubDate>Tue, 25 Jun 2024 20:15:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/images---2024-06-25t201435.504.jpeg"                         length="35416"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు</title>
                                    <description><![CDATA[<p> టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/lau-srikrishna-devarayalu-is-the-leader-of-tdp-parliamentary-party/article-2319"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-23-093649.jpg" alt=""></a><br /><p>టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  శ్రీకృష్ణదేవరాయలు 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో నరసరావుపేట నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై గెలుపొందారు.</p>
<p>ఈ ఏడాది జనవరి 23న వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసరావుపేట నుంచి మరోసారి పోటీ చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మంచి గౌరవం దక్కిందని, నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రాజెక్టులనూ పూర్తి చేసేలా తీవ్రంగా కృషి చేస్తానన్నారు. తన కష్టాన్ని చూసి రెండోసారి గెలిపించిన పల్నాడు వాసులందరికీ రుణపడి ఉంటానన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/lau-srikrishna-devarayalu-is-the-leader-of-tdp-parliamentary-party/article-2319</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/lau-srikrishna-devarayalu-is-the-leader-of-tdp-parliamentary-party/article-2319</guid>
                <pubDate>Sun, 23 Jun 2024 09:40:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-23-093649.jpg"                         length="111850"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ డుమ్మా</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>నేడు స్పీకర్ ఎన్నిక</strong></li>
<li><strong>ఏపీ అసెంబ్లీ స్పీకర్‌‌గా అయ్యన్న పాత్రులు ఏకగ్రీవం </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/election-of-speaker-on-the-second-day-of-assembly-meetings/article-2260"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/124113931_180624apassembly-brk1a.jpg" alt=""></a><br /><p>ఆంధ్రప్రదేశ్‌లో నేడు రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాళ స్పీకర్ ఎన్నిక జరగనుంది. శుక్రవారం టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఆయన స్పీకర్‌ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు రాకూడదని వైసీపీ నిర్ణయించుకుంది.<br /> <br />గతంలో స్పీకర్‌ను అధికార, విపక్ష పార్టీలు కలిసి చైర్‌లో కూర్చోబెట్టేవి. స్పీకర్‌ ఎన్నికకు అందరూ తప్పకుండా పాల్గొనాల్సిన సంప్రదాయానికి వైసీసీ విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. అయితే, ఇవాళ మాజీ సీఎం, పార్టీ చీఫ్ జగన్ పులివెందుల పర్యటనకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/election-of-speaker-on-the-second-day-of-assembly-meetings/article-2260</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/election-of-speaker-on-the-second-day-of-assembly-meetings/article-2260</guid>
                <pubDate>Sat, 22 Jun 2024 07:47:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/124113931_180624apassembly-brk1a.jpg"                         length="53221"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా</title>
                                    <description><![CDATA[<p>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-adjourned-till-tomorrow/article-2236"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/28-19_v_jpg--442x260-4g.webp" alt=""></a><br /><p>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు (వినుకొండ), పితాని సత్యనారాయణ (ఆచంట), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ ) అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రేపు ప్రమాణం చేయనున్నారు. </p>
<p>ఇదిలా ఉంటే రేపు (జూన్ 22) ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉండనుంది. ఏపీ అసెంబ్లీలో రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడిని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే అయ్యన్న తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-adjourned-till-tomorrow/article-2236</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-adjourned-till-tomorrow/article-2236</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 15:09:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/28-19_v_jpg--442x260-4g.webp"                         length="25908"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొడాలి నానిపై కేసు నమోదు </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>మాజీ మంత్రి నానిపై వలంటీర్ల ఫిర్యాదు </strong></li>
<li><strong>తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపణ</strong></li>
<li><strong>గుడివాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/-draft--add-your-title/article-2208"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/kodali-nani-784x441.jpg" alt=""></a><br /><p>ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మాజీమంత్రి కొడాలి నానికి గట్టి షాక్ తగిలింది. ఆయనపై పలువురు మాజీ వార్డు వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. </p>
<p>ఎన్నికలకు ముందు పలువురు వార్డు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన సంగతి తెలిసిందే. దీంతో కొడాలి నాని తమను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఆరోపిస్తూ వలంటీర్లు ఫిర్యాదు చేయడంతో గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన‌ట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/-draft--add-your-title/article-2208</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/-draft--add-your-title/article-2208</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 09:57:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/kodali-nani-784x441.jpg"                         length="41807"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రుషికొండ ప్యాలెస్ చిత్రాలు ఇంకా బయటపడాల్సివుంది: నారా లోకేశ్</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నడుచుకుంటాం</strong></li>
<li><strong>100 రోజుల్లో గంజాయి విక్రయాలకు చెక్ </strong></li>
<li><strong>ఏపీ ఐటీశాఖ మంత్రి నారాలోకేశ్</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/rushikonda-palace-pictures-are-yet-to-be-released-nara-lokesh/article-2023"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-17-123746.jpg" alt=""></a><br /><p>రుషికొండ ప్యాలెస్‌కు సంబంధించి ఇంకా చాలా చిత్రాలు బయటపడాల్సివుందని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ఆన మాట్లాడుతూ..  శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పారు. </p>
<p>తమ కార్యకర్తలపై దాడులు చేస్తే వారు ఎక్కడ ఉంటారో అర్థం చేసుకోవాలన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామన్నారు. ప్రజా దర్భార్‌ను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో బయటకు రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయంటూ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. </p>
<p>ఇదిలా ఉండగా, దాదాపు రూ.500 కోట్ల ప్రజాధనంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రుషికొండలో భవనాలను నిర్మించారు. అయితే అందులో ఏం నిర్మించారు అనేది ఆదివారం వరకు బయటి ప్రపంచానికి తెలియదు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టాక  రుషికొండకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆదివారం టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారాయి. రుషికొండలో నిర్మించిన ఈ భవనాలను ముందు పర్యాటకం కోసం నిర్మించినట్లు వైసీపీ చెప్పగా, తాజాగా ఇవి పరిపాలన భవనాలు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/rushikonda-palace-pictures-are-yet-to-be-released-nara-lokesh/article-2023</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/rushikonda-palace-pictures-are-yet-to-be-released-nara-lokesh/article-2023</guid>
                <pubDate>Mon, 17 Jun 2024 12:41:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-17-123746.jpg"                         length="139580"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొత్త మద్యం బ్రాండ్లకు బ్రేక్.. పునరాలోచనలో సర్కార్..!</title>
                                    <description><![CDATA[<p>కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో బిర్యానీ, హంటర్ వంటి కొత్త రకం బీర్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త బ్రాండ్లకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sarkar-reconsiders-break-for-new-liquor-brands/article-1633"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-11-080438.jpg" alt=""></a><br /><p>తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మద్యం బ్రాండ్లను మార్చిరాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఇటీవల ఐదు కొత్త బ్రాండ్ల ద్వారా 26 కొత్త బీర్లకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. </p>
<p>ఈ బీర్ల నాణ్యత, ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఈ మేరకు కొత్త బీర్ల అమ్మకాలకు సంబంధించిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో నూతన మద్యం పాలసీ అమలు దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. </p>
<p>ఈ క్రమంలో అక్కడ కింగ్‌ఫిషర్‌ బీర్లను లోడ్లకు లోడ్లు దించుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో ఏ వైన్స్‌కు వెళ్లినా కింగ్ ఫిషర్ బీర్లు లేవంటున్నారు. అదేబ్రాండ్ కావాలనుకునే వారికి కొన్ని చోట్ల రూ.220 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. దీంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుల్లో బీర్ల నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. దీన్ని బట్టి తెలంగాణలో కృత్రిమ బీర్ల కొరత సృష్టించారనే అనుమానాలకు తావిస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sarkar-reconsiders-break-for-new-liquor-brands/article-1633</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sarkar-reconsiders-break-for-new-liquor-brands/article-1633</guid>
                <pubDate>Tue, 11 Jun 2024 08:06:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-11-080438.jpg"                         length="175494"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైసీపీకి బాలినేని గుడ్‌బై..? ఆ ట్వీట్‌తో జోరుగా ప్రచారం</title>
                                    <description><![CDATA[<p>సార్వత్రిక ఎన్నిక్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆ పార్టీ 11స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో సీఎం జగన్‌కు గట్టి షాక్ తగిలినట్లయింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/balineni-goodbye-to-ycp-campaigned-loudly-with-that-tweet/article-1388"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-07-120017.jpg" alt=""></a><br /><p>సార్వత్రిక ఎన్నికల్లోఅధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆ పార్టీ 11స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో సీఎం జగన్‌కు గట్టి షాక్ తగిలినట్లయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ జెండా పట్టుకుని ఇన్ని రోజులు ప్రచారం చేసిన నేతలు ఆ పార్టీ ఓటమితో ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ తన బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నాలను చేస్తున్నది. </p>
<p>ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. దీనికి కారణం లేకపోలేదు. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయంతో ఆయన పవన్ కల్యాణ్‌లను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘<span class="css-1jxf684 r-bcqeeo r-1ttztb7 r-qvutc0 r-poiln3">అఖండ విజయం సాధించిన పవన్ కల్యాణ్ గారికి </span><span class="css-1jxf684 r-bcqeeo r-1ttztb7 r-qvutc0 r-poiln3">హృదయపూర్వక శుభాకాంక్షలు..హింసాత్మాక ఘటనలకు తావులేదని నిన్నటి రోజున మీరిచ్చిన సందేశం హార్షణీయం..శాసనసభ్యునిగా నా 25ఏళ్ల రాజీకియ జీవితంలో ఎలాంటి హింసాత్మాక ఘటనలకు తావులేదు..’ అంటూ </span>పేర్కొన్నారు.  దీంతో ఆయన ట్వీట్ రాష్ట్ర రాజకీయాలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ముందే ఆయన వైసీపీని వీడుతున్నారనే ప్రచారం జరిగింది.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">అఖండ విజయం సాధించిన <a href="https://twitter.com/PawanKalyan?ref_src=twsrc%5Etfw">@PawanKalyan</a> గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు..హింసాత్మాక ఘటనలకు తావులేదని నిన్నటి రోజున మీరిచ్చిన సందేశం హార్షణీయం..శాసనసభ్యునిగా నా 25ఏళ్ల రాజీకియ జీవితంలో ఎటువంటి హింసాత్మాక ఘటనలకు తావులేదు..</p>
— Balineni Srinivasa Reddy (@balineni_vasu) <a href="https://twitter.com/balineni_vasu/status/1798754213427908714?ref_src=twsrc%5Etfw">June 6, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/balineni-goodbye-to-ycp-campaigned-loudly-with-that-tweet/article-1388</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/balineni-goodbye-to-ycp-campaigned-loudly-with-that-tweet/article-1388</guid>
                <pubDate>Fri, 07 Jun 2024 12:01:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-07-120017.jpg"                         length="84302"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైఎస్ జగన్ సంచలన ట్వీట్ </title>
                                    <description><![CDATA[<p>రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ys-jagan-sensational-tweet%C2%A0/article-1326"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/jagan1.jpg" alt=""></a><br /><p>ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడక్కడా విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి.  రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. </p>
<p>టీడీపీ నేతల దాడులతో ఏపీలో భయానక వాతావరణం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి.’ అని పేర్కొన్నారు. </p>
<p>అదేవిధంగా గౌరవ గవర్నర్‌ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని విన్నవించారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు,…</p>
— YS Jagan Mohan Reddy (@ysjagan) <a href="https://twitter.com/ysjagan/status/1798624761561616749?ref_src=twsrc%5Etfw">June 6, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ys-jagan-sensational-tweet%C2%A0/article-1326</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ys-jagan-sensational-tweet%C2%A0/article-1326</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 14:14:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/jagan1.jpg"                         length="41247"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన</title>
                                    <description><![CDATA[<p>15రోజుల పాటు లండన్ వెళ్లిన సీఎం జగన్ తన పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో వారికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/cm-jagans-foreign-tour-has-ended/article-1081"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-01-084228.jpg" alt=""></a><br /><p>ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 15రోజుల పాటు లండన్ వెళ్లిన ఆయన తన పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో వారికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.</p>
<p>ఈ సందర్భంగా ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లికి చేరుకున్నారు. వైఎస్ జగన్, భార్య భారతితో కలసి ఏపీ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. </p>
<p>లండన్, స్విట్జర్లాండ్‌ దేశాల్లో కుటుంబసమేతంగా పర్యటించారు. లండన్ నుంచి జగన్ తన కుమార్తెలతో కలసి స్విట్జర్లాండ్‌లో పర్యటించారు. 15రోజుల తర్వాత తిరిగి స్వదేశానికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో లండన్‌ నుంచి బయల్దేరనున్న జగన్‌ నేరుగా గన్నవరం చేరుకున్నారు. కాగా, జగన్ రావడంతోనే కౌంటింగ్‌ డేకు సంబంధించి కరసత్తును ప్రారంభించారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="und" xml:lang="und">Jagan anna ki ఘనస్వాగతం 🤗 <a href="https://t.co/jVKG50mO0Y">pic.twitter.com/jVKG50mO0Y</a></p>
— YS JAGAN 2024 🇸🇱 (@ysrcpfrance) <a href="https://twitter.com/ysrcpfrance/status/1796712466887647314?ref_src=twsrc%5Etfw">June 1, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-jagans-foreign-tour-has-ended/article-1081</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-jagans-foreign-tour-has-ended/article-1081</guid>
                <pubDate>Sat, 01 Jun 2024 08:46:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-01-084228.jpg"                         length="108818"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        